ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక...
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో ఇరవై పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రతిపాదనలలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి..
శ్రీకాకుళం జిల్లా:
నూతన పారిశ్రామిక నగరంగా శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు, కళింగపట్నం పోర్ట్ అభివృద్ధి, స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం, నూతన విమానాశ్రయం, ఫుడ్ పార్క్, వంశధార, నాగావళిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, శ్రీకాకుళానికి ఓపెన్ యూనివర్సిటీ, ఎలక్టానిక్స్, హార్డ్వేర్ పార్క్.
విజయనగరం జిల్లా:
విజయనగరంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, నూతన పారిశ్రామిక నగరంగా విజయనగరం, ఏడాదిలోగా తోటపల్లి రిజర్వాయర్ పూర్తి, విజయనగరానికి పుడ్ పార్క్, గిరిజన యూనివర్శిటీ, హార్డ్వేర్ పార్క్, పోర్టు, సంగీతం, లలిత కళల అకాడెమీ, మెడికల్ కళాశాల,
విశాఖపట్నం జిల్లా:
మెగా సిటీగా విశాఖ, విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో ఇండస్ట్రీయల్ కారిడార్, మెట్రోరైలు, విశాఖలో ఐఐఎం, ఐఐఎఫ్టీ, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, విశాఖలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ హబ్, పుడ్ పార్క్, విశాఖలో ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్, రైల్వే జోన్.