Raghupathi Venkaiah Naidu

సౌత్‌ సినీ పితామహుడికి గుర్తింపేది..?

        భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరుపుకుంటున్న శుభ తరుణంలో భారత రాష్ట్రపతి సాక్షిగా దక్షిణ భారత సినిమాకు అవమానం జరిగింది..   ఇండియన్‌ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా భారత ప్రభుత్వం 50 మంది సినీ ప్రముఖుల స్టాంపులను విడుదల చేసింది.. అందులో ముగ్గురు తెలుగు వారికి కూడా స్థానం లభించటం గర్వకారణమే.. కాని దక్షిణా భారత సినిమా పితామహుడు పేరుగడించిన మహానుభావుడు.. తొలి థియేటర్‌ నిర్మాత అయిన రఘుపతి వెంకయ్యకు ఆ గౌరవం దక్కకపోవటం మాత్రం బాధాకరం..         తెలుగు నుంచి అల్లురామలింగయ్య, భానుమతి రామకృష్ణ, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖుల స్టాంపులను విడుదల చేశారు.. వీరు అందుకు అర్హులే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. కాని వీరికన్నా ముందే తెలుగు వారి కీర్తి ఇతర దేశాల్లో కూడా చాటి చెప్పిన రఘుపతి వెంకయ్య గారిని గుర్తించకపోవటానికి కారణం ఏంటి..?         ఆయన భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను 1981లో ఆయన పేరిట రఘుపతి వెంకయ్య అవార్డును నెలకొల్పిన ప్రభుత్వం ఈ వందేళ్ల సంబరాల్లో మాత్రం ఆయన్ను ఎందుకు చిన్న చూపు చూసింది..?         1906లో క్రోనోమెగాఫోన్‌ అనే ప్రొజెక్టర్‌ను 30వేల రూపాయల ఖర్చుతో కొని ఇతర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చిన ఆయన.., తరువాత పూర్తి స్థాయి థియేటర్‌ను నిర్మించిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. 1912లోనే చెన్నై మౌంట్‌ రోడ్‌లో ఆయన నిర్మించిన గైటీ థియేటర్‌ దేశంలోనే తొలి పూర్తి స్థాయి థియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాదు రెండో ప్రయత్నంగా క్రౌన్‌ థియేటర్‌ను నిర్మించిన ఘనత కూడా ఆయనదే.         ప్రస్థుతం స్టాంపుపై ముద్రితమవుతున్న తెలుగు వారిలో అల్లు రామలింగయ్య, భానుమతి రామకృష్ణలు ఇద్దరు గతంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న వారే.. అలాంటిది ఆ మహానుభావుడికి ఈ భారతీయ సినిమా వందేళ్ల సంబరాల్లో సముచిత స్థానం దక్కకపోవటం చాలా బాధాకరం..  

upa government

బరి తెగించిన యుపీయే ప్రభుత్వం

  కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి దినదినగండం నూరేళ్ళ ఆయుషులా ఉంది. పాముల పుట్టలోంచి పాములు బయటకి వస్తున్నట్లు రోజుకొక కుంభకోణం బయటపడుతోంది. ఇది చాలదన్నట్లు బయటపడుతున్నఆ కుంభకోణాల ప్రభావం తమ పార్టీపై, ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు, దాని తీవ్రత తగ్గించే ప్రయత్నంలో సీబీఐ రిపోర్టులను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించిన విషయాన్నినిన్నసీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా స్వయంగా సుప్రీంకోర్టులో బయటపెట్టారు. అటువంటిదేమి జరుగలేదని ఇంతవరకు భుకాయిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రంజిత్ సిన్హా కోర్టుకి వ్రాతపూర్వకంగా సమర్పించిన ఎఫిడవిట్ తో ఇబ్బందుల్లో పడింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నిజాయితీగా తప్పు ఒప్పుకోవడం కానీ, తప్పు చేసిన మంత్రులను, అధికారులను తొలగించడం గానీ చేయలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వాటికిదొక జబ్బుగా మారిపోయిందని కాంగ్రెస్ అనడం చూస్తే, అది ఎంత బరి తెగించిందో అర్ధం అవుతుంది.   దేశాన్నినడిపిస్తున్న ప్రభుత్వం యావత్ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నపార్లమెంటుకు జవాబు చెప్పనవసరం లేదనే భావన వ్యక్తం చేస్తోంది. అవినీతిని అరికట్టవలసిన సీబీఐని జేబు సంస్థగా మార్చేసుకొని, చివరికి అది తయారు చేసిన రిపోర్టులను కూడా చక్కబెట్టే స్థాయికి కాంగ్రెస్ ఎదిగిపోయింది. ఇక, ప్రభుత్వం సీబీఐ రెండూ కూడా అడ్డుదారులు తొక్కుతున్నపుడు, వాటిని ఇక నియత్రించ గల ఏకైక వ్యవస్థ న్యాయవ్యవస్థే. అయితే దానిని కూడా ప్రభుత్వం ప్రవితం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల ప్రధానమంత్రి చేసిన వ్యాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.   ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ తన పరిధికి లోబడి పనిచేయాలని, అది మరో రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోకి చొరబడే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. గతంలో శేషన్ వంటి శక్తివంతుడయిన ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎన్నికల సమయంలో అక్రమాలకు కళ్ళెం వేసినప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడింది. దానితో ఏకసభ్య కమీషన్ గా ఉన్న ఎన్నికల కమీషన్ను త్రిసభ్య కమీషన్ గా మార్చిఅందులో తనకనుకూలమయిన అధికారులను నియమించుకొని, ప్రధాన ఎన్నికల కమీషనర్ అధికారాలకు కత్తెర వేసింది.   ప్రస్తుతం సుప్రీంకోర్టుచేత రోజు మొట్టికాయలు వేయించుకోవడం అలవాటుగా మారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు దీనికి కూడా విరుగుడుగా ఉపాయాలు ఆలోచిస్తోంది. ప్రధానమంత్రి న్యాయవ్యవస్థను హెచ్చరించడమే అందుకు తొలి సంకేతంగా భావించవచ్చును. ప్రభుత్వానికి కాగ్ నివేదికలంటే కొందరు పనిలేనివాళ్ళు సృష్టించిన చెత్త కాగితాలతో సమానం. కాగ్  సీబీఐ నివేదికలను ఖాతరు చేయని ప్రభుత్వం, పార్లమెంటుకు కూడా తానూ  జవాబుదారీ కాదని భావిస్తోంది.   ఇప్పుడు అది సుప్రీం కోర్టు కూడా తన అవినీతి వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని కోరుకొంటున్నట్లు, ప్రధాని వ్యాక్యాలతో స్పష్టం అయింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు తన హెచ్చరికలను ఖాతరు చేయకపోతే, అప్పుడు ఎన్నికల కమీషనర్ అధికార్లను కత్తెరించినట్లే న్యాయవ్యవస్థ అధికారాలను కూడా కత్తిరించే ప్రయత్నం తప్పక చేస్తుంది. కాంగ్రెస్ కనుక ఈ ప్రయత్నంలో సఫలం అయితే ఇక మన దేశ వ్యవస్థలన్నీ కూడా ఒక దాని తరువాత మరొకటి పేక మేడల్లా కుప్పకూలడం తధ్యం.

lakshmi parvathi

లక్ష్మీ పార్వతి అంతర్యం ఏమిటి?

