శిరీష్ హీరో అంటే షాక్ అయ్యాను: చిరంజీవి

        మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో అల్లు శిరీష్ తొలి చిత్రం 'గౌరవం' శ్రీరామ నవమి సంధర్బంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా అల్లు శిరీష్ ను కేంద్రమంత్రి చిరంజీవి మెగా అభిమానులకు పరిచయం చేశారు. ''అల్లు శిరీష్ చాలా తెలివైనవాడు. అరవింద్‌గారి బాధ్యతల్ని చూసుకుంటాడనుకున్నాను. కానీ హీరో అవుతానన్నాడు. ముందు ఓ నిమిషం షాక్ అయ్యాం. మీ రక్తంలోనే నటన ఉంది. నటించు'' అని అన్నాను. "రాజకీయ హోదా కావచ్చు, మరేదైనా కావచ్చు. అభిమానుల అండ చూసి అధిష్టానం నాకు ఇచ్చింది. చిరంజీవి వెనుక ఇన్ని లక్షల మంది ఉన్నారన్న ఆలోచనతోనే నన్ను పిలుస్తున్నారు. పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ని అభిమానులు ఆదరించిన తీరు మరువలేను'' అని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు.

నిర్మాతలతో ఫైట్స్ చేస్తున్న స్టంట్ మాస్టర్స్

  తెలుగు టీవీ చానళ్ళలో డబ్బింగ్ సీరియళ్ళు నిలిపివేయాలని స్థానిక కళాకారులు చేసిన దీక్షలు ఉద్యమాలు ఇంకా చల్లారక ముందే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానిక స్టంట్ మాస్టర్లను, ఫైటర్లను తీసుకోకుండా ఇతర రాష్ట్రాలకి చెందిన వారిని తీసుకొంటున్నారని ఆందోళన మొదలయింది. గతంలో నిర్మాతల మండలి తమతో చేసుకొన్నఒప్పందం ప్రకారం 70 శాతం స్థానికులను 30 శాతం ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర స్టంట్ మాస్టర్స్ యూనియన్ ఆందోళన మొదలుపెట్టింది.   కానీ, వారిని నిర్మాతలు పట్టించుకోక పోవడంతో సినిమా షూటింగులను అడ్డుకోవడం ప్రారంభించారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాకు, గ్రీకువీరుడికి, కార్తి, హన్సిక జంటగా నటిస్తున్న బిర్యాని సినిమాల నిర్మాతలకి ఈ స్టంట్ మాష్టార్లతో స్టంటులు తప్పలేదు. తమిళ ప్రొడ్యుసర్ జ్ఞానవేలు రాజ నిర్మిస్తున్న సినిమాకు కూడా ఈ సెగ తగలడంతో అతను తెలివిగా తన షూటింగ్ కార్యక్రమాలను హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసుకొని సమస్యనుండి బయట పడ్డారు. మరికొందరు చిన్న పెద్ద నిర్మాతలు కూడా మళ్ళీ చెన్నై దారి పడుతున్నట్లు సమాచారం.   అయితే, స్థానికంగా దొరికే వారిని కాదనుకొని ఇతర రాష్ట్రాల వారికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నకు నిర్మాతలు నేరుగా జవాబు చెప్పకపోయినా, స్థానిక ఫైటర్స్ తమిళ ఫైటర్స్ వలే ఎక్కువ రిస్క్ తీసుకొని ఫైట్స్ చేయరని, యూనియన్ సభ్యులుగా ఉన్న కొందరయితే అసలు నేరుగా స్టంట్ సన్నివేశాలలో పాల్గొనకుండా గుంపులో ఒకరిగా నటించడానికే మొగ్గుచూపుతారని కొందరు నిర్మాతలు ఆరోపిస్తున్నారు.   కోట్ల రూపాయలు పోసి తీస్తున్న సినిమాలో ఇటువంటి వారిని ఏవిధంగా భరించగలమని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు సరయిన నైపుణ్యం ప్రదర్శిస్తే తాము రెట్టింపు ఖర్చులు భరిస్తూ ఇతర రాష్ట్రాల నుండి స్టంట్ మాస్టర్లను ఎందుకు తెచ్చుకొంటామని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఇతర రాష్ట్రాల స్టంట్ మాస్టర్లను, ఫైటర్లను రప్పించి సినిమాలు తీసుకోవలసివస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   కానీ, స్థానిక స్టంట్ మాస్టర్లు వేరే విధంగా చెపుతున్నారు. తాము ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, ఎంత రిస్కు తీసుకొని ఫైట్స్ చేసినప్పటికీ తామంటే మన నిర్మాతలకు దర్శకులకు ఎప్పుడూ చిన్న చూపేనని, ఇతర రాష్ట్రాల నటీనటులు, ఫైటర్స్, స్టంట్ మాస్టర్స్ పట్ల చూపే గౌరవం, ఆదరణలో పదో వంతు కూడా తమపై చూపారని ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం ఇతర రాష్ట్రాల స్టంట్ మాస్టర్ లను స్థానిక సంఘంలో పేరు నమోదు చేయించుకోమని చెప్పినప్పటికీ వినేవారు లేరని వారు ఆరోపిస్తున్నారు.   కోలివుడ్ లో జరిగే తమిళ సినిమా షూటింగులకి కేవలం స్థానికులనే తీసుకోవడానికి అక్కడి నిర్మాతలు మొగ్గు చూపుతున్నపుడు, హైదరాబాద్ లో జరిగే తెలుగు సినిమా షూటింగులకి స్థానికులని తీసుకోవడానికి నిర్మాతలకి అభ్యంతరం ఏమిటని నిలదీస్తున్నారు. స్థానిక కళాకారులు పని లేక పస్తులు పడుకొంటే, మన నిర్మాతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల నుండి స్టంట్ మాస్టర్లని తీసుకువస్తున్నారని ఆరోపించారు. వారు న్యాయ బద్దంగా స్థానికులకు అవకాశం ఈయకపోతే తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

బాద్ షా 50 రోజుల వేడుక లేనట్టేనా?

  బాద్ షా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తాజా చిత్రం ఇద్దరమ్మాయిలతో మే 9న విడుదల అవుతోంది. దాదాపు బాద్ షా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్. శ్రీనువైట్ల కాంబినేష లో వచ్చిన బాద్ షా చిత్రం మొదటివారంలోనే కలెక్షన్స్ పరంగా జోరు తగ్గిందని ట్రేడ్ వర్గాలు తెల్చేశాయి. కలెక్షన్స్ పరంగా ఓవర్సీస్ లో మాత్రం నెంబర్ వన్ గా నిలిచింది.  బాద్ షా చిత్రం టాక్ వైజ్ గా హిట్, కలెక్షన్స్ పరంగా కమర్షియల్ సూపర్ హిట్ గా నిలిచింది. షాడో, గ్రీకువీరుడు వాయిదా పడడంతో బాద్ షా కి కలెక్షన్స్ వచ్చాయి. బాద్ షా నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రం 50 రోజులు పూర్తీ కాకుండానే ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని విడుదల చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారు. అసలు బాద్ షా చిత్రం 50 రోజుల వేడుక జరుగుతుందా అనే అనుమానాలు అభిమానులకు కలుగుతోంది.

