టిడిపి ఎంపి హ‌రికృష్ణ రాజీనామా

  స‌మైక్యాంద్రకు మ‌ద్దతుగా మ‌రో ఎంపి రాజీనామ‌కు సిద్దమ‌య్యారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు ఎన్టీఆర్ త‌ర‌యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. స్పీప‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. గురువారం ఉద‌యం త‌న రాజీనామ ప‌త్రాన్ని చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించనున్నారు. గ‌త కొద్ది రోజులుగా హ‌రికృష్ణ స‌మైక్య వాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. ఇటీవ‌ల రాజ్యస‌భ‌లోనూ విభ‌జ‌న‌పై విరుచుప‌డ్డ హరికృష్ణ ఇప్పుడు రాజీనామ‌కు సిద్దం కావ‌టం చ‌ర్చనీయాంశం అయింది. అయితే హరికృష్ణ రాజీనామ‌తో మ‌రింత మంది నేత‌లు రాజీనామ బాట ప‌ట్టే అవకాశం ఉందంటున్నారు.

ఆశారామ్ బాపుపై లైంగిక దాడి కేసు

  ఇప్పటికే చాలా మంది ఆద్యాత్మిక గురువులు త‌మ శిష్యుల‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నార‌న్న వివాదాలు ఉండ‌టంతో ఇప్పుడు మ‌రో బాబాపై కూడా అలాంటి ఆరోప‌ణ‌లే మొద‌ల‌య్యాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ  తనపై లైంగిక దాడిచేశారంటూ ఓ అమ్మాయి  ఢిల్లీలో కేసు పెట్టింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ ఈ దాడి చేశారంటూ ఆ 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆ బాలిక వైద్య ప‌రీక్షలు చేయించి లైంగిక దాడి జ‌రిగిన‌ట్టుగా నిర్ధారించారు. ఆమె ఆరోపించిన విధంగా ఆశారామ్‌పై ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఉదంతం రాజ‌స్ధాన్‌లో జ‌రిగినందున కేసును అక్కడి బ‌దిలీ చేయ‌నున్నారు. అయితే ఆశారామ్ బాపు శిష్యులు మాత్రం ఈ విష‌యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, ఎవ‌రో కావాల‌నే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని ఆరోపించారు. ద‌ర్యాప్తు పూర్తి అయితే అన్ని నిజాలు తెలుస్తాయ‌న్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. వీటితో పాటు కొంత మంది భ‌క్తుల‌ను మీడియా ప్రతినిధుల‌ను అవ‌మానించిన కేసులు కూడా ఆయ‌న పై ఉన్నాయి. 2008లో ఆశారామ్ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ఇద్దరు విద్యార్ధులు మ‌ర‌ణించ‌టం కూడ అప్పట్లో సంచ‌ల‌న‌మ‌య్యింది.

రాయ‌ల తెలంగాణ అయితే ఓకె

  తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చిన ద‌గ్గర నుంచి స‌మైక్య గానం బ‌లంగా వినిపిస్తున్న ఎం ఐ ఎం పార్టీ నాయ‌కులు ఇప్పుడు కాస్త మెత్తబడ్డట్టుగా క‌నిపిస్తున్నారు. ఇన్నాళ్లు స‌మైక్యాంద్ర త‌ప్ప మ‌రో ఆఫ‌న్ష్ లేద‌న్న ఆ పార్టీ నాయ‌కులు ఇప్పుడు రాయ‌ల తెలంగాణకు కూడా మ‌ద్దతిస్తామంటున్నారు. విభ‌జ‌న ప్రక‌ట‌న‌, సీమాంద్రలో నిర‌స‌నల నేప‌ధ్యంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ బుధవారం సాయంత్రం భేటి అయ్యారు. విభ‌జ‌న అనివార్యం అయిన ప‌క్షంలో రాయ‌ల తెలంగాణ‌కు మ‌ద్దతిస్తామ‌న్నారు. ఇన్నాళ్లు స‌మైక్యం వైపు ఉన్న అస‌ద్ ఇప్పుడు రాయ‌ల తెలంగాణ అన‌టంతో ఢిల్లీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. చ‌ర్చ అంతా హైద‌రాబాద్ చుట్టూ న‌డుస్తుండ‌టంతో, హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన‌ప‌ట్టు ఉన్న అస‌దుద్దీన్, సోనియాతో భేటి కావ‌టం ప్రాదాన్యం సంత‌రించుకుంది. ఈ భూటిలోనే అస‌ద్ త‌న అభిప్రాయాన్ని సోనియాకు చెప్పారు. అయితే తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుండ‌టంతో రాయల తెలంగాణ అంశం మళ్లీ కొత్త వివాదాల‌ను తెర మీద‌కు తీసుకువ‌స్తుంది