  రేపు పార్లమెంటు ప్రాంగణంలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనున్న తరుణంలో, తనకు ఆహ్వానం పంపలేదని లక్ష్మీ పార్వతి ఆవేదన చెందడం సహజమే. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆమె స్వర్గీయ యన్టీఆర్ భార్య అనేది ఎవరూ కాదనలేని నిజం. అటువంటప్పుడు ఆమె తన భర్త విగ్రహావిష్కరణకు ఆహ్వానం కోరుకోవడంలో అసహజమేమి కాదు, కానీ దురదృష్టవశాత్తు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల ఆమె ఆక్రోశానికి అర్ధం ఉందని చెప్పక తప్పదు. అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆమెను తమ తల్లి స్థానంలో ఊహించుకోవడానికి ఇష్టపడట్లేదనే సంగతిని వారు మొదటి నుండి కూడా చాలా స్పష్టంగానే తెలియజేస్తున్నారు. అటువంటప్పుడు ఆమె కూడా వారి ప్రసక్తి తేకుండా తన జీవితం గురించి ఆలోచించుకొని ఉండాల్సింది. కానీ, రాజకీయంగా చైతన్య వంతురాలయిన ఆమె తన ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో పదేపదే యన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఒకసారి చంద్రబాబు మీద, మరొకసారి నందమూరి కుటుంబ సభ్యుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఆవిధంగా వ్యవహరించడం వలన మీడియాలో గుర్తింపు పొందగలిగారు కూడా. కానీ, అదే సమయంలో ఆమెను నందమూరి కుటుంభ సభ్యులు మరింత అసహ్యించుకొనేలాచేసింది. ఆ విషయం ఆమె కూడా బాగానే గ్రహించగలిగినప్పటికీ ఆమె తన ఉనికిని కాపాడుకోవాలంటే వేరే దారిలేదు గనుక తన ధోరణిలోతను ముందుకు సాగిపోతున్నారు.   నటీనటులు సినిమా జీవితానికి, ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపుకు అలవాటు పడితే దానికి దూరంగా ఉండలేనట్లే, ప్రజా జీవితానికి అలవాటుపడిన రాజకీయ నాయకులు కూడా, ఏ గుర్తింపుకు నోచుకోని సామాన్య జీవితం ఊహించుకోలేరు. లక్ష్మీ పార్వతి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండటంచేత, ఆమె తన ‘యన్టీఆర్ భార్య హోదా’ను పదేపదే ప్రస్తావిస్తూ, నందమూరి కుటుంబ సభ్యులను, చంద్రబాబును తరచూ విమర్శిస్తూ మీడియాను, ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.   ఆమె సమాజం నుండి గుర్తింపు, గౌరవం ఆశిస్తే, సమాజం తద్విరుద్ధంగా ప్రతిస్పందిస్తోంది. తద్వారా ఆమె తనకు తానూగానే సమాజంలో వ్యతిరేఖభావనలు సృష్టించుకొంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం కనబరుస్తున్న ‘అతిస్పందన’ సమాజంలో ఆమె పట్ల వ్యతిరేఖ భావనలు కలిగిస్తోంది.   సోనియా గాంధీకి, మీరా కుమార్ కి, పురందేశ్వరికి తన నిరసన తెలియజేస్తూ లేఖలు వ్రాస్తానని చెప్పిన ఆమె, మళ్ళీ అంతలోనే తనకు రేపటిలోగా ఆహ్వానం పంపకపోతే పురందేశ్వరిని, మీరా కుమార్ ని కోర్టుకు ఈడుస్తానని బెదిరించడం, పురందేశ్వరే స్వయంగా చంద్రబాబు వెనుక ఉంది తన తండ్రికి వెన్నుపోటు పొడిపించిందని ఆరోపానాలు చేయడంతో, ప్రజలకి ఆమె పట్ల కలిగిన సానుభూతి కాస్తా ఆవిరయిపోవడమే కాకుండా ఇప్పుడు విమర్శలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది.   రాజకీయ చైతన్యవంతురాలయిన ఆమె తదనుగుణంగా పయనిస్తే అప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందగలరు. కానీ ఎల్లకాలం ఇదే సూత్రం నమ్ముకొని ఉనంత కాలం ఆమె పరిస్థితుల్లో కానీ, ఆమె పట్ల సమాజ ప్రతిస్పందనలో గానీ పెద్దగా మార్పులు రావు.

 Kudankulam project is safe

కూడంకుళం ప్రాజెక్ట్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

        కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంకు సుప్రీంకోర్టు ఓకె చెప్పింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీల నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్కడాలేవని న్యాయస్థానం తెలిపింది. చేపట్టవలసిన 17 భద్రతా చర్యల్లో ఇప్పటికే 12 అమలు చేశారని, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా అణు విద్యుత్ అవసరం ఎంతైనా ఉందని, ఇతర విద్యుత్‌లతో పోలిస్తే అణు విద్యుత్ చాలా చౌక అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని కొనసాగించవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకారులు, స్వచ్ఛంద సంస్థలు స్టే కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ వేగవంతంగా జరిగింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్ణ, దీపక్ మిశ్రాల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అణు విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ ఆందోళనలు తీవ్రతరం కావటంతో ఈ వివాదం కోర్టు కెక్కింది.

 jagan bail

జగన్ బెయిల్ కి అనర్హుడు: సిబిఐ

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచింది. జగన్ బెయిల్‌కు అనర్హుడని, విచారణ కీలక దశలో ఉన్న సమయంలో జగన్ బయటకు వస్తే విచారణ సవ్యంగా జరగదని, ఇతర దేశాల నుంచి వచ్చిన పెట్టుబడులపై విచారణ చేయాల్సి ఉందని సీబీఐ తరఫు న్యాయవాది అశోక్‌భాన్ తెలిపారు. జగన్ బెయిల్‌ను ఆర్థిక నేరంగా పరిగణించాలని, బెయిల్ ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని అశోక్‌భాన్ కోర్టులో వాదించారు. విచారణ ఇంకా 4, 5 నెలల్లో పూర్తి అవుతుందని న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. ఏడు అంశాల్లో జగన్‌ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. దర్యాఫ్తు పూర్తయినందున జగన్ కుబెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే వాదించారు. జగన్ ఎక్కడకు పారిపోరని, ఎన్నికలు వస్తున్నందున పార్టీని సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.  

 NTR statue in parliament

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు చంద్రబాబు

      పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు సైతం పాల్గొంటారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావల్సిందిగా చంద్రబాబు నాయుడుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ ఎంపీలు ఈ రోజు స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాబుకు ఆహ్వానం పంపకపోవడంపై తాము తీవ్ర మనస్తాపం చెందామని అన్నారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆహ్వాన లేఖను చంద్రబాబుకు నివాసానికి పంపించారని, దానిని వారు తిరస్కరించారని, తర్వాత టిడిపి భవన్‌కు పంపినట్లు ఆమె చెప్పారని స్పీకర్ తెలిపినట్లు సమాచారం.

 Konatala

దొంగల పార్టీలో దాడి ఎలా చేరతారు: కొణతాల

      దాడి వీరభద్రరావుపై వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కొణతాల లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దాడి వీరభద్రరావు క్యారెక్టర్‌లేని మనిషి. ఆయన రాకతో వైసీపీ సర్వనాశనం అవుతుంది. "టీడీపీ అధికారంలో ఉండగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. కొణతాల రామకృష్ణ ఏనాడూ పదవులకోసం పాకులాడలేదు. 2009లో ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ వైఎస్ పదవి ఇస్తానన్నప్పటికీ... సున్నితంగా తిరస్కరించారు. కానీ దాడి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసి 24 గంటలు గడవకముందే జగన్ వద్దకు వెళ్లి పదవికోసం బేరం పెట్టారు'' అని విరుచుకుపడ్డారు. దాడి అనుచరులంతా టీడీపీలోనే ఉన్నారని... ఆయన అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలతో రాజకీయాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీని దొంగల పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్శించిన దాడి వీరభద్రరావు ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా చేరతారని ప్రశ్నించారు.

