మీ పిల్లల్ని సైనిక స్కూల్లో చేర్పించాలని వుందా?
మీ పిల్లల్ని సైనిక స్కూల్లో ఆరు, తొమ్మిదివ తరగతుల్లో చేర్చాలనుకుంటే ఈ క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 2015-16 సంవత్సరానికి సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
జనవరి 4న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆరో తరగతిలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. గణితం (100 మార్కులు), లాంగ్వేజీ ఎబిలిటీ (100 మార్కులు) పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ఇంటిలిజెన్సీ (100 మార్కులు) పరీక్ష జరుగుతుంది.
తొమ్మిదో తరగతికి జనవరి 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు గణితం (200 మార్కులు), సైన్స్ (75 మార్కులు), మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇంగ్లీషు (100 మార్కులు), సోషల్ స్టడీస్ (75 మార్కులు) పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది అదనంగా కలికిరి, విజయవాడ, రాజమండ్రిలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 08922- 246119, 246168 ఫోన్ నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రవేశ పరీక్ష నిర్వహించే కేంద్రాలు...
గుంటూరు - శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్, బ్రాడీపేట,
హైదరాబాద్ - కీస్ గర్ల్స్ హైస్కూల్, సికింద్రాబాద్,
కరీంనగర్ - గవర్నమెంట్ హైస్కూల్, సుభాష్నగర్,
తిరుపతి - శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదురుగా,
విజయనగరం - సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కంటోన్మెంట్,
విశాఖపట్నం - ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్, సీతమ్మధార,
విజయవాడ - జెడ్పీ హైస్కూల్ (బాలుర), పటమట,
కడప - నాగార్జున మోడల్ స్కూల్, జిల్లా కోర్టు వెనుక, మారుతీనగర్,
కర్నూలు - మాంటిసోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్, ఎ-క్యాంప్,
రాజమండ్రి - ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాయికృష్ణా థియేటర్ దగ్గర,
కలికిరి - సైనిక్ స్కూల్, కలికిరి, చిత్తూరు జిల్లా.