ధూళిపాళ్ళ దీక్ష భగ్నంలో విషాదం

      తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర పొన్నూరులో నాలుగు రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేసారు. పార్టీనాయకులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పైచెయ్యయిన పోలీసులకు నరేంద్రను అక్కడి నుండి తరలించే అవకాశం దొరికింది.   నరేంద్రను తరలిస్తున్న సందర్భంలో పోలీసు వాహనం వెనకనే దాన్ని అనుసరిస్తున్న మద్దతుదారుల వాహనం కూడా ముందు వాహనంతో సమానంగా వేగంగా ముందుకు పోతుండగా ఒక లారీని ఢీకొంది.  దానితో అందులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.  ముగ్గురికి గాయాలవగా వారిని హాస్పిటల్ కి చేర్చారు.  ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణ కోడూరు సమీపంలో జరిగింది.  జరిగిన ప్రమాదాన్ని నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్ బెస్ట్..జగన్ వేస్ట్

      మాజీ మంత్రి కొండా సురేఖ జగన్ పై మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. రక్షాబంధన్ సంధర్బంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి విగ్రహానికి రాఖీ కట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి, జగన్ కి చాలా తేడా ఉందని అన్నారు. వైఎస్ ఉన్నప్పుడు తాము ఉన్నత స్థాయిలో ఉంటే, జగన్ కార్యకర్త స్థాయికి దిగజార్చారని ఆమె అనడం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలంగానే తెలంగాణ వచ్చిందని, ఆయన పేరిట స్మృతివనం నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.   తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం మూలంగానే తాను ఆ పార్టీని వీడి బయటకు వచ్చానని, వైఎస్ ను దూషించిన వారు ఆ పార్టీలో చెలామణి అవుతున్నారని, ఆత్మగౌరవం చంపుకోలేక బయటకు వచ్చామని అన్నారు. అయితే వైఎస్ మూలంగా తెలంగాణ వచ్చిందని కొండా సురేఖ అనడం ఆశ్చర్యంగా చింతచచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో.

ధర్మానను విచారిస్తున్న సిబిఐ

      మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు. దిల్ కుశ అతిథి గృహంలో సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ నిన్న ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జ్ ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సిబిఐ విచారిస్తోంది. కాగా, ఇప్పటికే ధర్మాన ప్రసాద రావు పైన సిబిఐ ఒక ఛార్జీషీటు దాఖలు చేసింది. ఆయన సిబిఐ ఎదుట హాజరు కావడం ఇది మూడోసారి.

బాలయ్య కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ డుమ్మా!

      ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే నందమూరి బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాకపోవడం అక్కడ లోటుగా కనిపించింది.వారిద్దరినీ బాలకృష్ణ పిలవలేదని కొందరు అంటుంటే హరికృష్ణకు ఆహ్వానం అందిందని అయితే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవనందున ఆయన రాలేదని, తన తరపున తన మరో కుమారుడు కళ్యాణ్ రామ్ పంపించాడని మరికొందరు అంటున్నారు. ఎన్టీఆర్ – నారా లోకేష్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని, ఇక కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకొన్పప్పుడు మొదలయిన వివాదం సమసిపోలేదని, బాబాయ్.. అబ్బాయ్ లకు అభిప్రాయ భేదాలు వచ్చాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమయినా నందమూరి కుటుంబంలో విభేదాలు అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.

కాంగ్రెస్ ఎత్తుకి తెదేపా, వైకాపాలు చిత్తు

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైకాపా నేత షర్మిల ఇద్దరూ తమ పాదయాత్రలు కొనసాగిస్తు కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని అస్త్రాలు సంధిస్తున్నపుడు, కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. చంద్రబాబు పాదయాత్ర తరువాత తెదేపా మళ్ళీ రెండు ప్రాంతాలలో బాగా పుంజుకొంది కూడా. అయితే, కాంగ్రెస్ పార్టీ వేసిన ఒకే ఒక ఎత్తుతో రెండు పార్టీలు చిత్తయినట్లు కనిపిస్తున్నాయి.   కాంగ్రెస్ పార్టీ ‘రాష్ట్రవిభజన ప్రకటన చేయడంతో వారిద్దరూ ఎంతో శ్రమపడి చేసిన పాదయాత్రలు నిష్ప్రయోజనమయ్యాయి. వైకాపా సమైక్యాంధ్ర టర్న్ తీసుకోవడం వలన షర్మిల తెలంగాణాలో చేసిన పాదయాత్రలు, విజయమ్మ శ్రమ వృధా కాగా, చంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య పరిస్థితులను సైతం లెక్క చేయకుండా చేసిన పాదయాత్ర రాష్ట్ర విభజన ప్రకటనతో నిష్ప్రయోజనమయిపోయింది. కాంగ్రెస్ వేసిన ఎత్తుతో వైకాపా తెలంగాణాను వదులుకోవలసి వస్తే, తెదేపా రెండు ప్రాంతాలలో తన ఉనికిని నిలుపుకోవడానికి ప్రయాస పడవలసి వస్తోంది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా సీమాంధ్ర ప్రాంతంపై పట్టుకోసం తీవ్రంగా శ్రమించడం గమనిస్తే వాటి పరిస్థితి అర్ధం అవుతుంది.

హరికృష్ణ చైతన్య యాత్ర

      రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలని, వారిని విడదీయొద్దని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ చైతన్యయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ తెలుగువారి ఆత్మగౌరవ పతాకాన్ని తలకెత్తుకుని 1982లో ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారు. కేవలం తొమ్మిదినెలలలో రాష్ట్రంలో పాతుకుపోయిన కాంగ్రెస్ పాలనను కూకటివేళ్లతో పెకలించారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందని లేఖలు రాసి నిరసన తెలుపుతున్న హరికృష్ణ తాజాగా చైతన్య యాత్ర చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన అనంతపురం జిల్లా హిందూపురం నుండి ఈ యాత్రను చేపట్టనున్నారని సమాచారం. ఇక ఆయన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా నుండి తెలుగు ఆత్మగౌరవ యాత్రకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ రెండు యాత్రలకు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతారో వేచిచూడాలి.

వైభవంగా బాలయ్య కుమార్తె వివాహం

      ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం ఈ రోజు హైటెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం 8.52గంటలకు వరుడు శ్రీభరత్‌, వధువు తేజస్విని మెడలో మూడుముళ్లు వేసారు. ఈ వివాహం కార్యక్రమాన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. బాలకృష్ణ స్వయంగా అతిధులందరినీ ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పెళ్లికి ఆయన అల్లుడు, నందమూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   వదూవరునలు ఆశీర్వదించేందుకు... కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఎంపీ నామా నాగేశ్వరరావు, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ, మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న, మోత్కుపల్లి నర్సింహులు, ఈనాడు అధినేత రామోజీరావు, కేంద్రమంత్రి చిరంజీవి లతో పాటు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.  

ఆమోదం లేకుండానే ఆహార భద్రత షురూ

  సోనియాగాంధీ మానస పుత్రికగా భావిస్తున్న ప్రతిష్టాత్మక ఆహార భద్రత పథకానికి సోనియాగాంధీ మంగళవారం పచ్చజెండా ఊపారు. రాజీవ్‌గాంధీ జయంతి రోజునే ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు సోనియా. మరే ప్రపంచ దేశాల్లో లేని విధంగా భారత్‌లోనే తొలిసారి ఇలాంటి పథకాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ లోపు బిల్లును ఆమోదింప చేయాలని భావించినా అది కుదరక పోవటంతో అమోదానికి ముందే లాంచనంగా ప్రారంభించేశారు. బొగ్గు కుంభకొణంపై ప్రదాని వివరణ ఇవ్వాలని బిజెపి పట్టుపట్టడంతోపాటు, టీడిపి ఎంపిలు రాష్ట్రవిభజనపై ఆందోళనకు దిగటంతో ఆహార భద్రత బిల్లు పార్లమెంట్‌లో చర్చకు రాలేదు. అందుకే పార్లమెంట్‌ ఆమోదంతో సంబందం లేకుండానే పథకానికి సోనియా శ్రీకారం చుట్టారు. నిరుపేద మహిళలకు ఆహార ధాన్యాల ప్యాకెట్లు, ఆధార్ ఆధారిత స్మార్ట్‌కార్డ్‌లను అందజేశారు. ఈ పథకం ద్వారా దేశంలోని 125 కోట్ల ప్రజలలో 80 కోట్ల మందికి తక్కువ ధరలకే ఆహార ధాన్యాలు అందుతాయని, నగరాల్లోని ప్రజలల్లో కూడా ఎక్కువ శాతం మంది లభ్ది పొందుతారన్నారు. ఇలాంటి పథకం అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్‌ పార్టీ గర్విస్తుందన్నారు.

