ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. మంత్రులుగా లాలు కొడుకులు

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు..పాట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్ కుమార్ 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పదిహేనేళ్ల క్రితం కొద్దిరోజులుగా సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఆతరువాత 2005లో 2010లో సీఎం అయ్యారు. 2014 లోకసభ ఎన్నికల్లో బీహార్‌లో పార్టీ దారుణ ఓటమి అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. మాంఝీని ముఖ్యమంత్రిగా తొలగించాక నితీష్ మరోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ కుమార్ తో పాటు మొత్తం 28 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో లాలు ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ లు కూడా ఉన్నారు. ఇంకా ముగ్గురు మహిళలకు కూడా మంత్రులుగా అవకాశం దక్కింది. కాగా నితీశ్ కుమార్ ప్రమాణ స్పీకారానికి పలువురు కేంద్రమంత్రులు.. 9 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా పోటీ చేయగా 4:4:2 అనుకున్న ప్రకారమే పదవులు పంచుకున్నట్టు తెలుస్తోంది.

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బందీలుగా 170 మంది

పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మాలి రాజధాని బమాకాలో ఉన్నరాడిసన్‌ బ్లూ హోటల్ లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడి చేసి 170 మందిని (140 మంది టూరిస్ట్ లు, 30 మంది హోటల్ సిబ్బంది) నిర్భందించి.. తొమ్మిది మందిని చంపారు. బందీల్లో ఎక్కువగా అమెరికా, బ్రిటన్ కు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల దగ్గర భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాగా ఆటోమెటిక్ ఆయుధాలు, బాంబులు ధరించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, లోపలికి వెళ్లారని తెలుస్తోంది.

వెంకయ్యనాయుడిది జ్యోతిలక్ష్మీ నాలుక.. మోడీకి కట్టుకున్న పెళ్లాం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెరైటీగా తిట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు కూడా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడులను చాలా విచిత్రమైన పోలికలతో విమర్సించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే.. కాదు కాదు మేము అధికారంలోకి కనుక వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు బీజేపీ పార్టీ, వెంకయ్య నాయుడు కూడా చెప్పారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే మాత్రం నీళ్లు నములుతున్నారని అన్నారు. అంతేకాదు వెంకయ్య నాలుకను జ్యోతిలక్ష్మి నడుముతో పోల్చుతూ.. వెంకయ్యనాయుడు నాలుక జ్యోతిలక్ష్మీ నడుములా ఎటుబడితే అటు తిరుగుతుందని ఎద్దేవ చేశారు. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా మండిపడ్డారు. మోడీకి ఏపీ కట్టుకున్న పెళ్లామని.. కట్టుకున్న పెళ్లాం లాంటి  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ‘నీతో ఉండను' పొమ్మంటున్నారని అన్నారు. మొత్తానికి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నారాయణకు ఈసారి మోడీ, వెంకయ్య బలైయ్యారన్నమాట.

ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన నితీష్ కుమార్

  బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేసారు. దీనితో ఆయన ఐదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరుగుతోంది. బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. నితీష్ కుమార్ తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్, ఆ తరువాత పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వారిలో తేజ్ ప్రతాప్ యాదవ్ కొన్ని పదాలను సరిగ్గా ఉచ్చరించకపోవడంతో గవర్నర్ రామ్ నాథ్ అతని చేత మళ్ళీ ప్రమాణస్వీకారం చేయించారు.   నితీష్ మంత్రివర్గంలో ఆయనతో కలిపి మొత్తం 28మంది మంత్రులుగా ఉంటారు. వారిలో జెడీయు, ఆర్.జె.డి.ల తరపున చెరో 12 మంది, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు కలిపి మొత్తం 28మంది మంత్రులు ఉంటారు. ఈ కార్యక్రమానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీపై వెంకయ్య ఫైర్.. అసహనం పేరుతో విమర్శలు చేస్తోంది..

కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అసహనం పేరుతో విమర్శలు చేస్తోందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అసహనానికి గురైందని.. అందుకే అందరిపై అసహనంతో ఇలా విమర్సలు  చేస్తున్నారు.. ముందు అసహనానికి గురైంది కాంగ్రెస్ పార్టీనే అని.. అది ఆ పార్టీ గుర్తించాలని విరుచుకుపడ్డారు. అనవసరంగా కుల, మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపుతోందని.. అందుకే  తన రాజకీయ అవసరాల కోసం కుల, మత శక్తులను ప్రోత్సహిస్తోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్‌ నేతలు పాకిస్థాన్‌ను పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని కుల, మత, వర్గంగా విడగొట్టింది కాంగ్రెస్సే అని వ్యాఖ్యానించారు.

సీఆర్డీఏ తో చంద్రబాబు సమావేశం..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీఆర్డీఏ తో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల డిజైన్లు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యలయాలు నిర్మాణంపై అంతర్జాతీయ అర్కిటెక్ లకు డిజైనింగ్ బాధ్యతలు అప్పగించామని.. ఫిభ్రవరి నెలాఖరుకు డిజైన్ లు ఫైనల్ చేస్తామని.. జూన్ నుండి నిర్మాణాలు చేపడుతామని సీఆర్డీఏ సెక్రెటరీ అజయ్ జైన్ తెలిపారు. ఈ ఫైనల్ డిజైన్ ఎంపికకు 5గురు సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేస్తామని.. సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ ప్రపంచస్థాయిలో వినూత్నంగా ఉండే విధంగా డిజైన్లు రూపొందిస్తాని అన్నారు.

లాలు చిన్న కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి?

  బీహార్ ఎన్నికల్లో బీజేపీ పై మహా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అసలు బీహార్ ఎన్నికల్లో అర్జేడీకి ఎక్కువ ఓట్లు రావు అని భావించినా కానీ జేడీయూ కంటే  అర్జేడీకే ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాగూ మొదటి నుండి నితీశ్ నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కాబట్టి ఆయనే బీహర్ ముఖ్యమంత్రిగా ఉంటారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. మరి లాలు పరిస్థితి ఎంటి అన్నది ప్రశ్న.. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఆయన కొడుకులకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి ఆయన నితీశ్ కుమార్ తో మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. దీంతో లాలు చిన్న కొడుకు తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మోడీకి రాహుల్ గాంధీ సవాల్..

ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. తన పౌరసత్వంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్ష నేతలు నాపై కావాలనే బురద చల్లుతున్నారని.. నా పౌరసత్వంపై వెంటనే దర్యాప్తు చేయండి.. ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే ఏ చర్యలకైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. నేను మోడీని చూసి భయపడటం లేదు.. దమ్ముంటే తానే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయాలి.. అనుచరులతో ఇలా మాట్లాడించడం సరికాదు అని అన్నారు. కాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని..అతనికి లండన్ పౌరసత్వం ఉందని..దీని గురించి నేను ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ కు కూడా లేఖ రాశాను.. భారత్ ద్వంద్వ పౌరసత్వం ఒప్పుకోదు కాబట్టి రాహుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు.

ఒక్కరోజులో మావోయిస్ట్ ల కలకలం.

ఒకేసారి పలు సందర్బాల్లో మావోయిస్టులు అరెస్ట్, ఎన్ కౌంటర్లతో కలకలం రేగింది. చాలా రోజుల తరువాత మళ్లీ చత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 15 మంది మావోలు చనిపోగా వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులను మావోలు కిడ్నాప్ చేయడం. ఖమ్మం జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నాయకులును కిడ్నాప్ చేసి అనంతరం మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట తమ డిమాండ్లతో ఒక లేఖను రాశారు. అందులో 1). వరంగల్ జిల్లాలో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలి. 2). ఖమ్మం జిల్లా నుంచి అదిలాబాద్ వరకూ నిర్వహిస్తున్న కూంబింగ్ ను నిలిపివేయాలి. 3). ఎన్ కౌంటర్ పేరిట హత్యల్ని ఆపేయాలని లేదంటే.. టీఆర్ ఎస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన కొంత సేపటికి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మావోయిస్ట్ సానుభూతి పరులంటూ ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించారు. మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ జనార్ధన్ ఉరఫ్ ఐతు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన  వరంగల్ జిల్లా పోలీసుల వద్ద లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లో దశాబ్ద కాలం పాటు పని చేసిన ఇతను లొంగిపోవటం మావోలకు తీరని లోటుగా చెబుతున్నారు. ఇతని పేరు మీద రూ.20లక్షల రివార్డు ఉంది.

నితీశ్ చంద్రబాబును లైట్ తీసుకున్నారా?

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ ఈ రోజు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ అంగరంగ వైభవంగా జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులను.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. కానీ ఇంతమందికి ఆహ్వానం పంపించిన నితీశ్ మాత్రం ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును మాత్రం ఆహ్వానించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మోడీకి చంద్రబాబు సన్నిహితుడు కాబట్టి ఆహ్వానించలేదా అని అనుకుంటున్నారు.. కానీ అలా అయితే నితీశ్ మోడీనే ఆహ్వానించారు కదా.. మరి చంద్రబాబును ఆహ్వానించడంలో ఏముంది అని మరికొందరు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందునా నితీశ్ కు చంద్రబాబుకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ సుపరిచితులే.. అయినా చంద్రబాబును మాటవరుసకైనా ఆహ్వానించకుండా ఎందుకు లైట్ తీసుకున్నారా అని ఇప్పుడు అందరి ప్రశ్న. అంతేకాదు బాబుకు ఇన్విటేషన్ అందకపోవటంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా ఆరా తీశారని చెబుతున్నారు. మరి చంద్రబాబును నితిశ్ ఆహ్వానించకపోవడానికి గల కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి.

