శ్రీనువైట్ల కి షాకిచ్చిన కోన వెంకట్

  బాద్ షా సినిమా తరువాత దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ల మద్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. బాద్ షా సినిమాకు తను, గోపీ మోహన్ కలిసి కధ అందించినప్పటికీ, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కనీసం తన పేరు కూడా వేయలేదని కోన వెంకట్ ఆగ్రహం చెందడంతో వారి మద్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. అయితే, ప్రింటింగ్ విభాగంలో జరిగిన చిన్నపొరపాటు వలననే పేరు అచ్చవలేదని, తరువాత వచ్చే అన్ని పోస్టర్స్ మరియు ట్రయలర్స్ లో కోన వెంకట్ పేరు తప్పకఉంటుందని నిర్మాత బండ్ల గణేష్ హామీ ఈయడంతో గొడవ సద్దుమనిగింది.   కానీ, సినిమా విడుదల అయిన తరువాత సినిమా అంత గొప్పగా హిట్టవడానికి కారణం శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ, అయన స్వయంగా వ్రాసుకొన్న సింగల్ లయిన్ డైలాగులే కారణమని మీడియాలో బాగా ప్రచారం జరగడంతో, కధ మళ్ళీ మొదటికి వచ్చింది. సినిమా విజయంలో తన పాత్ర ఏమి లేదా? అని కోన వెంకట్లో ఆవేశం కలగడం ఆ ఊపులో ట్వీటర్లో కొన్ని పంచు డైలాగులు పేల్చడం జరిగింది.   “కనీసం స్క్రీన్ ప్లే అనే పదానికి స్పెల్లింగు కూడా వ్రాయడం చేత కాని దర్శకులు చాల మందే ఉన్నారని” ఆయన చురకలు వేసారు. అవి ఎవరిని ఉద్దేశించి వేసినవో అందరికీ తెలుసు. ఆ తరువాత బాద్ షా హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి ఆహ్వానం వచ్చినా కోన వెంకట్ వెళ్ళలేదు కానీ, ట్వీటర్ లో మరి కొన్నిడైలాగులు వేసారు. “మమ్మల్ని కూడా సినిమా యూనిట్ లో సభ్యులుగా ఇంకా గుర్తుంచు కొన్నందుకు చాల థాంక్స్,” అని ఆ తరువాత “మమ్మల్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, కానీ అవసరం తీరిన తరువాత విసిరి పారేయకండి” అనే డైలాగుతో, దాదాపు 10సం.లు కలిసి పనిచేసి, 8 విజయవంతమయిన సినిమాలకు కధలందించిన వారి స్నేహసంబంధాలు పుట్టుకున తెగిపోయాయి.   అందుకు శ్రీను వైట్ల కూడా స్పందించక పోవడం విశేషం. కానీ ఆయనకు బదులు వారిరువురితో కలిసి పనిచేసిన మరో రచయిత గోపీ మోహన్ “నేను గత 10 ఏళ్లుగా శ్రీను వైట్లతో కలిసి పనిచేస్తున్నాను. ఆయన రచయితలకు పూర్తి స్వేచ్చానిస్తారు. మా ఇరువురి మద్య చక్కటి అవగాహన, అనుబంధం ఉంది” అని ట్వీట్ చేయడంతో వారి ముగ్గురు కధ మంచి క్లయిమాక్స్ తో ముగిసింది.   అప్పుడే, కోన వెంకట్ తానేమిటో త్వరలో నిరూపించుకోనున్నాని, పెన్ను పట్టినవాడు మెగా ఫోన్ పట్టలేదని భావించవద్దంటూ అనడమే కాకుండా, త్వరలో తన మాటలు నిజం చేసిచూపేందుకు సిద్ధం అయ్యాడు. పవన్ కళ్యాణ్ నటించనున్న గబ్బర్ సింగ్-2 సినిమాకి ఆయన కధ మరియు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ స్వయంగా తన స్వంత బ్యానర్లో నిర్మిస్తారని మరో సమాచారం.   ఒక కధా రచయిత మెగాఫోను చేపడితే అది ఎంత ఘాటుగా ఉంటుందో ఇప్పటికే కొరటాల శివ తన మిర్చీ సినిమాతో నిరూపించాడు. మరి సుదీర్గ అనుభవం ఉన్న కోన వెంకట్ దర్శకత్వం వహిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. పెన్ను, కాగితాలు వేసుకొని గదిలో ఓ మూల కూర్చొని కధలు వ్రాసుకొనే వాడిని రెచ్చ గోడితే మరో కొత్త దర్శకుడుపుడితే, అది పోటీ పెంచుతుందే తప్ప తగ్గించదు కదా! దాని వల్ల ఎవరికి నష్టం అని కోన వెంకట్ మరో చిన్న డైలాగు పేల్చినట్లు సమాచారం. ఆయన చెప్పింది నిజమే కదా!