ఆంటోని కమిటీని కలిసిన సీమాంద్ర నాయకులు

  రాష్ట్ర విభజన విషయంలో ఆంటోని కమిటీని కలిసి సీమాంద్ర ప్రాంత నాయకులు మరోసారి తమ అభిప్రాయాలను కమిటీ ముందుంచారు. రాష్ట్రవిభజన వల్ల సమస్యలు తీరక పోగా పార్టీకి రాష్ట్రానికి కొత్త సమస్యలు తలెత్తుతాయని వారు కమిటీకి నివేదించారు. ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు విభజన వల్ల విద్య, వైద్య, ఉపాది కల్సన, హైదరాబాద్‌ లాంటి విషయాల్లో తలెత్తే వివాదాలను కూడా కమిటీతో చర్చించామన్నారు. నీటి సమస్యలను తరువాత పరిష్కరించుకోవచ్చన్న వాదనను తొసి పుచ్చారు. ఈ భేటిలొ సీమాంద్ర మంత్రులతో పాటు ఎంపిలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. జెసి దివాకర్‌రెడ్డి మాత్రం రాయల్‌ తెలంగాణ అంశాన్ని ప్రస్దావించారు. విభజన అనివార్యమౌన పక్షంలో రాయలతెలంగాణనే ఇవ్వండని ప్రతిపాదించారు. కమిటీ సభ్యులను రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు.

వీర‌ప్పమొయిలీతో రాముల‌మ్మ భేటి

  టిఆర్ఎస్ బ‌హిష్కృత‌నేత మెద‌క్ ఎంపి విజ‌య‌శాంతి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప‌లువురు నేత‌ల‌తో సంప్రదింపులు జ‌రిపిన ఆమె తాజాగా వీర‌ప్పమొయిలితో భేటి అయ్యారు. మెద‌క్ సీటు వ‌ద్దే టిఆర్ఎస్ పార్టీకి దూరం అయిన విజ‌య‌శాంతికి కాంగ్రెస్ పెద్దలు అదే సీటుకు హామి ఇచ్చిన‌ట్టుగా ప్రచారం జ‌రుగుతుంది. విజ‌య‌శాంతి క‌లిసి దిగ్విజ‌య్‌సింగ్‌తో భేటి అయిన ర‌ఘునంద‌న్ ఇప్పటికే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. గ‌తంలో విజ‌య‌శాంతి ఇంట్లో 80ల‌క్షల రూపాయ‌ల సెటిల్‌మెంట్ జ‌రిగింద‌ని ఆరోపించిన ర‌ఘునంద‌న్ ఇప్పుడు విజ‌య‌శాంతితో క‌లిసి కాంగ్రెస్ నేత‌ల‌ను క‌ల‌వ‌టం చ‌ర్చనీయాంశంమ‌యింది. గ‌తంలో ర‌ఘునంద‌న్ చేసిన ఆరోప‌ణల వెనుక కూడా విజ‌య‌శాంతి ఉన్నార‌న్న ఆరోప‌ణ ఉంది.

కాంగ్రెస్ గూటికి టిఆర్ఎస్ నాయ‌కులు

  టిఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రక‌ట‌న చేసిన ద‌గ్గర నుంచి అయోమ‌యంలో ప‌డిన టిఆర్ఎస్ నాయ‌కుల‌కు ప్రస్థుత ప‌రిణామ‌లు మింగుడుప‌డ‌టం లేదు. ఆ పార్టీ నేత‌లు మాజీ మంత్రులు విజ‌య‌రామారావు, చంద్రశేఖ‌ర్‌ల‌తొ పాటు టిఆర్ ఎస్ పార్టీ బ‌హిష్కృత నేత రఘునంద‌న్‌రావులు మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్‌సింగ్ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేర‌డానికి ముందు ఈ నాయ‌కులు ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో స‌మావవేశం అయి చ‌ర్చలు జ‌రిపారు. త‌రువాత దిగ్విజ‌య్‌సింగ్ నివాసానికి చేరిన టిఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింద‌ని తెలంగాణ ప్రజ‌లు కాంగ్రెస్ పార్టీకి రుణ‌ప‌డి ఉంటార‌ని అన్నారు.అలాగే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించిన కె. చంద్రశేఖరరావు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారన్నారు.