ఈసారి మోడీకి ఆ అవకాశం దక్కతుందా?

టైమ్స్ పత్రిక ప్రతి ఏటా 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ను ఎంపిక చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి 2015 ఏడాదికి 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో భారత్ ప్రధాని నరేంద్రమోడీతోపాటు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత సంతతికి చెందిన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. అంతేకాదు వారు ఈ పత్రిక వారి గురించి కొంచెం భ్రీఫింగ్ కూడా ఇచ్చింది. భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ.. విదేశీయులతో మంచి సత్సంబంధాలు ఏర్పరుచుకుంటూ అక్కడ పెట్టుబడులతో ఆధునీకరించే దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాని ఈమధ్య దేశంలో మత పరమైన విమర్శలు ఎక్కవయ్యానని.. అంతేకాదు.. బీహార్ ఎన్నికల ప్రభావం కూడా కొంత పడుతుందని పేర్కొన్నారు. ఇక అంబానీ టెలికామ్ సంస్థల నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ముడి చమురు రిఫైనరీ కలిగిన వ్యక్తి అని టైమ్ తెలిపింది.  భారత సంతతికి చెందిన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ పదకొండేళ్లు గూగుల్ లో పని చేసి ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కుడిభుజంగా పేరొంది ప్రస్తుతం ఆ సంస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నాడని టైమ్ పేర్కొంది. కాగా ఈరేసులో రష్యా ప్రధాని పుతిన్ కూడా ఉన్నారు. కాకపోతే ఈయన మోడీ కంటే కొంచెం వెనుకలోనే ఉన్నారని తెలుస్తోంది. మోడీకి ఇంతవరకూ 1.3 శాతం ఓట్లు రాగా పిచాయ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కూడా అదే శాతం ఓట్లు వచ్చాయి. అంబానీకి అతి తక్కువగా 0.2 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈ సారి 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' మోడీని వరిస్తుందో లేదో తెలియాలంటే వచ్చేనెల వరకూ ఆగాల్సిందే.

1000కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వండి.. చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా చాలా నష్టం జరిగింది. అనేక చెరువులు కట్టలు తెగిపోయి.. రోడ్లు విరిగిపోయి వరదలు వచ్చి చాలా ఆస్తి నష్టం జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఏరియల్ సర్వే కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైందని.. వరదల కారణంగా జరిగిన నష్టనివారణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులకు రూ.1000కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖలు పంపించారు. మొత్తంగా రూ.3వేల కోట్ల నష్టం జరిగినట్టు ఉందని.. అంచనాలు వేసి లెక్కలు కట్టిన తర్వాత తుది నివేదికను పంపుతామని.. ప్రస్తుతానికి మొదటిగా వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు.

గాడిదకు గడ్డేసి.. మోడీని అడిగితే ఎలా? కిషన్ రెడ్డి..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తూటాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్ధులను ఏకిపారేయడంలో తన స్టైలే వేరు. తిట్లతో పాటు సామెతలని కూడా యాడ్ చేస్తూ చాలా గమ్మత్తుగా తిడుతుంటారు. అలా కేసీఆర్ తరుచూ వాడే సామెతే (గాడిదకు గడ్డేసి… ఆవును పాలు ఇవ్వమంటే ఇస్తుందా ?) ఇప్పుడు కేసీఆర్ పై ప్రయాగించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వరంగల్ ఉపఎన్నికల ప్రచార నేపథ్యంలో కేసీఆర్ అందరిని విమర్శించినట్టే కిషన్ రెడ్డిని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సమయంలో రాజీనామా చేయమని కిషన్ రెడ్డిని అడిగితే దద్దమ్మలా పారిపోయాడని అన్నారు. అంతే దీనికి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ స్టైల్ లోనే ఆయనకు ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని నేతలు మోడీని విమర్శిస్తున్న నేపథ్యంలో.. గాడిదకు గడ్డేసి.. మోడీని అడిగితే ఏం లాభం అంటూ కేసీఆర్ ను గాడిద అనేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందేమో అని భయపడే ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మొత్తానికి సైలెంట్ గా ఉండే కిషన్ రెడ్డి కేసీఆర్ స్టైల్లోనే కేసీఆర్ ను గాడిద అని విమర్శించడంతో అందరూ షాకవుతున్నారు.

‘నువ్వెంత అంటే నువ్వెంత’ .. రావెల వర్సెస్ ఎంపీపీ

టీడీపీ మంత్రి రావెల కిశోర్ బాబుకు తన సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడులో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రావెలపై ఎంపీపీ తోట లక్ష్మీ కుమారి విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి రావెల గుంటూరు జెడ్పీ సమావేశంలో పాల్గొనగా.. ఈ సమావేశంలో పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే వారు గ్రామాల సమస్యల్ని తెలుపుతున్న నేపథ్యంలో  తోట లక్ష్మీ కుమారి కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి రావెల కలుగజేసుకొని ‘నువ్వు మాట్లాడటానికి చాలా టైమ్‌ ఉంది.కూర్చోవమ్మా అని అడ్డుపడ్డారు. దీంతో లక్ష్మీ కుమారికి, రావెలకి మధ్య వాగ్వాదం నెలకొంది. సుమారు అరగంట సేపు వీరిద్దరూ వాదులాడుకోవడం..‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో మాటల యుద్ధం జ‌ర‌గ‌డం.. ఇద్దరి అనుచరుల మధ్య తోపులాట కూడా జరగింది. దీంతో ఆగ్రహం చెందిన రావెల అక్కడినుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రావెల తీరుపై అక్కడి ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రిగా ఆయన ఇలా ప్రవర్తించడం తగదని.. ప్రజాప్రతినిధులను గౌరవించాలని మండిపడుతున్నారు. ఆఖరికి ఈ గొడవ కాస్త చంద్రబాబు దృష్టికి వెళ్లడం జరిగింది. మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

రష్యా విమానం.. జ్యూస్‌ టిన్‌‌లో బాంబు పెట్టి పేల్చేశాం.. ఐసిస్

ఇటీవల ఈజిప్ట్ లో రష్యా విమానం కూలిపోయి అనేక మంది ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. ఈజిప్ట్ లోని సినాయ్ పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అప్పుడు అధికారులు తెలిపినా దానికి కారణం ఉగ్రవాదులే అని అనుమానం వ్యక్తమయింది. ఆతరువాత ఉగ్రవాదులే విమానాన్ని పేల్చేసినట్టు చెప్పారు.. కానీ మొదట ఆ ప్రకటనను ఎవరూ నమ్మకపోయినా ఆఖరికి అది నిజమే అని తేలింది. అయితే ఇప్పుడు అసలు విమానాన్ని ఎలా పేల్చారు అన్నదానిపై వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా విమానాన్నితాగిపారేసిన పైనాపిల్‌ జ్యూస్‌ టిన్‌‌లో డిటోనేటర్‌ను అమర్చి పేల్చివేసినట్టు తెలిపారు. ఈ బాంబు విమానంలోకి తీసుకెళ్లడంలో మా అనుచరులు పోలీసులను బురిడి కొట్టించారని అన్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన బాంబు ఫొటోను.. బాంబును విమానంలోకి చేర్చిన ప్రయాణికుల పాస్ పోర్టు ఫోటోలను కూడా తమ అధికార మ్యాగజైన్ ఢబిక్ లో ప్రచురించారు. తమపై బాంబుల వర్షం కురిపించే దేశాలకు ఇది ఓ హెచ్చరిక అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

మోడీ తరువాత స్థానాన్ని ఆక్రమించిన కేజ్రీవాల్

ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ట్విట్టర్ ఫాలోవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరికి కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు మోడీ. ఇప్పుడు ప్రధాని తరువాత ఆస్థానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఆక్రమించారు. మంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ ఘనత సాధించిన రెండో రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ అవతరించారు. రాత్రికి ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరిందని ట్విట్టర్ లో 60 లక్షల మార్క్ ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ తెలిపారు. కాగా మోడీకి మొత్తం 1.6 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఒకరు

నా జీవితంలోనే ఎపుడూ చూడలేదు.. చంద్రబాబు

భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలైపోయింది. ఈ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాఫ్టర్ ద్వారా జిల్లాను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన నెల్లూరుజిల్లాలో సంభవించిన వర్షాలకు ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. పర్యవేక్షణ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఇలాంటి వర్షం తన జీవితంలోనే ఎపుడూ చూడలేదని ఆయన అనడం గమనార్హం. అంతేకాదు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ వర్షాల గురించి ప్రధానికి వివరించారు. అయితే... వర్షసూచన తెలియడంతో ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడం.. జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం బాగా తగ్గింది.