ఒసామా బిన్ లాడెన్, సన్నీ లియోన్ అభిమాని

  పాకిస్తాన్ లోని అబ్బొట్టాబాద్ ఇంట్లో అమెరికా సైనికులు ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఒసామా బిన్ లాడెన్ ఒంట్లో సోదాలు నిర్వహించగా నీలిచిత్రాల కేసెట్లు లభ్యమయ్యాయి. ఆ కేసెట్లలో ఎక్కువగా సన్నీ లియోన్ నీలిచిత్రాలే వుండడం విశేషం. ఈ విషయంపై సన్నీ లియోన్ ను వివరణ కోరగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్ వద్ద తన నీలిచిత్రాలు వున్నాయనడం ముందు పెద్ద జోక్ గా తీసుకున్నాను. కానీ అలాంటి వ్యక్తి తన అభిమాని అని తెలియడంతో ఆనందంగా వుందని చెప్పింది. మీకు అత్యంత పెద్ద అభిమాని ఎవరు అని అడిగిన ప్రశ్నకు సన్నీ లియోన్ జవాబిస్తూ ఒక కాలేజీ స్టూడెంట్ నా చిత్రాన్ని వర్జిన్ చెట్టు చిటారు కొమ్మపై ఉంచి తనని ఆ సంవత్సరం జరిగే ఫీట్ కు నన్ను ఆహ్వానించాడు. అది చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మరొక అభిమాని ఏర్ పోర్ట్ లో ఎప్పుడూ కలుస్తూ ఉంటాడని తనను చూసిన వెంటనే తనకు నాతొ ఒక సినిమా తీయాలని ఉందని అంటుంటాడు. అతను ఇప్పటికే 50 చిత్రాలు తీసి వుంటాడు. నేను ఎప్పుడు ఏర్ పోర్ట్ కు వెళ్ళినా అతను నాకు ఎదురుపడుతుంటాడు అని గట్టిగా నవ్వేసింది

ఎన్టీఆర్, హరీష్ శంకర్ మూవీ అప్ డేట్స్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సూపర్ హిట్ అవడంతో ఫుల్ జోష్ లో వున్న ఎన్టీఆర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమాలో బిజీ గా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ లాంకో హిల్స్ సమీపంలో చిత్రీకరణ జరుగుతుంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. బృందావనం తరువాత ఎన్టీఆర్, సమంత చేస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్, సమంత కెమిస్ట్రీ బాగా పండిందని డైరెక్టర్ ట్విట్ కూడా చేశారు. వీరిద్దరి మద్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటాయని హరీష్ ధీమా వ్యక్తం చేశాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ మల్టీస్టారర్

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన దూకుడును పెంచినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్న ఈయన తాజాగా తన కుమారులు నిర్మించే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా నటించబోతున్నారు. మోహన్ బాబు సరసన అలనాటి అందాల తార రవీనా టాండన్ నటిస్తుంది. కథానాయికలుగా ప్రణీత, హన్సిక నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘లక్ష్యం ’ ఫేం దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు అయిన గోపీ మోహన్, కోనవెంకట్, బీవీఎస్ రవి లు పనిచేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చ బోతున్నారు. ఈ చిత్ర షూటింగు ఈ నెల 21 ప్రారంభం కాబోతుంది.

నటి అంజలి కష్టాలు తీరేనా

  సినీనటి అంజలి ఎట్టకేలకు తన 5రోజుల అజ్ఞాతవాసం ముగించుకొని మళ్ళీ కెమెరాల ముందుకు వచ్చింది. ఇక ముందు కేవలం తన సినిమా కెరీర్ మీదనే దృష్టి పెడతానని, ఇంతవరకు ఒప్పుకొన్న అన్ని సినిమాలను పూర్తి చేస్తానని ఆమె హామీ ఇచ్చింది. ఇక నుండి తన జీవితం, తన సినిమా కెరీర్ తన చేతుల్లోనే ఉంటుందని కూడా ఆమె అనడం చూస్తే, ఇక ఎవరి పెత్తననం అంగీకరించనని ఆమె చెప్పిందనుకోవచ్చును.   కానీ, ఆమె తన డబ్బు కాజేశాడని ఆరోపించిన తమిళ దర్శకుడు కలంజియణ్ తోనే ‘ఊర్ శూత్రి పురాణం’అనే తమిళ సినిమాలోకలిసి నటించడానికి ఒక అగ్రిమెంటు మీద సంతకం చేసి, కాల్షీట్స్ కూడా ఇచ్చింది. ఇన్ని గొడవలు, ఆరోపణలు, కోర్టు కేసులు జరిగిన తరువాత ఇప్పుడు అతనితో కలిసి నటించడం అంజలికి కష్టమే. నటించకపోతే కోర్టుకీడుస్తానని అతను ముందే హెచ్చరిస్తున్నాడు. ఈ సమస్యని అంజలి ఏవిధంగా పరిష్కరించుకొంటుందో, ఈ విషయంలో ఆమెకు ఎవరు సహాయపడతారో తెలియదు కానీ, ఆమె కష్టాలు ఇప్పుడప్పుడే తీరేట్లు లేవు.

తడకా చూపిస్తానంటున్నకుర్ర హీరో

  అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో నాగార్జున తానూ గ్రీకు వీరుడినని చెప్పుకొంటుంటే, అతని కొడుకు నాగచైతన్య మాత్రం తన బెజవాడ, దడ సినిమాలు తిరగ్గొట్టిన ప్రజలందరికీ తన తడాకా చూపిస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే షూటింగు పూర్తి చేసుకొన్న అతని సినిమా పేరు ‘తడాకా.’ ఇది తమిళ్లో సూపర్ హిట్టయిన ‘వెట్టి’ అనే సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమాలో చైతుతో పాటు కమెడియన్ సునీల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆండ్రియా మరియు తమన్నాలు వీరికి జంటగా నటిస్తున్నారు. కొద్దిగా ప్యాచ్ వర్క్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని దర్శకుడు ‘డాలీ’ చెప్పారు. ఈ సినిమా వచ్చే నెలాకరులోగా లేదా జూన్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను బెల్లం కొండ సురేష్ తన శ్రీ సై గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

మానసికంగా సిద్ధపడాల్సిందే ... సమంత

  ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు చిత్రరంగంలోకి అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం విధితమే. కానీ తాజాగా విడుదలైన జబర్ దస్త్, ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాలు సమంతకు పరాజయాలు రుచి చూపించాయి. పరాజయాలు మీలో ఎలాంటి మార్పు తెచ్చింది? అన్న ప్రశ్నకు సమంత ఈ విధంగా సమాధానం చెప్పింది. ఎవరూ వరుసగా విజయాలు అందిపుచ్చుకోలేరు. ఎంత పెద్ద ప్రవాహానికైనా ఎక్కడో చిన్నపాటి అడ్డుకట్టపడుతుంది. అయినా బాధపడాల్సిన అవసరం లేదు. రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేయాలి విజయాలని అందుకున్నామంటే దాని అర్థం ఇక మనకు భవిష్యత్తులో తిరుగులేదని కాదు, వచ్చే పరాజయాల్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, దానికోసం మానసికంగా సిద్ధపడాల్సిందే అని చెప్పింది.

నా జీవితం నా చేతుల్లోనే: నటి అంజలి

        “నా లైఫ్ ఇక నా చేతుల్లోనే ఉంది. గత ఐదు రోజులుగా నా జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయి. నా వల్ల ఇబ్బందిపడ్డ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇక నా సినీ, వ్యక్తిగత జీవితం అంతా నా చేతుల్లోనే ఉంది. దర్శకుడు, నిర్మాతలు, నటులకు అందరికీ క్షమాపణలు చెబుతున్నా..సోమవారం నుండి “‘బోల్ బచ్చన్” షూటింగ్ పాల్గొంటా. ఇక నాదృష్టి అంతా సినిమాలమీదనే” ప్రముఖ నటి అంజలి తెలిపింది. ఆమె కిడ్నాప్ వ్యవహారం ముగియడంతో ఈ సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడింది. తన కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనల వల్ల ఆందోళన చెందారని, సోమవారం నుండి షూటింగ్ వెళ్తానని తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్రలో జరుగుతుంది.

అజ్ఞాతం వీడిన నటి అంజలి

        ఐదు రోజుల నుంచి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా సినీ నటి అంజలి శుక్రవారం హైదరాబాద్ పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యింది. డీసీపీ సుధీర్ బాబు నటి అంజలి ని దాదాపు రెండు గంటలు ప్రశ్నించారు. అన౦తరం మీడియాతో మాట్లాడిన అంజలి..మానసిక ఒత్తిడితోనే తాను బయటకి వెళ్లానని చెప్పారు. సోమవారం నుంచి షూటింగ్ లకు హాజరవుతానని స్పష్టం చేశారు. బాబాయి,పిన్ని గురించి మీడియాకు చెప్పడానికి అంజలి నిరాకరించారు. మరో వైపు ఆమె పిన్ని భారతి మద్రాస్ కోర్టులో తన కుమార్తెను తనకు తిరిగి అప్పగించవలసిందిగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఆమెను తామే పెంచాము గనుక ఆమెపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని అందువల్ల ఆమెను తమకే క్షేమంగా అప్పగించవలసిందిగా తన పిటిషన్లో కోరింది. 

బాద్ షా మొదటివారం కలెక్షన్స్

యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా విడుదలయి అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ సినిమాకి టికెట్స్ దొరకని పరిస్థితి. ఏ సినిమా హాలు ముందు చూసినా హౌస్ ఫుల్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. సినిమా టాక్ విని దియేటర్లకి వస్తున్న ఫామిలీ ఆడియన్స్ ని హౌస్ ఫుల్ బోర్డులు వెక్కిరిస్తుండటంతో కొంచెం అసహనంగా మరో సినిమాకి వెళ్ళక తప్పట్లేదు. ఈ ఊపు కనీసం మరో రెండువారాల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని దియేటర్ల యజమానులు చెపుతున్నారు. మొదటి వారం కలెక్షన్ వివరాలు: నైజాం 8.04 కోట్లు సీడెడ్ 5.45 కోట్లు కృష్ణా 1.69 కోట్లు గుంటూరు 2.70 కోట్లు నెల్లూరు 1.13 కోట్లు తూర్పు గోదావరి 1.81 కోట్లు పశ్చిమ గోదావరి 1.51 కోట్లు ఉత్తరాంధ్ర 2.43 కోట్లు కర్ణాటక 2.75 కోట్లు దేశంలో మిగిలిన ప్రాంతాలలో 0.70 కోట్లు విదేశాలలో 5.90 కోట్లు మొత్తం కలెక్షన్స్ 34.11 కోట్లు

బాబాయ్‌ చెప్పుతో కొట్టినందుకే వెళ్లిపోయా: అంజలి

        తన సోదరి అంజలి మాట్లాడిన ఫోన్‌కాల్ రికార్డ్‌ను రవిశంకర్ మీడియాకు విడుదల చేశారు. బాబాయ్‌చెప్పుతో కొట్టాడని అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని చెప్పింది. విపరీతంగా కొట్టేవాడని, చెప్పుతో కొట్టాడని వాపోయింది. తన పిన్ని వేధింపులు భరించలేకే భారతీ దేవి ఇంటి నుంచి వచ్చేశానని అంజలి తన సోదరుడితో చెప్పింది. ఇలా జరుగుతున్నప్పుడు ముందే ఎందుకు తనను ఎందుకు సంప్రదించలేద రవి శంకర్ ప్రశ్నించినప్పుడు.. ఎవరి ఫోన్ నంబర్లు తన దగ్గర లేవని అంజలి పేర్కొంది. "అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనీసం నువ్వయినా నాకు అండగా ఉండు'' అంటూ అంజలి తన సోదరుడిని వేడుకుంది. తాను కనబడడం లేదన్న ఫిర్యాదును ఉపసంహరించు కోవాలని చేసుకోవాలని సోదరుడికి చెప్పింది. కాగా, అంజలి అదృశ్యంతో కంగారు పడ్డ కొందరు నిర్మాతలకు ఆమె ఫోన్ చేసిందని తెలిసింది.  

ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న అమితాబ్

        2011 సంవత్సరానికి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో జరిగిన ఈ వేడుకలో సీఎం కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న అమితాబ్‌బచ్చన్ మాట్లాడాతు...తన దృష్టిలో అతిగొప్ప జాతీయ సమైక్యత సాధనం సినిమాయేనని అమితాబ్ బచ్చన్ తెలిపారు. "తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగునేల కన్నబిడ్డ నందమూరి తారకరామారావు. ఆయన పేరుమీద ఏర్పాటు చేసిన అవార్డును నేనందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. ఆయన సినిమాలను నేను హిందీలో రీమేక్ చేసేవాడిని. నా సినిమాలను ఆయన తెలుగులో రీమేక్ చేసేవారు. పరస్పరం సలహాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. భారతీయ సినిమా వందేళ్ల పండుగను చేసుకుంటున్న సమయంలో మనం దాదాసాహెబ్‌ని గుర్తుచేసుకోవాలి. 'హరిశ్చంద్ర' సినిమాను గుర్తుచేసుకోవాలి'' అన్నారు.

నేడు హైదరాబాద్ రానున్న సినీనటి అంజలి

  సినీనటి అంజలి అదృశ్యం సంచలనాన్ని సృష్టిస్తున్న విషయం విదితమే. తాజాగా ఆమె తన సోదరుడు రవిశంకర్ ను శాటిలైట్ ఫోన్ ద్వారా తన క్షేమసమాచారాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రవిశంకర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన సోదరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని తెలపడంతో పోలీసులు అంజలిని తక్షణం హైదరాబాద్ రావాలని సూచించారు. రవిశంకర్ పోలీసుల సూచనలను అంజలికి చేరవేయడంతో అంజలి నేడు హైదరాబాద్ కు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ఒక సినీ నిర్మాత సంరక్షణలో ఉన్నట్లు సమాచారం. పిన్నీ, బాబాయ్ లతో గత కొంతకాలంగా అంజలికి బేధాభిప్రాయాలు తలెత్తాయి. అంజలి తెలుగు చిత్రాలలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో బాబాయి, పిన్ని తమకు ఇష్టం లేదని, తమిళ సినిమాలలోనే చేయాలని ఆమెపై వత్తిడి తెచ్చారు. అయినా అంజలి వారి మాటలను బేఖాతరు చేయడంతో వారు అంజలిని కొట్టి హింసించినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విరక్తి చెందిన అంజలి హైదరాబాద్ లోని ఒక హోటల్ నుండి హఠాత్తుగా మాయమైపోయారు. ఆశ్రయమిస్తున్న సినీ నిర్మాత కూడా అంజలికి నచ్చజెప్పడంతో ఆమె ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి తాను ఎందుకు అదృశ్యం కావాల్సి వచ్చిందో వెల్లడిస్తుందని తెలిసింది.

మున్నా భాయ్ కోసం నిరీక్షిస్తాము

  అక్రమాయుధాల కేసులో 5ఏళ్ళ జైలు శిక్ష విదింపబడిన బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ ఈ నెల 18లోగా కోర్టు ముందు లొంగిపోవలసి ఉంది. అందుకు అతను మానసికంగా సిద్దపడినప్పటికీ, ఆఖరి ప్రయత్నంగా రేపు సుప్రీం కోర్టులో రివ్యు పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఒకవేళ కోర్టు అతని పిటిషను తిరస్కరించినట్లయితే, ఇక క్షమాభిక్ష కోసం కూడా దరఖాస్తు చేసుకోకూడదని ఆయన నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.   గత 20 సం.లుగా ఈ కేసును తన భుజాలమీద కోతిలా మోసుకు తిరుగుతూ దానితో నిత్యం నరకం అనుభవిస్తూ మనఃశాంతి లేకుండా జీవిస్తున్నానని, ఈ నరకం అనుభవించడంకంటే మూడున్నరేళ్ళు జైల్లో గడిపివస్తే ఇక తను జీవితాంతం ప్రశాంతంగా బ్రతకవచ్చుననే ఆశతో జైలుకి వెళ్ళిపోవాలనుకొంటున్నట్లు ఆయన నిర్మాతలకు చెప్పారు. అతనితో ‘మున్నాభాయి-3వ భాగం’ తీయాలనుకొన్న రాజ్ కుమార్ హిరాని మరియు విదూ వినోద్ చోప్రాలు కూడా సానుకూలంగా స్పందిస్తూ తమ రియల్ లైఫ్ హీరో మున్నాభాయ్ జైలు నుండి తిరిగివచ్చేవరకు తమ రీల్ మున్నాభాయి ఎదురుచూస్తాడని, అతను జైలు నుండి తిరిగి వచ్చిన తరువాతనే మున్నాభాయి-3 సినిమా తీస్తాము తప్ప వేరెవరితో తీయబోమని వారు తెలిపారు.

అంజలి దాగుడుమూతలు

  మూడు రోజుల క్రితం హోటల్ నుండి పారిపోయిన సినీనటి అంజలి ఇంకా తన దాగుడుమూతలు ఆటలు కొనసాగిస్తూనే ఉంది. ఈ రోజు తన సోదరుడు రవి శంకర్ కు ఫోన్ చేసి తానూ క్షేమంగానే ఉన్నానని రేపు మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు మాట్లాడాలనుకొంటున్నట్లు తెలిపింది. తానూ ఒంటరిగా లేనని తనకు తోడుగా మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపింది. తన వల్ల ఏనిర్మాత కూడా నష్టపోవడం ఇష్టంలేదని, కానీ హోటల్ రూములో తనను బాబాయి సూరిబాబు కొట్టడంవలననే పారిపోయానని త్వరలో వచ్చి షూటింగులో పాల్గొంటానని తెలిపింది. తను ఇక పిన్ని,బాబాయి ఇంటికి తిరిగి వెళ్ళే ప్రసక్తిలేదని వారు తనను చాల వేధిస్తున్నారని కూడా తెలిపింది.   పోలీసులు చెపుతున్న సమాచారం ప్రకారం ఆమె హోటల్ రూము నుండి బయటకి వెళ్ళిన గంటలోగా ఆమె ఫోన్ నుండి మొత్తం 18 ఫోన్ కాల్స్ వెళ్ళినట్లు తెలిసింది. ఆమె కోలీవుడ్ లో పలువురు నిర్మాతలతో, పాత్రికేయులతో మరియు ఒక వైద్యునితో మాట్లాడినట్లు తెలిపారు.   ఇక మరో వైపు ఆమె పిన్ని భారతి మద్రాస్ కోర్టులో తన కుమార్తెను తనకు తిరిగి అప్పగించవలసిందిగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఆమెను తామే పెంచాము గనుక ఆమెపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని అందువల్ల ఆమెను తమకే క్షేమంగా అప్పగించవలసిందిగా తన పిటిషన్లో కోరింది.

శ్రీనువైట్ల కి ఎన్టీఆర్ సెంటిమెంట్‌

        నందమూరి తారకరామారావుగారి ప్రస్తావన నా సినిమాల్లో సెంటిమెంట్‌గా మారింది. 'రెడీ'లో మామూలుగానే పెట్టాను. కానీ 'దూకుడు'లో ప్రకాష్‌రాజ్ అభిమానించే వ్యక్తిగా నాకు ఎన్టీఆర్‌గారు తప్ప మరెవరూ గుర్తుకురాలేదు. ఈ సినిమాలో మాత్రం సెంటిమెంట్‌గానే పెట్టాను. తెలంగాణ యాసలో మాట్లాడించిన డైలాగులకు చాలా మంచి స్పందన వస్తోంది. తారక్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. జస్టిస్ చౌదరి గెటప్‌నకు కూడా ఈ సినిమాలో మంచి స్పందన వస్తోంది. తారక్ కూడా ఎగ్జైట్ అయి చేశాడు. నాజర్ పాత్రను అందరూ మెచ్చుకుంటున్నారు. బ్రహ్మానందంగారు ఫోన్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేనెప్పుడూ హీరోని దృష్టిలో పెట్టుకునే కథ చేస్తాను. నేను ఏ సినిమా చేసినా వినోదాన్ని మిస్ కాను. అన్ని వర్గాల వారినీ అలరించేసినిమా చేయడమే నా ధ్యేయం.