hero ram charan

రామ్ చరణ్ తప్పించుకున్నాడు

        పదవుల్లో ఉండేది మనవాళ్లే అయితే తప్పు మనదైనా తప్పించుకోవచ్చు. ఇది మరోసారి మీడియా సాక్షిగా రుజువైంది. ఈ మధ్యాహ్నం వీకెండ్ మూడ్ లో రాంచరణ్ బంజారాహిల్స్ లో తన ఆస్టిన్ మార్టిన్ కారుతో విహరిస్తున్నారు. పాపం కోట్ల రూపాయల విలువైన సారు కారు కదా.. బుల్లి ఆల్టో అడ్డమొస్తే కోపం రాదా.. అలాగే వచ్చింది. అంతే ఆస్టిన్ మార్టిన్ అడ్డమొచ్చినందుకు పాపం ఆ వ్యక్తి హీరో చేతిలో తన్నులే తినాల్సి వచ్చింది. హీరో అయితే మాత్రం నన్ను కొట్టేస్తాడా అంటూ ఆ బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తీరా రెండు గంటల్లో గల్లీ నుంచి డ్రామా ఢిల్లీ చేరి అక్కడ్నుంచి రివర్సులో బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో ముగిసింది. తండ్రేమో కేంద్రమంత్రి, మామ పారిశ్రామిక వేత్త… మరి ఈ చిన్న కేసును కూడా మేనేజ్ చేయలేకపోతే ఇక పదవులెందుకు? పవరెందుకు? అంతే… మూడు నాలుగు ఫోన్ కాల్స్ కాసింత క్యాష్ తో పనైపోయింది.

konda surekha

మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరనున్న కొండా దంపతులు

  దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ పట్ల, కొండా సురేఖ దంపతులకు ఉన్న అభిమానం విశ్వాసం వలననే, వారిరువురూ మరోఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచిన సంగతి అందరికీ తెలుసు. వారిరువురి కృషి మూలంగానే పార్టీకి తెలంగాణాలో బలమయిన పునాదులు ఏర్పాడాయి. అందుకు వారిరువుకి పార్టీలోమరింత ప్రాదాన్యత నిచ్చి కీలక బాధ్యతలు అప్పగించకపోగా, తెలంగాణాలో పార్టీ కొంచెం బలం పుంజుకొన్నాక ఏరు దాటినా తరువాత తెప్ప తగలేసినట్లుగా, ఇక వారి అవసరం తమకు లేదనే విధంగా వ్యవహరించడం మొదలుపెట్టారు.   జగన్ మోహన్ రెడ్డికి స్వయంగా చిన్నానయిన వైవీ.సుబ్బారెడ్డి నేతృత్వంలోవారికి వ్యతిరేఖంగా ఒక బలమయిన వర్గం ఏర్పాటు అవడం, జిల్లా రాజకీయాలలో పార్టీకి సంబంధించినంత వరకు కొండా దంపతుల ప్రమేయం లేకుండా నియామకాలు,కార్యక్రమాలు ఆ వర్గం వారు చేపట్టడంతో, కొండా దంపతులు కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం జగన్ మోహన్ రెడ్డి అయినా తమ ఆవేదనను పట్టించుకొంటారని ఆశించిన వారికి అక్కడా నిరాశే మిగిలింది.   పరకాల ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కొండసురేఖ తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని జగన్ మోహన్ రెడ్డికి మోర పెట్టుకొన్నపుడు, ఆయన కనీసం ఆమెపై సానుభూతి కూడా చూపకపోవడంతో, వారికి పార్టీలో తమ స్థానం ఏమిటో స్పష్టంగా అర్ధం అయింది. ఎవరి కోసం తమ సర్వస్వం త్యాగం చేసి వచ్చామో వారికే తమపట్ల ఆదరణ, అభిమానం లేన్నపుడు ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏమిటని వారు వాపోయారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన తమకి పార్టీలో గౌరవం లేకుండా పోవడంతో కొండా సురేఖ దంపతులు తమ రాజకీయ భవితవ్యం గురించి ఆలోచనలో పడ్డారు.   పార్టీలో క్రమంగా పెరుగుతున్న కులవివక్షను తట్టుకోవడం కూడా వారికి కష్టంగా మారడంతో, వారు తొలుత తెరాస వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. కానీ, తెరాస ఆమెకోరిన విధంగా పరకాల నుండి కాక భూపాల్‌పల్లి నియోజక వర్గం నుండి టికెట్ ఈయగలమని చెప్పడంతో సురేఖ దంపతులు వెనక్కి తగ్గారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి, ఆప్తుడయిన మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీలోకి చేరవలసిందిగా ఆహ్వానించడంతో వారు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.   ఇంత వరకు వారిని నిర్లక్ష్యం చేసిన జగన్ మోహన్ రెడ్డి, వారు త్వరలో పార్టీ వీడనున్నారని తెలియగానే, వారిని సముదాయించేందుకు తన అనుచరుల ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, కొండా దంపతులు మాత్రం పార్టీని వీడేందుకే నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. బహుశః వచ్చే వారం రోజుల్లోగా వారు తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

 ram charan

యువకుడిని కొట్టిన రామ్‌ చరణ్

        కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ ఈ రోజు ఓ యువకునిపై చేయి చేసుకున్నట్లు తెలియవచ్చింది. బంజార్‌హిల్స్ సిటీ సెంటర్ వద్ద రామ్ చరణ్ కారును ఇద్దరు యువకులు దాటి వెళ్ళారని, మా కారునే ఓవర్‌టేక్ చేస్తారా అంటూ వారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఒక యువకుని చొక్కా చిరిగి, గాయాలయ్యాయి. రామ్ సెక్యూరిటీ కూడా వారిపై దాడి చేసినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేపు సమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు యువకులు మీడియాకు తెలిపారు. తాము ఏ తప్పు చేయలేదని, ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని వారు పేర్కొన్నట్లు తెలియవచ్చింది. అది రామ్ చరణ్ కారని తమకు తెలియదని, అనవసరంగా తమపై దాడి చేశారని వారు తెలిపారు.

karnataka elections

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు

  నేడు కర్ణాటకలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మరో మూడు రోజుల తరువాత ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూల వాతావరణం కనబడుతోంది. కానీ, కేంద్రంలో వరుసపెట్టి బయటపడుతున్న కుంభ కోణాలు ఆ సానుకూల పరిస్థితిని తారుమారు చేసినా చేయవచ్చును. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన మోడీ, అద్వానీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ విజయావకాశాలను తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అయ్యాయో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.   ఇక, కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాదిస్తే, అదే ఊపులో పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలున్నాయి. అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయి.   ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి విడుదలయ్యే పరిస్థితి లేదు గనుక బలహీనంగా ఉన్న ఆ పార్టీని ఇటువంటప్పుడే ఎదుర్కోవడం చాలా తేలికని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక తెలంగాణా ఉద్యమాలు పూర్తిగా చల్లారిపోవడంతో తెలంగాణా జిల్లాలలో ప్రజలు కేసీఆర్ పై నమ్మకం కోల్పోయి ఉన్నారు. గనుక సందిగ్ధంలో ఉన్న వారి ఓట్లు కొల్లగొట్టేందుకు ఇదే మంచి తరుణమని కాంగ్రెస్ భావిస్తోంది.   ఇతర పార్టీల నేతల చుట్టూ తిరుగుతున్న కేసీఆర్, తెరాసలో పోటీ చేసేందుకు బలమయిన అభ్యర్ధులు లేరనే విషయాన్నీ స్వయంగా చాటింపు వేసుకొన్నట్లు అయింది. అందువల్ల తెరాసను ఇటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నపుడే ఓడించడం సులువవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక,   చంద్రబాబు పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొంచెం బలం పుంజుకొన్నపటికీ, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోలేదని కాంగ్రెస్ భావిస్తోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేఖ వైఖరి స్పష్టంగా కనబడుతున్నపటికీ, సర్వే రిపోర్టులు కూడా పార్టీకి వ్యతిరేఖంగా ఉన్నపటికీ, ప్రతిపక్షాల బలహీనంగా ఉన్న ఈ సమయంలోనే ముందస్తు ఎన్నికలకి వెళ్ళినట్లయితే పార్టీకి కొంతలో కొంతయినా మేలు కలుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, ముటా తగాదాలు ఆ పార్టీకి కొత్తేమి కాదు గనుక, మున్ముందు మరిన్ని కుంభకోణాలు బయటపడక ముందే, ఈ మాత్రం సానుకూలంగా ఉన్న తరుణంలో ఎన్నికలకి వెళ్ళడమే మేలని కాంగ్రెస్ భావిస్తోంది.   కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక భారీ మెజార్టీ తో విజయం సాదిస్తే బహుశః ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచన చేయవచ్చును.

ramachandrayya

చిరంజీవి భజనలో తరిస్తున్న దేవాదాయ శాఖా మంత్రి

  మన మంత్రులకి పాలనా వ్యవహారాలూ చూసుకొనే తీరిక, ఆసక్తి లేకపోయినా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకి, శంకు స్థాపనలు చేయడానికి, స్వంత వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి మాత్రం మంచి ఆసక్తి కనబరుస్తారు. నిన్న విశాఖలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి విశాఖ-భీమిలి బీచ్ కారిడార్ పనులకు శంకు స్థాపన చేసినప్పుడు బొత్స శ్రీనివాస రావు, టీ.సుబ్బిరామి రెడ్డి, ద్రోణంరాజు మరియు ఆయన అనుచరులయిన మంత్రులు గంట శ్రీనివాస రావు, రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరయిన మంత్రులందరూ వారికి అబిరుచి ఉన్న విషయాలపై అంటే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్టానంతో తనకున్న సంబందాల గురించి, బొత్ససత్యనారాయణ జగన్, చంద్రబాబుల గురించి మాట్లాడితే, చిరంజీవి భజనమండలిలో ప్రధాన సభ్యుడయిన దేవాదాయ శాఖా మంత్రి రామచంద్రయ్య ఈ వేదిక మీద ఉన్నవారికి బాధ కలిగించే విషయం చెపుతున్నానంటూ “చిరంజీవి గారు! ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ మీ వైపే చూస్తున్నారు. మీరూ బొత్స కలిసి రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు కోరుకొంటున్నారు,” అని అన్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో తప్పుకొంటే లేదా తప్పించబడితే వారిరువు కలిసి రాష్ట్రాన్ని ఏలాలన్నమాట. వారిలో ఏ ఒక్కరూ కూడా ఈ బీచ్ కారిడార్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కానీ, దాని రూపు రేఖల గురించి గానీ ప్రస్తావించలేదు. ఎవరి గోల వారిదే నన్నమాట!

ABK Prasad

తెలంగాణ అసాధ్యం!

  - ఎబికె ప్రసాద్ {సీనియర్ సంపాదకులు]     తెలుగుజాతిని విచ్చిత్తి లక్ష్యంగా రాజకీయ నిరుద్యోగులు, 'చేతబడి' రాజకీయాలూ కొన్నాళ్ళుగా ప్రారంభించి కొనసాగిస్తున్న 'ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం ప్రస్తుతం చీలబాటలు పట్టింది. తెలుగుజాతిని చీల్చబోయి ఉద్యమమే రెండు మూడు పాయలుగా బద్దలైంది. ఇందులో ఒక 'పాయ'కు కాంగ్రెస్ నాయకత్వంతో లోపాయికారీగా మిలాఖత్ అయిన తన టి.ఆర్.ఎస్. పార్టీ రానున్న (2014) ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుంది, అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తో గాని, ఇటు బి.జె.పి.తో గాని, కమ్యూనిస్టు (సి.పి.ఐ.) పార్టీతో గానీ ఎలాంటి పొత్తుపెట్టుకోకుండానే పోటీ చేస్తుందని 'బొబ్బిలిదొర' కెసిఆర్ ప్రకటించాడు.    కాగా, మొదట్లో కెసిఆర్ తో కలిసి ప్రొఫెసర్ కోదండరామ రెడ్డి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ సంఘం, ఇప్పుడు బయటికి ప్రకటించకపోయినా కె.సి.ఆర్. వర్గానికి దూరంగా ఉంటూ సొంత ఎజెండాతో ఉద్యమం పేరిట ఢిల్లీలో "జంతర్ మంతర్''లో గత నెల 29న "రెండురోజుల'' సత్యాగ్రహం తలపెట్టింది. అయినా కేంద్రప్రభుత్వం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పాటుకోసం ఎలాంటి ఆసక్తి కనబరచకపోవటంతో కోదండం వర్గం హతాశులై తిరిగి ఇంటికి చేరింది. ఇక జంతర్ మంతర్ 'దీక్ష'కు మద్ధతు పలికిన పార్టీలు, నాయకులు ఎవరు? తాడూ బొంగరం లేని పక్షాలు. పది-పదిహేను ఏళ్ళ నాడు కాకినాడ సభలో తెలంగాణా ఏర్పాటుకు హామీపడి, తీరా కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పరచి అయిదేళ్ళు కొనసాగించుకున్న బిజెపి-ఎన్.డి.ఎ. పరివార్ ముఠా ఆ హామీని అమలుపరచకుండా తప్పుకుంది. అయినా బిజెపి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే (ఆ అవకాశాలు కన్పించడంలేదు) గిస్తే మూడు మాసాల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మరోసారి 'మాట' వదిలింది. ఇక "దీక్ష"కు మద్ధతు పలకడానికి వచ్చిన వారిలో - ఒకే ఒక పార్టీ సభ్యుడిగాను, అధ్యక్షుడుగానూ మిగిలిపోయిన "జనతా పార్టీ'' నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఒకడు. ఇతడు భారత రాజేకీయాల్లో ఆధునిక శకుని! ఇక కోదండం వర్గానికి మద్ధతు తెల్పడానికి చేరినవారిలో మరో వ్యక్తి భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం ప్రతాప రెడ్డి ఒకరు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమేగాక బ్రిటిష్-నిజాం పరాయి పాలనల మూలంగా చెల్లాచెదురై పరాయి పంచాల్లో బతుకులీడ్చిన ప్రాచీన చరిత్రగల తెలుగుజాతినంతటినీ ఏకంచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణకు కారకులయిన కమ్యూనిస్టు పార్టీ తరువాతి కాలంలో రాజకీయంగా పతనం కావడం, ఆ పతన రాజకీయంలో భాగంగా ఉనికికోసం తెలంగాణా వేర్పాటువాదాన్ని భుజాన వేసుకోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. శాసనవేదికలో ప్రాతినిధ్య పరంగానూ అతి బలహీనశక్తిగా మనుగడ సాగిస్తూ వచ్చిన పార్టీకి సురవరం కార్యదర్శి!  కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్రం)లో భాగస్వామిగా ఉన్న పవార్ ఎన్.సి.పి. పార్టీ సంఖ్యాపరంగా బలహీనమైన పక్షం. కోదండం దేక్షకు మద్ధతిలిచ్చిన బాపతు బలం ఇదీ! "తెలంగాణా వాదాన్ని బలంగా చాటేందుకు'' హస్తినకు చేరిన సంసద్ యాత్ర అలా ముగిసింది! కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడానికి సిద్ధమైన కెసిఆర్ పార్టీకి చెందిన మరొక "నోటి దురుసు'' వ్యక్తి ఈటెల "కాంగ్రెస్ కు గోరీ'' కడతామని ప్రగల్భించాడు! 'ఈటెల'వారు సంసద్ యాత్రలో పాల్గొన్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, కెసిఆర్ పెంచుకున్న "పలుకుబడి''ని కాస్తా కోదండం కొట్టేయకుండా "చెక్'' చేయడానికే గాని మరొకందుకు కాదు. ఇక వేర్పాటు ఉద్యమానికి మద్ధతు పలికిన మరొక పార్టీ 'లెటర్ హెడ్' పార్టీగానే మిగిలిపోయిన ఫార్వర్డ్ బ్లాక్! ఇక వేర్పాటువాదానికి మద్ధతు చెబుతున్న ఈ అమాం బాపతు రాజకీయ నిరుద్యోగులు రేపటి ఎన్నికలకోసం ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలూ కోటలు దాటిపోతున్నాయి. వీళ్ళందరి నినాదం ఒక్కటే - "సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి పొందడమే లక్ష్యం''! కాని ప్రాంతీయ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి విమోచన పొందేది ఎప్పుడో వీళ్ళు చెప్పరు. ఈ చిల్లర మల్లర రాజకీయ నిరుద్యోగులందరికి - తెలంగాణలో దశాబ్దాలుగా తిష్ఠవేసి తెలంగాణా దళిత బహుజన వర్గాల ప్రజల మూల్గుల్ని పీల్చిపిప్పిచేసిన దొరలు, జాగిర్దార్లు, భూస్వామ్య స్థానిక పెట్టుబడిదారులతో పాటు అదే దోపిడీకి, దోపిడీ రాజకీయాలకూ నాయకత్వం వచించిన మహారాష్ట్ర, పంజాబీ, రాజస్థానీ, సింధీ, కర్ణాటక పెట్టుబడుదారులు తమ శ్రేయోభిలాషులై తోటి సహోదర సహోదరులయిన తెలుగుప్రజలు కాకుండా పోయారు! దూరదృష్టిలో కొరవడిన ఈ దుర్మార్గపు రాజకీయానికి పునాదులన్నీ - వేర్పాటువాదులు తమ స్వార్థప్రయోజనాల కోసం తలపెట్టిన విషప్రచారంలోనే ఉన్నాయి. తెలంగాణలోనూ, ఇతర తెలుగు ప్రాంతాలలోనూ ఉన్న తెలుగువారంతా శాతవాహనుల కాలంనుంచీ ఆదాన ప్రదానాలుగా అటువాడు ఇటూ, ఇటువారు అటూ వలసపోయిన ప్రవాసులూ, నివాసులేనని మరవరాదు! "పచ్చని తెలంగాణా రాష్ట్రం నా కల'' అని ఎన్నికల నినాదంగా చేపట్టిన కె.సి.ఆర్. పుట్టుపూర్వాలన్నీ "అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక'' అన్నట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల ఇతగాడు ఉద్దేశించిన లక్ష్యం అధికారం కోసం తన "కుటుంబ పచ్చదనమే'' గాని తెలంగాణా ప్రాంత పచ్చదనం మాత్రం కాదని! జాతిని చీల్చే విద్వేష ప్రచారంగాని, ప్రజల ఐక్యతను భంగపరిచే ప్రకటనలుగానీ, మత విద్వేష ప్రచారంగానీ రాజ్యాంగ విరుద్ధచర్యలుగా భావించి అలాంటి వారిని శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంతో ముందుకు రావాలని కొలది రోజులనాడే (ఏప్రిల్ లో) సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని మరవరాదు. ఒక వైపున పంటలు కోల్పోయి, అప్పులపాలైన రైతులు, మరొక వైపున చేనేతకారులు అనేకమంది తెలంగాణలో కూడా ఆత్మహత్యలు చేసుకొంటూండగా పట్టించుకోని కెసిఆర్, కోదండం వర్గం, ఇంకొక వైపున విద్వేష ప్రచారం ద్వారా అక్కరకు రాణి హామీలపైన యువతలో ఆశలు రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పారు. ఈ పాపంనుంచి తప్పుకొనే మార్గం లేకనే ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకపోతే తమను స్థానిక ప్రజలు బతకనివ్వరన్న భయం వారిని వెంటాడుతోంది కాబట్టే కాలుకాలిన పిల్లుల్లాగా హైదరాబాద్ నుంచి హస్తినకు ఢిల్లీ నుంచి హైదరాబాదుకూ 'బరాట్లు' కొడుతున్నారు. ఈ సందట్లోనే ఉస్మానియా ఆచార్యుడు, దళితమేధావి అయిన కంచి ఐలయ్య ఒక ప్రకటనలో [11.04.2013] "తెలంగాణా ఉద్యమం పేరుతొ కెసిఆర్ రూ. 50 వేలకోట్లు కూడబెట్టుకున్నారని బాహాటంగా ఆరోపించడం యువతలో సంచలన కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రజల దృష్టిని మళ్ళించడంకోసం 2014లో జరిగే ఎన్నికలు "మధ్యంతరంగానే రేపో మాపో వస్తా''యన్న ప్రకటనలతోనూ "త్వరలో మరికొందరు ఇతర పార్టీల ఎం.ఎల్.ఎ.లు టి.ఆర్.ఎస్.లో చేరనున్నారన్న చిట్కాలతోనూ కాలక్షేపం చేస్తున్నాడు! ఇది కె.సి.ఆర్. 'ఒంటరి' పోరాటంతో చేస్తున్న 'తుంటరి' రాజకీయం తప్ప మరొకటి కాదు! ఈ భాగోతం యిలా వుండగా, కాంగ్రెస్ లో తన టి.ఆర్.ఎస్. పార్టీని కలిపివేయడానికి రెండు నెలలనాడు ఢిల్లీలో హామీపడి వచ్చిన ఈ 'చేతబడుల' రాజకీయవేత్త అందుకు విరుద్ధంగా తన రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పైన వ్యతిరేక ప్రచారాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నాడు. ఈ 'గోడదూకుడు వ్యక్తిని తమకిచ్చిన మాటనుంచి తప్పుకోజూడడాన్ని అనుమానించిన కేంద్రనాయకత్వం ఇప్పుడు కె.సి.ఆర్. ఆస్తులపైన కూడా సి.బి.ఐ. ద్వారా ఆరా తీయిస్తున్నట్టు ఢిల్లీ నుంచి "సూర్య'' దినపత్రిక ప్రత్యేక ప్రతినిధి పంపించిన భారీ వార్తను ప్రచురించి రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది! ఈ కూపీలో భాగంగానే ఆ పత్రిక కేసిఆర్ మరొక స్థానిక బడా పట్టుబడిదారుడైన ఒక 'ఘరానా'తో కలిసి ఒక దినపత్రికను ఒక ఛానెల్ ను నెలకొల్పడంపైన ఆ పత్రిక యజమానికి కెసిఆర్ కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి కూడా సిబీఐ దర్యాప్తులోకి దిగనున్నట్టు రాసింది. దోపిడీ వ్యవస్థను కాపాడుకోగోరే పెట్టుబడీదారీ వర్గాలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా వారి దోపిడీ స్వభావం మారదు. కాని ఒక దోపిడీదారు మరొక దోపిడీదారుతో లాభాపేక్షతో పోటీపడుతున్నప్పుడు ఒక్కో సందర్భంలో వారి మధ్య ఘర్షణ 'కపట కలహంగా' తలెత్తుతూ ఉంటుంది! కాని దోపిడీ స్వభావంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని భూస్వామ్య పెట్టుబడి వర్గాల మధ్య తేడా ఉండదు. కాని రాజకీయాలలోకి దిగి 'రాజకీయ నిరుద్యోగులు'గా ఉండే ఒక ప్రాంతపు పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన దోపిడీదారుల దోపిడీని మాత్రమే ఉదాహరిస్తూ "కపట కలహం'' తో ప్రజలమధ్య చిచ్చుపెట్టి ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడరు. ఆ అధికార దాహంతోనే ప్రాంతీయ భూస్వామ్య పెట్టుబడివర్గాలకు నాయకత్వం వహిస్తున్న కెసిఆర్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకోసం స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి 'సీమాంధ్రుల దోపిడీని నుంచి తెలంగాణాను విముక్తి చేయడం' తన లక్ష్యంగా ప్రకటించి, "సీమాంధ్రులను తరిమికొట్టండి'' వారి "ఆస్తిపాస్తుల్ని, ఇళ్లను స్వాధీనం చేసుకోండి "పరిశ్రమలనుంచి వారిని తరిమేస్తే, ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయి'', "మధ్యలో ఉద్యమాన్ని ఆపేశామా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు, చంపేస్తారు'' అంటూ నోటికొచ్చిన బజారు కూతలతో సామాన్యప్రజలనూ, నిరుద్యోగ విద్యార్థులనూ రెచ్చగొడుటూ నినాదాలు యిచ్చాడు. ఈ పరిణామం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీయడానికీ, ఏ సోదర సీమాంద్రులపై కెసిఆర్ తన స్వార్థం కోసం కత్తికట్టాడో తిరిగి ఆ సీమాంధ్రలోని డిగ్రీ కళాశాలకు, వృత్తి కళాశాలలకూ ప్రాంతంలోని మన తెలుగుపిల్లలూ, ఇతర రాష్ట్రాల పిల్లలూ చదువుల కోసం వలసపోవలసి వచ్చింది; ఇతగాడి ప్రవర్తన మూలంగా కొన్ని పారిశ్రామిక సంస్థలూ, ముఖ్యంగా కొన్ని ఐ.టి. కంపెనీలు మూతపడి, వేలాదిమంది యువకులు, ఉద్యోగాలూ ఉపాధి కోల్పోవలసి వచ్చింది.  ఆ మాటకొస్తే సీమాంధ్ర పెట్టుబడిదారులకే కాదు, మన తెలంగాణాలోని పెట్టుబడిదారులకూ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత బడా బడా "ఫామ్ హౌస్''లూ "విలాసక్షేత్రాలూ'' (ఫామ్ హౌస్ లు)ఉన్నాయి. అవి ఉభయత్రా రాజకీయ మంత్రంగాలకూ కేంద్రాలు; ఇక హైదరాబాద్ లోని సినిమా పరిశ్రమ ఉనికి అంటారా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఎన్.టి.రామారావు కంటే చాలా ముందుగా తెలుగు సినిమా పరిశ్రమను మద్రాసునుంచి హైదరాబాద్ కు ఆహ్వానించిన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణాకు చెందిన సమర్థమైన పరిపాలనా దక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిగారేనని మరిచిపోయి కెసిఆర్ వర్గం కళ్ళున్న కబోధి పాత్ర వహిస్తే ఎలా?! ఎటుతిరిగీ ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తరువాతనే కాంగ్రెస్ రాజకీయ కుమ్ములాటల్లో చెన్నారెడ్డి తన నిరుద్యోగ బాధ తనకు దుస్సహమై తిరిగి అధ్కారంలోకి రావడంకోసం "తెలంగాణా ప్రజాసమితి''ని ఏర్పాటు చేసి వేర్పాటు ఉద్యమానికి బీజాలు నాటాడు. ఆ చరిత్ర తెలుగుప్రజలు మరచిపోలేరు! అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే దోపిడీకాండలో భాగాస్వాములయిన మన తెలంగాణాలోని భూస్వామ్య-పెట్టుబడిదారుల కనీసం 20 మంది దాకా ఎంతలేదన్నా ఒక్కొక్కరు రూ.500 కోట్లనుంచి రూ.4,000కోట్ల వరకూ విలువగల ఆస్తులు ఏ రూపంలోనైతేనేమి కూడబెట్టుకున్నవారేనని ప్రాంతీయ సామాజికశాస్త్రవేత్తల అంచనా!   ఈ క్రమంలో, ప్రొఫెసర్ కంచి ఐలయ్య టి.ఆర్.ఎస్. నాయకుడు 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్. మన తెలంగాణలో కూడగట్టుకున్న ఆస్తుల విలువ (రూ. 50,000 కోట్లు) [పమీ అతిగా ఉన్న అంచనా అని అనుకున్నా "ఇంటర్నెట్'' సమాచారం ప్రకారం గుజరాత్ నుంచి (కాండ్లా రేవునుంచి వ్యాపార లావాదేవీల్లో భాగంగా కెసిఆర్ నడుపుతున్నాడని చెబుతున్న ఎందు షిప్పులు) హైదరాబాద్ వరకూ అతనికి ఉన్న ఆస్తుల విలువ రూ.6,000 కోట్లు అని అంచనా! తల దాచుకోడానికి కేవలం 75 గజాల స్థలం కోసం తెలంగాణా పేదసాదలు పడిగాపులు పడుతూన్న దశలో 75 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకోడానికి సాహసించిన 'ఉద్యమ' నాయకుడు రేపు మన తెలంగాణలో అధికారంలోకి వస్తే దళిత బహుజన, పేద, మధ్యతరగతి వర్గాలకు, యువతకూ ఏదో తవ్వి తలకెత్తుతాడను కోవడం కేవలం భ్రమ మాత్రమేనని గుర్తించాలి. ఇక పేదసాదలు అంతో ఇంతో ఆశలుపెట్టుకున్న మావోయిస్టుల తెలంగాణా రాజకీయం మావో నిర్వహించిన ఐక్య చైనా, అఖండ చైనా విప్లవోద్యమానికి పూర్తి విరుద్ధం. చైనాలో ఏ రాష్ట్రాన్నీ మావో "వేర్పాటువాదం''తో విచ్చిన్నం చేయలేదు, భాషా రాష్ట్రాలనూ విడదీయలేదు. జాతీయ మైనారిటీల రక్షణ దృష్ట్యా మెజారిటీ 'హాన్' జాతి దురహంకారాన్ని విజయవంతంగా నిరోధించగలిగిన వాడు మావో. విప్లవోద్యమంలో తనకు అవసరమైన రక్షణ స్థావరాల నిర్మాణం కోసం ఏ రాష్ట్రాన్నీ మావో వేర్పాటు ఉద్యమం ద్వారా విడగొట్టడానికి ప్రయత్నించలేదు. అలాంటి ఉదాహరణ ఏదైనా ఉంటే ఇక్కడి వేర్పాటువాదులు గానీ, లేదా వారిని వ్యతిరేకిస్తూనే "స్థావరం'' కోసం తెలుగుజాతి ఐక్యమత్యాన్ని విచ్చిన్నం చేయగల వ్యూహరచనలో ఉన్న మావోయిస్టు సోదరులు గానీ పేర్కొంటే సంతోషిద్దాం! ఏది ఏమైనా తెలంగాణా యువతను అబద్ధాలతో మభ్యపెట్టి, వారిని ఆత్మహత్యల వైపునక్కు పురిగొల్పిన కెసిఆర్, అతని ప్రాంతీయపార్టీ భవిష్యత్తు సంక్షోభదశలో ప్రవేశించి, పతనోన్ముఖంగా అడుగులు వేయడం అనివార్యమని ఆ పార్టీలోని కొందరు నాయకులు సహా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన ప్రత్యర్థిపక్షాల నుంచి తన పార్టీ వైపుకు "ఆకర్షితులవుతు''న్నారని ఆశించిన కెసిఆర్ కు ఇటునుంచి అటువైపుగా వలసలు ప్రారంభం కావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!  

Gas Subsidy Aadhar card

సర్కారీ కామెడీ

      ప్రభుత్వం ప్రజలతో కామెడీలు చేస్తుంది.. ఇన్నాళ్లు అన్నింటికీ ఆధారే ఆధారం అంటూ దేశ ప్రజలను పరుగులు పెట్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది.. గ్యాస్‌కు సంభందించిన అన్ని రకాల లావాదేవిలకు ఆధార్‌ తప్పని సరి అని షరతు పెట్టిన పెద్దలు ఇప్పుడు ఆ అవసరం లేదంటూ ప్రజలకు కాస్త ఊరటనిచ్చినట్టుగా షో చేశారు.. కాని అక్కడే అసలు మెలిక వేశారు..    గ్యాస్‌ బుకింగ్‌కు ఆదార్‌కు ఎలాంటి సంభందం లేదు అంటూనే గ్యాస్‌ సబ్సిడీకి మాత్రం ఆదార్‌ కంపల్సరీ అంటూ కొత్త మెలిక పెట్టారు.. అప్పుడేప్పుడో ఓ సినిమా డైరెక్టర్‌ చెప్పినట్టుగా ఇది యాథార్ధ కథల ఆదారంగా తెరకెక్కించిన కల్పిత గాథ.. కల్సిత కథల ఆదారంగా తెరకెక్కిన యథార్ధ గాథ అన్నట్టుగా.. గ్యాస్‌కి ఆధార్‌కి సంభందం లేదు కాని, సబ్సిడీకి ఆధార్‌ కంపల్సెరీ అనటంపై సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు..  గ్యాస్‌ బుక్‌ చేయడానికైతేనేం.. గ్యాస్‌ సబ్సిడీకి అయితేనేం ఆధార్‌ లేనిదే గ్యాస్‌ బండ సామాన్యుడి పాలిట గుదిబండగా మారనుంది.. ప్రభుత్వ చాలని ఆధార్‌ కేంద్రాలతో ఇంత వరకు సగం మందికి కూడా ఆధార్‌ కార్డులు అందినట్టుగా లేదు.. దీంతో ఈ సబ్సిడీ మెలిక నేరుగా ప్రజల జేబులో నుండి డబ్బు తీసుకోవడానికే అంటున్నారు విశ్లేషకులు.  ఏది ఏమైనా గ్యాష్‌ ఆధార్‌ ప్రభుత్వం ఈ మూడు విషయాలు సగటు మనిషి మాత్రం నిద్రలేకుండా చేస్తున్నాయి..

dadi veerabhadra rao

అప్పుడు గజదొంగ..ఇప్పుడు కాదు

  నిన్న మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి ఒక గజదొంగ అని, ఆయన పార్టీని ఒక దొంగల ముటా అని మీడియా ముందు తిట్టిపోసిన దాడి వీరభద్రరావుకి, అలనాడు భోది వృక్షం క్రింద బుద్దుడికి జ్ఞానోదయం అయినట్లు, నేడు చంచల్ గూడా జైల్లో జ్ఞానోదయం అయింది. ఈ రోజు జైల్లో జగన్ మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ “నేను గతంలో విన్న జగన్ వేరు, నేడు నేను చూసిన జగన్ వేరు. ఆయన గురించి బయట చాల చెడుగా ప్రచారం అవుతోంది. కానీ, ఆయన జైల్లో ఉన్నాకూడా రాష్ట్రం బాగుడాలనే తపిస్తున్నారు. అటువంటి ధృడ సంకల్పం కలిగిన నేతను ఇటీవల కాలంలో నేను చూడలేదు. ఆయన నేతృత్వంలో నేను పని చేయాలని నిశ్చయించుకొన్నాను. గతంలో నేను వారి గురించి, వారి పార్టీ గురించి చేసిన విమర్శలు తెదేపా విధానాలననుసరించి చేసినవే తప్ప వ్యక్తిగతంగా చేసినవి కావు. ఆయన కుటుంబానికి చాలా అన్యాయం జరుగుతోంది. వారికి అండగా నిలబడతాను,” అని అన్నారు. ఆయన వైకాపాలో చేరుతున్నానని చేసిన ఈ ప్రకటనతో, తనకు, తన కుమారుడు రత్నాకర్ కు పార్టీ టికెట్స్ ఖాయం చేసుకొన్నట్లే భావించవలసి ఉంటుంది. మరి దీనికి కొణతాల సోదరులు ఏవిధంగా స్వీకరిస్తారో చూడాలి. తనకి పదవులు ముఖ్యం కాదంటూనే, శాసన మండలికి రెండవసారి అవకాశం ఇవ్వనందుకు తెదేపాతో 30ఏళ్ల తన అనుబంధాన్ని పుటుకున్న తెంచేసుకొన్న ఇటువంటి వ్యక్తి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో ఒకరోజు హ్యాండిచ్చి వేరే పార్టీలోకి మారడని ఖచ్చితంగా చెప్పలేము. ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నఅనకాపల్లి వైకాపా కార్యకర్తలు, నేతలతో పొసగక బహుశః వచ్చే ఎన్నికలలోగానే ఆయన మళ్ళీ పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మీడియా వేదికగా కాంగ్రెస్ నేతల యుద్ధం

  రోజుకో పధకంతో ప్రజలలోకి దూసుకుపోతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడలను వ్యతిరేఖిస్తున్నమంత్రులు దామోదర రాజనరసింహ, జానారెడ్డి, డీయల్.రవీంద్ర రెడ్డి, వట్టి వసంత కుమార్ తదితరులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో నిన్నఆయన ఇంట్లోనే సమావేశం అయి, ముఖ్యమంత్రి తమ పట్ల అనుసరిస్తున్న అనుచిత, నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ కి లేఖ వ్రాసినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. కానీ, అటువంటిదేమి లేదని బొత్స సత్యనారాయణ ఖండించినప్పటికీ, రాష్ట్ర వ్యవహారాల గురించి నివేదికలు పంపడం మామూలేనని చెప్పడం పత్రికలలో వచ్చిన వార్తలు నిజమేనని అర్ధం అవుతుంది.   దీనికి విరుగుడుగా త్వరలో ముఖ్యమంత్రి డిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో మాట్లాడనున్నారని మరో వార్తా పత్రికలకి లీకయింది. కానీ, మళ్ళీ కొద్ది సేపటికే ముఖ్యమంత్రికి డిల్లీ పర్యటన ఆలోచన ఏమిలేదని, మీడియాలో వస్తున్నవార్తలు నిజం కాదని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ఖండన ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి పర్యటన గురించి ఆయన కానీ, ఆయన కార్యాలయ సిబ్బంది గానీ ఎవరూ ప్రకటించకపోయినా, ఆయన డిల్లీ బయలుదేరుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం రాజకీయ ఎత్తుగడ అయిఉండవచ్చును. బహుశః అసమతి నేతలని కట్టడి చేయడానికే ముఖ్యమంత్రి అనుకూల వర్గానికి చెందినవారెవరో ఇటువంటి వార్తని మీడియాకి లీక్ చేసి ఉండవచ్చును. లేదా నిజంగానే ఇది మీడియా సృష్టి అయిఉండవచ్చును కూడా. కానీ, ఈ వార్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, ఆయనని వ్యతిరేఖించేవారికి మద్య జరుగుతున్నకుమ్ములాటలకి అద్దం పట్టింది.

అసమ్మతి సెగ, ఢిల్లీకి సీఎం కిరణ్

        ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనలకు అసమ్మతి సెగ తగిలింది. ఢిల్లీ నుండి అధిష్టానం పిలుపు నివ్వడంతో ఆయన ఈ నెల 6,7,8 తేదీలలో జరగనున్న ఇందిరమ్మ బాట కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఢిల్లీ బాట పట్టనున్నారు. ‘బంగారు తల్లి’ పథకం ఎవరితోనూ చర్చించకుండా ప్రకటించడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, వట్టి వసంత్ కుమార్, జానారెడ్డి తదితరులు ఆగ్రహంగా ఉన్నారు.ఈ మేరకు వీరంతా అధిష్టానానికి ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక శానససభ ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఇక ఈ అసమ్మతితో పాటు పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు 48 గంటల దీక్ష అధిష్టానాన్ని తాకినట్లు తెలుస్తోంది. దీనిని కూడా చర్చించాలన్న ఉద్దేశంతో పాటు ఎన్నికలకు ఏడాది కాలమే ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

వైకాపాలో వలస పక్షుల బాధలు

        వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైకాపా ఆవిర్భవించిన నాటి నుండి ఆ పార్టీలోకి వెళుతున్న వలస పక్షుల్ని గమనిస్తే మొట్టమొదటగా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ వైకాపా పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా వెళ్ళిన ఎం.పి. సబ్బం హరి, వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ అయిన కొణతాళ రామకృష్ణతో ఉన్న విభేదాల కారణంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ జైల్లో ఉన్న కారణంగా వాళ్ళ చిన్నాన్న వై.వి. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారు. జగన్ కి మొట్టమొదటి నుండి సపోర్టింగ్ గా ఉండి మంత్రి పదవిని కూడా వదులుకున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ లాంటి వారికి ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యత కనిపించడం లేదు. అటువంటప్పుడు కొత్తగా చేరేవారికి ఎటువంటి ప్రాధాన్యత, గౌరవం లభిస్తుందో చెప్పనవసరం లేదు.    ఒకనాడు రాజశేఖర్ రెడ్డి తో సమాన స్థాయిలో కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ హోం మంత్రి మైసూర రెడ్డి లాంటి వారు రాజశేఖర రెడ్డి తో విభేదించి తెదేపా లో చేరి వైఎసార్ మరణానంతరం జగన్ పార్టీ లో చేరడం అంటే రాజకీయాల్లో పడిపోతున్న అధికార దాహానికి అద్దం పడుతుంది. ఆయనకు పార్టీలో సరైన గౌరవమర్యాదలు లభించక పార్టీలో ఇమడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు కారణం పార్టీని నడిపించడానికి కో ఆర్డినేటర్లను నియమించారు. దానిలో అనుభవం ఉన్నవారికి స్థానం లేదు. అనుభవం  లేని వారిని కో ఆర్డినేటర్లు గా నియమించటం వలన మైసూరా రెడ్డి లాంటి సీనియర్ నేతలు చిన్నచూపుకు గురౌతున్నారు. సినీనటి రోజా తెదేపాలో అత్యన్నత స్థానం అయిన మహిళా అధ్యక్షురాలిగా పనిచేసినప్పటికీ ఆమె అనుభవాన్ని సరిగా ఉపయోగించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపిచడం లేదు. జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంగా జైల్లో ఉన్న కారణంగా పార్టీని నడిపించే వారికి రాజకీయ అనుభవం లేదు. దాడి వీరభద్రరావు వైకాపా లో చేరుతున్న కారణంగా ఆ పార్టీ కార్యకర్తల నుండి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత, పార్టీ సీనియర్లకు విలువ ఇవ్వని జగన్ వైఖరి వెరసి కొణతాల పార్టీ నుండి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుండి, తెదేపా నుండి వచ్చిన వారికి ఎంతవరకు సముచిత స్థానం లభిస్తుందో తెలుసుకుని దాడి లాంటి వారు వైకాపా లొకి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఎపుడో ఆ పార్టీ లోకి వెళ్ళిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాధించింది ఏమిటి? వైకాపా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ రెహ్మాన్ స్థితి కుడా ఇంతకు మించి భిన్నంగా ఉన్నట్లు ఏమీ కనిపించటం లేదు. ఈ మొత్తం ప్రహసనం లో వివిధ పార్టీల నుండి వైకాపా లోకి వెళుతున్న వలస పక్షులకు దక్కుతున్నది ఏమిటి? (లేదా) వారు సాధించినది ఏమిటి? వారు ఎవరి కోసం ఈ గోడ దూకుళ్ళు మొదలు పెట్టారు?  మకు మర్యాదలు దక్కలేదని, తమ వ్యతిరేకులు పార్టీ లోకి వస్తే సహించలేనితనాలే కాని, నేడు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బాధలు ఎవరికీ పట్టవు. ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకోవటానికి కూడా వారి చరిష్మా సరిపోని నేతలు, ఈ రాజకీయాలు ఎవరిని ఉద్ధరించటానికి? కేవలం వారి ఉనికిని, వారి వ్యాపారాలను, వారి ఆస్తులను కాపాడుకోవటానికి తప్ప. రాజకీయాల్లో ఆత్మ హత్యలే కాని, హత్యలుండవని ప్రతి నేతా మాట్లాడుతాడు. మరి ఇవాళ నైతికత, క్రమశిక్షణ, విలువలు అన్నింటిని వదిలేసి ఇలా పార్టీలు మారడం "హత్య లేక ఆత్మహత్య." ఏ పేరు పెడతారు? ఎందుకంటే ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ నేతని నమ్మి ఎందరో  నేతలు, కార్యకర్తలు, మేధావులు తమ ఆస్తులు అమ్ముకుని మరీ ఆ పార్టీ లోకి వెళ్ళారు. ఫలితం అందులో చాలా మంది తమ ఆస్తుల్ని పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఓక పార్టీ పెట్టగానే నేతలు ప్రస్తుతం ఉన్న పార్టీ లో తమకు సముచిత న్యాయం, సముచిత స్థానం దక్కట్లేదని ఆ  కొత్త పార్టీ లోకి గుంపులు గుంపులుగా వెళ్లి చేరితే అక్కడ మాత్రం సముచిత న్యాయం , సముచిత స్థానం ఎలా దక్కుతాయి అనేది అనుభవజ్ఞులైన నేతలకు తెలియనిదా? (లేక) ఈ విషయాన్ని ప్రజలెవరూ గమనించట్లేదని వారి గుడ్డి నమ్మకమా? ఏది ఏమైనా కార్యకర్తలు పాటించే క్రమశిక్షణని నేతలు పాటించకపోవడం చాలా బాధాకరం. వోటర్లందరు రాజకీయ ప్రక్షాళన దిశగా వోటు హక్కును వినియోగించుకోవడం తమ కర్తవ్యం అని గుర్తెరగాలి. 

వైకాపాలో చేరక ముందే దాడికి సెగ

  తెలుగుదేశం పార్టీలో కొందరు తనని పార్టీ నుండి బయటకి పంపేందుకు పొగ పెడుతున్నారని కుంటి సాకులు చెప్పి నిన్న పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరేందుకు ముందే రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ రోజు కానీ, సోమవారం గానీ చంచల్ గూడా జైలుకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనుకొంటున్నట్లు ఆయన ఈ రోజే ప్రకటించారు. అయితే, ఆయన జైల్లోకి ప్రవేశించక మునుపే లోపలి నుండి అనకాపల్లి నియోజక వర్గానికి చెందిన వైకాపా నేతలు పొగపెట్టడం మొదలుపెట్టేసారు.   అనకాపల్లికే చెందిన దాడి వీరభద్రరావుకి, కొణతాల రామకృష్ణ కుటుంబాలకి మద్య గత రెండు దశాబ్దాలు రాజకీయ వైరం ఉంది. తొలుత కొణతాల కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు, దాడి వీరభద్రరావు ఆయనకు రాజకీయ ప్రత్యర్ధిగా నిలిచి పెనుసవాలు విసిరేరు. కానీ, ఇప్పుడు ఆ రాజకీయ ప్రత్యర్దులిరువురూ భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు వైకాపాలో వచ్చిపడ్డారు.   దాడి వీరభద్రరావు రానంత వరకు అనకాపల్లికి సంబందించినంత వరకు వైకాపాలో కొణతాల రామకృష్ణదే పైచేయి. కానీ, ఇప్పుడు దాడి ప్రవేశంతో, ఆయన సీటుకే ఎసరు వచ్చేలా ఉంది. దాడితో బాటు ఆయన కుమారుడు రత్నాకర్ కూడా తరలి వస్తుండటంతో ఆ ఇబ్బంది రెట్టింపయింది. ఈసారి కొణతాల సోదరుడు పెదబాబు అనకాపల్లి శాసన సభకు, రామకృష్ణ లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు వారిరువురికీ పోటీగా దాడి వీరభద్ర రావు మరియు ఆయన కుమారుడు పోటీకి వస్తున్నారు.   దాడి&సన్స్ వైకాపాలో చేరేందుకు ప్రప్రధమ షరతు అనకాపల్లి నియోజక వర్గం సీట్లు కేటాయింపే! గనుక, సహజంగానే కొణతాల సోదరులకు అది ఆందోళన కలిగించే విషయమే అవుతుంది. కొణతాల కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అటువంటి తమని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన దాడి&సన్స్ కి టికెట్స్ ఇచ్చేందుకు జగన్ మాట ఇస్తాడేమోనని కొణతాల సోదరులిద్దరు చాలా ఆందోళన చెందుతున్నారు.   అయితే రామకృష్ణ ఇంకా బయటపడకపోయినా, ఆయన సోదరుడు పెదబాబు మాత్రం, “తనకు ఎంతో పలుకుబడి ఉందని భావిస్తున్న దాడి వీరభద్రరావుకి గత ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అటువంటి వ్యక్తి మా పార్టీలోకి వచ్చినందువల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు,” అంటూ బాంబు పేల్చారు. కానీ ఆయన సోదరుడు రామకృష్ణ మాత్రం దాడి వీరభద్రరావు పట్ల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా దానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.   అయితే, ఇటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ నాయకుడయినా సహజంగా అటువంటి ప్రకటనే చేస్తాడు. కానీ, పార్టీ టికెట్స్ పంపకం విషయం వచ్చేసరికి తనకు న్యాయం జరగక పోతే, ఇప్పుడు దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ మీద అలిగి 30సం.ల అనుబంధాన్ని పుటుకున తెంపుకు వచ్సుసినట్లే, కొణతాల సోదరులు కూడా అలిగి పార్టీ వీడి కాంగ్రెస్ గూటికే చేరినా చేరవచ్చును. అదే జరిగితే, అప్పుడు కొణతాల సోదరులు, దాడి వీరభద్ర రావు & సన్స్ కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో మళ్ళీ ప్రత్యర్దులుగా ఒకరినొకరు ఎదుర్కొంటారేమో!