అంజలి మిస్సింగ్ పై స్టేషన్‌లో ఫిర్యాదు

        సినీ నటి అంజలి సోదరుడు రవిశంకర్ తన చెల్లి అదృశ్యమైందని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం నుండి ఆమె కనిపించడం లేదని, ఆమె ఫోన్ కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌ నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియమ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అంజలి ఆరోపించి అదృశ్యమవడం సినిమా పరిశ్రమంలో కలకలం రేపింది. మరోవైపు తనపై సినీ నటి అంజలి చేసిన ఆరోపణలను ఖండించిన దర్శకుడు కళంజియమ్ ఖండించారు. కుట్ర పూరితంగా తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంజలి ఆరోపణలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనకు పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియంల నుండి ప్రాణాలకు ముప్పు ఉందని అంజలి ప్రకటించిన నేపథ్యంలో ఆమె మాటలతో తన పరువుకు నష్టం కలిగిందని కళంజియం అంటున్నారు.    

నన్నుఏటియం కార్డులా వాడుకున్నారు: నటి అంజలి

  కోలీవుడ్ నుండి తెలుగు సినీమాలలోకి జర్నీ చేసి వచ్చిన సినీ నటి అంజలి సీతమ్మవాకిట్లో అడుగుపెట్టినప్పటి నుండి మంచి పేరే సంపాదించుకొంది. అయితే ఆమె కూడా సీతమ్మవారి కష్టాలు తప్పలేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్లు తమ కుటుంబ సభ్యుల వలన తరచూ ఎదుర్కొనే సమస్యే ఇప్పుడు అంజలి కూడా ఎదుర్కొంటోంది.   "ఇంతవరకు నన్ను అంటిపెట్టుకొని ఉండే ‘భారతి’ అందరు అనుకొంటున్నట్లు నా తల్లి కాదు. ఆమె నాకు పిన్ని అవుతుంది. ఆంద్రాలో నివసిస్తున్నఆమెను, ఆమె కుటుంబ సభ్యులను నేను స్వయంగా చెన్నై తీసుకువచ్చిఅనేక విధాల సహాయం చేసినప్పటికీ, వారు నన్నే మోసం చేసి నా సంపాదన అంతా దోచుకోన్నారు. చివరికి ఖర్చులుకి కూడా నా చేతిలో పైసా లేకుండా చేసారు. వారితో తమిళ దర్శకుడు కలంజియం కూడా చేతులు కలిపి అందరూ కలిసి నా సంపాదన మొత్తం దోచుకోవడమే కాకుండా నా వెనుక కుట్రలు పన్నుతున్నారు. వారు నన్నొక డబ్బు ఇచ్చే ఏటియం కార్డులా వాడుకోన్నారు. నా పిన్నిభారతి, ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను నా అన్నతో, అక్కతోగానీ మాట్లాడనీయకుండా కట్టడి చేసేవారు. ఇక వారి ఆగడాలు భరించలేక నేను హైదరాబాదులో స్థిర పడదామని వచ్చేసాను. అక్కడే ఉంటే వారి వల్ల నాకు ప్రాణ హాని కూడా ఉంది. అయినప్పటికీ, వారు నన్ను వదిలిపెట్టలేదు. నాకు ఒక దర్శకుడితో సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక నా సినిమా కెరీర్ పైనే దృష్టి పెట్టి మళ్ళీ నిలదొక్కుకోవాలని అనుకొంటున్నాను. మళ్ళీ నేను కష్టపడి సంపాదించుకోగలననే దైర్యం నాకు ఉంది. నా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి,” అని అంజలి మీడియాకు తెలిపింది.   ఆమె చేస్తున్న ఆరోపణలకు దర్శకుడు కలంజియం ప్రతిస్పందిస్తూ ఆమెను సినీపరిశ్రమకు నేనే పరిచయం చేసాను. ఆమె బాగుపడాలని కోరుకొనే వారిలో నేను మొదటివాడిని,. అంజలి ఇంకా మంచి చెడు తెలియని చిన్నపిల్ల. పబ్బులకు పార్టీలకు వెళతానని ఆమె అన్నప్పుడు మేము అది మంచిది కాదని చెప్పడం ఆమెకు కోపం తెప్పించింది. అన్నివిషయాలు ఆమెకే క్రమంగా అర్ధం అవడం మొదలయితే అప్పుడు మేము చెప్పినదానిలో తప్పు లేదనితెలుసుకొంటుంది,” అని అన్నారు. ఇప్పుడే అందిన వార్త: అంజలి నిన్న ఉదయం నుండి కనిపించట్లేదని, ఆమె సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని, ఆమె సోదరుడు కొద్దిసేపటి క్రితం మీడియాకు తెలిపారు.

హీరోయిన్ అంజలిని వేదిస్తున్న పిన్ని

        'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో తెలుగు లో క్రేజ్ ని తెచ్చుకున్న హీరోయిన్ అంజలి చిత్ర హింసలు పెడుతున్నారట. అంజలి పిన్ని భారతీదేవి తనను వేదిస్తోందని ఆరోపించింది. '' నా వెంటే ఉంటూ నాకు గోతులు తవ్వారని, ఇప్పుడు నా వద్ద చిల్లిగవ్వ లేకుండా నా ఆస్తి అంతా మింగేశారని, ఇప్పుడు చిత్ర హింసలు పెడుతున్నారని” వాపోయింది అంజలి.   నా సొంత అక్క, అన్నలతో కూడా మాట్లాడనీయకుండా చిత్రహింసలు పెడుతున్నారని, నా ప్రాణాలకు వీరి నుండి ముప్పు ఉందని, ఏం జరిగినా వీరిదే భాధ్యత అని తేల్చిచెప్పింది. వీరితో పాటు దర్శకడు కలంజియం కూడా నన్ను మోసం చేశారని, నేను మేజర్ ను అయ్యాను కాబట్టి వీరికి దూరంగా ఉండాలని హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపింది. ప్రస్తుతం అంజలి తెలుగులో రవి తేజ సరసన బలుపులో నటిస్తుంది.

అల్లు అర్జున్..'బాద్‌షా' మీద దృష్టి పెట్టమన్నాడు

        పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ నిలుస్తుందని అన్నారు. 'బాద్ షా' షూటింగ్ టైం లో ‘ఇద్దరమ్మాయిలతో’ సెట్స్ కి వెళ్ళానని..అల్లు అర్జున్ తన షాట్ అయిపోయిన తరువాత నువ్వు వెళ్లి ‘బాద్ షా’ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టు, ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రొడక్షన్ విషయాలు నేను చూసుకుంటానని చెప్పారని అన్నారు. పని మీద అల్లుఅర్జున్ కి వున్న అంకిత భావానికి హాట్సాఫ్ చెప్పారు. ఇద్దరమ్మాయిలతో’లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయడానికి పాలన్ చేస్తున్నారు. మే 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

యూ.ఎస్ లో రికార్డులు బ్రేక్ చేసిన 'బాద్‌షా'

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్‌షా' తో యూ.ఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ని చూపిస్తున్నాడు. 'బాద్‌షా' యూ.ఎస్ లో మొదటి మూడు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసి కొత్త రికార్డ్ ను సృష్టించాడు. 1 మిలియన్ డాలర్స్ ను మూడు రోజుల్లో క్రాస్ చేసిన మొదటి తెలుగు సినిమా బాద్‌షా నే. ఈ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న బాద్‌షా మొదటివారం రికార్డులు సృష్టించడం ఖాయం గా కనిపిస్తోంది.   ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈచిత్రాన్ని అమెరికాలో దాదాపు 120 స్క్కీన్లలో భారీ ఎత్తున విడుదల చేసారు. ఇది వరకు మిర్చి చిత్రం ఇక్కడ అత్యధిక థియేటర్లలో విడుదల కాగా... ‘బాద్ షా' చిత్రం దాన్ని బీట్ చేసింది.

ఈ ఉగాది పవన్ ఫ్యాన్స్ కి పండగే

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది పండగ రోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఉగాది రోజు తెరపడనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 3 కోట్ల ఖర్చుతో వేసిన సెట్ లో జరుగుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రాజమౌళి 'బహుబలి'లో అడివి శేష్

      టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న భారీ బడ్జెట్ మూవీ 'బహుబలి' లో తాజాగా మరో హీరో జాయిన్ అయ్యాడు. కర్మ, పవన్ కళ్యాణ్ పంజా సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్నలను పొందిన అడివి శేష్, 'బహుబలి' లో ఓ కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. చారిత్రక నేపథ్యంతో తీయబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం శేష్ సాధన చేయడం మొదలుపెట్టాడు. ప్రభాస్ హీరోగా మగధీర కంటే ఎక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్15 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.   అడివి సాయి కిరణ్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ 'కిస్' లో శేష్ హీరో గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. మరోవైపు రవి తేజ హీరోగా నటిస్తున్న 'బలుపు'లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు.

'బాద్‌షా' ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్

  జూ.యన్టీఆర్ చుట్టుకొన్న వివాదాల సంగతెలా ఉన్నా నిన్న విడుదలయిన బాద్షా సినిమా కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. కేవలం ఒక్క రోజులో మన రాష్ట్రంలోనే 9.10 కోట్ల రూపాయలు కుమ్మేసి సరికొత్త రికార్డు సృష్టించాడు మన బాద్ షా. ఇక ఈ రోజు శనివారం రేపు ఆదివారం ఇక చెప్పుకోవడానికేముంది దున్నుడే దున్నుడు. ప్రాంతాల వారిగా మొదటి రోజు కలెక్షన్ వివరాలు: నైజాం 2.52 కోట్లు సీడెడ్ 2.20 కోట్లు కృష్ణ 0.56 కోట్లు గుంటూరు 1.13 కోట్లు నెల్లూరు 0.43 కోట్లు తూర్పు గోదావరి  0.98   కోట్లు (పాత రికార్డ్స్ బ్రేక్) పశ్చిమ గోదావరి 0.64 కోట్లు  (పాత రికార్డ్స్ బ్రేక్) ఉత్తరాంధ్ర 0.80 కోట్లు మొత్తం కలెక్షన్స్ 9.26 కోట్లుషేర్ (ఆల్ టైం రికార్డ్ )    

'బాద్‌షా' బాక్సాఫీసు వద్ద రికార్డుల వేట

  ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ఈ రోజు విడుదలయింది. అలాగే సినిమా మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకొని, సినీ విమర్శకుల దగ్గర మంచి మార్కులు కూడా రాబట్టుకోవడంతో అటు సినిమా యూనిట్ ఇటు నందమూరి అభిమానులు హాయిగా ఊపిరి తీసుకొన్నారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధానంగా చెప్పుకోవలసిన విషయాలు దాదాపు అందరూ ఊహించినవే. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యన్టీఆర్ మార్క్ యాక్షన్+కామెడీ, బ్రహ్మానందం+ఎం.ఎస్ నారాయణల కామెడీ. మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన యన్టీఆర్ తనపవరేమిటో మరోమారు చూపింఛి అదుర్స్ అనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ డెలివరీ, కామెడీ ట్రాక్స్ లో అతని అద్బుతమయిన టైమింగ్, ఫస్ట్ ఆఫ్ కి సెకండ్ ఆఫ్ కి ఆతను నటనలో స్పష్టంగా చూపిన తేడా, ఫైట్స్, డ్యాన్సులు అన్నీ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉన్నాయి. సీనియర్ యన్టీఆర్ చేసిన జస్టిస్ చౌదరి సీన్లు, సంగీత్ లో ఆయన పాటలకి వేసిన స్టెప్పులు ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చాయి. ఇక మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక అదేవిధంగా ఇన్స్ పెక్టర్ పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మానందం, డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వర రావు పాత్రలో ఎం.ఎస్ నారాయణ ఇద్దరూ కూడా దాదాపు సినిమాని తమ భుజాల మీద వేసుకొని నడిపించేరని చెప్పవచ్చును. వారినిద్దరినీ ఎలా వాడుకోవాలో బాగా తెలిసున్న శ్రీను వైట్ల వారి నుండి కామెడీ ఎంత పిండుకోవచ్చో అంతా పిండేసుకొన్నాడు. ఒకో సమయంలో సినిమాలో హీరో యన్టీఆరా లేక బ్రహ్మానందమా అనే రీతిలో సాగిపోయింది వారి కామెడి. బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకొంటే బాద్షా లేకుంటే జఫ్ఫా అవుతాడని చెప్పవచ్చును జూ.యన్టీఆర్, బ్రహ్మానందం కలిసి చేసిన అదుర్స్ సినిమా తరువాత మళ్ళీ అంతకు ఏమాత్రం తీసిపోని రీతిలో. వారిద్దరు ఈ సినిమాలో గొప్పకామెడీ పండించారు. ఇక నాజార్, జూ.యన్టీఆర్, బ్రహ్మానందంల మద్య వచ్చే కామెడీ సీన్లు కూడా చాలా బాగా పండాయి. హీరోయిన్ కాజల్ పాత్ర మాత్రం షరా మామూలుగానే హీరోతో ఆడి పాడుకోవడానికే తప్ప ఆమె ప్రత్యేకంగా చేయవలసిన, కష్టపడవలసినదేమి లేదనే చెప్పవచ్చును కాకపోతే ఆమె పరిధి మేరకు చక్కటి నటన, గ్లామర్, డ్యాన్సులు చక్కగా చేసిందని మాత్రం చెప్పవచ్చును. సైరో సైరో, రంగోలి రంగోలి, బంతిపూల జానకి, వెల్ కమ్ కనకం సాంగ్స్ చాల బాగా వచ్చాయి. ఇక సినిమాలో సింగల్ లయిన్ పంచ్ డైలాగులు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక ప్రతీ సినిమాకి ఉన్నట్లే ఈ సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమా చూస్తునంత సేపు వైట్ల పాత సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. కానీ, శ్రీను వైట్ల తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మరిపించి వారిని మరేమీ ఆలోచించుకోనీయకుండా తన కామెడీ సీన్లతో కట్టిపడేసాడు. జూ.యన్టీఆర్, బ్రహ్మానందం, నాజర్, ఎం.ఎస్ నారాయణల పాత్రలను తీర్చి దిద్దడంలో చూపిన శ్రద్ధ జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, తనికెళ్ళ వంటి వారి పాత్రలపై చూపలేదేమోనని అనిపిస్తుంది. అలాగని వారెవరూ తమ పాత్రలను తేలికగా తీసుకోలేదు. సిద్దార్థ్ తో సహా అందరూ కూడా తమ పాత్రలలో చాలా చక్కగా నటించారు. సినిమా మొత్తంగా చూస్తే కామెడీ, యాక్షన్ ప్రధానంగా సాగిందని చెప్పవచ్చును. రెండూ కూడా సమపాళ్ళలో పడ్డాయి గనుక బాద్షా ఇక బాక్సాఫీసు బద్దలు చేయడానికి డిసయిడ్ అయిపోయినట్లే.

ఎన్టీఆర్ 'బాద్‌షా' మూవీ టాక్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శ్రీనువైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ కావడంతో, ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిమియర్, మార్నింగ్ షో చూసిన వాళ్ళంతా సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. ఎన్టీఆర్ మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 'బాద్‌షా' లో ఎన్టీఆర్ చాలా అందంగా, ట్రెండీగా, ఫ్రెష్ గా కనిపించాడని అంటున్నారు. కొంతకాలంగా యంగ్ టైగర్ డాన్సులపై అసంతృప్తిగా ఉన్న అభిమానులకి ఈ సినిమా లోని డాన్సులు అలరిస్తాయని అంటున్నారు. నందమూరి అభిమానులకి ఈ సినిమా ఓ పండగా లాంటింది. ఈ సినిమాలో డిజైన్ చేసిన కొన్ని స్పెషల్ సీక్వెన్స్ లు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ జస్టిస్ చౌదరి గెటప్ లో వచ్చే సీక్వెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే సంగీత్ ఎపిసోడ్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ పాపులర్ మెలోడీ పాటలపై చేసిన సీక్వెన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయట.

'బాద్‌షా' బ్రహ్మానందం కామెడీ కేవ్వు కేక

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్‌షా' చిత్రంలో బ్రహ్మానందం హైలెట్ గా నిలిచాడు. అదుర్స్ సినిమాలో కామెడీ తో అదరగొట్టిన యంగ్ టైగర్, బ్రహ్మానందం మరో సారి ప్రేక్షకులను తమ కామెడీ తో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలను బాగా పండించారు. ఇక బ్రహ్మానందం పద్మనాభ సింహ పాత్రను ఓ రేంజిలో ఆడుకున్నాడని సమాచారం. శ్రీను వైట్ల గత చిత్రాలు ఢీ, రెఢీ, దూకుడు ఇలా అన్ని చిత్రాలలో బ్రహ్మానందం కోసం ప్రత్యేక పాత్రలు సృష్టించాడు. అందులో పేలినట్లే ఇందులోనూ ఆయన పాత్ర పేలిందని, సెకండాఫ్ అంతా బ్రహ్మానందం ఆకట్టుకుంటాడని సమాచారం. ఎమ్.ఎస్ నారాయణ..రివేంజ్ నాగేశ్వరరావు గా అదరకొట్టాడని, కాని 'బాద్‌షా' లో ఎన్టీఆర్ తరువాత 'బాద్‌షా' బ్రహ్మానందంమేనని అంటున్నారు.

