Coronavirus will see its end soon

సూర్యుని మేష సంక్రమణంతో, ఈ నెల 13 తర్వాత కరోనా తీవ్రత తగ్గుముఖం 

కరోన వైరస్ కి మూలకారణము కేతు గ్రహమనీ, సూర్యుని మేష సంక్రమణంతో, ఈ నెల 13 తర్వాత కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందనీ జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. వాస్తవానికి -సూర్యుడు తులారాశినుండి వృశ్చిక రాశికి ప్రవేశించే కాలములో  ఈవైరెస్ జన్మించింది.అంటే, నిరుడు సెప్టేంబర్ అక్టోబర్ కాలములో జన్మించింది.కాని దానియొక్క తీవ్రత ఎవరికి తెలియలేదు. ఈ వైరస్ యొక్క తీవ్రత డిసెంబర్ 26 వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఆనగా ఆరు గ్రహాలు గురువు , శని, కేతువు, సూర్యుడు,చంద్రుడు, బుధుడు తో కూడుకున్నటువంటి ఆరుగ్రహాల కూటమి ధనుర్ రాశిలో ఏర్పడటము జరిగింది.ఈ షష్ఠగ్రహ కూటమి చాలా సాధారణముగా ఎప్పుడు జరగదు.ఈ షష్ఠగ్రహ కూటమి  ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది.కాని ఒక వైరెస్ ద్వార ప్రపంచ వినాశనము జరుగుతుందని ఎవరు ఊహించలేక పోయారు.ఈ షష్ఠగ్రహ కూటమి ద్వార ఏర్పడిన వైరస్ క్రమముగా పెరుగుతూవచ్చింది. ఈ షష్ఠగ్రహ కూటమి నుండి చంద్రుడు త్వరగా  బయటకు వెల్లడము వలన పంచగ్రహ కూటమి ఏర్పడింది. నిరుడు డిసెంబర్ 31 వ తేదీన చైన కరోన వైరెస్ మాదేశానికి వ్యాపించిందని మొట్టమొదటి సారి ప్రపంచానికి తెలియచెప్పింది. ఆరోజు గ్రహస్థితి రాహువు ఆర్ద్రా నక్షత్రము మిథునములో ఉన్నారు. చంద్రుడు కుంభంలో ఉన్నారు శుక్రుడు మకరం లో ఉన్నారు.. ధనస్సురాశిలో గురువు శని కేతువు సూర్యుడు బుధుడు ఐదు గ్రహాలు కలసి వున్నాయి.ఈపంచగ్రహ కూటమి డిసెంబర్ లో జరిగింది. జనవరి 11 వ తేదీన చైనా తన దేశములో కరోన వైరెస్ తో మరణము సంభవించిందని తెలియజేసింది. జనవరి 23 వ తేదీన చంద్రుడు బుధుడు, శని సూర్యుడు ధనస్సురాశి నుండి మకరరాశి లోకి ప్రవేశించాయి.  గురువు కేతువు ధనస్సు రాశిలో మిగిలి పోయాఋ. . ఈ గురువు కేతువు కలయిక వలన  ఈ వైరస్ ప్రపంచవ్యాప్తమయిపోయింది. గురువు మంచి గ్రహము అయినప్పటికి, కేతువు కలయిక వలన ఈవైరెస్ ప్రపంచమంతా తెలిసింది.దీనితో పాటు శని సూర్య కలయిక వలన మృత్యుప్రళయము మొదలయింది.దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవిడ్ 19 అనే పేరుని సూచించింది. శని సూర్యులు వైర గ్రహాలు. ఫిబ్రవరి 8 వ తేదీన కుజ కేతు గురు కలయిక వలన ఈ వైరెస్ ప్రపంచమంత పెనుదుమారముగా మారింది.గురువు కేతువులతో కుజుడు కలవడము వలన కుజగ్రహ కలయిక ప్రభావముతో ప్రపంచమంతా భీభత్సముగా మారింది. ఫిబ్రవరి 18 వ తేది నుండి మార్చి 5 వ తేది మద్యలో రాహువు కేతువు మధ్యలో సప్తమ గ్రహాలు చేరి  కాలసర్ప దోషం ఏర్పడింది.మండుతున్న నిప్పులో ఆజ్యం పోసినట్టుఅయింది.కాలసర్పస్థితి ప్రపంచమంతా ఏర్పడింది.ఈ మధ్య కాలములో మానవాళికి ఉపయోగపడే శుభగ్రహాలు వాటి ప్రభావాన్ని కోల్పోవడము జరిగింది. మంచి చేసే గ్రహాస్థితులు కాలసర్ప దోషం వలన వాటి ప్రభావాన్ని కోల్పోవడము జరిగింది.దీని ప్రభావము వలన ప్రపంచమంతా లాక్ డౌన్ ప్రకటించింది.జనజీవనము స్తంభించడమూ జరిగింది .భారతదేశము ఆధ్యాత్మిక దేశమయినందున,  భగవద్ ఆనుగ్రహము వలన దీనిప్రభావము తక్కువగా ఉంది. ఈ యొక్క కరోన వైరెస్ జ్యోతీష్య శాస్త్ర ప్రకారము తగ్గుముఖం పట్టేది ఎప్పుడంటే, మార్చి 24 నాడు ఉగాది ఈ ఉగాది గ్రహస్థితులు గురువు కేతువు ధనస్సురాశిలోనే వున్నారు. కుజుడు గురువుకేతువులను వదిలిపెట్టి మఖరరాశిలోకి ప్రవేశిస్తున్నారు.సూర్యుడు కూడ మారడము వలన మృత్యువు అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.కుజుడు గురుకేతువులను వదిలిపెట్టడము వలన దీని ప్రభావము కొంత తగ్గుముఖం పడుతుంది.కాని పూర్తిగా తగ్గదు.కాని కొంత ప్రశాంతతను ఇస్తుంది. మార్చి 30 వ తేదీన కేతువుని గురువు కూడ వదిలిపెట్టడము వలన  కేతువు ఒంటరివాడు అవుతాడు. దీనివలన గ్రహ స్థితులు అన్ని అనుకూలముగా మారుతాయి.దీనివలన జనాలలో అవగాహన పెరగడము, కొద్దికొద్దిగా ఈ వైరెస్ తగ్గడము, భయాందోళనలు తగ్గుముఖం పడతాయి. కాని పూర్తిగా నిర్మూలన కాదు. ఈ వైరెస్ గురించి పూర్తిగా భయాందోళనలు తగ్గాలంటే ఏప్రిల్  13వ తేదీ వరకూ ఆగవలసిందే. దీని వల్ల సూర్యగ్రహం మీనరాశి నుండి మేషసంక్రమణము చెందుతుంది. ఫలితంగా సూర్యగ్రహం బలపడి వ్యాధులన్నీ  దూరమయి ఆ సమయానికల్లా  మందులు అందుబాటులోకి వచ్చి ఈ వైరెస్ తగ్గుముఖం పడుతుంది. మామూలు పరిస్థితులు వస్తాయని జ్యోతిష్యుల లెక్క. ఆ శుభ  సమయం కోసం వేచి చూద్దాం.

Jandhan accounts

జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు విత్‌డ్రాపై కేంద్రం ఆంక్షలు

జన్‌ధన్‌ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు. ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. అలాగే, ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న , ఖాతా చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న,   అలాగే, ఖాతా చివరన 6లేక 7 సంఖ్య ఉన్నవాళ్లయితే ఈ నెల 8న ,ఎనిమిది లేదా 9 అంకె ఉన్నవాళ్లు అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.  కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతాల్లో 3 నెలల పాటు రూ.500 చొప్పున  జమచేస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో జన్‌ధన్‌ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉండగా, తెలంగాణలో 52,23,218 మంది ఖాతాదారులు ఉన్నారు.

lockdown in vizag

రేపటి నుంచి విశాఖలో కఠిన ఆంక్షలు

రేపటి నుండి జిల్లాలో కఠిన ఆంక్షలు ఉంటాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఉదయం  6 నుండి 9 వరకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి ఉంటుందనీ, పచారి షాపులు,  పళ్లుమార్కెట్, రైతు బజార్లు,   మార్కెట్ కి మాత్రమే సాయం 6 నుండి 9 వరకే తెరిచి ఉంటాయని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉదయం 7 నుండి సాయంత్రం 7  వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి, ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ ,  వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ చెప్పారు.  ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు,  ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఉంటుందనీ, జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్,  ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్,  రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్,  ఫుడ్ కోర్ట్స్,  ఐరన్ & స్టీల్ షాప్స్,  గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్,  పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ,  ఓపెన్ కు అనుమతి లేదని, పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దని,  నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Woman Protest In Front of Husband House West Godavari

ఊరిపేరు సిద్ధాంతం..జరిగిందేమో రాద్ధాంతం!

కరోనా టైం లో  కోడల్ని గెంటేసిన అత్తింటి వారు! పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో దారుణం జరిగింది. కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేసి తాళాలు వేసుకున్న అత్తింటి వారి వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అత్తింటి వారి ఎదుట కోడలు ఆందోళన మొదలెట్టింది.  నెల క్రితం భర్త గోడి రవికుమార్ చనిపోవడంతో అత్తింటి వద్దే ఉంటున్న కోడలు గోడి వెంకటలక్ష్మి. చనిపోయి నెలరోజులయ్యింది కాబట్టి గుమ్మం దాటి వెళ్లి రమ్మని చెప్పి తీరా వెళ్లిరాగా ఇంటికి తాళాలు వేసి బయటికి పొమ్మన వైనం. తనను ఇంట్లోకి తీసుకువెళ్ళేవరకూ ఇక్కడే ఉంటానని చెప్పి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వెంకటలక్ష్మి. గ్రామసచివాలయంలోనూ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన కోడలు వెంకటలక్ష్మి. కరోనా కారణంగా లాక్డౌన్ ఉండటంతో ఎటుళ్ళాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్న వెంకటలక్ష్మి. అయితే, ఇంతవరకూ పోలీసులు స్పందించలేదు.

volunteer attack on old people

ఉద్రిక్తంగా మారిన పెన్షన్ పంపిణీ...

విజ‌య‌న‌గ‌రంలో పెన్ష‌న్ పంపిణీ లో వాలంటీర్‌లు చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. ఇదేమిట‌ని అడిగితే చావుదెబ్బ‌లు త‌ప్ప‌టం లేదంటున్నారు వృద్ధులు. వేలు ముద్రలు వేయించుకొని డ‌బ్బులివ్వ‌లేద‌ని ఓ వృద్ధురాలు ఆరోపించింది. విజయనగరం జిల్లా జామి మండలం పావాడలో పెంక్షన్ పంపిణీలో అవకతవకలు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వేలుముద్రలు వేయించుకొని డబ్బులివ్వలేదని వృద్ధురాలు ఆరోపించి అడిగినందుకు వృద్దులపై  వాలంటీర్ దౌర్జన్యం చేయ‌డంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఈ సంద‌ర్భంగా కొట్లాట జ‌రిగింది. పెన్ష‌న్ కోసం మహిళలు  వాలెంటీర్ల మ‌ధ్య గొడ‌వ రోడ్డు కెక్కింది.

Police beats Common man in front of his son

క‌రోనా సంగ‌తేమో, పోలీసు దెబ్బే చుక్క‌ల్ని చూపిస్తుంది!

తెలంగాణా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఇది డిపార్ట్‌మెంట్ నినాదం. ఆచ‌ర‌ణ‌లోనూ అలానే వున్నారా? రూల్స్ అతిక్ర‌మిస్తే ఫైన్ వేయండి. ఇంటికి నోటీస్ పంపండి. అంతే కానీ ఈ కొట్టుడు ఏంటి?  నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో పోలీసులు అమానుషంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కన్న కొడుకు ముందు  లాఠీలతో బాదుతున్న దృశ్యం హ్రుదయ విదారకంగ ఉంది. వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో ఓ వ్యక్తిని కన్న కొడుకు ముందే చితక బాధారు. లాఠీలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ పరుష పదజాలం వాడారు. ఐదారుగురు పోలీసులు ఒక వ్యక్తిని చుట్టుముట్టి కింద పడేసి మరీ దారుణంగా హింసించారు. ఆ వ్యక్తి కొడుకు వదలండి అంకుల్ ఫ్లీజ్ అంటున్నా ఏ మాత్రం కనికరించలేదు.  ఆ వ్యక్తితోపాటు ఆ పిల్లాన్ని కూడా పోలీసు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.  దురుసుగా ప్రవర్తిస్తూ.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ.. ఆ పిల్లాడితో సహా ఇద్దరిని అరెస్టు చేసి కారులోకి నెట్టి తీసుకెళ్లారు. ఈ  ఆక్రందనలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  కొంతమంది పోలీసుల‌ ప్రవర్తనతో మిగ‌తా పోలీసులంతా బ‌ద‌నాం అవుతున్నారు. అమాయ‌క ప్ర‌జ‌ల‌పై జులుం చేసే వారికి గుణ‌పాఠం నేర్పేలా ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారా? పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ నిర్ణ‌యం ఏమిటో?

Coronavirus

గొడుగుతో క‌రోనాను క‌ట్ట‌డిచేయ‌వ‌చ్చ‌ట‌!

కరోనా బారిన పడకుండా ఉండేందుకు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మరో చిట్కా చెబుతున్నారు. సోషల్ డిస్టెంన్స్ పాటించమంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. అయితే ఆ సూచన మేరకు దాన్ని అమలు పరచాలంటే ప్రతి ఒక్కరు గొడుగు ఉప‌యోగిస్తే ఒకరికొకరు కనీసం మీటరు దూరం పాటించినట్లవుతుందని ఆయన సలహా ఇస్తున్నారు.  ఎదుటి వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము వంటి వాటి నుంచి వచ్చే తుంపర్ల బారిన పడకుండా గొడుగు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. వ‌ర్షం, ఎండ నుంచే కాదు వైర‌స్ బారిన ప‌డ‌కుండా గొడుగు ర‌క్షిస్తుంద‌ట‌. అయితే గొడుగు వేసుకుని బయటకు వెళ్లి వచ్చిన వెంటనే దాన్ని ఎండలోనే కొద్ది సేపు ఉంచి లోపల పెడితే మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. చేతులు కడుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, ఇదేదో గొడుకు కూడా వాడుదాం. టైం అలా వుంది. ఏం చేస్తాం మ‌రి! డెడ్లీ వైర‌స్‌....

sri rama brahmotsavam in vontimitta

ఒంటిమిట్టలో నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలు 

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. ఆపై ఆగమశాస్త్ర ప్రకారం, పుట్టమన్నును తీసుకుని వచ్చి, బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయంలో ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు, రాత్రి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు.  7వ తేదీ రాత్రి, పున్నమి వెన్నెల కాంతుల్లో స్వామివారి కల్యాణాన్ని కూడా పరిమిత సంఖ్యలో హాజరయ్యే పూజారులు, అధికారుల సమక్షంలో నిర్వహిస్తామని ఆలయ డిప్యూటీ ఈఓ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు కిక్కిరిసిపోయే ఒంటిమిట్ట, ఇప్పుడు భక్తులు కనిపించక బోసిపోయింది. 

PM Modi video conference with CMs on coronavirus

ఆంధ్రలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల తబ్లీగ్ జమాతే పుణ్యమే: జగన్ మోహన్ రెడ్డి 

*వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ *వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు *ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌ కోవిడ్‌ –19ను ఎదర్కోవడంలో రాష్ట్రంలో సమగ్ర విధానానలు అనుసరిస్తోందని ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను నెలకొల్పా మన్నారు.13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌ –19 వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించా మన్నారు. 10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశామని సి ఎం చెప్పారు. మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధంచేశామాన్నారు. దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం మరో 20వేల బెడ్లను రెడీగా ఉంచామని చెప్పారు. అంతేకాక క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నామాన్నారు.  ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికిపైగా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చారని,  వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మందికాగా  17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని సి ఎం చెప్పారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు... అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారని సి ఎం చెప్పారు. వీరందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఉన్నారన్నారు. కోవిడ్‌ –19 లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేసినట్టు సి ఎం చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు సర్వే చేశాం: ఢిల్లీలో తబ్లీగీ సమాతే సదస్సుకు హాజరైన వారిని గుర్తించి వారి క్వారంటైన్‌కు తరలించామాన్నారు. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామాన్నారు: తబ్లిగీ జమాతేకు హాజరైన 1085 మంది ఇలా గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నామని సి ఎం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్‌ –19 సోకిందని, ఇందులో 111 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్లిన వారేనని, 91 మంది తబ్లీగ్‌జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్‌ కావడంద్వారా ఈ వైరస్‌ సోకిందని వివరించారు.

Nizamuddin Markaz incident

నిజాముద్దీన్ లెక్క తేల్చిన ఢిల్లీ పోలీసులు!

ఢిల్లీ మర్కజ్‌ మసీదులో జ‌రిగిన మూడు రోజుల కార్య‌క్ర‌మంలో మొత్తం 1,830 మంది హాజరు కాగా వీరిలో 16 దేశాలకు చెందిన 281 మంది విదేశీయులని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఇండోనేషియా 72, శ్రీలంక 32, మయన్మార్‌ 33, కిర్గిస్థాన్‌ 28, మలేసియా 20, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల నుంచి తొమ్మిది మంది చొప్పున, థారులాండ్‌ 7, ఫిజీ 4, ఇంగ్లాండ్‌ 3, ఆప్ఘనిస్థాన్‌, అల్జీరియా, జైబూటీ, సింగపూర్‌, ఫ్రాన్స్‌, కువైట్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 711 మంది, తమిళనాడు నుంచి 501, అసోం 216, ఉత్తర ప్రదేశ్‌ 156, మహారాష్ట్ర 109, మధ్యప్రదేశ్‌ 107, బీహార్‌ 86, పశ్చిమ బెంగాల్‌ 73, తెలంగాణ 55, జార్ఖండ్‌ 46, కర్ణాటక 45, ఉత్తరాఖండ్‌ 34, హర్యానా 22, అండమాన్‌ నికోబార్‌ దీవులు 21, రాజస్థాన్‌ 19, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఒడిశాల నుంచి 15 మంది చొప్పున, పంజాబ్‌ 9, మేఘాలయ నుంచి ఐదుగురు ఈ ఇస్త‌మాలో పాల్గొన్నట్లు గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో ప్రార్థనలకు హాజరైన తమ రాష్ట్ర వ్యక్తులను గుర్తించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌ తోపే అధికారులను ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన పర్యటనను రద్దు చేసుకొని మంగళవారం రాష్ట్ర రాజధాని చేరుకున్నారు. నిజాముద్దీన్‌ పాజిటివ్‌ కేసుల కలకలం నేపథ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

vontimitta temple in kadapa

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రసిద్ద శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా మొదటి రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఏకాంతంగా బుధవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమం టీటీడీ అధికారులు నిర్వహించారు. చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అంకురార్పణ తో పుట్టమన్ను సేకరణ తో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6నుంచి 6.30 లోపు ఏకాంతగా పూజలు జరుపనున్నారు. ఏడవ తేదీ సాయంత్రం స్వామి వారి కళ్యాణం  వేడుకగా నిర్వహించనున్నారు. ఈ పది రోజుల పాటు ఆలయం లోపల వాహన సేవలు,కల్యాణం భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం టీటీడీ అధికారులు, అర్చకులు, మంగళ వాయిద్యాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

donald trump negligence over coronavirus

కార్పోరేట్ సేవ‌లో క‌రోనా ప్యాకేజ్! ట్రంప్ నిర్ల‌క్ష్యానికి పారాకాష్ట‌!

గాంధీ ఆసుప్ర‌తిలో రోగి బంధువులు డాక్ట‌ర్ ను కొడితే, అమెరికాలో వైద్య సిబ్బందిని దొంగ‌లంటూ అధ్య‌క్షుడు ట్రంప్‌యే ఆడిపోసుకుంటున్నాడట‌. మాస్కులను ఆసుపత్రులు, వైద్య సిబ్బంది దొంగిలించడం వల్లే వీటికి కొరత ఏర్పడిందని ట్రంప్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. యుద్ధ రంగంలో ముందుండి పోరాడుతున్న సైనికులను కమాండర్‌ నిందించి కూర్చొన్నట్లుగా ఉంది ట్రంప్‌ తీరు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్‌ వర్కర్లకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, గౌనులు, టెస్టింగ్‌ కిట్లు, రెస్పిరేటర్లు, శానిటైజర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచేందుకు నిర్దిష్ట చర్యలేవీ తీసుకోవ‌డం లేదు. పైగా వారిని దొంగలుగా చిత్రించే ప్రయత్నం చేశాడు.  కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో చైనా అనుభవం నేర్పిస్తోంది. అలాగే ఎలా ఎదుర్కోకూడదో అమెరికా అనుభవం గుణ‌పాఠం నేర్పుతోంది.  ట్రంప్  నిర్లక్ష్యానికి అమెరికాలో 2,13,003 కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మృత్యు వాత పడ్డారు.  అమెరికాలో క‌రోనా కాటుకు జ‌నం బ‌లి అవుతుంటే ట్రంప్ ఏమో కార్పోరేట్ కంపెనీల సేవ‌లో త‌రిస్తున్నాడ‌ట‌. క‌రోనా ప్యాకేజ్ కూడా వారికే అర్పిస్తున్నాడ‌ట‌. కరోనా ప్రమాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ), ఆరోగ్య రంగ నిపుణులు చేసిన హెచ్చరికల్ని ట్రంప్ ప‌ట్టించుకోలేదు. కరోనా మహమ్మారి అంతమయ్యేలోపు అమెరికాలో 2 లక్షల మందిని అది బలిగొంటుందని ప్రముఖ వైద్య నిపుణులు, అమెరికాలోని అలర్జీ, అంటువ్యాధుల జాతీయ పరిశోధనా సంస్థ డైరక్టర్‌ అంథొనీ ఫౌసి చేసిన హెచ్చరికను ట్రంప్ నిర్ల‌క్ష్యం చేశారు. నిరుద్యోగం కనివిని ఎరుగని రీతిలో 32.7 శాతానికి చేరుకోనున్నదని ఆర్థిక వేత్తల అంచనా.  చరిత్రలో ఇదొక అసాధారణ పరిస్థితి. ట్రంప్‌ ప్రభుత్వం మొదట ఇదంతా మీడియా సృష్టి అని, గోరంతలు కొండంతలు చేసి చూపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందంటూ సమస్య తీవ్రతను గుర్తించేందుకు నిరాకరించారు. ఫలితంగా కరోనా అమెరికాలోని యాభై రాష్ట్రాలకు విస్తరించింది. అమెరికా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌ సిటీ కరోనాకు కేంద్ర స్థానంగా మారింది.  కరోనాపై పోరు పేరుతో 2.2 లక్షల కోట్ల డాలర్లతో తీసుకొచ్చిన ప్యాకేజీలో సింహభాగం ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌, స్పేస్‌, హోటల్‌ పరిశ్రమకే దక్కనుంది. కార్పొరేట్లు, కుబేరుల డబ్బుతో అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్‌ పార్టీ కి,  ఈ సంక్షోభాన్ని తన కార్పొరేట్‌ మిత్రులకు వరంగా మార్చడమెలా అన్నదే  ధ్యేయమైపోయింది.

Chinese city bans dog and cat meat

కుక్క, పిల్లి మాంసం తినడంపై నిషేధం!

చైనావాళ్ళ‌కు ఇప్పుడు బుద్ధి వ‌చ్చిన‌ట్లుంది. అందుకే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో త‌మ అల‌వాట్లు మార్చ‌కోవ‌డంపై దృష్టిపెట్టారు.  అందులో భాగంగా చైనా దేశంలోని షెన్‌జెన్ నగరం మొట్టమొదటిసారి కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం పిల్లులు, కుక్కలతో పాటు పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులను తినడాన్ని నిషేధించారు. పాములు, బల్లులు, కుక్కలు, పిల్లులతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగాన్ని షెన్‌జెన్ నగరంలో నిషేధించారు. చైనాలోని వూహాన్ నగరంలో జంతువధశాల కేంద్రంగా కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం కుక్కలు, పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది.  తైవాన్, హాంకాంగ్ దేశాల్లో కూడా కుక్కలు, పిల్లులను తినడాన్ని నిషేధించారు.  అయితే ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్దలను ఈ నిషేధం నుంచి మినహాయించారు.

Saudi Officials Urge Muslims to Postpone the Hajj

హజ్‌ యాత్రపై గందరగోళం! వాయిదా వేసుకోమంటున్న హ‌జ్ మంత్రి!

కరోనా వైరస్ నేప‌థ్యంలో హ‌జ్ యాత్ర‌పై సౌదీ స‌ర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2020 హజ్ లో పాల్గొనే యాత్రికులు వాయిదా వేసుకోవాల‌ని హ‌జ్ మంత్రి మొహ‌మ్మ‌ద్ బంటెన్ విజ్ఞ‌ప్తి చేశారు. యాత్రికుల భ‌ద్ర‌త త‌మ‌కు ముఖ్య‌మ‌ని, వైర‌స్ నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చే వ‌ర‌కు యాత్రికులు త‌మ ప్లాన్‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఆదేశించారు.  షెడ్యూల్ ప్రకారం... ఈ ఏడాది జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ప్ర‌పంచం న‌లువైపుల నుంచి దాదాపు 40 ల‌క్ష‌ల మంది హ‌జ్‌ యాత్ర‌కు వెళ్ల‌నున్నారు.  అయితే వారంతా త‌మ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవాల‌ని సౌదీ విజ్ఞప్తి చేసింది.  ఎప్పుడు కరోనా నుంచి బయటపడతామో తెలియని పరిస్థితి. హజ్‌ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్‌ ఫిలిగ్రిమ్స్ ను సూచించింది. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 40 లక్ష‌ల ముస్లీం యాత్రికులంతా హజ్‌ యాత్రకు తరలివస్తారు.    ఇండియా నుంచి ఈ ఏడాది ల‌క్షా 75 వేల మంది హ‌జ్ యాత్ర‌కు వెళ్ళ‌నున్నారు. ఒక్కొక్క‌రికి దాదాపు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చు వ‌స్తుంది. ఇప్ప‌ట్టికే ఒక్కొక్క‌రు రెండు విడ‌త‌ల్లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు హ‌జ్ క‌మిటీ ఆఫ్ ఇండియాకు చెల్లించారు. మూడ‌వ విడ‌త కింద మ‌రో ల‌క్ష రూపాయ‌లు చెల్లించాల్సి వుంది.  షెడ్యూల్ ప్ర‌కారం జూన్ నెల నుంచే సౌదీకి హ‌జ్‌యాత్రికుల్ని తీసుకుని విమానాలు బ‌య‌లుదేరుతాయి. ఈ నేప‌థ్యంలో హ‌జ్ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోమ‌ని సౌదీ హ‌జ్ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న గొంద‌ర‌గోళంలో ప‌డ‌వేసింది. ఈ ఏడాది హ‌జ్ యాత్ర వుంటుందా? లేదా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

మేనల్లుడి అంత్యక్రియలకు వెళ్ల‌లేక‌పోయిన స‌ల్మాన్‌!

సల్మాన్ ఖాన్ సొంత‌ మేనల్లుడి అంత్యక్రియలకు హాజరు కాలేని దుస్థితి. స‌ల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్, గుండెపోటు బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సల్మాన్ కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగే ఈయన అంత్యక్రియలు ఇండోర్‌లో ఎప్రిల్ 1న జరిగాయి.  అయితే లాక్ డౌన్ కారణంగా సల్మాన్ సహా చాలా మంది అబ్ధుల్లా అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు. కేవలం తక్కువ మందితోనే ఖ‌న‌నం జరగింది. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు. నిరుపేద,  కోటీశ్వరుడు,  సామాన్యుడు, సెలబ్రెటీ ఎవ్వరినీ ఈ కరోనా ప్రభావం వదల లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడిక్కడ వ్యవస్థలన్నీ స్థంభించి పోయాయి.

ధారావి మురికివాడలో కరోనా వైరస్‌! ఒక‌రు మృతి

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో కరోనా వైరస్ ప్రవేశించింది. కారోనా కాటుకు ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మురికివాడలో నివసించే దాదాపు పది లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ముంబైలోని ధారావి మురికివాడలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ధారవిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బుధవారం సాయంత్రం సియాన్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఈ వ్యక్తి నివాసముంటున్న భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ భవనంలో ఉంటున్న మిగతా ఏడు కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికి ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ ధారవి మురికివాడలో సుమారుగా 10 లక్షల మంది గుడిసెవాసులు నివసిస్తున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జస్‌లోక్‌ ఆస్పత్రిలోని ఔట్‌ పేషెంట్‌ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.

మంగళగిరిలో మూడు కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటన

* మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ * కూరగాయల దుకాణాలు, షాపులు మూసివేత * గుంటూరులో అత్యధికంగా 20 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మంగళగిరి వ్యక్తికి గతరాత్రి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు. అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు. కాగా, నిన్న రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్ర సి ఎం ఓ కాల్ సెంటర్ ను కడిగిపారేసిన కామన్ మ్యాన్!

* గుంటూరు కలెక్టర్ ఉపయోగించిన భాషపై అభ్యంతరం ...  * అసమర్ధ అధికారుల తీరుపై కామన్ మ్యాన్ అసహనం .....  * తండ్రి పేరుకూ, హెల్ప్ లైన్ ఫిర్యాదుకూ సంబంధమేమిటని ప్రశ్న  * కాలం చెల్లిన 'కాలమ్స్' ను తొలగించాలని సూచన  * వార్డు నెంబర్ చెపితే కానీ, ఫిర్యాదు తీసుకోలేమని చెప్పిన సి ఎం ఓ కాల్ సెంటర్  ఆంధ్ర సి ఎం ఓ కాల్ సెంటర్ ను కడిగిపారేసిన కామన్ మ్యాన్. ఏపీలో ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ, కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో పేద ప్రజలకు రేషన్ డీలర్ల వద్దే సరుకులు ఇవ్వడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. వాటి గురించే ఈ కామన్ మ్యాన్ ఆంధ్ర ప్రదేశ్ సి ఎం ఓ కాల్ సెంటర్ ను ఎక్కి దిగారు. గతంలో అడక్కముందే పింఛన్లను ఇంటివద్దకే పంపిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ ను మాత్రం షాపులకు వచ్చి తీసుకోవాలనడం సరికాదని తన వాదన.  గతంలో నెలవారీ పెన్షన్ ను ఇంటివద్దే అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అదే వాలంటీర్లను వాడుకుని ఇంటివద్దకే రేషన్ పంపుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపాల్సిన రేషన్ సరుకులను షాపుల వద్దే తీసుకోవాలని అధికారులు సూచించడంతో ఇవాళ పేద ప్రజలు డీలర్ల వద్ద క్యూలో కనిపించారు. అసలే కరోనా భయాలు, సామాజిక దూరం పాటించాలన్న హెచ్చరికలు, అలాగని ఇంటివద్దే ఉండిపోతే రేషన్ దొరకదేమో అన్న భయం, ఒక్క రోజులో సరుకులు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన.. ఇలా అనేక భయాలతో ప్రజలు ఇవాళ రేషన్ డీలర్ షాపుల వద్దకు చేరుకుని సరుకులు తీసుకోవడం కనిపించింది. గతంలో నెలవారీ సామాజిక పెన్షన్లను ఇంటివద్దే ఇవ్వాలని ఎవరూ కోరలేదు. ఒకటో తేదీ ఆదివారం వచ్చినా అదే రోజు ఇవ్వాలని ఎవరూ అడగలేదు. కానీ ప్రభుత్వం మాత్రం లక్షలాది వాలంటీర్లను మోహరించి ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఒకే రోజు రికార్డు స్దాయిలో పెన్షన్లను ఇంటివద్దకే పంపింది. కానీ ఇప్పుడు కరోనా పరిస్ధితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్దితి లేదు. లాక్ డౌన్ కొనసాగుతోంది. తప్పనిసరైతే తప్ప బయటికి వచ్చే పరిస్దితి లేదు. అయినా వాలంటీర్లను వాడుకోకుండా ప్రజలను రేషన్ కోసం షాపుల వద్ద క్యూ కట్టాలని ప్రభుత్వం సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఉదయం షాపింగ్ సమయాలను కూడా తగ్గించిన ప్రభుత్వం, రేషన్ కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వారిని రేషన్ దుకాణాల వద్ద క్యూల్లో ఉండాలనడం సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని కామన్ మ్యాన్ సి ఎం ఓ కాల్ సెంటర్ కి వివరించే ప్రయత్నం చేస్తే, ఆయనకు ఎదురైనా చేదు అనుభవం ఇది. ఇంతే కాదు, కిక్కిరిసిన ప్రాంతం లోని ఒక షెడ్ లో పిల్లలకు ట్యూషన్ నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుంటూరు కలెక్టర్ కు విన్నవిస్తే, మీకు రూల్స్ తెలుసా అంటూ చాలా దురుసుగా కలెక్టర్ అడిగిన తీరును కూడా ఆయన వివరించారు. ఇదండీ, మొత్తానికి కరోనా కంట్రోల్ విషయం లో మన కలెక్టర్ గారి వైఖరి.