ఉభ‌య స‌భ‌లు గురువారానికి వాయిదా

  బొగ్గు గ‌నుల కేటాయింపు కుంభ‌కోణానికి సంభందించి గొడ‌వ‌తో ఉభ‌య స‌భ‌లు గురువారానికి వాయిదా ప‌డ్డాయి.బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో.. ఆ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటన చేయాలని బీజేపీ  గట్టిగా డిమాండ్ చేస్తూ పదే పదే సభను అడ్డుకుంది దీంతో స‌భ ఉద‌యం నుంచి ప‌లుమార్లు వాయిదా ప‌డింది. త‌రువాత కూడా ప‌రిస్థితి స‌ర్ధుకోక‌పోవడంతో  చివరకు గురువారానికి వాయిదా పడింది. బొగ్గు కుంభ‌కోణంలో క‌న‌ప‌డ‌కుండా పోయిన ప‌త్రాల్లో కాంగ్రెస్ నాయ‌కుల పేర్లు ఉన్నాయ‌ని ఆరోపించిన బిజెపి ప్రదాని లోక్‌స‌భ‌కు వ‌చ్చి స‌మాదానం చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ఈ విష‌యం పై మాట్లాడిన సుష్మాస్వరాజ్ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్వయంగా ప్రదానిని తీసుకువ‌చ్చి ఈ అంశంపై వివ‌ర‌ణ ఇప్పించాల‌ని కోరారు. బీజేపీ, జేడీయూ, శివసేన సహా మొత్తం ఎన్డీయే సభ్యులంతా ఈ అంశంపై ప‌ట్టుబట్టి సభను స్తంభింపజేశారు. అదే స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తించగా, సీపీఎం సభ్యులు ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో మూడుసార్లు వాయిదా ప‌డిన స‌భ‌,  బుధవారం రాఖీ సందర్భంగా సభకు సెలవు కావ‌టంతో చివరకు గురువారానికి వాయిదా పడింది.

వైఎస్ఆర్.కాంగ్రెస్ ఊసరవెల్లి

      ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న దీక్ష వీధి నాటకాన్ని తలపిస్తోందని పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశంలో వైసీపీ సానుకూలంగా మాట్లాడడంతోనే నిర్ణయం వచ్చిందని ఆయన అన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే వైసీపీ నేతలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని బొత్స ఆరోపించారు.   తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2008లో లేఖ ఇచ్చినప్పుడు కమిటీ ప్రజల అభిప్రాయాలు అడగలేదా అంటూ బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ చూస్తోందని, అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని బొత్స స్పష్టం చేశారు.

సియం కిర‌ణ్ ద‌ద్దమ్మ

  స‌మైక్య వాదుల‌పై కె సి ఆర్ త‌న‌యుడు కెటిఆర్ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌కు అండ‌గా ఉంటున్నార‌న్న నెపంతో సియం కిర‌ణ్‌కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి కావూరి సాంబ‌శివ‌రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుల‌పై తీవ్రవిమ‌ర్శలు చేశారు. కెసిఆర్ బ‌హిరంగ స‌వాల్ విసిరితే దానికి క‌నీసం స్పందించ‌ని కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఓ దద్దమ్మ అన్నారు. తెలంగాణ విభ‌జ‌న‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్రక‌టించిన చంద్రబాబు ఇప్పుడు డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు కెటిఆర్‌. త‌ను గ‌తంలో తీసుకున్న నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉన్నట్లయితే హరికృష్ణ, ప‌య్యావుల కేశ‌వుల‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌న్నారు. హైద‌రాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాల‌న్న కావూరి వ్యాఖ్యల‌పై స్పందిస్తూ హైద‌రాబాద్ పై పేచీ పెడితే స‌హించ‌మ‌న్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ త‌న ఇం టి అంశం గా చూస్తుంద‌ని, హైద‌రాబాద్ కావూరి లాంటి వాళ్ల జాగీర్ కాద‌న్నారు. సీమాంద్ర ప్రాంతం వారు క‌లిసి ఉండాలంటున్నారు కానీ తెలంగాణ భ‌క్తుల‌ను ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్రశ్నించారు.

బాబు ఆత్మగౌరవ యాత్ర

      విభజన విషయంలో ఎంపీ హరికృష్ణ వైఖరి ఎలా ఉన్నా ..పార్టీలోని సమైక్య నేతలు ఏం మాట్లాడినా చివరకు నేను చెప్పింది మాత్రమే ఫైనల్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. త్వరలోనే తాను తెలుగు ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానని, తెలుగు జాతి విధ్వంసాన్ని అరికడతానని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య అనుబంధాలు పెంపొందేలా చేయాలి తప్ప విద్వేషాలు పెంచడం సరికాదని ఆయన అన్నారు.   కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఇరు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి రెచ్చగొడ్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన ద్వారా ఇరుప్రాంతాలలో ఓట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుందని, ప్రత్యేక మయిన పరిస్థితుల్లో తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా సీడబ్లూసీ నిర్ణయం తీసుకోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 25న లేదా  ఈ నెల 29న ఆత్మగౌరవ యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు.