కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఎలాంటి  లాభాలో తెలుసా!

కొబ్బరినీరు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అనుకోవచ్చు. ఈ సహజసిద్దమైన నీటిలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు,  యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు, విటమిన్-బి కాంప్లెక్స్ లు, విటమిన్-సి ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అనారోగ్యం చేసినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఎండ కారణంగా అలసిపోయినప్పుడు, వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలని ఇలా చాలా కారణాలుగా కొబ్బరి నీరు తాగుతారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడే కొబ్బరి నీరు అమృతంతో సమానమనడంలో సందేహం లేదు. లేత కొబ్బరి  బొండాంలో ఉండే కొబ్బరి నీరు కాస్త ఉప్పగా ఉంటుంది. ఈ నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. కొబ్బెర పట్టిన కొబ్బరి బొండాంలో నీరు తియ్యగా ఉంటుంది. ఇందులో కేలరీలు కాసింత ఎక్కువ ఉన్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అయితే కొబ్బరి నీరు తాగే సమయాన్ని బట్టి దాన్నుండి కలిగే ప్రయోజనాలు కూడా మారతాయి. ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే.. ఉదయాన్నే పరగడుపున.. ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది ఉదయాన్నే లేత కొబ్బరి బొండాం నీటిని తాగుతారు. అధిక వేడి శరీరం ఉన్నవారికి ఇది భలే ఉపయోగపుడుతుంది. ఎందుకంటే పరగడుపున కొబ్బరినీరు తాగితే శరీరంలో అధిక ఉష్టోగ్రత తగ్గిస్తుంది. భోజనం తరువాత.. భోజనం తరువాత కొబ్బరి బోండాం తాగేవారు తక్కువే. అయితే భోజనం చేసిన కొద్దిసేపటి తరువాత కొబ్బరి బోండాం నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి జీర్ణం కావడం సులువే.  కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలా భోజనం తరువాత కొబ్బరినీరు ట్రై చేయవచ్చు. నిద్రపోయే ముందు.. రాత్రి పడుకునేముందు పాలు తాగే వారు అధికం. కానీ పడుకునే ముందు కొబ్బరినీరు తాగితే మానసిక సమస్యలు చాలా దూరం ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో టాక్సిన్ లు తొలగిస్తుంది. వ్యాయామం తరువాత.. అధికంగా వ్యాయామం చేసేవారు, ఆటగాళ్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడుతుంది. అలాంటి సందర్బాలలో కొబ్బరి నీరు తాగడం వల్ల కోల్పోయిన  ఎలక్ట్రోలైట్లు భర్తీ అవుతాయి. ఆటలోనూ, వ్యాయామంలోనూ అలసిన శరీరానికి ఇది ఓదార్పును ఇస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.  తల్లి పాలలో లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇదే పదార్థం కొబ్బరినీళ్లలో కూడా ఉంటుంది. దీని కారణంగా కొబ్బరినీరు తాగితే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మద్యం తాగాలని అనిపించినప్పుడు.. మద్యం తాగే అలవాటున్న చాలామంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటారు. కొందరు మద్యం మానేయాలని ప్రయత్నించినా అందులో సఫలం కాలేరు. అయితే మద్యం తాగాలని అనిపించినప్పుడల్లా కొబ్బరినీరు తాగాలి. మద్యానికి బానిసైనవారు మద్యం తాగకపోతే తల తిరిగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొబ్బరినీరు ఈ లక్షణాలు తగ్గిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను కూడా భర్తీ చేస్తుంది.                                                         *నిశ్శబ్ద.

ఉపన్యాసకులు ఎలా ఉండాలి?

ఓ సభ నిండా శ్రోతలు ఉన్నప్పుడు వారి ముందు మాట్లాడటం, వారిని మెప్పించేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. నేటి కాలంలో ఇలా మాట్లాడేవారు చాలా అరుదు. ఒకసారి చరిత్రలోకి చూస్తే…….. చికాగోలో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు సమయం ఇచ్చేందుకే ఎవ్వరూ ఇష్టపడలేదు. అయిష్టంగా, మొక్కుబడిగా సమయం కేటాయించారు. ఐతే ఆరంభ వాక్యాలతోనే వివేకానంద అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. సంక్లిష్టమైన, మతపరమైన ఉపన్యాసాల నడుమ శ్రోతలను "సోదరసోదరీమణులు" గా సంబోధించటంతోటే శ్రోతల పైమెట్టునున్న వాడిలా కాక, వారిలో తానూ ఒకడైపోయాడు. విశ్వవేదికపై వివేకానందుడు ఓ శక్తిగా అవిర్భవించాడు. ఉపన్యాసాలిచ్చేవారు గమనించాల్సిన అంశం ఇది. వీలైనంత త్వరగా ఎదురుగా ఉన్న శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. శ్రోతల కన్నా తాను ఒక మెట్టు పైనున్న వాడిలా కాక తానూ శ్రోతలలో ఒకడన్న భావనను శ్రోతలకు కలిగిస్తే తోటే ఉపన్యాసకుడు. సగం విజయం సాధించినట్టే. ఆధునిక సమాజంలో 'వాజ్ పేయి' ఉపన్యాసాలంటే, సభల పేరు చెప్తే ఆమడ దూరం పారిపోయేవారు కూడా సభలకు పరుగెత్తి వస్తారు. ఇతర రాజకీయనాయకులంతా ఓ వైపు, ఉపన్యాసాలలో వాజ్ పేయి ఒక్కడూ ఓ వైపు. గమనిస్తే, వాజ్ పేయి ఉపన్యాసాలలో ఏ నాడూ తాను ఓ మెట్టు పైనున్నాడన్న భావన శ్రోతలకు కలగనివ్వడు. పైగా చమత్కార పూరితమైన సంభాషణలతో సభను అలరిస్తాడు. మామూలుగా మనం మాట్లాడే పదాలనే విరిచి పలకటం, వాటిని పలుకుతున్నప్పుడు తానూ ఆనందం అనుభవిస్తూ పలకటం, వల్ల వాజ్ పేయి మామూలు మాటలు కూడా సభలో ప్రేక్షకులను ఉర్రూతలూపుతాయి. పైగా, తన ఉపన్యాసంలో సమకాలీన సంఘటనలను, ప్రాంతీయఘటనలను వ్యంగ్యంగా ప్రస్తావించటంతో వాజ్ పేయి ఉపన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. వాజ్ పేయి తరువాత శ్రోతలను అంతగా అలరించేవి అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలు. వాజ్ పేయి ధోరణికి, వాక్ శైలికి పూర్తిగా భిన్నమైంది అబ్దుల్ కలాం ధోరణి. అయితే ఇద్దరిలో మనం గమనించాల్సిన అంశం, వారు వీలైనంతగా శ్రోతలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తగా తన ఇమేజీని వాడుకుంటూ, ప్రతి ఒక్కరికీ మంచిని బోధించాలన్న నిజాయితీని ప్రదర్శిస్తూ, అబ్దుల్ కలామ్ శ్రోతలను స్ఫూర్తిమంతం చేయగలుగుతున్నాడు. గమనిస్తే రాజకీయ సంబంధిత ఉపన్యాసాలిస్తున్నప్పుడు అబ్దుల్ కలామ్ వ్యవహారశైలి మొక్కుబడిగా ఉంటుంది. అదే పిల్లల నడుమ, విద్యార్థుల నడుమ ఆయన చైతన్యంతో ఉట్టిపడుతూ, చైతన్యాన్ని కలిగిస్తాడు.  దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఉపన్యాసకుడు తనకు ఏ అంశాలపై పట్టు ఉందో, ఏ అంశంపై తాను శక్తిమంతంగా మాట్లాడగలడో తెలుసుకొని ఉండాలి. లేకపోతే వేదికనెక్కి అభాసుపాలు కాక తప్పదు. ప్రస్తుతం మన నాయకులనేకులకు తాము మాట్లాడాల్సిన అంశాలపై పట్టు ఉండదు. ఏదో రొటీన్ గా, మొక్కుబడిగా మాట్లాడతారు. దాంతో సభలంటేనే విసుగు పుడుతుంది. సాహిత్య సభలు కూడా ఇలాగే తయారయ్యాయి. సాహిత్యసభలు తమ పూర్వవైభవాన్ని కోల్పోవటం వెనుక ఉపన్యాసకులలో నిజాయితీ లోపించటం ప్రధానకారణం. పొగడ్తలతో ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయటం, ఏ సభకు ఆ సభలోని వ్యక్తే కాళిదాసుకు పెద్దన్న అన్నట్టు మాట్లాడటం సర్వసాధారణమై పోయింది. విమర్శలు భరించే సహనం లేకపోవటంతో పొగడ్తలే దివ్యౌషధంగా మారాయి. దాంతో సాహిత్యసభలు విలువను కోల్పోయి పరిహాసాస్పదం అయ్యాయి. సభల్లో మాట్లాడేటప్పుడు ఉపన్యాసకుడు ముందుగా తాను మాట్లాడే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం తప్పనిసరి, చమత్కారపూరిత సంభాషణ లేకున్నా, విభిన్నభావాలు ప్రదర్శించలేకున్నా, శ్రోతల దృష్టిని నిజాయితీగా, విజ్ఞానవంతంగా ఉండే ఉపన్యాసకుడు ఆకర్షించగలుగుతాడు. ఇలాంటి ఉపన్యాసకులే ప్రజల మనసుల్లో కూడా అంతో ఇంతో గుర్తుగా నిలిచిపోతారు.                                       ◆నిశ్శబ్ద.

ప్రాణాలను తీసే COPD మీద అవగాహన కావాలిప్పుడు..

COPD అనే పదం విన్నప్పుడు చాలామంది మహిళలలో ఎదురయ్యే PCOD ని పొరపాటున ఇలా చదివారా ఏమైనా అనే సందేహం వస్తుంది. అయితే అది ఇది వేరు వేరు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 ను ప్రపంచ COPD దినోత్సవంగా జరుపుకుంటున్నారు.   COPD అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది శ్వాస సంబంధ సమస్యల రుగ్మత. శ్వాస నాళాలు కుచించుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస సంబంధ సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ఎక్కువకాలం బ్రోన్కైటిస్ సమస్య కొనసాగడం, ఎంఫెసెమా వంటి రెండు శ్వాస సంబంధ వ్యాధులు  COPD లో చేర్చబడ్డాయి. అసలు COPD ని ఎందుకంత ప్రమాదకరమైన సమస్యగా చెబుతున్నారు? దీని ప్రభావమెంత? దీని కారణాలు, దీని నివారణా మార్గాలేంటి? తెలుసుకుంటే.. COPD అనేది ప్రపంచంలో ఎక్కువ మొత్తం  ప్రజల మరణాలకు కారణం అవుతున్న జబ్బులో మూడవది.  ఈ సమస్యలో రోగనిర్థారణ ఎంత త్వరగా జరిగితే అంత  తొందరగా చికిత్స తీసుకోగలుగుతారు.  ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు.  అయితే గత ముప్పై సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే COPD సమస్య ప్రభావం చాలా పెరిగింది. మరీ ఎక్కువగా గత 10 సంవత్సరాల నుండి COPD తీవ్రంగా ఉంది. కరోనా తరువాత ఇది ప్రాణాంతకంగా రూపొంతరం చెందింది. మనిషి శ్వాసించాలంటే ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  అయితే COPD సమస్యలో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. ఈ COPD లక్షణాలు కింది విధంగా ఉంటాయి. COPD సమస్య ఉన్నవారిలో ఛాతీ నుండి కఫం, శ్లేష్మంతో కూడిన దగ్గు వస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులలో తరచుగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఛాతీ చాలా బిగుతుగా ఉంటుంది. తుమ్ములు, ముక్కు కారడం, అలసట, బలహీనత వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఊపిరి తీసుకునేటప్పుడు గురక  వస్తుంటుంది. సాధారణంగా జలుబు వస్తే రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. లేదంటే నాలుగైదు రోజులు వేధిస్తుంది. మెడిసిడ్ వాడితే తగ్గిపోతుంది. కానీ COPD సమస్యలో జలుబు దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. ఈ లక్షణాలు అన్నీ ఉన్నట్టైతే  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది చాలామందిలో ధూమపానం, మద్యపానం కారణంగా వస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉండే వదిలేయాలి.                                                        *నిశ్శబ్ద.  

ఆర్గ్యూ జరిగేటప్పుడు ఏడవకూడదు అనుకుని కూడా ఏడ్చేస్తుంటారా? ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు..!

ఏడవడం  ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చేసే పనే.. అయితే ఎప్పుడు ఏడుస్తున్నాం, ఎందుకు ఏడుస్తున్నాం అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు ఇతరులతో ఏదైనా వాదిస్తున్నప్పుడో.. గొడవ పడుతున్నప్పుడో అప్రయత్నంగా ఏడ్చేస్తుంటాం. మనిషిలో ఎమోషన్ స్థాయి పెరిగినప్పుడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. అదే ఏడుపుగా బయటకు వస్తూంటుంది. అయితే ఇలా ఏడ్చిన తరువాత.. అయ్యో ఎందుకు ఏడ్చాము అని ఎవరిని వారు అనుకుంటూంటారు. కొన్ని సార్లు తమని తాము నిందించుకునే వారు కూడా ఉంటారు. అయితే కింది చిట్కాలతో ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా ఏడుపును నియంత్రించుకోవచ్చు. కారణం.. ఎవరితో అయినా వాదిస్తున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఏడుపు వస్తుంటే అసలు ఏడుపు ఎందుకు వస్తోంది అని ఆలోచించాలి. దాని కారణం అర్థం అయ్యాక అసలు ఏడవాలని అనుకున్నా కూడ ఏడుపు రాదు. అంతేకాదు.. అలా ఏడవడానికి బదులుగా ఇతరులతో లాజిక్ గా మాట్లాడతారు. డైవర్ట్ కావాలి.. ఆర్గ్యూ చేసుకున్నప్పుడు  ఏడుపు వస్తుంటే దాన్ని బయటపడనివ్వకుండా డైవర్ట్ కావాలి.  ఇందుకోసం పిడికిలి బిగించడం, లోతుగా శ్వాస తీసుకోవడం,  గట్టిగా కళ్లు మూసుకోవడం వంటి చర్యల ద్వారా కోపాన్ని డైవర్ట్ చేయాలి. సైలెంట్.. గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఏడుపు వచ్చినా దాన్ని అణుచుకోవాలన్నా, ఎదుటివారితో లాజిక్ గా మాట్లాడాలన్నా సింపుల్ గా కాసేపు సైలెంట్ గా ఉండటం మంచిది. దీని వల్ల విషయాన్ని బాగా అర్థం చేసుకుని  లాజిక్ గా వాదించి మీరే కరెక్ట్ అనిపించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద.

కార్తీక మాసం ఎందుకంత విశిష్టమైనది!

తెలుగు క్యాలెండర్  ప్రకారం ఏడాదిలో ఉన్న 12మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఆశ్వయుజ మాస  అమావాస్య నాడు వచ్చే దీపావళి మరుసటిరోజు నుండి కార్తీకమాసం మొదలవుతుంది.  ఇది తెలుగు క్యాలెండర్ లో ఎెనిమిదవ నెల. కార్తీకమాసంలో చాలామంది శివాలయ దర్శనం, దీపాలు వెలిగించడం, దైవభక్తిలో గడపడం చేస్తారు. అయితే కార్తీకమాసంలో కేవలం ఇవే ప్రధానం కాదు. కార్తీకమాసం ఎందుకంత గొప్పది? ఈ మాసం ప్రత్యేకత ఏమిటి? పురాణాలలో కార్తీకమాసం గురించి ఏం చెప్పబడింది? కార్తీకమాసంలో ఏ పూజ మంచిది?  వివరంగా తెలుసుకుంటే.. హిందూ క్యాలెండర్ లో కార్తీకమాసం చాలా విశిష్టమైనది. ఈ మాసం  విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం అంతా స్నానం, దానం, ధ్యానం, పూజలు మొదలైనవాటితో చాలా భక్తిపూర్వకంగా గడిచిపోతుంది. ఈ మాసం పుణ్యఫలాలను ఇస్తుందని సాక్షాత్తూ ఆ విష్టు భవనానుడే చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అన్ని మాసాలలోకి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని బ్రహ్మ దేవుడు కూడా చెప్పినట్టు పురాణ కథలున్నాయి.  ఇకపోతే కార్తీకమాసంలో ఎవరైనా తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటే దానికి నారాయణ తీర్థం లేదా బదరికాశ్రమం చాలా ఉత్తమమైనదని పండితులు, పురాణ కథనాలు చెబుతున్నాయి. కార్తీక మాసం గురించి పురాణ గ్రంథాలలో ..  "న కార్తీకసమో మాసో న కృతేన్ సమం యుగం   న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం" అని ఉంది. అంటే.. కార్తీకమాసం లాంటి మాసం లేదు, సత్యయుగం లాంటి శకం లేదు, వేదాల వంటి గ్రంథాలు లేవు, గంగ వంటి తీర్థం లేదు అని అర్థం.  కార్తీక మాసంలో దేవుడి అంశ బలపడుతుంది. ఈ మాసంలో విష్టుభగవానుడిని తులసితో పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.  ఈ మాసంలో జ్ఞానం, లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. కేవలం ఈ పూజలు మాత్రమే కాకుండా గంగాస్నానం, దీపదానం, యజ్ఞం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. నదీ స్నానం.. దీపాలు వదలడం వెనుక కారణం.. కార్తీక మాసంలో స్నానానికి పెద్ద  పీట వేస్తారు. పారే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. అయితే నదీ స్నానం వెనుక ఉన్న ముఖ్య కారణం చూస్తే.. "శ్రేష్ఠో దేవాన మధుసూదన్ తీర్థ నారాయణాఖ్యాం హి త్రితాయాం దుర్లభం కలౌ ।"  అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం శ్రీమహావిష్ణువు నెలకొని ఉండే విష్టుతీర్థం లాగా కార్తీకమాసం కూడా  గొప్పది అని అర్థం. ఇంకొక కారణం చూస్తే..  కార్తీక పూర్ణిమ రోజున మహదేవుడు లేదా పరమేశ్వరుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. విష్ణుమూర్తి కూడా మత్స్య అవతారం ఎత్తాడు.  కార్తీకమాసం అంతా విష్ణువు మత్స్య అవతారంలో నీటిలో నివసిస్తాడు. అలాంటి పవిత్రమైన సమయంలో ఉదయాన్నే నీటిలో స్నానం చేయడం, నీటిలో దీపాలు వదిలడం చేస్తే పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీకమాసంలో గంగాస్నానం చేయడానికి దేవతలే భూలోకానికి వస్తారని కూడా అంటారు. అందుకే పారే నీటిలో స్నానం చేయడం పుణ్యప్రదం.                                                  *నిశ్శబ్ద.

పిల్లలు హోం వర్క్ చేయడానికి అయిష్టంగా ఉంటారా? ఇలా చేస్తే..

చిన్నపిల్లలకు స్కూలుకు వెళ్లడమన్నా, ట్యూషన్లకు వెళ్ళడమన్నా, హోం వర్క్ చెయ్యడమన్నా అస్సలు ఇష్టముండదు. పిల్లలు ఎప్పుడూ ఆడుకోవడానికి, కార్టూన్స్ చూడడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలను స్కూలుకు పంపడం మొదలుపెట్టిన తరువాత వారు ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవరకు కూడా తల్లిదండ్రులు పిల్లలతో హోం వర్క్ చేయించాల్సి ఉంటుంది.  కానీ పిల్లలు హోం వర్క్ చేయడానికి ససేమీరా ఒప్పుకోరు. మొండి చేస్తారు. అలాకాకుండా పిల్లలు హ్యాపీగా హోం వర్క్ చేయాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి.. పిల్లలకు హోంవర్క్‌ని సులభతరం చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచాలి. పిల్లలు చదువుకునే ప్రదేశంలో ప్రశాంతత,  తగినంత వెలుతురు ఉండాలి. పిల్లల దృష్టిని మరల్చేది ఏమీ ఉండకూడదు. పిల్లలకి పెన్ను, కాగితం, రిఫరెన్స్ మెటీరియల్ ఉండాలి. కేవలం చదువులకే ప్రత్యేక స్థానం కల్పించడం వల్ల పిల్లల ఏకాగ్రత, ఉత్పాదకత రెండూ పెరుగుతాయి.  పిల్లలకు సమయ నిర్వహణ నేర్పాలి..  పిల్లలకు సమయ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను నేర్పాలి. ఉదాహరణకు టైమర్‌ను 25 నిమిషాలు సెట్ చేసి, ఆపై చిన్న విరామం తీసుకోమనాలి. పోమోడోరో టెక్నిక్ అని పిలిచే ఈ టెక్నిక్ ఉత్పాదకతను పెంచుతుంది.  మానసిక అలసటను తగ్గిస్తుంది. చిన్న చిన్న బ్రేక్ ల వల్ల పిల్లలకు విసుగు రాదు. ఇది మాత్రమే కాకుండా  పిల్లల చదువులో వారికి సహాయం చేయడానికి పుస్తకాలు లేదా విద్యా వెబ్‌సైట్‌ల వంటి వాటిని  యాక్సెస్ చేయడానికి వారిని అనుమతించాలి. ఎక్కువ వనరులు అందుబాటులో ఉంటే పిల్లలు స్వతంత్రంగా పనిని పూర్తి చేయడం సులభం అవుతుంది. తల్లిదండ్రులు తమ దృష్టిని గ్రేడ్‌ల  మీద కాకుండా పిల్లల చదువు మీదనే ఉంచాలి. గ్రేడ్లు, ర్యాంకులు పిల్లలమీద ఒత్తిడి కలిగిస్తాయి.  ప్రశ్నలు అడగడానికి, విషయాలను లోతుగా అన్వేషించడానికి,  వాటిని  పూర్తిగా అర్థం చేసుకోవడానికి  పిల్లలను ప్రోత్సహించాలి.  జ్ఞానం,  వ్యక్తిగత అభివృద్ధి   ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. మైక్రోమేనేజింగ్‌ను నివారించాలి..  పిల్లల హోంవర్క్‌ను మైక్రోమేనేజింగ్ పద్ధతిలో నిర్వహించకూడదు. చాలామంది  దీనివల్ల  నిరాశ,  ప్రతిఘటనకు లోనవుతారు. దీనికి బదులుగా పిల్లలకు హోంవర్క్ చేయడంలో  మద్దతు ఇవ్వడం,  మార్గదర్శకత్వం అందించండం చేయాలి. దీనివల్ల   పిల్లవాడు తన స్వంత పనులను  సులువుగా పూర్తీ చేస్తాడు.                                                         *నిశ్శబ్ద  

ఈ వ్యక్తులతో స్నేహం చేయండి, వారు చాలా దయగలవారు!

మంచి హృదయం ఉన్న వ్యక్తులు అని చెప్పినప్పుడు, మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి కరుణ, నిజాయితీ, వినయం. ఒక్క మాటలో చెప్పాలంటే, వీరు ఇతరుల కంటే మృదువైన,  సున్నితమైన లక్షణాలను కలిగి ఉన్నారని చెప్పడం తప్పు కాదు. అలాంటి మంచి మనసున్న వారిని ఎలా గుర్తించాలి అని మీరు ఒక సారి ఒక ప్రశ్న అడగవచ్చు. కొంతమంది చాలా కూల్‌గా ఉంటారు. మరికొందరు చాలా వినయంగా ఉంటారు.  కానీ ఇతరులపై కనికరం చూపే వారు చాలా అరుదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూపుతున్న కనికరాన్ని కూడా అనుమానించేవాళ్లు ఉన్నారు. నేటి ప్రపంచంలో జరుగుతున్న మోసాల కారణంగా ప్రజలు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను అంత సులభంగా విశ్వసించడం లేదని అర్థం. కొన్ని రాశిచక్రాల వ్యక్తులు మొదటి నుండి అత్యంత అందమైన హృదయాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. మీరు స్నేహం చేయడానికి మంచి వ్యక్తి కోసం చూస్తున్నట్లయితే, ఈ మూడు రాశులను ముందుగా పరిగణించవచ్చు. 1. కర్కాటకం: కర్కాటకం చంద్రునిచే పాలించబడుతుంది, అంటే ఇది ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మరొక వ్యక్తి ముందు వారు తమ భావాలను ఎలా వ్యక్తం చేస్తారో వారి హృదయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు, ఇది ఈ రాశిచక్రాన్ని చాలా భావోద్వేగ గుర్తుగా చేస్తుంది. ఈ సంకేతం యొక్క వ్యక్తులు గొప్ప సున్నితత్వం కలిగి ఉంటారు, వారు ప్రతిదీ హృదయపూర్వకంగా తీసుకుంటారు. వారు తమ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని.. వారి కోసం తమ సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు. వారు చాలా సానుభూతి కలిగి ఉంటారుజ వారి అవసరాల కంటే ఇతరుల అవసరాలకు విలువ ఇస్తారు. 2. కన్య: బాహ్యంగా, కన్యలు ఆచరణాత్మక, విమర్శనాత్మక, విరక్త జీవులు. ఈ రాశి వారి మనసులోని భావాలపై చాలా ఆధారపడి ఉంటుంది. కన్య రాశి వారు రహస్యంగా చాలా సెన్సిటివ్, మృదుహృదయం కలిగి ఉంటారని చాలా మందికి తెలియదు. అతని గురించి విమర్శలు ప్రియమైనవారి నుండి,  తిరస్కరణ భయం నుండి వస్తాయి. వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.  వారు ఎల్లప్పుడూ వారి నిజాయితీ మరియు సహాయానికి అంకితమై ఉంటారు. 3. మీనం: మీనం రాశి వారు చాలా సున్నితమైన జీవులు. నిజానికి, అవి రాశిచక్రం యొక్క అత్యంత సున్నితమైన సంకేతాలలో ఒకటి. వారు దయ, నిస్వార్థ,  సానుభూతి గలవారు. అతను తన దయ,  దాతృత్వానికి కూడా ప్రసిద్ది చెందారు, ఎల్లప్పుడూ అవసరమైన వారి కోసం చూస్తున్నాడు. అతని మనసు, హృదయం చాలా అందంగా ఉన్నాయి. ఈ మూడు రాశుల వారికి మంచి హృదయం ఉన్నందున, ఇతర రాశుల వారికి మంచి హృదయం లేదని కాదు. అన్ని రాశుల కంటే ఈ మూడు రాశులు హృదయాన్ని తాకుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

తప్పు చేసినవారిని తిట్టడం మంచిదేనా?

జరిగిపోయిన తప్పుల కన్నా, వాటి తాలూకు జ్ఞాపకాలే మనల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. నిస్సత్తువను ఆవహింపజేస్తాయి. ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో? అనే ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తాయి. కానీ ప్రపంచానికి మన పొరపాట్లను పట్టించుకునే తీరిక ఉండదు. ఒకవేళ ఆ క్షణాలకు అది చర్చనీయాంశమైనా, మరుక్షణం లోకం మనల్నీ, మన తప్పులనూ మరచిపోతుంది. వారి నిందలతో మనం నిరాశకు గురి కావలసిన అవసరం లేదు. 'అవును! తప్పు జరిగిపోయింది దాన్ని దిద్దుకునే అవకాశం కూడా నాకే ఉంది' అని మనకు మనమే ధైర్యం నూరిపోసుకోవాలి.  నీకు నీవే తోడూనీడ! తప్పుకు తలదించుకోవలసిన పని లేదు. తలబిరుసుగా, అహంకారంగా తప్పిదాన్ని సమర్థించు కోవడమూ సరి కాదు. కానీ తప్పు ఎందుకు జరిగిందో విశ్లేషించుకొని, సమీక్షించుకొని సవరించుకోవాలి. అలా కాకుండా బేలగా విలవిల లాడిపోతే మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే ఆంగ్ల మేధావి మార్క్ ట్వెయిన్ 'మనం తప్పిదాల అనుభవం నుంచి అది నేర్పిన విజ్ఞతను మాత్రమే స్వీకరించాలి. లేకపోతే మనం వేడిపొయ్యి మీద కూర్చోబోయిన పిల్లిలా అయిపోతాం. ఆ పిల్లి భవిష్యత్తులో వేడిపొయ్యి మీద కూర్చోవడం అటుంచి, భయంతో ఆరిన పొయ్యి మీద కూడా కూర్చోదు' అంటారు. పొరపాట్లు జరుగుతాయేమో, నిందలు పడాల్సి వస్తుందేమోనన్న అపోహలతో అసలు ప్రయత్నమే మానుకుంటే మనం ఎందుకూ కొరగాకుండా పోతాం!   మన సహచరుల్లో, సహోద్యోగుల్లో, మన కుటుంబసభ్యుల్లో కానీ ఎవరి వల్లనైనా పొరపాట్లు జరిగితే వాటిని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేయకూడదు. ఆ వ్యక్తి అపరాధభావంతో కుమిలిపోయేలా ప్రవర్తించకూడదు. ముద్దాయిలా బోను ఎక్కించి, నిందలు, ప్రశ్నలు గుప్పించ కూడదు. ఆ వ్యక్తి స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నాయకుడిగా నలుగురినీ ముందుకు నడిపించాల్సిన వ్యక్తి, తండ్రిగా తన వారికి మార్గదర్శకత్వం వహించి తను ముందు నడవాల్సిన వ్యక్తి తన వారి తప్పులను సహృదయంతో మన్నించగలగాలి. మాటతో కన్నా మౌనంతో వారి మనస్సును మార్చగలగాలి. తాము పొరపాట్లు చేస్తే శ్రీరాముడు ఒక మాట అంటాడని కాకుండా, అన్నయ్య తనే మనస్సులో బాధపడుతూ తమతో మాట్లాడకుండా ఉంటాడేమోనని ఆ తమ్ముళ్ళు ఆలోచించేవాళ్ళట. అంత విశాలహృదయం రఘురాముడిది. అలా తమ వెంట నడిచే వారి తప్పులను సహృదయంతో సరిదిద్దగలిగి ఉండాలి. ఎదుటివ్యక్తి చేసిన పొరపాటును నలుగురి ముందూ ఎత్తి చూపి, విమర్శిస్తే అతని పరిస్థితి మరింత దిగజార్చినవాళ్ళమవుతాము. వారు తమ తప్పును సవరించుకోవడం వదిలేసి, ఆ అవమానంతో మరింత కుంగిపోతారు. ఇలా మనతో కలసి పనిచేసే వారి తప్పిదాలను పరుషవాక్యాలతో చెణకుతూ ఉత్తమ ఫలితాలను రాబట్టలేం.                                           *నిశ్శబ్ద.

ప్రకృతి గర్జిస్తే.. సునామీ ప్రళయం..

పంచభూతాలలో ప్రతి దానికి ప్రత్యేకత ఉంది. సకల జీవులకు దాహం వేస్తే నీరు తాగుతారు. ఆ నీరు ఉగ్రరూపం దాలిస్తే కల్లోలమే.  ఈ కల్లోలానికి కేరాఫ్ అడ్రస్ గా సునామీని చెప్పుకోవచ్చు. ప్రకృతీ వైపరీత్యంలో భాగమని చెప్పుకున్నా ఈ సునామీలకు కారణం ప్రజల చర్యలే అన్నది అంగీకరిచాల్సిన సత్యం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ సునామీ బారిన పడి తీవ్ర నష్టాన్ని రుచిచూసే  ఉన్నాయి.  సునామీలు ఊళ్లను, పట్టణాలను కూడా తుడిచిపెట్టేస్తుంటాయి. ఇవి చాలా అరుదే అయినా వీటి వల్ల కలిగే నష్టం మాత్రం  మాటల్లో వర్ణించలేనిది. ఈ సునామీల గురించి అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా జపాన్ దేశం ప్రపంచ సునామీ దినోత్సవాన్ని నిర్వహించింది. అసలింతకూ ఈ రోజు మొదలు పెట్టడం వెనుక కారణం ఏంటి? ప్రపంచ సునామీ దినోత్సవం రోజున ఏం చేస్తారు? వివరంగా తెలుసుకుంటే.. నిర్ణయం..  డిసెంబర్ 22, 2015న ఐక్యరాజ్యసమితి తీర్మాణం ద్వారా ప్రతి ఏడాది నవంబర్ 5వ తేదీన ప్రపంచ సునామీ  దినోత్సపం జరుపుకోవాలని నిర్ణయించారు.  సునామీలు ప్రపంచంలో అత్యంత విశానకాన్ని కలిగించే  ప్రకృతి విపత్తులు. వీటికి ఎలాంటి సరిహద్దులు, నియమాలు అంటూ లేవు. తన ఉగ్రరూపంలో, ఉదృతంగా ప్రవహిస్తూ తనలో సమస్తాన్ని కలిపేసుకుంటూ సముద్రం సాగిపోవడమే సునామీ.  ఈ సునామీల వల్ల చాలావరకు నష్టం తీరప్రాంతాలకే పొంచి ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి అయినా ఇవి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. కారణాలు.. సునామీలు రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో భూమి బలంగా కదలడం అంటే భూకంపం, సముద్రంలో అగ్నిపర్వత పిస్పోటనాలు సంభవించడం మొదలైన కారణాల వల్ల నీరు చాలా దూరం ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గ్రహించి నష్టాన్నినివారించడానికి  ప్రయత్నాలు చేయడం, అందరికీ అవగాహాన కలిగించడం, సునామీ సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో  ప్రణాళికలు రచించడం ఈ ప్రపంచ సునామీ అవగాహనా దినోత్సవం ప్రత్యేకత. చరిత్రలో ఏముంది? గత 100సంవత్సరాల కాలాన్ని గమనిస్తే దాదాపు 58 సునామీలు సంభవించాయి. ఈ సునామీలలో సుమారు 2,60వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇది ప్రకృతి వైపరీత్యాల కంటే చాలా ఎక్కువ నష్టమని, ఇది అవగాహనా లోపం, నియంత్రిణా లోపమని అంటున్నారు.  ఈ 100 ఏళ్లలో సంభవించిన సునామీలలో 2004, డిసెంబర్ లో హిందూమహాసముద్రం సునామీలో అదిక మరణాలు సంభవించాయి.  ఇండోనేషియా, శ్రీలంక, బారతదేసం, థాయ్ లాండ్ సహా 14దేశాలలో సుమారు 2,27వేల మంది మరణించారు. ఆ తరువాత కేవలం మూడు వారాల తరువాత జపాన్లోని కోబ్ లో అతర్జాతీయ దేశాలు సమావేశమయ్యాయి. హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ ను ఆమోదించాయి.  ఈ ఒప్పందమే విపత్తు ప్రమాదాలను తగ్గించే దిశగా రూపొందిన మొట్టమొదటి ప్రపంచ ఒప్పందం. ప్రపంచంలో సునామీలు.. తేదీలు.. మరణాలు.. ప్యూర్టో రికోలో సునామీ.. ప్యూర్టో రికో పశ్చిమ తీరంలో భూకంపం,  సునామీ కారణంగా 118 మంది మరణించారు. ఇది 1918లో జరిగింది. అలాస్కా సునామీ..  కాలిఫోనియాలోని క్రెసెంట్ సిటీ వరకు అలస్కా సునామీ సంభవించింది. ఇది  110 మరణాలకు కారణమైంది. ఇది  1964లో జరిగింది. 2004 హిందూ మహాసముద్రం సునామీ..  ఈ సునామీ సమయంలో హిందూ మహాసముద్రం సుమత్రాలో 65 నుండి 100 అడుగుల ఎత్తుకు చేరుకుంది.   ఇండోనేషియా నుండి తూర్పు ఆఫ్రికా వరకు 2లక్షల కంటే ఎక్కువ మరణాలకు కారణమైంది.                                                   *నిశ్శబ్ద.

శివుడు బ్రహ్మ తల ఎందుకు నరికేశాడో తెలుసా?

బ్రహ్మదేవుడికి ఐదు తలలుండేవి. కానీ, మనకు ఫోటోలలో బ్రహ్మ యొక్క నాలుగు తలలు మాత్రమే కనిపిస్తాయి. బ్రహ్మ తన తల ఒకటి పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? బ్రహ్మ తన ఐదవ తలను ఎలా పోగొట్టుకున్నాడు? బ్రహ్మ ఐదవ తల అసలు కథ మీకు తెలుసా? త్రిమూర్తులలో, సృష్టికర్త బ్రహ్మ, సృష్టి రక్షకుడు విష్ణువు నాశనం చేసేవాడు శివుడు. ఈ మూడింటి ఆధీనంలో సృష్టి పనిచేస్తుంది. బ్రహ్మదేవుడికి 4 తలలు ఉండేవని పురాణాలలో ప్రస్తావన ఉంది. బ్రహ్మదేవుడు విష్ణువు నాభి అనగా విష్ణువు నాభి నుండి జన్మించాడని చెబుతారు. విష్ణువు నాభిచే కప్పబడిన వెంటనే బ్రహ్మ నాలుగు దిక్కులను గమనిస్తాడు. నాలుగు తలలు వ్యక్తీకరించబడ్డాయి, ప్రతి దిశకు ఒకటి. మరికొన్ని పౌరాణిక కథనాల ప్రకారం, బ్రాహ్మణుడికి 4 తలలకు బదులుగా 5 తలలు ఉన్నాయని చెబుతారు. ఇంతకీ ఈ బ్రహ్మ 5వ తల రహస్యం ఏంటి..? కొన్ని కథలలోని సూచనల ప్రకారం, శివుడు బ్రహ్మదేవుని తలలలో ఒకదానిని నరికివేసినట్లు చెబుతారు. దీని కారణంగా శివుడు బ్రహ్మ దోషాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ , శివుడు బ్రహ్మ శిరస్సును నరికివేసిందేమిటి..?ఈ తలపై బ్రహ్మ దేవుడు అపారమైన అహంకారం కలిగి ఉన్నాడు. తన కంటే గొప్పవాడు లేడని భావించాడు.బ్రహ్మ దేవుడు తనను తాను గొప్పవాడని తెలుసుకున్నాడు. బ్రహ్మ తలను నరికిన శివుడు: బ్రహ్మదేవునిలోని అహంకారం కారణంగా, అతను ఎల్లప్పుడూ విష్ణువును అవమానించేవాడు. చిన్నచూపు చూస్తాడు. ఇది గమనించిన శివుడు కోపోద్రిక్తుడై బ్రహ్మదేవుని తలను నరికివేస్తాడు. ఈ కారణంగానే పరమశివుడు బ్రహ్మను వధించే ఘోరమైన దోషానికి పాల్పడ్డాడని కథల్లో చెప్పబడింది. బ్రహ్మదేవుని తల నరికివేయడంలో అర్థం: శివుడు బ్రహ్మదేవుని 5వ శిరస్సును నరికివేయడం అంటే ఒక వ్యక్తి తనకంటే ఇతరులను ఎప్పుడూ తక్కువగా భావించకూడదు. అలాగే ఇతరుల బలహీనతలను చూసి అవమానించకూడదు. అంటే కోపాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాలి.  బ్రహ్మదేవుని అహంకారము నశించును: శివుడు బ్రహ్మదేవుని తలను నరికివేయగా, తల నేలమీద పడిపోతుంది. అదేవిధంగా, ఒక వ్యక్తి కూడా నేలపై పడతాడు. అంటే శివుడు బ్రహ్మదేవుని ఒక్క తలను కూడా నరికివేయలేదు. బదులుగా, ఇది బ్రహ్మ తలకు జోడించబడిన శరీరం. ఈ శరీరం బ్రహ్మను చెడుగా చిత్రీకరించింది, అపరిమితమైన కోపం, అహంకారం కలిగి ఉంది. బ్రహ్మ అంత అహంకారంతో, కోపంతో ఉండకపోతే శివుడు తల నరికేవాడు కాదు.

మహాత్మా గాంధీ జీవితాన్ని మార్చిన సంఘటన!

ఓ పదిహేనేళ్ళ కుర్రాడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు అన్న చేతి  బంగారాన్ని దొంగిలించాడు. తన అవసరాలను తీర్చుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి నుంచి అతని మనస్సు మనస్సులో లేదు. తప్పు చేశానన్న భావం అతణ్ణి నిలువునా తొలిచివేసింది. జీవితంలో ఎన్నడూ చేయకూడదనుకున్న పని చేశానన్న పశ్చాత్తాపభావం ఆ యువకుణ్ణి కుదురుగా ఉండనీయలేదు. ఇంకెప్పుడూ దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయినా మనస్సు శాంతించలేదు. చేసిన తప్పును తండ్రికి చెప్పాలనుకున్నాడు. కాళ్ళపై పడి క్షమించాల్సిందిగా కోరాలనుకున్నాడు. కానీ నోరువిప్పి చెప్పే సాహసం చేయలేకపోయాడు. జరిగిన తప్పంతా చివరకు ఒక చీటీ పై రాశాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పాపాన్ని చేయనని మాట ఇస్తున్నాననీ, ఎంతటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాననీ వణుకుతున్న అక్షరాలను ఆర్ద్రతతో పేర్చాడు. ఒకానొక సాయంత్రం ఆ ఉత్తరం పట్టుకొని, వ్యాధితో మంచాన పడ్డ తండ్రి వద్దకు వెళ్ళాడు. బాధపడుతూ తలదించుకొని తండ్రి చేతిలో ఆ కాగితం పెట్టాడు. ఉత్తరమంతా చదివి కన్నతండ్రి కళ్ళు జలపాతాలయ్యాయి. నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించాడు. కొడుకు చేసిన తప్పు కన్నా, దాన్ని స్వచ్ఛందంగా అంగీకరించి, పశ్చాత్తాపం పడుతున్న తీరు ఆ తండ్రి హృదయాన్ని కదిలించింది. తరువాత చీటీని చింపేసి, కొడుకును దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని, ఆనందబాష్పాలు కార్చాడు. తండ్రి పెట్టిన ఆ కన్నీటి క్షమాభిక్షకు కొడుకు కంటికీ మింటికీ రోదించాడు. అలా ఆ కుమారుడి పశ్చాత్తాపం, ఆ తండ్రి పితృవాత్సల్యం భవిష్యత్తులో లోకానికి ఓ మహనీయుణ్ణి అందించాయి. మారిన ఆ యువకుణ్ణి మహాత్మా గాంధీగా తీర్చిదిద్దాయి. పొరపాట్లు చేయనివారు కాదు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చి పైకెదిగినవారే మాననీయులని ఋజువు చేశాయి.  ఎంతటి విజేతలకైనా వారి ప్రస్థానంలో తప్పులు, తడబాట్లు సహజాతిసహజమే. కానీ వారు ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. వాటినే సోపానాలుగా చేసుకొని పై పైకి నడిచారు. అయితే మనలో చాలామంది తడబాట్లకు కుంగిపోతారు. ప్రపంచమంతా మనల్నే పట్టించుకుంటుందనీ, మన పొరపాట్ల గురించే చర్చించుకుంటుందనీ అనవసరంగా ఆలోచిస్తూ ఆందోళనపడుతూ ఉంటారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాలే కానీ, వాటినే మనస్సులో తలచుకుంటూ మథనపడకూడదు. నిజానికి ఈ ప్రపంచంలో ఎవరూ పూర్ణపురుషులు కారు! పొరపాటు చేయనివారంటూ ఉండరు. ఎవరో, ఏదో అనుకుంటారని జరిగిన తప్పిదానికి తలుపులు బిగించుకొని కూర్చోవలసిన అవసరం లేదు. మరో ప్రయత్నం చేయకుండా ఉండాల్సిన పని లేదు. అందుకే పరమ కిరాతకంగా జీవించిన అంగుళీమాలుణ్ణి మంచివాడిగా మార్చి ఓదారుస్తూ... యస్య పాపం కృతం కర్మ కుశలేనపిధీయతే!  స ఇమం లోకం ప్రభాసయత్యభ్రాన్ముక్త ఇవ చంద్రమా|| 'గతంలో చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం ద్వారా అణగదొక్కుతాడో, అతడు ఆ లోకానికి సన్మార్గాన్ని చూపే జ్యోతి అవుతాడు. కారుమబ్బుల నుంచి బయటకు వచ్చిన పూర్ణచంద్రుని లాంటి వాడవుతాడ'ని బోధిస్తాడు గౌతమ బుద్ధుడు. ఇలా మారడానికి మనస్సు సిద్ధంగా ఉంటే, ఘోరమైన తప్పిదాల నుంచి కూడా కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఎవరి భవితను వారే నిర్మించుకోగలుగుతారు.                                    *నిశ్శబ్ద.

కర్ణుడు ఎంత మంచి వాడైనా అతని చావు శాపం వల్లే జరిగింది!

కర్ణుడు  మహాభారత యుద్ధం యొక్క ముఖ్యమైన పాత్రలలో ఒకరిగా గుర్తించబడ్డాడు. కర్ణుడు కుంతి మొదటి కుమారుడు. అతన్ని దాన శూర వీర కర్ణ అని కూడా అంటారు. కర్ణుడి దానధర్మాన్ని మించిన వారు భూమిపై మరొకరు ఉండరు. కర్ణుడు ఉదార స్వభావం కలవాడు. తను అడిగిన ఏ దాతృత్వానికి లేదని చెప్పడు. అంత ఉదారుడైన కర్ణుడు కూడా శపించబడ్డాడు. కర్ణుడిని ఎవరు శపించారు? కర్ణుడు దేనితో శపించబడ్డాడు..??తెలుసుకుందాం. కౌరవులు అన్నదమ్ములే అయినా పాండవులకే అనుకూలం: మహాభారత కథ విన్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు అందులో కర్ణుడి ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. కర్ణుడు పాండవుల తల్లి అయిన కుంతి గర్భం నుండి జన్మించాడు. అయితే మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన కాకుండా పాండవుల తరపున పోరాడాడు. ఎందుకంటే కర్ణుడికి తన తల్లి కంటే అత్యంత సన్నిహితుడైన దుర్యోధనుడితో సన్నిహిత సంబంధం ఉంది. కర్ణుడికి అవమానం: మహాభారతంలో అత్యంత అవమానానికి గురైన వ్యక్తి కర్ణుడు. ఎందుకంటే కర్ణుడి జన్మ వంశం గురించి తెలియని కౌరవులు అతనిని ఒక్కగానొక్క కొడుకు అని ఎప్పుడూ అవమానించేవారు. ఈ కారణంగా కర్ణుడు కౌరవులకు దూరంగా ఉండాలనుకున్నాడు. అయితే, దుర్యోధనుడు అతన్ని కొడుకు అని పిలవలేదు లేదా అవమానించలేదు. దుర్యోధనుడు కర్ణుని నిండు సభలో ఖండించి కర్ణుని కొడుకుగా అవమానించినా అతనికి అండగా నిలిచాడు. ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగ రాష్ట్ర వీధుల్లో గుర్రంపై వెళుతుండగా, ఒక చిన్న పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు కర్ణుడు గుర్రాన్ని అక్కడ ఆపి, ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడే ఇంటికి తీసుకెళ్తానన్న నెయ్యి కింద పడిందని ఇంటికి ఎలా వెళ్లాలని అంటూ ఏడిచాడు.  అప్పుడు కర్ణుడు బిడ్డకు మరో నెయ్యి ఇస్తానని అంటాడు. దీనికి అంగీకరించని ఓ చిన్నారి అదే నెయ్యి కావాలని పట్టుబట్టింది. కర్ణుడు భూదేవి చేత శపించబడ్డాడు: ఏడుస్తున్న చిన్నారికి సాయం చేయకుండా తిరిగిరావడాన్ని కర్ణుడు సహించలేకపోయాడు. తర్వాత నెయ్యి తడిపిన మట్టిని తన రెండు చేతుల్లోకి తీసుకుని బలంగా పిండాడు. అప్పుడు మట్టిలో సేకరించిన నెయ్యి బిడ్డ పట్టుకున్న కుండలోకి చుక్కలా పడిపోతుంది. నెయ్యి డబ్బా నిండగానే చిన్నారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ, అదే సమయంలో కర్ణుడు బురదలోంచి ఒక స్త్రీ మూలుగును వినడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన బాధకు నీ జీవితంలో కీలకమైన సమయంలో నీ రథాన్ని పట్టుకుంటాను అని భూమాత కర్ణుడిని శపిస్తుంది. మహాభారత యుద్ధంలో ఈ కీలక ఘట్టం జరుగుతుంది. కర్ణుడి రథచక్రం ఒకటి భూమిలో ఇరుక్కుపోయి, కర్ణుడు ఎంత ప్రయత్నించినా రథచక్రాన్ని ఎత్తలేడు. అప్పుడు భూదేవి ఇచ్చిన శాపం గుర్తుకొస్తుంది. పరశురాముని శాపం: మహాభారత యుద్ధంలో కర్ణుడికి విపత్తు కలిగించింది భూదేవి శాపం మాత్రమే కాదు. పరశురాముడి శాపం కూడా ఒక విధంగా కర్ణుడి మరణానికి దారి తీస్తుంది. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన దివ్యాస్త్రంతో కర్ణునిపై దాడి చేసినప్పుడు. పరశురాముడి శాపం వల్ల కర్ణుడు ఏ బాణం వేయాలో మర్చిపోతాడు. దీని కారణంగా, మహాభారత యుద్ధ భూమిలో కర్ణుడు మరణిస్తాడు.

జాతీయ ఐక్యతా దినోత్సవం*  ఉక్కుమనిషి ఉక్కు సంకల్పమే నేటి ఐక్య భారతం..

ప్రపంచదేశాలలో ఎంతో గొప్పదైన భారతదేశం ఒకప్పుడు బ్రిటీషర్ల చేతుల్లో నలిగింది. భారత ప్రజలు తెల్లదొరల కింద బానిసలుగా జీవితాన్ని గడిపారు.  ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తిని కలిగించడానికి,దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది వీరులు దేశం కోసం పాటుపడ్డారు. వీరిలో భారతీయులు ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖులు.  565 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన రాచరిక రాష్ట్రాలు, బ్రిటీష్ కాలం నాటి వలసరాజ్యాల ప్రావిన్సుల నుండి  భారతదేశాన్ని ఐక్యంగా  రూపొందించడంలో ఈయన కృషి చేశారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా, భారతదేశ మొదటి హోం మినిన్టర్ గా పనిచేసిన  సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి యేటా  అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశం ఏకం కవడానికి ఆయన చేసిన ఉక్కు సంకల్పం కారణంగానే ఆయనకు ఉక్కుమనిషి అనే బిరుదు వచ్చిందని కూడా అంటారు. అసలు ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం చరిత్ర ఏమిటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం దేశానికి ఎలా ఉపయోగపడింది? ఈయన జీవితం ఏంటి?  మొదలైన విషయాలు పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశపు ఉక్కు మనిషి వల్లభాయ్ ఝవేర్‌భాయ్ పటేల్ అక్టోబర్ 31, 1875న జన్మించాడు. ఈయనను సర్దార్ పటేల్ అని కూడా పిలుస్తారు.  స్వాతంత్ర్యం తర్వాత బ్రిటిష్ వారు  వైదొలిగినప్పుడు  భారతదేశాన్ని ఒక తాటిమీద నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన నాయకులలో ఈయన అగ్రగణ్యుడు. దేశాన్ని విభజించి పాలించడమనే వ్యూహంలో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, సర్దార్ పటేల్ భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. సర్దార్ పటేల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహుడిగా ప్రసిద్ధి చెందారు.  భారతదేశం , పాకిస్తాన్ విభజన తర్వాత స్వతంత్ర ప్రావిన్సులను ఏకీకృత భారతదేశంలోకి చేర్చడంలో  ఆయన  గణనీయమైన పాత్ర పోషించాడు.  భారతదేశ రాజకీయ ఏకీకరణ,1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో హోం మంత్రిగా కూడా పనిచేశాడు. జాతీయ ఐక్యతా దినోత్సవం.. 2014లో రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జాతీయ ఐక్యతా దినోత్సవం  అధికారిక ప్రకటనను దేశ హోం మంత్రిత్వ శాఖ అనౌన్స్  చేసింది. జాతీయ ఐక్యత దినోత్సవం "మన దేశ ఐక్యత, సమగ్రత ,భద్రతకు అసలైన  అర్థం  దేశానికి ఏర్పడే  బెదిరింపులను తట్టుకోవడానికి దేశానికి ఉన్న సహజమైన బలాన్ని, స్థితిస్థాపకతను  తిరిగి సంపాదించుకోవడానికి, దాన్ని ధృవీకరించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా దేశ బలం అందరికీ చాటి చెప్పినట్టు అవుతుంది. ఈ విషయాన్ని చాటి చెప్పడమే జాతీయ ఐక్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.  భారతదేశం కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా  సర్దార్ పటేల్ జయంతిని  జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజును జరుపుకోవడానికి ముందు  'యూనిఫైయర్ ఆఫ్ ఇండియా' స్టాట్యూ ఆఫ్ యూనిటీతో సర్దార్ వల్లబాయ్ పటేల్ ను దేశం మొత్తం  సత్కరించుకుంది.   వాస్తవానికి ఇది  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.  సుమారు 597 అడుగుల ఎత్తులో సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఆయన్ను దేశం గౌరవించుకుంది.  అక్టోబర్ 31, 2018న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 31, 2019న, భారత చరిత్రలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడానికి 'రన్ ఫర్ యూనిటీ' అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం  జరిగింది. ఆయన 144వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం లో   ప్రారంభమైన రన్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ఇండియా గేట్ సి-హెక్సాగన్-షాజహాన్ రోడ్ వద్ద దాదాపు ఒక మైలు దూరం పరుగు సాగింది.  హిందువులూ, ముస్లింలు ఒకే దేశంలో నివసించాలని సంకల్పించి ఆ దిశగా పోరాటం చేసి దాన్ని సాధించిన ఉక్కు మనిషిగా సర్థార్ వల్లబాయ్ పటేల్ యావత్ దేశ ప్రజలకు పూజ్యునీయుడు. పాఠశాలల్లో, కళాశాలల్లో సర్దార్ పటేల్ గురించి పిల్లలకు వివరించి చెప్పడం. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం గురించి పిల్లలకు చెప్పి వారిలో  చైతన్యం కలిగించడం సర్దార్ పటేల్ వ్యక్తిత్వం ద్వారా పిల్లలు మంచి విషయాలు నేర్చుకునేలా పిల్లలను గైడ్ చేయడం ద్వారా పిల్లలలో మంచి క్రమశిక్షణ, గొప్పవిలువలు అలవడతాయి.                                                *నిశ్శబ్ద.

అబ్దుల్ కలామ్ ఆశయానికి బీజం వేసిన ఉపాధ్యాయుడు.. సంఘటన ఇవే..

రామేశ్వరం పాఠశాలలో అబ్దుల్ కలామ్ అయిదో తరగతి చదువుతున్నప్పుడు  శ్రీశివసుబ్రహ్మణ్య అయ్యర్ ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పేవారు.  తన దగ్గర చదువుకునే విద్యార్థులను అమితంగా ప్రేమించే ఉపాధ్యాయుల్లో ఆయన ఒకరు. ఆయన ఒక రోజు పక్షులు ఎలా ఎగురుతాయో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. నల్లబల్ల మీద ఒక పక్షి బొమ్మ గీసి దాని తల, తోక, రెక్కలు, శరీర నిర్మాణాన్ని వివరంగా చిత్రించారు. పక్షులు తమ రెక్కల్ని అల్లార్చడం ద్వారా ఎలా ఎగరగలుగుతాయో, ఆ ప్రయత్నంలో తమ తోక ద్వారా ఎలా దిశలు మార్చుకోగలుగుతాయో చూపించారు. దాదాపు అరగంట పాటు విహంగాల విహారం గురించి చక్కగా వివరించారు. పాఠం ముగించాక అర్థమైందా? అని అందరినీ అడిగారు. అబ్దుల్ కలామ్ ఎలాంటి సంకోచం లేకుండా నాకు అర్థం కాలేదని అన్నారు. ఆ మాటే చాలామంది విద్యార్థులు చెప్పారు. వారి సమాధానానికి ఆ మాస్టారు ఏమీ నిరుత్సాహపడలేదు, సహనాన్ని కోల్పోలేదు. సాయంకాలం పిల్లలందరినీ సముద్రతీరానికి తీసుకువెళ్ళారు. అప్పుడు అయ్యర్గారు ఆకాశంలో గుంపులు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించారు. ఆ అద్భుతమైన పక్షి సమూహాలను చూసి విద్యార్థులంతా విభ్రాంతులమయ్యారు.  ఉపాధ్యాయుడు ఆ పక్షుల్ని చూపిస్తూ, అవి అలా ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లారుస్తున్నాయో గమనించమన్నారు. అవి తాము కోరుకున్న దిశకు తిరగడానికి తమ తోకల్ని ఎలా వాడుకుంటున్నాయో పరిశీలించమన్నారు. అప్పుడాయన  'పక్షిని నడిపిస్తున్న ఆ యంత్రం ఎక్కడుంది? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?" అని విద్యార్థులను అడిగారు. చివరకు జవాబు కూడా ఆయనే చెప్పారు. పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తేనని, దాని ఇచ్ఛాశక్తే దాని చోదకశక్తి అని వివరించారు. అంత గహనమైన భావనల్ని ఆయన విద్యార్థుల కళ్ళెదుట కనపడుతున్న దృష్టాంతంలో సులభంగా, సరళంగా బోధపరిచారు. ఆ రోజు తెలుసుకున్నది కేవలం ఒక పక్షి ఎలా ఎగురుతున్నదన్న అంశంతో  అబ్దుల్ కలాం ఆగిపోలేదు. ఆ రోజు వారు చెప్పిన ఆ పాఠం ఆయనలో విశిష్ట అనుభూతిని జాగృతం చేసింది.  భవిష్యత్తులో చదువుకోబోయే చదువు ఆకాశయాన వ్యవస్థలకు సంబంధించి ఉండాలని అప్పుడే తీర్మానించుకున్నారు. ఒక సాయంకాలం పాఠశాల ముగిసిన తరువాత ఆయన మనస్సులోని మాటను  మాస్టారు ముందుంచాను. అప్పుడాయన చాలా ఓపిగ్గా అబ్దుల్ కలామ్ భవిష్య ప్రణాళిక ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. మొదట  హైస్కూలు, కళాశాల చదువులు పూర్తిచేయాల్సి ఉంటుందనీ, ఆ తరువాత ఇంజనీరింగ్లో ఆకాశయాన వ్యవస్థల గురించి చదువు కొనసాగించాలనీ చెప్పారు. ఆ మొత్తం క్రమంలో అబ్దుల్ కలామ్ కష్టపడి చదువుకోగలిగితే భవిష్యత్తులో ఆకాశయాన విజ్ఞానానికి సంబంధించి ఎంతో కొంత సాధించగలవని కూడా ఆయన చెప్పారు. ఆ ఉపాధ్యాయుడి సలహా ప్రకారం అబ్దుల్ కలామ్ కళాశాలకు వెళ్ళినప్పుడు భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అలాగే మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరినప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నారు.  ఉపాధ్యాయుడు పక్షులు ఎలా ఎగురుతాయో వివరించడానికి చూపిన దృష్టాంతం,  చదువు కోసం ఆయన చేసిన సూచనలు అబ్దుల్ కలామ్ జీవితానికి ఒక గమ్యాన్నీ, లక్ష్యాన్నీ ప్రసాదించాయి. అబ్దుల్ కలామ్  జీవితంలో అదొక గొప్ప మలుపు. కాలగమనంలో ఆయనొక రాకెట్ ఇంజనీరుగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా, సాంకేతిక నిపుణుడిగా రూపుదిద్దుకోవడానికి ఆ సంఘటనే నాంది పలికింది. ఈ విషయాన్ని స్వయానా అబ్దుల్ కలామ్ చెప్పారు.                                             *నిశ్శబ్ద.

ఈ వ్యక్తులు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగుతారు..!!

జీవితం చాలా అనూహ్యమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మనలో కొందరు జీవితంలో అనుకోని సంఘటనలను ఎదుర్కొని  ముందుకు సాగితే, మనలో కొందరు జీవితంలో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు  ధైర్యం కోల్పోతారు. జీవితంలో అనుకోని సంఘటనలు, సందర్భాలు అన్నీ చాలా కూల్ గా హ్యాండిల్ చేసి ముందుకు సాగే కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం. వృషభం: వృషభ రాశి వారు స్థిరత్వానికి ప్రసిద్ధి చెందారు. ఈ భూమి రాశిలో జన్మించిన వ్యక్తులు వారి సామాజిక సర్కిల్‌లలో దృఢంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోరు. వారు తమ సౌకర్యవంతమైన దినచర్యలను ఇష్టపడుతుండగా, జీవితం వారికి అనేక విషయాలను నేర్పుతుంది. వృషభ రాశి వారు కూడా ఈ గందరగోళాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో చాలా ఓపికగా, పట్టుదలతో ఉండే సహజమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ఒత్తిడికి గురికాకపోవడమే కాదు, వాటిని ఒక్కొక్కటిగా తీసుకునే నేర్పు కలిగి ఉంటారు.  మిథునరాశి: మిథునరాశివారు తమ జీవితంలో వచ్చే కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు జీవితంలో ఆకస్మిక మార్పుల నుండి కుంచించుకుపోరు. వాటన్నింటితో పోరాడి గెలుస్తారు. వారి ద్వంద్వ స్వభావం వారిని బహుళ కోణాల నుండి పరిస్థితిని చూడటానికి అనుమతిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో కూడా ఇది వారికి సహాయపడుతుంది. వృశ్చికం: వృశ్చిక రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ఎప్పుడూ ఆకర్షితులవుతారని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వ్యక్తుల మనస్సు చాలా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. చాలామందికి అది మొదట్లో అర్థం కాదు. జీవితం గడుస్తున్న కొద్దీ,  కఠినంగా మారినప్పుడు, అవి బలపడటమే కాదు, రూపాంతరం చెందుతాయి. ఈ రాశి వ్యక్తులు లోతైన వ్యక్తిగత వృద్ధికి సవాళ్లను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. ప్రతి అంశాన్ని అన్వేషిస్తారు, దానిని అర్థం చేసుకుంటారు. ఈ రాశి వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ఏవైనా అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వారి తీవ్రమైన భావోద్వేగాలను కేంద్రీకరిస్తారు.  తులారాశి: తుల రాశి వారు తమ జీవితంలో చాలా సమతుల్యమైన , సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఎవరైనా తమ జీవితంలో సమతుల్యతను భంగపరిచినప్పుడు వారు జీవితంలో కొంత చికాకును అనుభవించినప్పటికీ వారు చాలా బలంగా ఉంటారు. ఈ రాశి  వ్యక్తులు ఎలాంటి క్లిష్టపరిస్థితులను అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. తమ చుట్టూ నిత్యం ప్రశాంతత ఉండేలా చూస్తారు.

మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే..ఈ తప్పులు చేయకూడదు..!

ఒక వ్యక్తి విజయం సాధించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం విజయం సాధించాలంటే ఏం చేయాలి..? మనం ఏ ఆలోచనలను మనసులో ఉంచుకోవాలి..? ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు.నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త,  వ్యూహకర్త మాత్రమే కాకుండా, అతను ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడటానికి ప్రజలు చాణక్యుడి తత్వాన్ని అనుసరిస్తారు. చాణక్యుని నీతి శాస్త్రం జీవితంలోని అనేక అంశాలలో సమస్యలకు సంబంధించిన సూత్రాలను కలిగి ఉంది.  వాటిని స్వీకరించడం ద్వారా  తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. చాణక్య నీతి వ్యక్తిగత జీవితం నుండి పని, వ్యాపారం,  సంబంధాల వరకు అన్ని అంశాలపై వెలుగునిస్తుంది. ఈ విషయంలో, ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా విజయం సాధించాలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆ ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం. మీ సమస్యలను ఇతరులతో పంచుకోకండి: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన సమస్యలను లేదా అతని బలహీనతలను ఇతరులకు చెప్పకూడదని పేర్కొన్నాడు. మన బలహీనతలను ఇతరులకు చెప్పడం మన బాధలకు దారి తీస్తుంది. లేదా మీరు మీ బలహీనతలను చెప్పే వ్యక్తి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా మీ బలహీనతలు,సమస్యల గురించి ఇతరులకు చెప్పకూడదు. తెలివిగా ఖర్చు చేయాలి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు. అందువల్ల, ఇంట్లో సంపదను కూడబెట్టుకోవడం చాలా ముఖ్యం. మీ డబ్బును ఎల్లప్పుడూ చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి. వీలైనంత ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించండి. మూర్ఖులతో వాదించకూడదు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, తెలివితక్కువ వ్యక్తులతో ఎప్పుడూ వాదించవద్దు. ఇలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది. అంతేకాకుండా, ఇది మీ వ్యక్తిత్వంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇతరుల దృష్టిలో మీరు చెడ్డవారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూర్ఖులతో వాదించే బదులు వారిని వదిలేయండి. ఎందుకంటే అదే విషయం వాళ్లకు చెప్పినా వాళ్లకు పట్టదు. ఇలాంటివారిని నమ్మకూడదు: ఆచార్య చాణక్యుడి ప్రకారం, మీ మాటలను పట్టించుకోని వ్యక్తులు విశ్వసించదగినవారు కాదు. మిమ్మల్ని బాధలో చూసి ఆనందించే వ్యక్తులను మీరు ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా మోసం చేస్తాడు. కాబట్టి మీరు అందరితో పంచుకోగలిగే ఆలోచనలను మాత్రమే వారితో పంచుకోండి. మీ ఆలోచనలన్నింటినీ వారితో పంచుకోవద్దు. లక్ష్యం రహస్యంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. దీని కారణంగా వ్యక్తులు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించవచ్చు. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క విజయం అతని కృషి, వ్యూహం, సమయపాలనపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ లక్ష్యం గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు.  

మంచి చెడులను ప్రజలు చూస్తున్న విధానం ఇదే..

  అదొక పెద్ద అంతర్జాతీయ కంపెనీ. ఆ కంపెనీలో బట్టలు ఉతికే సబ్బుపౌడర్(డిటర్జెంట్) తయారు చేస్తారు. వారు సబ్బుపొడికి 'అంతర్జాతీయ మార్కెట్' సొంతం చేసుకోవడానికి ఎలాంటి ప్రకటనలు(ఎడ్వర్టైజ్మెంట్) చేస్తే వినియోగదారులు పెరుగుతారో బాగా ఆలోచించి, వారి ప్రకటనలలో బొమ్మలకు ప్రాధాన్యతనిచ్చి, అతి తక్కువ పదాలను ఉపయో గించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రకటనలో మూడు బొమ్మల క్రింద వరుసగా ఇలా వ్రాయించారు : *మురికి బట్టలు* * సబ్బునీళ్ళలో బట్టలు* * శుభ్రమైన బట్టలు*  ఇంకేముంది! కంపెనీకి విపరీతమైన లాభాలు. కొన్నాళ్ళ తరువాత వారి 'సర్వే'లో ఒక కొత్త విషయం బయట పడింది. కొన్ని దేశాలలో వారి సబ్బుపొడికి 'మార్కెట్' లేకపోవడమే కాకుండా, ప్రజలలో ఆ సబ్బుపొడి మీద ఒక విధమైన ద్వేషం ఏర్పడింది. అందుకు కారణాలను తెలుసుకోవడానికి, ఆ దేశాలకు కంపెనీవారు 'మేధావి' బృందాన్ని పంపించారు. చివరికి 'సర్వే'లో తేలిన విషయం ఏమిటంటే, ఆ దేశ ప్రజలు కంపెనీ వారి ప్రకటనలను 'కుడి నుండి ఎడమ' వైపుకు చదవడమే! ఇదీ మన సమస్య. మంచీ, చెడులు నాణానికి ఇరువైపులున్న బొమ్మ, బొరుసుల్లాంటివి. ఇరు ప్రక్కలలో ఎటువైపు మనం చూస్తామో, దానిపైనే వస్తువు యొక్క మంచి చెడు ఆధారపడి ఉంటుంది. కుడి ఎడమయినా, ఎడమ కుడి అయినా పొరపాటే! మనం ద్వంద్వాలలో జీవిస్తున్నాం. ఈ ద్వంద్వ బుద్ధితో భగవంతుణ్ణి కొలుస్తున్నాం. మనకు చెడు సంభవిస్తే సహించం. ఎందుకీ చెడుని సృష్టించావని భగవంతుణ్ణి ప్రశ్నిస్తాం, రోదిస్తాం. కానీ భగవంతుడు మంచి, చెడులనే ద్వంద్వాలకు అతీతుడన్న విషయం మరచిపోతున్నాం. జీవితమనే నాణానికి మంచి, చెడులు ఇరుప్రక్కలా ఉన్న బొమ్మా బొరుసుల్లాంటివి అన్న భావన కలిగినప్పుడు, మనలో మరొక సమస్య తలెత్తుతుంది. అదే 'విచ్చలవిడితనం'. మంచి, చెడులనే ద్వంద్వాలు జీవితంలో సహజమనే మెట్ట వేదాంత ధోరణి విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో పరిణతి లేనప్పుడు ఇలాంటి మెట్ట వేదాంతం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. పైగా ప్రమాదం కూడా! కాబట్టి సాధకుడు మంచీ, చెడుల మధ్య తారతమ్యం తెలుసుకొని 'చెడు'ని వదలిపెట్టి, 'మంచి'ని పెంచుకొనే ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద మాటల్లో “నాకు మేలైనది నీకు కీడు కావచ్చు. అన్ని విషయాల మాదిరే మంచి చెడ్డలకు కూడా క్రమవికాసం వుందనేదే దీని పర్యవసానం.  అది క్రమవికాసం చెందుతూన్నప్పుడు ఒక దశలో మంచి అని మరొక దశలో చెడు అని అంటుంటాం. నా మిత్రుడి ప్రాణం తీసిన తుపాను చెడ్డదని నేనంటాను. కానీ ఆ తుపాను గాలిలోని సూక్ష్మ విషక్రిములను నాశనం చేసి అసంఖ్యాక  జనాన్ని కాపాడి ఉండవచ్చును. దాన్ని గుర్తించినవారు మంచిదంటారు.   కాబట్టి మంచి చెడ్డలు సాపేక్ష ప్రపంచానికి సంబంధించినవే.  నిర్గుణదేవుడు సాపేక్షదేవుడు కాడు. కాబట్టి అతడు మంచివాడని గాని, చెడ్డవాడని గాని నిర్వచించలేం. అతడు మంచి చెడులకు అతీతుడు. అతడు మంచివాడూ కాడు, చెడ్డవాడు కాడు. కానీ, చెడుకంటే మంచే తనకు ఎక్కువ సన్నిహితమనే మాట నిజం.                                            *నిశ్శబ్ద.  

చాణక్యుడు చెప్పిన ఈ నీతి పాటిస్తే డబ్బుకు లోటుండదు..

తినడానికి తిండి.. కట్టుకోవడానికి బట్ట.. విద్య నుంచి వైద్యం వరకు.. చివరికి మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ డబ్బు విలువను చెప్పకనే చెబుతున్నాయి. పొద్దున్న లేచింది  మొదలు రాత్రి నిద్రించే వరకు మనిషి జీవితంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడివుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే ఈ భూమిపై జీవిస్తున్న మనుషుల్లో అతికొద్ది మినహా మిగతావారంతా ధనార్జనలో తలమునకలవుతున్నారు. పేద, ధనిక అనే భేదం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం పరితపిస్తున్నారు. కానీ కొంతమంది ఎంత శ్రమించినా కష్టానికి తగ్గ డబ్బు మిగలదు. చేతిలో డబ్బు ఆగక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారి ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతి శాస్త్రంలో కొన్ని సూచనలు చేశాడు. అవేంటో తెలుసుకుని పాటిస్తే ఎంత చిన్న మొత్తం సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం ఖాయం.. అహంకారం ఉంటే ధనం నిలవదు.. అవసరాల కోసం డబ్బు సంపాదన అందరికీ అనివార్యమే. కానీ ఏ మనిషీ డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదు. డబ్బు సంపాదనతో అహంకారం ఆవహిస్తుందని, అహంకారం ఉన్నచోట డబ్బు నిలవదని చాణక్యుడు చెప్పాడు. అందుకే చేతిలో డబ్బు ఉన్నప్పుడు మురిసిపోకుండా..  లేనప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ నిరాడంబరంగా ఉండాలి. అందరినీ సమదృష్టితో చూడాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. అప్పుడు మాత్రమే అహంకారం దూరమై చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇంట్లో ధాన్యం ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు.. ఇంట్లో నిండుగా ధాన్యాగారం ఉండటం చాలా శుభప్రదమని చాలామంది చెబుతున్నారు. ఇది సత్యమేనని చాణక్యనీతి కూడా చెబుతోంది. ధాన్యం ఇంట్లోవారి ఆకలి తీర్చడమే కాకుండా ఆ గృహంలో సంపదను శాశ్వతం చేస్తుందని చాణక్యనీతి వివరిస్తోంది.  ఇంట్లో ధాన్యం అయిపోకముందే మరింత ధాన్యాన్ని తెచ్చిపెడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇంటిపై ఉండేలా చూసుకోవచ్చు. అలాగే ఆహారాన్ని ఎప్పుడూ అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు. ఇంట్లో చింతలుంటే ధనం నిలవదు.. కొంతమంది ఇళ్లలో ఎప్పుడుచూసినా చింతలు, కష్టాలు, కన్నీళ పరిస్థితులు కనిపిస్తుంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ పరిస్థితులు ఇంట్లో రణరంగాన్ని తలపిస్తుంటాయి. అయితే అలాంటి ఇళ్లలో ధనలక్ష్మి ఉండదని చాణక్య నీతిశాస్త్రం చెబుతోంది. అన్నివేళలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి లక్ష్మీదేవి నిలవాలనుకునేవారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక అంశాలు రహస్యంగా ఉండాలి.. వ్యక్తిగత ఆర్థిక విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని చాణక్యనీతి సూచిస్తోంది. ఆర్ఠిక లక్ష్యాలు ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతోంది. ఎందుకంటే ఎవరైనా కించపరిస్తే లక్ష్యం నుంచి దృష్టి మరలే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వ్యక్తులు ఆర్థిక అంశాల్లో గోప్యతను పాటిస్తుంటారు. ఖర్చు పెట్టడం తెలియాలి.. డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని  ఖర్చుపెట్టే విషయంలో నేర్పు ఉండాలి. కష్టకాలంలో డబ్బు ఏవిధంగా అక్కరకొస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చుపెట్టాలి. సాయాలకు, పెట్టుబడులకు, ఆత్మరక్షణ కోసం వెనుకాడకుండా ఖర్చుచేయవచ్చు. అలాగని కేవలం ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా ఖర్చు ఉండకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సంపదను జల్సాలకు ఉపయోగించడం ఏమాత్రం మంచిదికాదు. నీళ్లలా వృథా చేస్తే లక్ష్మీదేవి నిలవదు. వివేచనతో సమయానుగుణంగా ఖర్చుచేయడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. అక్రమ సంపాదన నిలవదు డబ్బు సంపాదన కోసం కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటుంటారు. కాలం కలిసొస్తే గట్టిగానే పోగేసుకుంటారు. కానీ అలాంటివారి వద్ద ఎల్లకాలం సంపద నిలవదు. డబ్బుని ఆర్జించే విషయంలో ఎల్లప్పుడూ న్యాయం, నిజాయితీగా మెలగాలి. అనైతిక మార్గాల ద్వారా వచ్చిన డబ్బు ఎల్లకాలం నిలవదు. అందుకే డబ్బును ఎప్పుడూ ధర్మబద్ధంగానే సంపాదించాలి.                                        *నిశ్శబ్ద.

పేదరిక నిర్మూలనే మెరుగైన జీవితాలకు నాంది!!

ఆకలితో అలమటించడం.. తలదాచుకోవడానికి గూడులేకపోవడం.. చదువుకోవాల్సిన వయసులో పనికెళ్లడం.. ఇవన్ని పేదరికానికి  గుర్తులు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సవాళ్లలో ఒకటైన పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పేదరిక నిర్మూలనపై విశ్వవ్యాప్తంగా అవగాహన పెంచడం, అంతర్జాతీయంగా తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మెరుగైన సమాజం కోసం పారదోలాల్సిన ప్రధాన సవాళ్లలో పేదరికం ప్రధానమైనది. సమాజంలో అణగారిన వర్గాలవారు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, అవసరమైన చర్యలతో పేదవర్గాలకు చేయూతనివ్వాలన్న స్పృహను  అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గుర్తుచేస్తుంది.  పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు సాధారణ జీవితం కూడా నరకయాతనే. విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులకు వారు ఆమడ దూరంలో ఉంటున్నారు. అందుకే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమానత్వపు ఔనత్యాన్ని చాటిచెప్పడం, పేదలు ఆత్మగౌరవం, హూందాగా జీవించాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ పేదరిక నిర్మూలనం దినోత్సవం లక్ష్యంగా చేసుకుంది. ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమ్మిళితం ప్రాముఖ్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది.  చరిత్ర ఏం చెబుతోంది.. 1987లో ఏం జరిగింది? అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం చరిత్ర 1987లో మొదలైంది. తీవ్రమైన పేదరికం, హింస, ఆకలి బాధితులకు మద్ధతుగా అక్టోబర్ 17న వందలాది మంది ప్యారిస్‌లోని ట్రొకెడెరోలో సమావేశమయ్యారు. 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌పై సంతకం చేసిన ప్రదేశంలో వీరంతా సమావేశమయ్యారు. ఈ సందర్భానికి గౌరవ సూచకంగా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించాలని 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. పేదరికం నిర్మూలన ఆవశ్యతను చాటిచెప్పడం దీని ముఖ్యొద్దేశమని పేర్కొంది. 2023 థీమ్ ఇదే.. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు. ‘‘ ఆత్మగౌరమైన పని, సామాజిక సంరక్షణ: ఆచరణలోకి అందరికీ గౌరవం’’ అనేది ఈ ఏడాది థీమ్. పేదలైనప్పటికీ పనిలో ఆత్మగౌరవం, సమాజంలో అణగారిన వర్గాల రక్షణను ఈ థీమ్ చాటిచెబుతోంది. మరోవైపు అందరికీ గౌరవాన్ని మాటల్లో చెప్పి వదిలేయకుండా ఆచరణాత్మకం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది.  ప్రాముఖ్యత.. అంతర్జాతీయంగా అవగాహన, సహకారం, విద్య వంటి చర్యల ద్వారా పేదరిక నిర్మూలన ప్రాముఖ్యత అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం చాటిచెబుతోంది. నిరుద్యోగం, వనరులలేమి, విద్యలేమి, అసమానత వంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం రోజున ఈ సమస్యలను అధిగమించడంపై అవగాహన చాలా ముఖ్యం. పేదరికం పర్యవసనాలు నేరాలు, హింస, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి మరిన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతోంది. ఇతరులకు ఉపాధి కల్పించడం, ఆర్థిక భరోసా ఇవ్వడం, మెరుగైన జీవితాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి.                                              *నిశ్శబ్ద.