గ్రీకువీరుడి కొడుకు హంగామా

  నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న గ్రీకు వీరుడు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. వెరైటీగా చేద్దామని ముందు వైజాగ్ బీచ్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ అనుకొన్నపటికీ, పోలీసులు అనుమతి ఈయకపోవడంతో నిన్న హైదరాబాదులో నిర్వహించారు.   ఈ ఫంక్షన్ లో నాగార్జున రెండవ కొడుకు అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. త్వరలో తానూ కూడా సినిమాలలో నటించాలనికోరుకొంటున్న అఖిల్ అందుకు తగ్గట్టుగానే హీరోలాగ మంచి హాండ్ సమ్ గా హుషారుగా తండ్రికి తగ్గ తనయుడిలాగ కనిపించాడు. అతనిని వేదిక మీదకి ఆహ్వానించినప్పుడు బుద్ధిగా వెళ్ళిపోకుండా నోట్లో వేళ్ళుపెట్టి గట్టిగా ఈల వేయడంతో ప్రేక్షకుల నుంచి కూడా అదే రీతిలో మంచి స్పందన వచ్చింది.   ఇక ఆడియో ఫంక్షన్ కి అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ తరలి రావడంతో ఫంక్షన్ కి చాలా నిండుతనం వచ్చింది. అందరూ సినిమాలలో నటించినవారే అవడంతో అంతమందిని ఒకే వేదికపై చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఆనందించారు. అదేవిధంగా సకుటుంబ సపరివారమంతా పక్కనే ఉండటంతో మన గ్రీకువీరుడికి కూడా ఎక్కడలేని హుషారు వచ్చేసింది. తను నిత్య యవ్వనంగా, అందంగా కనబడటానికి గల రహస్యాన్ని కూడా బయట పెట్టేసారు.   తన అభిమానుల నుండి అందుతున్న ఈ ఆధారణే తనను ఆనందంగా ఉంచుతోందని, అందువల్లే తానూ ఇప్పటికీ అందంగా కనబడగలుగుతున్నానని నాగ్ అన్నారు. అంతే కాదు తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ సినిమా రంగం నుండి రిటైర్ అయిపోవచ్చునేమో కానీ తానూ మాత్రం రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని అనడంతో ప్రేక్షకులు హుషారుగా ఈలలు వేసి ఆయనని ప్రోత్సహించారు.   ఇక ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావుగారికి తానూ వీరాభిమానినని, కానీ ఆయనతో సినిమా తీసే అవకాశం లేకపోయినా ఆయన కొడుకుతో తీయగలుగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాని అన్నారు. త్వరలో నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా ‘హలో బ్రదర్స్’ వాళ్ళబ్బాయిని హీరోగా పెట్టి రీమేక్ చేయబోతున్నానని ప్రకటించారు. అయితే అది నాగ చైతన్యాతోనా లేక అఖిల్ తోనా ఆయన చెప్పకపోయినప్పటికీ, సినిమాలలో నటించాలని ఆత్రుత పడుతున్న అఖిల్ ను హీరోగా పెట్టి ఆ సినిమా తీయవచ్చును..

‘బాద్‌షా’ సెన్సార్ కట్స్ ఇవే!

  యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాధ్షా సినిమా విడుదలకు కేవలం మరొక్క 36 గంటలు మాత్రమే మిగిలి ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గిర పడుతున్న కొద్దీ ఆ సినిమా గురించి ఒకటొకటిగా బయటకి వస్తున్న ఆసక్తికరమయిన వార్తలు బాధ్షా రేంజిని అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెంచేశాయి. ఇక యన్టీఆర్ అభిమానుల సందడికి హద్దే లేదు.   శ్రీను వైట్ల కామెడీ, నందమూరి పులి చేసిన యాక్షన్ సీన్లు ఎపుడెపుడు చూద్దామా అని వారు ఒకటే తహతహలాడిపోతూ సినిమా టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇక ఆ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా అనుకూలంగా రావడంతో బాధ్షా పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. నందమూరి అభిమానులకి తెలుగు వన్ అందిస్తున్న బాధ్షా సినిమా సెన్సార్ రిపోర్ట్:   దర్శకుడు శ్రీను వైట్ల తన బాధ్షాకు ‘యు’ సర్టిఫికేట్ పొందాలనే ముందు జాగ్రత్తగా సినిమాలో ప్రతీ చిన్న అంశాన్ని సెన్సార్ కళ్ళద్దాలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీసినా కూడా ఇంటర్వెల్ కి ముందు ‘రామారావు’ బాద్షా గా మారే సన్నివేశంలో కొంచెం వయోలెన్స్ ఎక్కువయిండానే కారణంతో బాద్షాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిసింది.   కానీ, శ్రీను వైట్ల కష్టం వృధాపోలేదు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు అసలు కత్తెర ఉపయోగించే పని పడలేదని సమాచారం. అందువల్ల శ్రీను వైట్ల తన బాధ్షాను నందమూరి అభిమానులకు ఏవిధంగా చూపాలని భావించాడో పూర్తిగా ఆవిధంగానే చూపించగలుగుతున్నాడు.   ముఖ్యంగా బాధ్షా-బ్రహ్మానందం-యమ్మస్ నారాయణలతో కలిసి చేసిన హాస్య సన్నివేశాలను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు అంత అద్భుతంగా కామెడీ పండించిన నటులని, అంత గొప్పగా మలచిన దర్శకుడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారని సమాచారం,   ఇక సినిమాలో కట్స్ వేయకపోయినా ‘నీ అబ్బ, బలుపు, బొంగు, బొక్క వంటి పదాలకు బీప్ శబ్దాలు తగిలించేసారు. అదేవిధంగా బాద్షా సిగరెట్ కాల్చే సన్నివేశాలకి పొగ త్రాగుట హానికరం అనే హెచ్చరికలు తప్పని సరి. ఇక వెల్కం కనకం అనే పాటలో ‘కలకండ’ అనే పదంలో కూడా సెన్సార్ బోర్డు వారికి బూతు కనిపించడంతో దానికీ ఒక బీప్ తగిలించేసారు. ఇటీవల విడుదల అవుతున్న చిన్న సినిమాలో యూత్ ని ఆకర్షించేందుకు దర్శకులు విరివిగా బూతులు చొప్పిస్తున్నా అభ్యంతరం చెప్పని సెన్సార్ బోర్డు ‘కలకండ’ కి ఎందుకు బీప్ తగిలించిందో తెలియదు.   మొత్తం మీద సెన్సార్ కత్తెర భారిన పడకుండా బాద్షా తప్పించుకొన్నందుకు చాలా సంతోషించవలసిన విషయమే. శ్రీను వైట్ల మార్క్ కామెడీని, యంగ్ టైగర్ మార్క్ యాక్షన్ సన్నివేశాలని, పంచ్ డైలాగులను తీసుకు వస్తున్న బాద్షా ఘన విజయం ఖాయమని ముందే డిసైడ్ అయిపోయాడు గనుక ఇక మనం బాద్షాను సింపుల్ గా ఫాలో అయిపోవడమే బెటర్.

కాజల్ 'లవ్ ఫెయిల్యూర్'

        టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ లవ్ లో పడి మోసపోయిందట! వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇది మాత్రం నిజం అని చెబుతోంది హీరోయిన్ కాజల్. కాలేజిలో చదివే రోజుల్లో తాను తోటి విద్యార్ధితో ప్రేమలో పడి మోసపోయానని చెప్పింది. ఆ సంఘటన తరువాత తాను ఎవ్వరిని ప్రేమించలేదని అంటోంది. ''జీవితం లో ప్రేమ ఒక భాగము మాత్రమే...ప్రేమలో పడి ఎవ్వరు జీవితాలు నాశనం చేసుకోవద్దు'' అని మెసేజ్ ఇచ్చింది కాజల్. జీవితంలో సెటిలాయ్యాకే ప్రేమ..పెళ్ళి గురించి ఆలోచించాలని ముందే డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' లో నటిస్తోంది. తన గ్లామర్ ఈ సినిమాకి మేజర్ అసెట్ గా నిలువనుందని సమాచారం. ఈ సినిమాలో కాజల్ జానకిగా కనిపించనుంది.

కృష్ణా జిల్లాలో 'బాద్ షా' రికార్డ్

  'బాద్‌షా' రిలీజ్ కి ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఈ సినిమా ఎనభైకు పైగా థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్ లలో రికార్డ్ థియేటర్లలో విడుదలవుతున్న 'బాద్‌షా' కృష్ణా జిల్లాలో మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. కృష్ణా జిల్లా నందమూరి హీరోలకు కంచుకోటగా చెబుతుంటారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వేసవిలో ప్రేక్షుకుల ముందుకు వస్తున్న మొదటి చిత్రం, సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో థియేటర్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లకు అద్భుతమైన ఆదరణ లభించడం కూడా చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది.