కేసీఆర్ ప్లాన్ అదిరింది.. మరి మోడీ మద్దతిస్తాడా?

  ఈ మధ్య కేసీఆర్, మోడీని కలిసి వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి భేటీలో కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యలే చర్చకు వచ్చాయా? లేక రాజకీయాలు కూడా చర్చించారా? అంటూ అందరూ గుసగుసలు ఆడుకున్నారు.. నిజంగానే ఆ భేటీలో కేసీఆర్, మోడీలు రాజకీయాల గురించి కూడా చర్చించుకున్నారంటూ ఒక వార్త బయటికి వస్తుంది.. ఐతే ఆ రాజకీయ చర్చ 'రాష్ట్రంలో మీరు మద్దతివ్వండి, కేంద్రంలో మేం మద్దదిస్తాం' ఇలాంటి వాటి గురించి కాదంట.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కురియన్‌ పదవీ కాలం ముగియడంతో త్వరలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరగనుంది.. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 లో 4 సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం సంఖ్య 241 .. అంటే డిప్యూటీ చైర్మన్ కావాలంటే 121 బలం కావాలి.. బీజేపీ, కాంగ్రెస్ లకు పూర్తి బలం లేదు.. దాంతో వేరే పార్టీల మద్దతు ఈ రెండు పార్టీలకి కచ్చితంగా కావాల్సిందే..  ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకొని, ఎవరికి వారు తాము బలపరిచిన అభ్యర్థే గెలవాలని చూస్తున్నాయి.. ఇక మోడీ అయితే కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలని అవసరమైతే తనకి సానుకూలంగా ఉన్న పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని చూస్తున్నాడట.. ఇదే కేసీఆర్ పాలిట వరంగా మారింది.. తెరాస తరుపున అభ్యర్థిని నిల్చోబెట్టి మోడీ మద్దతుతో గెలవాలని చూస్తున్నారట.. అభ్యర్థిగా సీనియర్ నేత ఎంపీ కేశవరావు పేరు కూడా వినిపిస్తుంది.. ఇదే విషయం కేసీఆర్, మోడీతో భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది.. మోడీ కూడా భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది.. మరి మోడీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెరాసకు మద్దతు తెలుపుతారా?..  ఒకవేళ తెలిపినా, అప్పటికీ తెరాసకి పూర్తి మెజారిటీ రాదు, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు కూడా తప్పనిసరి.. మరి ఆ పార్టీలు తెరాసకు మద్దదిస్తాయా?.. అసలింత జరుగుతుంటే కాంగ్రెస్ సైలెంట్ గా ఎందుకుంటుంది.. ఒకవైపు దేశ స్థాయిలో బీజేపీ ప్రత్యర్థి, మరోవైపు తెలంగాణాలో తెరాస ప్రత్యర్థి.. మరి ఈ రెండు ప్రత్యర్థులు కలిసి డిప్యూటీ చైర్మన్ పదవి తన్నుకుపోతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? బీజేపీయేతర శక్తులన్నిటినీ ఏకం చేయదు.. ప్రస్తుతం కాంగ్రెస్ అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి కేసీఆర్ అనుకున్నట్టు మోడీ మద్దతుతో తెరాస డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుందో లేక కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు షాక్ ఇస్తుందో త్వరలోనే తెలుస్తుంది.  

బీజేపీకి షాక్ ఇచ్చే దిశగా బాబు

  ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ బాబు ఎన్డీయే నుండి బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అలానే టీడీపీ,బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే బాబు 2019 లో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.. దానిలో భాగంగానే శాంపిల్ గా బీజేపీకి ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.. అదేంటంటే.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక త్వరలో జరగనుంది.. ఆ ఎన్నిక సాక్షిగా బాబు తన సత్తా చూపబోతున్నట్టు తెలుస్తుంది.. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా.. 4 ఖాళీ ఉండటంతో ప్రస్తుతం ఆ సంఖ్య 241 .. అంటే డిప్యూటీ చైర్మన్ కావాలంటే కనీసం 121 ఓట్లు కావాలి.. బీజేపీకి సొంత బలం 80 .. మిత్రపక్షాలు, మరికొన్ని పార్టీల మద్దతు ఉంటే తప్ప బీజేపీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో విజయం సాధించలేదు.. అందుకే బాబు బీజేపీకి ఇప్పుడొక షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక త్రాటి మీదకు తీస్కొచ్చి.. బీజేపీని ఓడించాలి అనుకుంటున్నారట.. బాబుకి జాతీయ స్థాయిలో మంచి పేరుంది.. జాతీయ నేతలు, వివిధ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి.. బాబు తలుచుకుంటే బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడం పెద్ద కష్టం కాదు.. ఇక బీజేపీని గద్దె దించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా అంటే సహజంగానే ముందడుగు వేస్తుంది..దీన్నిబట్టి చూస్తే రాజ్యసభ సాక్షిగా బాబు, బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.  

మోడీ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించిన బాబు

  ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం, కేంద్రం మీద విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.. అయితే అవకాశం దొరికితే కేంద్రాన్ని డైరెక్ట్ గా అడగాలని చూస్తున్న బాబుకి, నీతి ఆయోగ్ రూపంలో అద్భుత అవకాశం దొరికింది.. ఇంకేముంది మోడీ సాక్షిగా బాబు కేంద్రాన్ని అడిగేసారు.. మాట్లాడటానికి 7 నిమిషాలే సమయం అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బాబు ప్రసంగాన్ని ఆపే ప్రయత్నం చేసారు.. అయినా బాబు వినకుండా ఏపీకి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడటానికి ఎక్కువ సమయం కావాలంటూ సుమారు 20 నిమిషాలపాటు ప్రసంగించారు.. ఏపీ ప్రజలు విభజన కోరుకోలేదని, విభజన ఏకపక్షంగా జరిగి ఏపీకి అన్యాయం జరిగింది అన్నారు. ప్రత్యేకహోదా మరియు విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అన్న బాబు.. గత ప్రధాని ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నారు, బీజేపీ కూడా ఎన్నికల సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తానని మాట ఇచ్చింది.. ఆ మాట ప్రకారం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అంటూ బాబు సూటిగా చెప్పారు.. అలానే విభజన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాల్సిందే అంటూ పట్టు పట్టారు.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున.. భూసేకరణ, పునరావాసం, నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని.. అలానే ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం తిరిగి చెల్లించాలంటూ స్పష్టం చేసారు. అమరావతి నిర్మాణానికి 20 ఏళ్లలో 5 లక్షల కోట్లు అవసరమని, కానీ కేంద్రం ఇప్పటివరకు కేవలం 1500 కోట్లతో సరిపెట్టుకుంది అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే ఏపీలోని వెనకబడిన జిల్లాలను ఆదుకొనే విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిస్తుందని విమర్శించిన బాబు, ఈ ఏడాది వెనకబడిన జిల్లాల కోసం ఖాతాలో జమ చేసిన 350 కోట్లను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తూ బాబు కేంద్రంపై మండిపడ్డారు.. ఏపీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దానికి కేంద్రం కూడా సహకరించాలని కోరారు.. మొత్తానికి మోడీ సాక్షిగా నీతి ఆయోగ్ లో బాబు కేంద్రాన్ని గట్టిగానే అడిగారన్నమాట.

మోడీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్

  గత ఎన్నికలు మిగిల్చిన అనుభవాలు, ఉపఎన్నికల ఫలితాలు తెచ్చిన ఆశలతో.. మోడీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. మొన్నటివరకు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిన కాంగ్రెస్ ఇప్పుడు మోడీని గద్దె దించడమే లక్యంగా సాగుతుంది.. బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి దూరమవుతున్నాయి.. ఇదే కాంగ్రెస్ పాలిట వరంలా మారనుంది.. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతూ, ప్రజలకి దగ్గరవ్వాలని చూస్తుంది.. మోడీకి చెక్ పెట్టేందుకు అవసరమైతే ఒక మెట్టు దిగైనా ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది.. దానిలో భాగంగానే వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీచేయనుంది.. అంతేకాదు ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ స్థానాలు సర్దుబాటు చేసి, కాంగ్రెస్ తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దపడినట్టు తెలుస్తుంది.. విశ్లేషకుల అంచనాల ప్రకారం కాంగ్రెస్ కేవలం 200 నుండి 250 లోక్ సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయబోతోందని, ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోవడమే కాకుండా, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మోడీకి చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు.. ప్రాంతీయ పార్టీలతో కలిసి మోడీకి చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.  

బీజేపీ మాస్టర్ ప్లాన్.. ముందస్తు ఎన్నికలు?

  2014 వరకు ఒక లెక్క 2014కి ఒక లెక్క అన్నట్టుగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించింది.. మోడీ పీఎం అయ్యాడు.. తర్వాత బీజేపీ ఇంకా బలపడుతూ వచ్చింది.. మోడీ, అమిత్ షా సాయం తో బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా చేయాలనుకున్నాడు.. దీంతో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కోలుకోవడం కష్టం అనుకున్నారు.. మళ్ళీ మోడీనే పీఎం అవ్వడం ఖాయం అనుకున్నారు.. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవ్ కదా.. బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.. మిత్రపక్షాలు దూరమయ్యాయి.. ప్రజల్లో బీజేపీ మీద రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. అందుకే బీజేపీ ఆలోచనలో పడింది.. వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్న భయంతో మాస్టర్ ప్లాన్ వేసింది.. ఆ ప్లానే ముందస్తు ఎన్నికలు.. ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది సమయం ఉంది.. ఇప్పటికే ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ మీద ఏర్పడిన వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి.. దీనికితోడు త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడుతుంది.. ఆలస్యం అవుతున్న కొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భావించిన బీజేపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుందట.. వచ్చే ఏడాది మధ్యలో జరగాల్సిన ఎన్నికలని ఈ ఏడాది చివరికి నిర్వహించాలని చూస్తుందట.. మరి బీజేపీ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందో లేదో భవిష్యత్తులో తెలుస్తుంది.  

మూడో స్థానంలో ఏపీ.. ఆరో స్థానంలో తెలంగాణ

  తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, ఏపీలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రచార అస్త్రం 'జాబు రావాలి అంటే బాబు రావాలి'.. ఈ మాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది.. ప్రజలు కూడా అనుభవం, తెలివితేటలున్న బాబు సీఎం అయితే 'యువతకి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది' అని నమ్మి బాబుని గెలిపించారు.. మరి బాబు ఈ నాలుగేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా?.. ఈ ప్రశ్న ప్రతిపక్షాలను అడిగితే బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు అంటూ జోకులేస్తారు.. లేదా యువతకి ఉద్యోగాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆరోపిస్తుంటారు.. కానీ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తెలుస్తుంది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాల కల్పనలో ఏపీ మూడో స్థానంలో ఉంది.. ఇది ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్కలు కాదు.. లోక్ సభలో కేంద్రమంత్రి చెప్పిన లెక్కలు.. ఉద్యోగాల కల్పనలో కర్ణాటక, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఏపీ మూడో స్థానంలో ఉందట.. తరువాతి రెండు స్థానాల్లో గుజరాత్, తమిళనాడు ఉండగా తెలంగాణ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నట్టు తెలుస్తుంది.. ఏపీ మూడో స్థానంలో ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం రాజధాని, సరైన వసతులు కూడా లేని ఏపీలో ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించి బాబు తానేంటో నిరూపించుకున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు..మరి కొందరైతే 'జాబు రావాలి అంటే బాబు రావాలి' అనే మాటను బాబు నిజం చేసారుగా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు

  టీడీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా పట్టుదలగా నిలబడి తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ.. అలాంటి పార్టీ, అసలు ఎన్నికల తరువాత లేకుండా ఎలా పోతుంది అనుకుంటున్నారా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు చెప్తున్నారు మరి.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 120 లోక్ సభ స్థానాలు గెలవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోందని, అలానే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.. అంతేనా, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశం లేదని, అసలు టీడీపీ పార్టీనే ఉండదని అన్నారు.. టీడీపీ ప్రభుత్వం మీద, నాయకుల మీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకతను బీజేపీ అవకాశంగా మలుచుకొని రంగంలోకి దిగుతుందని అన్నారు.. అలానే ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు.. చంద్రబాబుకు గంగా యమున సరస్వతి పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని, గంగ ఎవరో యుమున ఎవరో సరస్వతి ఎవరో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమైందని, ఏపీలో టీడీపీకి, తెలంగాణాలో తెరాసకి గట్టిపోటీ ఇస్తామని అన్నారు.. చూద్దాం మరి బీజేపీ వ్యూహాలు ఫలించి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తుందో లేదో.  

వైసీపీ తరుపున సినీ హీరో ప్రచారం?

  సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.. కానీ సినిమాలకి, రాజకీయాలకి విడదీయరాని సంబంధం ఉంది.. సినిమా హీరోలు, రాజకీయాల్లోకి రావడం.. రాజకీయ వారసులు, సినిమా హీరోలు అవ్వడం కామన్.. అందుకే సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి.. రాజకీయ నాయకులు కూడా సినిమా వాళ్ళతో ప్రచారం చేపిస్తే, వాళ్ళ ఫాలోయింగ్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని నమ్ముతారు.. ఆ నమ్మకంతోనే సినిమా వాళ్ళని ఎన్నికల సమయంలో రంగంలోకి దింపుతారు.. ఇప్పుడు ఇదే ఫార్ములాని వైసీపీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. పాదయాత్రల పేరుతో జనాల్లో తిరిగితే సరిపోదు, జనాలకి దగ్గరవాలంటే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న వైసీపీకి, సినిమా వాళ్ళతో ప్రచారం అనే పాత ఫార్ములా తట్టిందట.. ఫార్ములా పాతదైనా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తదని నమ్ముతున్నారట.. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, థర్టీ ఇయర్స్ పృథ్వి లాంటి వారు వైసీపీకి మద్దతుగా నిలిచారు.. పోసాని అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరి బాబు మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. వీరికి తోడు ఇంకొందరు సినిమా వాళ్ళు వైసీపీకి మద్దతుగా నిలిస్తే పార్టీకి మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నారట.. ముఖ్యంగా హీరోలని రంగంలోకి దింపాలని చూస్తుందట.. దానిలో భాగంగానే తెలుగువాడు అయ్యుండి తమిళ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ని, వైసీపీ తరుపున ప్రచారం చేయించాలని చూస్తున్నారట.. మరి నిజంగానే విశాల్, వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా? ఒకవేళ చేస్తే వైసీపీకి ఏమన్నా ప్లస్ అవుతుందా? తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.  

తెలంగాణ పంచాయితీ

  తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా? అంటే అది గ్రామ పంచాయితీ ఎన్నికలే.. అసలు గ్రామ పంచాయితీ ఎన్నికలు ఉన్నాయా? లేవా? ఒకవేళ ఉంటే ఎప్పుడున్నాయి? అంటూ ఓటరు నుండి లీడర్ వరకు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు.. తెరాస ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇదే విషయం గురించి ఆలోచిస్తుంది.. సీఎం కేసీఆర్ ఏమో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటున్నారు.. కానీ తెరాస ఎమ్మెల్యేలు, నేతలు మాత్రం తొందర పడొద్దు ఇప్పుడు నిర్వహించటం కరెక్ట్ కాదు అంటున్నారట..   ఇదేంటి సీఎం సార్ అంత నమ్మకంగా నిర్వహించాలి అనుకుంటుంటే, ఎమ్మెల్యేలు ఎందుకు వద్దంటున్నారు అనుకుంటున్నారా?.. సీఎం నమ్మకం సీఎం ది.. ఎమ్మెల్యేల నమ్మకం ఎమ్మెల్యేలది..కేసీఆర్ ఏమో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బాగా పోయాయి.. సార్వత్రిక ఎన్నికలకి ఏడాది కూడా లేదు.. గ్రామ స్థాయిలో మన బలం తెలుస్తుంది.. దాన్ని బట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చని చూస్తున్నారట.. కానీ ఎమ్మెల్యేలు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు..   గ్రామ స్థాయి రాజకీయాలు వేరేలా ఉంటాయి.. పొరపాటున ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సంకేతాలు వెళ్తాయి.. ఇది ప్రతిపక్షాలకు వరంగా మారుతుంది.. ఈ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడుతుంది.. అందుకే పంచాయితీ ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచిదని తెరాస ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.. మరి కేసీఆర్ ఎమ్మెల్యేలు మాట విని వెనకడుగు వేస్తారో లేక తాను అనుకున్న మాట ప్రకారం ముందడుగు వేస్తారో చూడాలి.  

కర్ణాటక సీఎం కుమార స్వామికి మోడీ ఛాలెంజ్

కర్ణాటక అనగానే ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ముందుగా గురొస్తాయి.. సీట్లు ఎక్కువొచ్చిన బీజేపీ, ఓట్లు ఎక్కువొచ్చిన కాంగ్రెస్ కాకుండా.. అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమార స్వామి సీఎం అయ్యారు.. దీంతో బీజేపీ, జేడీఎస్ లు ప్రత్యర్ధులు అయ్యాయి.. మరి ప్రత్యర్థి పార్టీ నేత కుమార స్వామికి, మోడీ ఛాలెంజ్ విసరటం కామనేగా అనుకుంటాం.. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. మోడీ, కుమారస్వామికి పొలిటికల్ ఛాలెంజ్ విసరలేదు, ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.. క్రీడల శాఖామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అంటూ వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేసి కోహ్లీ, సైనా నెహ్వాల్ లాంటి వారిని ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ ఛాలెంజ్ స్వీకరించిన కోహ్లీ, జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. మోడీ, ధోని లాంటి వారిని ఛాలెంజ్ చేసాడు. ఈ ఛాలెంజ్లో భాగంగా మోడీ వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు, 2018 కామెన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన మానికా బాత్రాకు మరియు 40 ఏళ్లకు పైబడిన ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ చేసారు.. ప్రత్యర్థి పార్టీ నేతకి మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడంతో అందరూ షాక్ అవుతున్నారు.. అయితే కుమారస్వామి మాత్రం మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్ కి పాజిటివ్ గా స్పందించారు. 'నా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపినందుకు ధన్యవాదాలు, ప్రతిరోజు నేను యోగ చేస్తాను, ఇప్పటినుండి రాష్ట్ర అభివృద్ధి మీద ఇంకా ఎక్కువ శ్రద్ద పెడతాను దానికి మీ సపోర్ట్ కావాలంటూ' కుమారస్వామి ట్వీట్ చేసారు.. మరి ప్రత్యర్థుల మధ్య ఏర్పడిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ బంధం ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి.

ట్రంప్, కిమ్ ల భేటీ.. ఫలితం ఏమిటి?

  'శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు' అనే  డైలాగ్.. మన దేశ రాజకీయాల్లో బాగా వింటుంటాం.. అయితే ఈ డైలాగ్ మన దేశ రాజకీయాలకే కాదు.. ప్రపంచం మొత్తానికి సరిగ్గా సరిపోతుందని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ నిన్న మొన్నటి వరకు బద్ద శత్రువులు.. ఒకరి పేరు ఒకరు వింటే చాలు ఒంటికాలు మీద లేస్తారు.. అంతెందుకు ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది.. అమెరికా మీద అణుబాంబులు వేస్తామని కిమ్ బెదిరిస్తే.. ఉత్తర కొరియాని అసలు మ్యాప్ లో లేకుండా చేస్తానంటూ ట్రంప్ అన్నాడు.. ఇలా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం చూసి.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని ప్రపంచ దేశాలు భయపడ్డాయి.. అయితే ఎవరి ఊహలకి అందకుండా.. ట్రంప్, కిమ్ లు యుద్ధం వైపు కాకుండా సయోధ్య వైపు అడుగులు వేశారు.. ఇది ప్రపంచ దేశాలకు మూడో ప్రపంచ యుద్ధం కంటే షాకింగ్ గా మారింది.. అసలు ట్రంప్, కిమ్ ల భేటీ ఏంటంటూ ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూసింది.. అలా చూస్తుండగానే వీరిద్దరి భేటీకి ముహూర్తం ఖరారైంది.. భేటీ కూడా జరిగింది.. ట్రంప్, కిమ్ ల స్నేహపూర్వక కరచాలనంతో మొదలైన భేటీ సుమారు గంటన్నర పాటు సాగినట్టు తెలుస్తుంది.. మొదట కొంచెం ఆచి తూచి వ్యవహరించిన వీరిద్దరు, తరువాత బాగానే స్నేహపూర్వకంగా మాట్లాడారు.. ఈ భేటీలో ప్రధానంగా అణ్వాయుధ రహిత ఒప్పందం గురించి చర్చించినట్టు తెలుస్తుంది.. ఈ ఒప్పందంపై ఇద్దరు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.. మొత్తానికి వీరిద్దరి భేటీ వల్ల ఇరు దేశాల మధ్య శాంతి నెలకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.. చూద్దాం ఇంకా ముందు ముందు ఈ భేటీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.  

ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం ఉందా? లేదా?

  ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ మాజీ రాష్ట్రపతి.. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, మాజీ రాష్ట్రపతితో పాటు, మాజీ కాంగ్రెస్ నేత కూడా అనాల్సి వచ్చేలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. కాంగ్రెస్ నేతలు వద్దని చెప్పినా వినకుండా.. ప్రణబ్, ఈ మధ్య జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.. సిద్ధాంత పరంగా శత్రువైన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవ్వడంతో..కాంగ్రెస్ పార్టీ, ప్రణబ్ మీద కోపంగా ఉంది.. అందుకే ప్రణబ్ ని కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.. దానిలో భాగంగానే.. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానం, ప్రముఖులు అందరికీ పంపారు కానీ ప్రణబ్ కి పంపలేదంటూ వార్తలొచ్చాయి.. అయితే ఈ వార్తలని కాంగ్రెస్ కొట్టి పారేస్తోంది.. ప్రణబ్ ముఖర్జీ కి ఆహ్వానం పంపామని, ఆయన కూడా విందుకి రావడానికి అంగీకరించారని కాంగ్రెస్ అంటుంది.. దీంతో ప్రణబ్ కి నిజంగా ఆహ్వానం పంపారా? ఒకవేళ పంపినా ప్రణబ్ విందుకి వస్తారా? అంటూ ప్రజలలో ప్రశ్నలు మొదలయ్యాయి.. ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.. మొత్తానికి రేపు ఇఫ్తార్ విందు సాక్షిగా తెలియనుంది.. కాంగ్రెస్, ప్రణబ్ ని పక్కన పెడుతుందో? లేక ప్రస్తుతానికి తమ పక్కనే ఉంచుకుంటుందో?.. అయితే ఇదంతా చూసి.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. ప్రణబ్ ని కాంగ్రెస్ రాష్ట్రపతి చేసి గౌరవం ఇచ్చింది.. కానీ ప్రణబ్ కి మొదటి నుండి ప్రధాన మంత్రి పదవి మీద మక్కువ ఉండేది.. అందుకే కొన్ని పార్టీలు ప్రణబ్ తో థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయించాలని చూస్తున్నాయి.. ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రణబ్ ని దూరం పెడితే కాంగ్రెస్ కే నష్టం అంటున్నారు.. చూద్దాం ఈ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏంటో?.

బీజేపీ వైపు ఆనం అడుగులు?

  ఆనం బ్రదర్స్.. నెల్లూరులో బలమైన రాజకీయ శక్తులుగా ఎదిగి.. రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆనం బ్రదర్స్, కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరారు.. టీడీపీలో కూడా ఆనం బ్రదర్స్ వాళ్ళ మార్క్ చూపించారు.. అయితే అనుకోకుండా ఆనం వివేకానంద రెడ్డి మరణించడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.. ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ మీద అసహనంతో వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు మొదలయ్యాయి.. ఇక అందరూ ఆనం ఈరోజో, రేపో వైసీపీలో చేరతాబోతున్నారు అనుకుంటుండగా.. ఇప్పుడు కొత్తగా మరో వార్త వినిపిస్తుంది.. అదే ఆనం బీజేపీ లో చేరబోతున్నారని.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. అప్పుడు కన్నా, ఆనం మధ్య మంచి స్నేహం ఉండేది.. ఆ స్నేహమే ఇప్పుడు ఆనం, బీజేపీ వైపు అడుగులు వేసేలా చేస్తుందంట.. ఆనం వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు రావడంతో బీజేపీ, కన్నాని రంగంలోకి దింపిందట.. కన్నా కూడా దానికి తగ్గట్టే పావులు కదిపి ఎలాగైనా ఆనంని బీజేపీలోకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. మరి ఆనం రామనారాయణ రెడ్డి 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అంటూ కన్నా చెప్పినట్టు బీజేపీలో చేరతారా? లేక ముందు ఇచ్చిన మాట ప్రకారం వైసీపీలో చేరతారా?.. లేదా ఈ వార్తలన్నీ అవాస్తవం నేను టీడీపీలోనే ఉంటా అంటారా?.. ఆనం గురించి ఇలా రోజుకో వార్త వస్తుంటే.. అసలు ఆనం నిజంగా పార్టీ మారుతున్నారా? మారితే ఏ పార్టీలోకి వెళ్తారు? అంటూ నెల్లూరు ప్రజలే కాదు, తెలుగు ప్రజలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.. మరి ఆనం దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చూడాలి.  

కర్ణాటక ప్రభుత్వానికి కష్టకాలం?

    కర్ణాటక రాజకీయాలు థ్రిల్లర్ సినిమాని మించిపోయాయి.. ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాకు పూర్తి మెజారిటీ వస్తుందంటే, మాకు పూర్తి మెజారిటీ వస్తుందంటూ బల్లగుద్ది చెప్పాయి.. కానీ రిజల్ట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాయి.. ఓట్లేమో కాంగ్రెస్ కి ఎక్కువొచ్చాయి.. సీట్లేమో బీజేపీ కి ఎక్కువొచ్చాయి.. పూర్తి మెజారిటీ మాత్రం ఎవరికీ రాలేదు.. అయినా బీజేపీ, పెద్ద పార్టీ మాదే అంటూ గవర్నర్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా? బీజేపీకి అధికారం లేకుండా చేయటమే ప్రధాన లక్ష్యంగా జేడీఎస్ తో చేతులు కలిపింది.. బీజేపీకి మెజారిటీ లేదంటూ కోర్టుకెక్కింది.. ఎట్టకేలకు బీజేపీని ఒక్కరోజుకే గద్దె దింపి.. జేడీఎస్ నేత కుమార స్వామిని సీఎం చేసింది.. ఇంతటితో కర్ణాటక రాజకీయాలు కుదుటపడ్డాయి , ఇక సాఫీగా సాగుతాయి అనుకున్నారంతా.  ఇంతలో మరో ట్విస్ట్.. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కుమార స్వామికి సీఎం కుర్చీ టెన్షన్ మొదలైంది.. పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ౩౦ మంది కాంగ్రెస్ నేతలకి మంత్రి పదవులు దక్కాయి.. ఈసారేమో పూర్తి మెజారిటీ లేకపోవడంతో జేడీఎస్ కి మద్దతిచ్చింది.. అప్పటికీ జేడీఎస్ 8 మంత్రిపదవులే తీస్కొని మిగతావి కాంగ్రెస్ కి ఇచ్చింది.. కానీ మంత్రి పదవి దక్కని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం మాకూ మంత్రి పదవి కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి ఆ నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది.. దాంతో వాళ్ళు శాంతించారు.. ఇక కుమార స్వామి ప్రభుత్వం సాఫీగా సాగిపోతుంది అనుకుంటుండగా ఇంకో ట్విస్ట్.. అసంతృప్తితో ఉన్న సుమారు 40 మంది కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారంట.  దీంతో అసలు కుమార స్వామి ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అంటూ ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.. ఇదంతా చూసి 'బీజేపీకి అధికారం దక్కకుండా చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడిలా పదవుల కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ.. బీజేపీకి అవకాశం ఇస్తే ఎలా అంటూ.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.. చూద్దాం మరి ఆ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారో?.. పార్టీ గౌరవం ముఖ్యం అంటూ సైలెంట్ అవుతారో, లేక పదవే ముఖ్యమంటూ కుమార స్వామి కుర్చీకి ఎసరు పెడతారో.

ఈసారి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు పవన్

  ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కి చాలాసార్లు ఎదురైన ప్రశ్న ' స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు?'  .. పవన్ కొన్ని స్పీచులు వింటుంటే సామాన్యులకి కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది.. రాజకీయ విశ్లేషకులు కూడా పవన్, ఎవరో రాసిచ్చిన దాన్ని చదవకుండా ఆ విషయం మీద అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందని అంటుంటారు.. తాజాగా పవన్ మాట్లాడిన తీరు చూసి మళ్ళీ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.. మన శ్రీకాకుళం వ్యక్తి అడిగితే భూములు ఇవ్వలేదు కానీ 'ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ ' అనే వ్యక్తికి లోకేష్ భూములు కట్టబెట్టారని, ఆ భూముల్ని అతను అమ్ముకున్నాడని పవన్ చేసిన ఆరోపణలకి జన సైనికులు సైతం తలలు పట్టుకుంటున్నారు. నిజానికి 'ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్' అనేది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ.. ఈ కంపెనీని ఏపీ కి తీసుకురావడానికి ఐటీ మినిస్టర్ లోకేష్ చాలా కష్టపడ్డారు.. ఆ కష్టానికి ప్రతిఫలమే ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ కంపెనీ వైజాగ్ లో పెట్టడానికి అంగీకరించింది.. దానిలో భాగంగానే ఆ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించింది.. ఆ కేటాయింపులో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి.. కంపెనీ పూర్తిస్థాయిలో ఏర్పడి, ఉద్యోగ హామీలు నెరవేర్చాకే.. ఆ కంపెనీకి భూములు మీద పూర్తిహక్కు వస్తుంది. పవన్ ఇదంతా తెలుసుకోకుండా ప్రభుత్వం మీద ఏదొక ఆరోపణ చేయాలి అన్నట్టుగా.. కంపెనీ పేరుని వ్యక్తి పేరు అనుకోని ఎవరో రాసిచ్చింది ఇలా గుడ్డిగా చదివి నవ్వులపాలు కాకుండా.. అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిదని రాయకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మీరు తాగే నీళ్లలో యురేనియం

  మన దేశంలో సమస్యలకి కొదమేమీ లేదు... నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, రోగాలు, మతకల్లోలాలు అంటూ మన సమస్యల జాబితా చాలా సుదీర్ఘంగా జీవితాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. అందుకేనేమో పర్యావరణం, జీవవైవిధ్యం, భూగర్భజలాలు, అడవుల నరికివేత... లాంటి అంశాల మీద ఎవరూ పెద్దగా దృష్టి సారించరు. అందుకే వాటికి సంబంధించిన చట్టాలు అంత కఠినంగా ఉండవు, ఉన్నా వాటినెవ్వరూ పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇవే మన భవిష్యత్తుని తేల్చే అసలైన సమస్యలు. వాటిని అశ్రద్ధ చేయడం అంటే కూర్చున్న కొమ్మని నిదానంగా నరుక్కుంటూ పోవడమే! ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడెందుకూ అంటే... పర్యావరణానికి సంబంధించిన మరో సమస్య ఇప్పుడు పీకల మీదకు వచ్చింది కాబట్టి! ఈ మధ్యనే విడుదల అయిన ఓ నివేదిక ప్రకారం దేశంలో ఏకంగా 16 రాష్ట్రాలలోని భూగర్భ జలాలలో యురేనియం నిల్వలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. నివేదిక కోసం రాజస్థాన్‌ నుంచి సేకరించిన నమూనాలలో, ఏకంగా మూడో వంతు నీటిలో యురేనియం ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా 26 జిల్లాల నీటిలో యురేనియం శాతం చాలా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. దరిద్రం ఏమిటంటే మన దేశంలో అసలు తాగే నీటిలో యురేనియం ఎంత శాతం ఉండాలో చెప్పే నిబంధనలు కూడా లేవు. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలనే తీసుకోవాల్సి వస్తోంది. మన దేశ భూగర్బంలో యురేనియం శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. కానీ అది ప్రమాకరమైన రీతిలో నీటిలో కలవడం మాత్రం మనషి వల్లే జరుగుతోంది. భూగర్భజలాలను ఎడాపెడా తోడేయడం వల్ల, భూగర్బంలోని రాళ్లు ఎండి వాటిలో ఉండే యురేనియం బయటకి వస్తోందట. ఇది క్రమంగా భూగర్భజలాలను కలుషితం చేస్తోంది. రసాయన ఎరువుల నుంచి వచ్చే పదార్థాల వల్ల కూడా ఈ యురేనియం కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.   అణ్వాయుధాలని తయారుచేయడంలో యురేనియం చాలా అవసరం అన్న విషయాన్ని తరచూ వింటూ ఉంటాం. దాని వల్ల యురేనియం ఓ ప్రమాదకరమైన ఖనిజం అని అర్థం చేసుకోగలం. ఈ యురేనియం కలిసిన నీటిని తాగటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడైపోవడం వాటిలో ఒకటి మాత్రమే! యురేనియం కలిసి నీటితో స్నానం చేసినా కూడా కేన్సర్‌లాంటి సమస్యలూ వస్తాయి. రోజురోజుకీ మన దగ్గర భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో యురేనియం సమస్య మరింత తీవ్రం కానుందని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. కానీ దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయంటే చెప్పడం కష్టమే! తమ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో దొరికే నీటిలో ఏఏ ఖనిజాలు ఉన్నాయో మానిటర్‌ చేయాల్సిన ప్రభుత్వాలు చూసీచూడనట్లే రాజకీయాలలో మునిగిపోతుంటాయి. ఒకవేళ మనమే మనం తాగుతున్న నీటిలో యురేనియం నిల్వల గురించి తెలుసుకోవాలనుకున్నా కష్టమే. కాబట్టి ఓసారి నివేదికలను సరిచూసుకుని, వాటిలో మన ప్రాంతం ప్రస్తావన ఉంటే జాగ్రత్త వహించాలి. ఏ నీరు పడితే ఆ నీరు తాగకుండా రక్షిత మంచినీటి మీదే ఆధారపడాలి. ఆ సౌకర్యం లేని పేదల సంగతేమిటంటారా!!!

ఎన్టీఆర్ లో ఉన్న క్రమశిక్షణ పవన్ లో లేదు

  సినిమాల నుండి ఎవరు రాజకీయాలకి వచ్చినా వారిని, ఎన్టీఆర్ తో పోల్చటం తెలుగువారికి అలవాటు.. కానీ ఎన్టీఆర్ స్థాయికి చేరుకోటం అంత సులువు కాదని అందరికీ తెల్సిన నిజం.. ఇప్పటికే అది రుజువైంది కూడా.. సినిమాల్లో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.. కానీ ఆ పార్టీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్రమంత్రిగా పనిచేసారు.. కొంతకాలం తరువాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. అన్నయ్య చిరంజీవి బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. పవన్ జనసేన పార్టీ స్థాపించి.. 2014 లో టీడీపీ మద్దతిచ్చారు. తరువాత టీడీపీ కి, సినిమాలకి దూరమైన పవన్, 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. దానిలో భాగంగానే ప్రజా యాత్ర చేస్తూ టీడీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.. అయితే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, పవన్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.. తెర వెనక ఎవరో రాసిచ్చింది చదివితే ఉన్న గౌరవం పోతుందని.. పవన్ రాజకీయాల మీద మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలానే ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీస్కోచ్చారు.. నాడు ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తున్న టైములో కొడుకు పెళ్లి జరుగుతున్నా వెళ్లకుండా ప్రజలతో ఉన్నారని.. ఎన్టీఆర్ కి ప్రజలు, ప్రజాసేవే ముఖ్యమని.. అలాంటి క్రమశిక్షణ పవన్ లో కనిపించడం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు.. మరి ఈయన కామెంట్స్ కి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు నాలుగేళ్ళ పాలన

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏపీ పరిస్థితిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి.. ఏపీకి మంచి రాజధాని నిర్మాణం సాధ్యమేనా?.. కంపెనీలు, విదేశీ పెట్టుబడులు వస్తాయా?.. ఏపీ మిగతా రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందుతుందా?.. ఇలా చాలా ప్రశ్నలు ఏపీ ప్రజల్ని వేదించాయి.. ఆ ప్రశ్నల్లో నుండే ఒక సమాధానం వచ్చింది.. ఆ సమాధానమే చంద్రబాబు.. ఇపుడున్న పరిస్థితుల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలివితేటలు, ముందుచూపు ఉన్న చంద్రబాబు, సీఎం అయితే ఏపీ కి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మారు.. గెలిపించారు.. చంద్రబాబు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. ఈ వయస్సులో కూడా ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడూ పరిస్థితులు అనుకూలంగా లేవు.. ఇప్పుడూ అనుకూలంగా లేవు.. అయినా చంద్రబాబు పట్టువదలకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందన్న ఆశతో బాబు, 2014 లో బీజేపీతో నడిచారు.. కానీ బీజేపీ మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీ అంది.. దానికి కూడా బాబు అంగీకరించి నాలుగేళ్లు సహనంతో వేచి చూసారు.. కానీ కేంద్రం ఏపీకి మొండిచెయ్యి చూపడంతో.. బాబు బీజేపీ కి దూరమయ్యారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేకహోదా కోసం బీజేపీతో పోరాడుతున్నారు.. మరోవైపు 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. తరువాత టీడీపీని విభేదించి.. విమర్శలు చేస్తూ.. 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. వైసీపీ కూడా బలమైన ప్రతిపక్షంగా ఉంది.. ఇన్ని ప్రతికూలతలు మధ్య కూడా బాబు ఏ మాత్రం తడబడకుండా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అమరావతిని ప్రపంచంలో ఉన్న గొప్ప రాజధానుల్లో ఒకటిగా నిలుపుతానన్న బాబు.. అన్నట్టుగానే ఆ దిశగా పనులు మొదలుపెట్టారు.. భూసేకరణ చేసి, అద్భుతమైన డిజైన్లు వేయించి పనులు ప్రారంభించారు.. కానీ కేంద్రం నుండి సరైన సహకారం లేక పనులు నెమ్మదిగా సాగుతున్నాయని బాబు ఆరోపణ.. అలానే ప్రతిపక్షాలు కూడా బీజేపీతో కుమ్మక్కై టీడీపీని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బాబు ఆవేదన. ఏదేమైనా ప్రజలు బాబు అభివృద్ధి చేయగలడని నమ్మి ఓటేశారు.. బాబు కూడా దానికి తగ్గట్టే గొప్ప రాజధాని నిర్మాణ ప్రణాళికలు మొదలుపెట్టారు.. అలానే విద్యాసంస్థలు, కంపెనీలు రాష్ట్రానికి తేవడంలో విజయం సాధించారు.. అయితే ప్రభుత్వం మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రజలు బాబు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. రాజకీయ విశ్లేషకులు కూడా 'మళ్ళీ బాబు సీఎం అవ్వడమే కరెక్ట్ అని, ఒకవేళ వేరేవాళ్లు సీఎం అయితే రాజధాని పనులు మళ్ళీ మొదటికొస్తాయనీ.. దానివల్ల ఏపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని' భావిస్తున్నట్టు తెలుస్తుంది...

లోకేష్ సీఎం.. చంద్రబాబు పీఎం ...

  టీడీపీ మీద, బాబు మీద విమర్శలు చేస్తున్న బీజేపీ రోజురోజుకి ఆ విమర్శల డోస్ పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా, ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మరొక్కసారి టీడీపీని, బాబుని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసారు.. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.. అలానే, కేంద్ర పథకాలను టీడీపీ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుంది అంటూ మండిపడ్డారు.. అంతేనా 2014 ఎన్నికల టాపిక్ కూడా తీస్కోచ్చారు వీర్రాజు.. అసలు ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేన వల్లే తెలుగుదేశం గెలిచి అధికారంలోకి వచ్చింది అన్నారు.. అలానే 2019 ఎన్నికల టాపిక్ కూడా తీస్కోచ్చారు.. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని సీఎం చేసి, బాబు పీఎం కావాలని ఆశపడుతున్నారంటూ ఆరోపించారు. మోడీ పీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని.. చంద్రబాబు పీఎం కావాలని ఎప్పుడూ, ఎవరూ కోరుకోలేదని విమర్శించారు.. బాబువి కుట్రపూరిత రాజకీయాలని.. మిత్రపక్షంగా ఉన్నపుడు కూడా బీజేపీ గెలుపుకి ఎప్పుడూ సహకిరించలేదని మండిపడ్డారు.. అలానే కాంగ్రెస్, టీడీపీల పొత్తు గురించి మాట్లాడిన వీర్రాజు.. టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది అందుకే బీజేపీ మీద విమర్శలు చేస్తుందని అన్నారు.. సోము వీర్రాజు విమర్శలకు జవాబుగా కొందరు టీడీపీ నేతలు.. బాబు పీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని.. రాష్ట్ర ప్రయోజాల కోసమే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారట.. అలానే టీడీపీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్న వీర్రాజు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మాటిచ్చిన బీజేపీ.. తరువాత ఆ మాట తప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటే మంచిది అని కొందరు టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారట.