Nallari Kiran Kumar Reddy. Pileru

పట్టువీడలేదు... పదవి దక్కేనా!

    ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పార్టీ ఏర్పాటు చేసి తరువాత అన్నింటినీ పక్కన పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ నుంచి ఓ పెద్ద పదవి వరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా మృతి చెందారు. అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 1978 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారం ఇచ్చారు. ఆయన మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి తల్లి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే.. ఆ తరువాత ఓటమి చవి చూసారు.  అనంతరం 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చీఫ్ విప్ గా, స్పీకర్ గా కూడా పదవులు అధిరోహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ , అజహరుద్దీన్ తో కలసి వివిధ స్థాయిల్లో క్రికెట్ ఆడారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అనివార్యంగా ప్రవేశించారు. నిజాం కాలేజీలో నందమూరి బాలకృష్ణ.. కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చదువుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి గా పని చేశారు.ఆయన సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన తరువాత గత ఎన్నికల వరకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు.2024 ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరుపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వాక్చాతుర్యం తో రాజంపేట పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దిరెడ్డి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ పై స్పందించే రీతిలో ప్రసంగించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తో జిల్లా రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటూ పైచేయి సాధించారు.  గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన.. తన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని పీలేరు ఎమ్మెల్యే గా గెలిపించారు. పావు నరసింహారావు ఆశీస్సులతో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కిరణ్ కుమార్ రెడ్డి తండ్రికి ఉన్నా అది నెరవేరలేదు... తండ్రిఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నెరవేర్చారు.  తన ఇంట్లో అధికారం ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. నేటికి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. తమ ఇంటి గడప వద్దకు వచ్చి ఏమి కావాలనే అడిగితే అది జరుగుతుంది అన్నది నియోజకవర్గ ప్రజల మాట. కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం దృష్ట్యా బీజేపీ పార్టీ ఆయనకు అత్యున్నత స్థాయి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Ration shops

ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభం.. సరకులు పంపిణీ చేసిన మంత్రులు

  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ  రేషన్ షాపులు తెరుచుకున్నాయి. 29,796 రేషన్‌ దుకాణాల్లో సరకులు పంపిణీ చేస్తున్నారు.  కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చౌకధరల దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ రేషన్‌ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరకులు అందజేశారు.  కర్నూలులో మంత్రి టీజీ భరత్‌, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.   ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తామ సివిల్ సప్లై అధికారులు తెలిపారు. 1 కోటి 46 లక్షల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేశారు.  

Yadagirigutta

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కారు పార్కింగ్‌, బస్టాండ్‌ ప్రదేశాల్లో సందడి నెలకొంది. ఆలయ పరిసరాల్లో ఈవో వెంకట్రావు తిరుగుతూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో ఆలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

BRS MLC Kavitha

క‌విత ఇర‌వై ల‌క్ష వాచీకే షాకైన జ‌నం

  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అంటూనే అటు త‌న సొంత నిర్ణ‌యాలు తాను తీసుకుంటున్నారు. త‌న తండ్రి చేసే తప్పులు వ‌రుస‌గా దిద్దే య‌త్నం చేస్తున్నారు. మొద‌టిది తెలంగాణ వాదాన్ని తిరిగి త‌ట్టి లేపడం. అందుకే అట‌క మీదున్న తెలంగాణ జాగృతి బుట్టను కింద‌కు దించారు. ఎక్క‌డో ఉన్న రాజీవ్ పేరిట ఇంకా ప‌థ‌కాలు పెట్ట‌డ‌మేంటి? ఇక్క‌డి వారి  పేర్లు పెట్టాలి అంటూ ఆమె తెలంగాణ యాంగిల్ ని తిరిగి ట‌చ్ చేశారు. ఈ దిశ‌గా సంకేతాల‌ను ఇచ్చారు. ఇపుడామె స్కెచ్ ఏంటంటే, ఆనాడు భాష ద్వారా  క‌ల‌సిన ఆంధ్ర నుంచి వేరు ప‌డ్డానికి మొద‌లైనది తొలి ఉద్య‌మం అయితే.. త‌న తండ్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో జ‌రిగింది మ‌లి తెలంగాణ ఉద్య‌మం అయితే.. త‌న తండ్రే రేప‌టి రోజున  జైలుకు వెళ్తే.. మూడో మారు ఉద్యమం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయ‌న్నొక జాతి పిత‌గా  ప‌దే ప‌దే అంటూ, ఇటు అధికార  పార్టీకి అటు తెలంగాణ వాదుల్లోకి ఒక సంకేతాల‌ను పంపారు.  కేసీఆర్ కి నోటీసులు ఇవ్వ‌డం అంటే అది తెలంగాణ‌కు నోటీసులు ఇవ్వ‌డంతో స‌మాన‌మంటూ త‌న శ్రేణుల‌ను త‌ట్టి లేపుతున్నారు క‌విత‌. అంతే కాదు.. ఇందుకు బీసీ యాంగిల్ సైతం యాడ్ చేస్తున్నారు. బీసీల‌తో పాటు క్రిష్టియ‌న్- ముస్లిం- సిక్ వంటి మైనార్టీల‌తో స‌హా కొమ్ము కాస్తానంటూ ఆ  శ్రేషులంద‌రినీ తిరిగి రీయాక్టివేట్ చేస్తున్న చ‌ప్పుడు వినిపిస్తోంది.. ఆమె మాట‌ల్లో! ఒక వేళ కేసీఆర్ కి ఏదైనా జ‌రిగితే వెంట‌నే వీరంద‌రి సాయంతో ప్ర‌త్య‌ర్ధుల‌ను తిరిగి  తెలంగాణ వాదంతో కొట్టేలా ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇదంతా ఒక సెక్యూరిటీ ప‌ర్ప‌స్. భ‌ద్ర‌తాకంచె క‌ట్ట‌డంలో భాగ‌మే అన్న‌ది  రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఇక్క‌డ క‌వితే ఎందుకంటే.. ఇటు కేటీఆర్ అటు హ‌రీష్ సైతం కాళేశ్వ‌రం అనే ఒక స‌మ‌స్య‌లో ఉన్నారు. కేటీఆర్ సంగ‌తి స‌రే స‌రి. ఈ కార్ రేస్ అనే క‌ళ్లం ఆయ‌న్ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్ప‌టికే సిద్ధం చేసి ఉంచారు. కాబ‌ట్టి.. తాను వీరందరిలోకి తానే సీనియ‌ర్ కాబ‌ట్టి.. లిక్క‌ర్ కేసులో ఇప్ప‌టికే జైలుకెళ్లి వ‌చ్చిన అనుభ‌వ‌జ్ఞురాలు కాబ‌ట్టి.. ఆమెకున్న ధైర్యం వీరికి ఉండ‌క పోవ‌చ్చు... అందుకే ఆమె లీడ‌ర్షిప్ హ్యాండిల్ చేయ‌డానికి ముందుకొస్తున్నారు. అంటే  ఈ ముగ్గుర్ని జైళ్ల‌కు పంపినా.. వ‌చ్చే రోజుల్లో త‌న శ్రేణుల‌తో క‌ల‌సి మూడో ఉద్య‌మం చేసి.. రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించ‌డానికి ఆమె ప్లాన్ చేస్తున్నార‌న్న మాట‌. అందుకే అంటోంది కేసీఆర్ పై ఈగ‌వాల‌నియ్యం అంటే దాన‌ర్ధం ఇదేన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక వేళ కేసీఆర్ జైలుకెళ్లే ప‌రిస్థితి వ‌స్తే.. క‌విత త‌న జాగృతి శ్రేణుల ద్వారా మ‌రో తెలంగాణ ఉద్య‌మానికి రంగం సిద్ధం చేస్తున్నార‌న్న‌మాట‌.ఇక క‌విత త‌న  ద‌గ్గ‌రున్న నిధుల‌ను ఈ ఉద్య‌మాల‌కు వాడుతారా? లేక డాడీ నుంచి తీసుకుంటారా? అని కొంద‌రికి అనుమానం. అయితే లిక్క‌ర్ స్కామ్ లో క‌విత ఒక స్తాయిలో వెన‌కేసిన‌ట్టుగా చెబుతారుకొంద‌రు. కాదు.. కేసీఆరే స్వ‌యంగా త‌మ ద‌గ్గ‌ర అధికారికంగా వెయ్యి కోట్ల ధ‌న‌పు నిల్వ‌లున్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఒక స‌మ‌యంలో బీజేపీయేత‌ర పార్టీల‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చు సైతం తానే భ‌రిస్తాన‌ని అన్నారు.  అలాంటిది కేసీఆర్ త‌న బిడ్డ‌కు ఇవ్వ‌రా? అన్న‌ది మ‌రో వాద‌న‌.ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ క‌బ‌డ్డీలో.. ప్ర‌ధాన ఆట‌గాళ్లు బ‌రి బ‌య‌ట ఉన్నారు. ఇప్ప‌టికే ఈ కార్ రేసులో కేటీఆర్ దాదాపు ఔట్ అయ్యే ప‌రిస్థితి. కాళేశ్వ‌రం ఇష్యూలో ఇటు కేసీఆర్ అటు హ‌రీష్ సైతం నిందితులుగా ముద్ర వేయించుకున్నారు. దాన్ని కాంగ్రెస్ క‌మీష‌న్ అన్నా, కాళేశ్వ‌రం క‌మీష‌న్ అన్నా.. దాని ప‌ని అది చేస్తుంది. ఇక మిగిలింది స‌బ్ స్టిట్యూట్ క‌విత మాత్ర‌మే. ఆమె ఒక్క‌రే ఈ ముగ్గురు మ‌రాఠీల‌ను గ‌ట్టెక్కించ‌గ‌ల స‌మ‌ర్ధురాలుగా అంచ‌నా. అందుకే ఇంత హైడ్రామాగా భావిస్తున్నారు.  ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి కేసీఆర్ కి ఏ చిన్న హాని  జ‌రిగినా వెంట‌నే క‌విత త‌న జాగృతిని తెలంగాణ అనే ఆయుధంతో తిరిగి జాగృతం చేస్తార‌న్న‌మాట‌. మ‌రి దీనంత‌టికీ కాంగ్రెస్ రెడీగా ఉందా? ఇప్ప‌టికే సీఎం రేవంత్ కి రాహుల్ అపాయింట్మెంట్లు దొర‌క‌డం లేదు. పొమ్మ‌న లేక పొగ పెడుతున్నార‌న్న టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌నంత చొర‌వ తీసుకుంటారా? లేక ఏది ఏమైనా త‌న‌ను జైలుకు పంపిన కేసీఆర్ పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకుంటారా? తేలాల్సి ఉంది. ఇందుకు క‌విత రియాక్ష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌న్న కొత్త ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేస్తోంది.

 northeastern states

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు..25 మంది మృతి

    ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో మూడు రాష్ట్రాలు విలవిల్లడుతున్నాయి. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో25 మంది వరకు మరణించారు. అస్సాం రాజధాని గౌహతి లో మట్టి కూరుకుపోయి ఐదుగురు మరణించారు.  మణిపూర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు వల్ల ఇంఫాల్ నగరం జీవితం స్తంభించింది. ఇంఫాల్ నది ఒడ్డున నివసిస్తున్నవారు పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని  అధికారులు సూచించారు. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1,500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.  గల్లంతయిన 8 మంది పర్యాటకుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలకు వర్షాల వల్ల ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.  అరుణాచల్‌ప్రదేశ్‌లో 9 మంది చనిపోయారు.  ఈస్ట్‌ కామెంగ్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ వాహనం లోయలోకి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిగువ సుబాన్‌సిరి జిల్లాలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గువాహటిలో ఒక్క రోజే 111 మి.మీ వర్షం పడింది.  67 ఏళ్లలో ఇదే రికార్డు వర్షపాతం అని అధికారులు వెల్లడించారు.  

asi sucide

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడపలో జరిగింది. కడప రైల్వే స్టేషన్ పరిధిలోని సిద్దవటం కనుమలోపల్లి వద్ద రైలు పట్టాలపై ఏఎస్ఐ బుక్కే పురుషోత్తమ్ నాయక్ మృత దేహాన్ని శనివారం (మే 31( కనుగోన్నారు. తన ఇంటి నుంచి శనివారం  ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్ కోసం అని చెప్పి బయటకు వెళ్లిన ఏఎస్ఐ పురుషోత్తమ్ నాయక్ కనుమల్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొన్నారు.    చక్రాయపేట మండలం కల్లూరు పల్లె తండా కు చెందిన ఏఎస్ఐ కడప పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఏఎస్ఐ పురుషోత్తం ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పురుషోత్తమ్ నాయక్ మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంతరించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు, అనారోగ్యం కారణంగానే ఏఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు మృతుడి  కుమారుడు విశ్వ క్సేన్ నాయక్ ఎక్సైజ్ శాఖలో డిఎస్పి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు.

leopard in tirumala metls margam

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం  కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో 500వ మెట్టు వద్ద చెట్ల పొదలలో సేదదీరుతున్న చిరుతను గమనించిన భక్తులు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి చిరుతను అడవిలోకి తరిమేశారు.   చిరుత కలకలంతో శ్రీవారి మెట్టు ప్రారంభంలో చెకింగ్ పాయింట్ వద్ద భక్తులను మొదట అధికారులు అనుమతించలేదు. పరిస్థతి పూర్తిగా సద్దుమణిగాక భక్తులను గ్రూపుల వారీగా విభజించి మెట్ల మార్గంలోకి అనుమతించారు. వారం రోజుల వ్యవధిలో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కనిపించడం ఇది రెండో సారి. గత నెల 25న ఇదే మార్గంలో 350వ మెట్టు వద్ద భక్తులు చిరుతను గుర్తించారు. అప్పట్లో ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత సంచారం కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు మెట్ల మార్గంలో ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. ఇక పోతే 12 సంవత్సరాలలోపు వయస్సున్న వారిని మెట్ల మార్గంలో కొండపైకి అనుమతించకూడదని నిర్ణయించారు.  భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది మెట్ల మార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. 

devotees rush continue in tirumala

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి.  ఆదివారం (జూన్ 1) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (మే 31) రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారిని మొత్తం 95 వేల 80 మంది శ్రీవారిని దర్శించుకోగా వారిలో 39 వేల 668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా కానుకల ఆదాయం 3 కోట్ల 47లక్షల రూపాయలు వచ్చింది.  

opposition party leader name to mallampally mandal

మల్లంపల్లి మండలానికి బీఆర్ఎస్ నేత పేరు.. మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క

రాజకీయం అంటే ప్రత్యర్థులపై కేసులు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపులుగా మారిపోయిన నేటి రోజులలో ఓ నాయకురాలు మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు చేసిన సేవలను గుర్తించి ఒక మండలానికి ఏకంగా ఆయన పేరునే ప్రతిపాదించి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఔను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క ప్రతిపాదనను గౌరవించి ఓ మండలానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడి పేరు పెట్టింది.    ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేస్తూ శనివారం (మే 31) గెజిట్‌   విడుదలైంది. ఇంతకీ జేడీ ఏమిటంటారా. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జడ్పీ మాజీ అధ్యక్షుడు  దివంగత కుసుమ జగదీష్‌.   బీఆర్‌ఎస్‌  రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లంపల్లిని మండ లంగా ప్రకటించాలంటూ కుసుమ జగదీష్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్‌  రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  కాగా  కుసుమ జగదీష్‌ ఇటీవల మరణించారు. ఆ సమయంలో కుసుమ జగదీష్ కు నివాళులర్పించిన సీతక్క.. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెడతామనీ, ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాననీ హామీ ఇచ్చారు.  ఆ మాట నిలబెట్టుకున్నారు. కుసుమ జగదీష్ సేవలకు గుర్తింపుగా మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెట్టాలన్న మంత్రి సీతక్క ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు చేరుస్తూ జేడీ మల్లంపల్లిగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.  రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరును మండలానికి పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందుకు కృషి చేసిన మంత్రి సీతక్క రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేశారంటూ మల్లంపల్లి మండల సాధన సమితి సభ్యులు, ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.

Superstar impressed to the homesty of that kid

ఆ బాలుడి నిజాయితీకి సూపర్ స్టార్ ఫిదా!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా ఆ బాలుడు చిన్నతనంలోనే తన నిజాయితీతో ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన ఆత్మవిశ్వాసం, తనది కాని సొమ్ము వద్దంటూ కరాఖండీగా చెప్పిన తీరు సూపర్ స్టార్ రజనీని సైతం ముగ్ధుడిని చేశాయి. ఔను.. ఆ ఏడేళ్ల బాలుడి నిజాయితీకి, ఆత్మ విశ్వాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారు. తనది కాని సొమ్ము తనకు వద్దని నిష్కర్షగా చెప్పడమే కాదు.. అంతకంతా తాను సంపాదించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తమిళనాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెడితే..  మహ్మద్ యాసిన్ తనకు రోడ్డుపై దొరికిన 50 వేల రూపాయలను తీసుకుని తిన్నగా పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసు అధికారికి ఆ సొమ్ము ఇచ్చి ఎవరో పారేసుకున్నారు. జాగ్రత్తగా వారికి అందజేయండి అని రిక్వెస్ట్ చేశాడు. సహజంగానే ఆ పోలీసు అధికారి బాలుడి నిజాయితీకి ముచ్చటపడ్డాడు. ఇంత డబ్బు నీకు దొరికింది.. నువ్వే ఉంచేసుకోవచ్చుకదా.. అన్న ఆ పోలీసు అధికారికి ఆ ఏడేళ్ల బాలుడు ఇచ్చిన సమాధానంతో నోట మాటరాలేదు. ఆ బాలుడేమన్నాడంటే.. అది ఎవరో కష్టపడి సంపాదించిన సొమ్ము.. అది నాది కాదు..నాది కాని డబ్బును నేనెలా తీసుకుంటాను అంటూ అమాయకంగానే అయినా చాలా ధృఢంగా చెప్పాడు. దీంతో ఆ బాలుడి నిజాయితీకి ముగ్ధుడైన పోలీసు అధికారి..  నీ కోసం నేనేదైనా చేయాలని ఉంది.. ఏం చేయమంటావు అని అడిగితే.. మహ్మద్ యాసిన్ జవాబు ఏమిటో తెలుసా.. సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూడాలని ఉందని. విషయాన్నిపోలీసులు రజనీకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పందించి రజనీ కాంత్ మహ్మద్ యాసిన్ ను తన వద్దకు పిలిపించుకున్నారు. దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఆ పిల్లవాడి చదువు బాధ్యత తీసుకున్నారు. ఆ కుర్రవాడు ఎక్కడ చదువుకోవాలనుకుంటే అక్కడ, ఎం చదువుకుంటానంటే అది.. ఎంత ఖర్చైనా ఆ బాధ్యతంతా తనదేనని చెప్పారు. నిజాయితీకి కులం, మతం ఉండవనీ, అది పుట్టుకతో అబ్బే సుగుణమని అన్న రజనీకాంత్ అలాంటి సుగుణాల పుట్ట అయిన మహ్మద్ యాసిన్ అందరికీ ఆదర్శం అని మెచ్చుకున్నారు.  

miss world 2025 winner Opal Suchata

మిస్ వరల్డ్ గా థాయ్ లాండ్ భామ

హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో థాయ్ లాండ్ భామ విజేతగా నిలిచింది.  ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడగా వారందరినీ అధిగమించి థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుదాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీలలో ఫస్ట్ రన్నర్ అప్ గా ఇథియోపియా, సెకండ్ రన్నర్ అప్ గా పోలెండ్ కు చెందిన అందాల భామలు నిలిచారు. భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటానికి పోటీపడిన నందిని గుప్తాకు నిరాశే మిగిలింది.  అందం, అభినయం, ప్రతిభల మేలు కలయికతో ఓపల్ సుదాత చువాంగ్ శ్ఱీ మిస్వరల్డ్ కిరీటం అందుకున్నారు.   థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మోడలింగ్ పట్ల ఇష్టం, ఆసక్తితో ఈ పోటీలలో పాల్గొన్నారు.  2022లో జరిగిన మిస్ యానివర్స్ థాయ్ ల్యాండ్ పోటీలలో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఆమే.. 2024లో కూడా ఈ పోటీలలో పాల్గొని మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ టైటిళ్లు గెలిచారు.   16 ఏళ్ల వయసులో రొమ్ములో కణితితో బాధపడ్డారు సుచాత.   క్యాన్సర్ తో బాధపడే వారి పరిస్థితిని అర్ధం చేసుకుని,    ఓపల్ ఫర్ హెర్  ప్రాజెక్ట్ ద్వారా మహిళలలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు కృషి చేశారు.  సుచాత ప్రస్తుతం ధమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తున్నారు. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నఓపల్ సుదాత చువాంగ్ శ్రీకి రూ.8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం బహుమతిగా దక్కాయి. అలాగే ఏడాది పాటు ఉచిత ప్రపంచ యాత్ర చేసే అవకాశం లభించింది.  ఇక ఈ పోటీలలో భారత్ కు చెందిన నందినీ గుప్తాకు టాప్ 8లో స్థానం లభించలేదు. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు.   శనివారం(మే 31) రాత్రి హైటెక్స్ లో జరిగిన ఈ భారీ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ నటి ఖుష్బూ, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.అలాగే   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కూతురు నైమిషా రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన భార్య నందిని, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ips harish kumar gupta takes charge as apdgp

డీజీపీగా శ్రీ హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు.   మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన రాష్ట్ర పోలీస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.    1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా  విజిలెన్స్అండ్ ఎన్ ఫోర్స్ మెంట్  విభాగం డైరెక్టర్  జనరల్  పోస్టులో కొనసాగుతూ ఇంత వరకూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పదవీ  విరమణ తేదీతో సంబంధం లేకుండా డీజీపీగా ఆయన  రెండేళ్లపాటు   కొనసాగనున్నారు. గత నాలుగు నెలలుగా ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు. ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపిగా పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇన్ ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.  డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి  శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా నియమించింది. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పని చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం హరీష్ కుమార్ గుప్తాకు ఇన్ చార్జ్ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తి స్థాయి డీజీపీగా నియమించింది. 

all parties busy in internal fights

మూడు పార్టీలు.. ఒకటే ముచ్చట

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలు బజారు పడ్డాయి. పతాక స్థాయికి చేరాయి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు, పార్టీ, కుటుంబ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు మరింతగా ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయాలను రక్తి కట్టిస్తునాయి.  అయితే, అంతర్గత కుమ్ములాటలు ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమా అంటే కాదు..  అన్ని పార్టీలలో ఉన్నదే.. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలలోనూ అదే పరిస్థితి వుంది.  మూడు పార్టీలలో ఒకటే ముచ్చట నడుస్తోంది. చిన్న గీత పెద్ద గీత అంతే, అదొక్కటే తేడా, మిగిలినదంతా సేమ్  టూ సేమ్.  అవును..  అన్ని పార్టీలలో, ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీలోనూ ధిక్కార స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలను చిన్నా పెద్ద నాయకులు ప్రశ్నిస్తున్నారు. గీత దాటుతున్నారు. నేతలను నిలదీస్తునారు. అంతే కాదు.. ఇదొక అంటూ వ్యాధిలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, ఒక నాయకుడి నుంచి మరో నాయకుడికి   పాకుతోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలకు పదవీ కాంక్ష ఒక ప్రధాన కారణం అయితే..  రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్య పరిధి, పరిమితి రోజురోజుకు కుచించుకు పోవడం మరో ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవీ కాంక్ష పై కొచ్చినప్పుడు బంధాలు, బాంధవ్యాలు కూడా కొట్టుకు పోతున్నాయని అంటున్నారు. నిజానికి, ఈ రోజు బీఆర్ఎస్ లో  జరుగుతున్న పరిణామాలను గమనిస్తే,  ఇది ఫక్తు పదహారణాల కుటుంబ కలహాల చిత్రం లా సాగుతోందని అంటున్నారు. అన్నా, చెల్లి మధ్య కుర్చీలాటగా మొదలైన వివాదం మెల్లమెల్లగా కుటుంబ పరిధిని, పార్టీ పరిధిని దాటి ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది. ఒక చోటి నుంచి ఒక చోటికి పాకుతూ.. పక్క దారులు పట్టి పోతోంది.  రాష్ట్ర హద్దులు దాటి  జాతీయ మీడియాలోనూ చర్చకు వస్తున్నా పెద్దాయన కేసీఆర్  పెదవి విప్పక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. నిజానికి.. ఆయన తలచుకుంటే, సమస్య ఇంత వరకు వచ్చేది కాదని, అయినా ఆయన మౌనంగా ఉండడమే కాకుండా, మధ్య వర్తిత్వం జరిపేందుకు ముందుకు వచ్చిన కుటుంబ, పార్టీ పెద్దలకు కూడా పర్మిషన్ ఇవ్వ లేదని అంటున్నారు. మరోవంక కవిత, కేసీఆర్ ను కలిసే  అవకాశం వచ్చినా కలవలేక పోయానని,అంటున్నారు.  మరోవంక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత చేసిన కామెంట్ బీజేపీలో చిచ్చు పెట్టింది. అంతో ఇంతో ఇంకా క్రమశిక్షణ బతికున్న పార్టీగా భావించే బీజేపీలోనూ కవిత కామెంట్ నిప్పు పెట్టింది. ఫైర్ బ్రాండ్ ఎమ్మల్యేగా ముద్ర వేసుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  కవిత కామెంట్ ను ఎండార్స్ చేశారు. ఆమె చెప్పింది సత్యమని సర్టిఫికేట్ ఇచ్చారు.  అంతే కాదు.. రాష్ట్ర అపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. సరైన రేటు ఇస్తే, ప్లేటు మార్చేందుకు తమ పార్టీ నాయకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారని అన్నారు. ఆయన ఒకరనే కాదు..  కవిత ఇష్యూలో వేలు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించినా..  బీజేపీ నాయకులు ఎవరికి  వారుగానే సొంత అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నారు. కవిత విషయంలోనే కాదు.. అంతర్గత కుమ్ములాటల కారణంగానే పార్టీ  అధ్యక్ష ఎన్నిక ఒక అంతులేని కథల సాగుతోంది.  ఇక కాంగ్రెస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ముందు అసమ్మతి పుట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది అంటే అందులో తప్పులేదు. అదేమంటే,  మా పార్టీలో  అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ అంటారు. అందుకే.. పార్టీ ఎమ్మెల్సీ సభలోనే  ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. ఎమ్మెల్యేలు, నాయకులు పదవుల కోసం గాంధీ భవన్  మెట్ల మీదనే ధర్నా చేస్తారు. అంతవరకు ఎందుకు.. అంతర్గత కుమ్ములాటల కారణం గానే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినా ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కనీసం పీసీసీ  ఏర్పాటుకు కూడా మీన మేషాలు లెక్క పెట్టవలసి వస్తోంది.  సో. అంతర్గత కుమ్ములాటల విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట ..అంతర్గత ప్రజాస్వామ్యం లేక పోవడమే ఈ పరిస్థితికి కారణమని పరిశీలకులు అంటున్నారు.

kavitha dharna at indirapark on june 4th

కేసీఆర్ కోసం ధర్నా.. బీఆర్ఎస్ కాదు.. తెలంగాణ జాగృతి!

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ఈ నెల 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  అంతకంటే ఒక రోజు ముందు అంటే  జూన్ 4న కవిత ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఇప్పటికే కవిత పార్టీ లైన్ కు భిన్నంగా వెడుతున్నారు. తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం బీఆర్ఎస్ లో చీలికకు సంకేతంగా నిలిస్తే.. ఈ తరువాత మీడియాతో చిట్ చాట్ అంటూ ఆమె తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు.. ఆమెకు బీఆర్ఎస్ తలుపులు మూసేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ జాగృతి బ్యానర్ తో సొంతంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఆ అడుగుల్లో మొదటిదని చెప్పవచ్చు.  చావు నోట్లో తల పెట్టి.. తెలంగాణ సాధించిన  ప్రజానాయకుడు కేసీఆర్‌పై రాజకీయ కుట్రలు సాగడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నా కు పిలుపు నిచ్చారు. అలాగే.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత శనివారం ప్రారంభించారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  చాటిచెప్పడం, మహిళల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం  పోరాడుతున్న తెలంగాణ జాగృతి సంస్థ, ఇక కొత్త కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా ఉధృతంగా నిర్వహించనుందని అంటున్నారు.  

senior ips psr anjaneyulu fell ill

పీఎస్సార్ ఆంజనేయులుకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 31) అస్వస్థతతకు గురయ్యారు. విజయవాడ జిల్లా  జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ ప్లక్చుయేషన్స్ రావడంతో జైలు అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి ప్రత్యేక వార్డులో పీఎస్సార్ ఆంజనేయులుకు చికిత్స అందిస్తున్నారు.  సాయంత్రం వరకు వైద్యుల పరిశీలనలో ఉంచి  అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు.  అదలా ఉంటే   నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీసీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీకి అనారోగ్య కారణాలతో ఆయన విజ్ణప్తి మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు వంశీని  విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  

ఒక అల్లు అర్జున్.. మ‌హేష్ బాబు.. వైసీపీ ఈ హీరోల‌ను ఎందుకు ఓన్ చేసుకుంటోంది?

ఇవాళ సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే. దీంతో మ‌హేష్ బాబును ఓన్ చేసుకుంటూ ధూమ్ ధామ్ చేసేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.  గ‌తంలో అల్లు అర్జున్   నంద్యాల‌కు రావ‌డం నుంచి మొద‌లైంది అల్లు అర్జున్ మీద విప‌రీత‌మైన ప్రేమాభిమానం. అక్క‌డి  నుంచి వైసీపీ కేడ‌ర్ అల్లు అర్జున్ ని ప‌ట్టుకుని ఊగిపోవ‌డం మొద‌లైంది. అంతెందుకు లైలాను అదే ప‌నిగా బ్యాన్ చేసి దాన్ని ఆడ‌కుండా చేసింది ఇదే వైసీపీ  కేడ‌ర్.  కార‌ణం.. ఈ సినిమాలో న‌టించిన పృధ్వి చేసిన లెవ‌న్ కామెంట్లు. ఇలా సినిమాల‌ను ఎట్టి ప‌రిస్తితుల్లో లైట్ తీస్కోవ‌డం లేదు  వైసీపీ. అల్లు అర్జున్ బ్ల‌డ్ గ్రూప్ లో జ‌న‌సేన ఉంది. ఆ కాంపౌండ్ మొత్తం జ‌న‌ సైనికులే. కానీ అది గ‌తం. అర్జున్ భార్య కులాన్ని అడ్డు పెట్టుకుని బంధుత్వం క‌లిపేసుకున్నారు ఫ్యాన్ పార్టీ లీడ‌ర్లు. ఇప్పుడు అల్లు అర్జున్ స్వ‌త‌హాగా ఎలాంటి రాజ‌కీయ విధానం క‌లిగి ఉన్నారో ఏమో తెలీదు. కానీ..  వైసీపీ వాళ్లు మాత్రం.. అల్లు అర్జున్ మా హీరో అని ఓన్ చేసుకుంటున్నారు. ఆయ‌న ప్ర‌తి క‌ద‌లిక‌కూ కొమ్ము కాస్తున్నారు. సంధ్యా థియేట‌ర్ ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ వెన్నంటే ఉన్నారు. అల్లు అర్జున్ భుజాల‌ను అడ్డు పెట్టుకుని.. ప‌వ‌న్ క‌ళ్యాన్ ని గానీ ఆయ‌న జ‌న‌సైనికుల‌ను గానీ కొడితే అలా ప‌డి ఉంటుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఇక మ‌హేష్ బాబు సంగ‌తి స‌రే స‌రి. సూప‌ర్ స్టార్ కృష్ణ ఆనాడే ఎన్టీఆర్ ని వ్య‌తిరేకించిన వ్య‌క్తి. యాంటీ ఎన్టీఆర్ మూవీస్ సైతం తీసిన వారు. అంతేనా.. కాంగ్రెస్ నుంచి ఎంపీగానూ గెలిచిచారు. అలాంటి సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడైన మ‌హేష్ బాబు సైతం వారికి ఆరాధ‌నీయుడే. దీంతో కృష్ణ‌ను ఆయ‌న కొడుకు మహేష్ ను త‌మ కుటుంబ హీరోగానే ఫీల‌వుతుంది త‌ల్లి కాంగ్రెస్. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ దాన్ని కొన‌సాగిస్తోంద‌ని అంటారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రంటే బాల‌య్య‌. బాల‌కృష్ణ అంటే జ‌గ‌న్ కి ఎడ‌తెగ‌ని వీరాభిమానం. క‌డ‌ప జిల్లా ఫ్యాన్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ మాత్ర‌మే కాదు.. ఒక స‌మ‌యంలో బాల‌య్య సినిమాల‌ను సైతం డిస్ట్రిబ్యూట‌ర్ గా విడుద‌ల చేసేవాడ‌ని అంటారు. ఇదే బాల‌కృష్న‌ను ఒక స‌మ‌యంలో కాపాడిన‌ట్టుగానూ చెబుతారు. ఇక జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌, యోగి అనే సినిమా ప్రొడ్యూస‌ర్ కూడా.  జ‌గ‌న్ కుటుంబం కూడా సినిమాల‌తో లింక్ అప్ అయ్యి ర‌క‌ర‌కాల య‌త్నాలు చేశారు. కానీ అదెందుకో వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమాల  ప‌రంగా వారు ఏమి చేయ‌ద‌లిచినా ఎదురు దెబ్బ‌లు త‌గిలేవి. జ‌గ‌న్ డిస్ట్రిబ్యూట‌ర్ గా కావ‌చ్చు, ష‌ర్మిల ప్రొడ్యూస‌ర్ గా కావ‌చ్చు.. రివ‌ర్స్ లో న‌ష్టాలు లేదా చెడ్డ‌పేరే మిగిల్చాయి.  అయినా స‌రే వైసీపీ అభిమానులు.. మ‌న‌కంటూ ఒక హీరో ఉండాల‌న్న కోణంలో గ‌తంలో  మ‌హేష్ బాబు,  అల్లు అర్జున్ని ఓన్ చేసుకుంటూ.. ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో మూడువేల యాక్టివ్ కేసులు

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు మూడు వేల మందికి పైగా కరోనా సోకింది. వీరంతా వివిధ దశల్లో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.   దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతన్నా.. కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వ్యప్తి తీవ్ర స్థాయిలో ఉందని  వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కేరళలో ప్రస్తుతం  1,147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాతి స్థానంలో 424 కేసులతో మహారాష్ట్ర ఉంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉ:దంటున్నారు. అలాగే కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య  కూడా భారీగానే ఉందని చెబుతున్నారు.  ఈ నెల 25 నుంచి కరోనా వ్యాప్తి తీవ్రత అధికమైందంటున్నారు. గత నాలుగు రోజులుగా కరోనా బారిన పడిన వారి సంఖ్య మూడు రెట్టు పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.  రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3  కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

క్యూలైన్ లో రాజకీయ నినాదాలు జగన్ ప్రియ శిష్యుడి పనే!

టీటీడీకి సంబంధించి ఏదైనా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం జ‌రిగితే.. అందుకు బాధ్యులైన వారిపై కేసులు పెడ‌తామ‌ని ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు.  కానీ ఇవేవీ ఖాత‌రు చేయ‌ని కొంద‌రు త‌ర‌చూ ఏవో   అవాస్త‌వాల‌ను తిరుమ‌లకు ఆపాదించే య‌త్నం చేస్తున్నారు. నిజానికి తిరుమ‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేస్తే..  వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు.  ఈ విష‌యం తెలిసి కూడా కొంద‌రు కావాల‌నే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి రాజ‌కీయాల‌ను పుల‌మాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే గోవుల మ‌ర‌ణాల విష‌యంలో వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి పెద్ద ఎత్తున గొడ‌వ‌కు దిగ‌డం.. అదో పెద్ద రాజ‌కీయ దుమారానికి కార‌ణంగా నిల‌వ‌డం సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింద‌నుకునేలోపు.. ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో సౌక‌ర్యాలు స‌రిగా లేవంటూ కాకినాడ‌కు చెందిన అచ్చారావు అనే భ‌క్తుడు హ‌డావిడి చేశాడు. దీంతో అత‌డ్ని ప‌ట్టుకుని ఆరా తీసిన సిబ్బందికి తెలిసిందేంటంటే త్వ‌ర‌గా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తార‌నే ఆలోచ‌న‌తో తానిలా చేశానంటున్నాడీ భ‌క్తుడు.  ఇత‌డిలా అరిచి గోల‌ చేస్తుంటే ఇదే అద‌నుగా భావించిన ఒక‌రు వీడియో తీసి వ‌దిలారు. ఇపుడీ వ్య‌క్తి ఎవ‌రు? ఇత‌డి వెన‌కున్న ఉద్దేశ‌మేంటి? పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ ఎలాంటిద‌న్న‌ది విచార‌ణ చేస్తున్నారు పోలీసులు. అయితే టీటీడీలో భార‌త‌మ్మ సైన్యం ఒక రెండు వేల మంది వ‌ర‌కూ ఉన్నార‌ని అంటారు. వీరిలోని ఒక‌రే ఈ వీడియో తీశారా!? అన్న కోణంలో కూడా ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.  ఇంత‌కీ టీటీడీ నామ్స్ ప్ర‌కారం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఏం జ‌రుగుతుంది? అంటే ఐటీ యాక్ట్ వాడుతారు. ఆ త‌ర్వాత పోలీసులు కూడా కేసులు పెడ‌తారు.  త‌ప్పుడు ప్ర‌చారం చేసేవారిపై భార‌తీయ న్యాయ సంహిత 197, 353 సెక్ష‌న్ల ప్ర‌కారం శిక్షిస్తారు. మ‌రీ ముఖ్యంగా ఆధ్యాత్మిక ప‌రంగా ఇలాంటి త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేస్తే  వారిపై ఈ సెక్ష‌న్ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటారు. ఒక్కోసారి  ఆరు నెల‌ల నుంచీ జైలు శిక్ష, ఐదు వేల రూపాయ‌ల జ‌రిమానా సైతం విధిస్తారు. ఇప్పుడిక సౌకర్యాలు లేవంటూ క్యూలైన్ లో రాజకీయ నినాదాలు చేసిన భక్తుడు ఎవరా అన్న ఆరా తీస్తే.. వైసీపీ, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ కుట్ర కోణం బయటపడింది. ఇంతకీ    తిరుమలలో నిన్న క్యూ లైన్ లో హడావిడి చేసిన వ్యక్తి  కాకినాడ రూరల్ కి చెందిన వైసీపీ నేత. జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు. ఇతని పేరు బద్దిలి అచ్చారావు. వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ గా 2022లో జగన్ రెడ్డి పదవిని ఇచ్చాడు. ఆ అచ్చారావే.. నిన్న తిరుమల క్యైలైన్ లో సౌకర్యాలు లేవంటూ నానా హడావుడీ చేసి వివాదం సృష్టించాలని ప్రయత్నించాడు.  

అమ్మ కేసీఆర్.. ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులు ఎందుకివ్వ‌లేదో తెలిస్తే షాక్

కేసీఆర్ సినిమా ఇండ‌స్ట్రీని ఎందుకో చిన్న చూపు చూశారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే సినిమా వారితో మాత్రం కేసీఆర్ కుటుంబం స‌త్సంబంధాలు బాగానే నెరిపారు. ఒక ప‌క్క చూస్తే నాగార్జున భార్య అమ‌ల‌కూ, క‌విత‌కూ స్నేహ‌ముండేద‌ని అంటారు. మ‌రో ప‌క్క చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌మంత సైతం ఈ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన‌ట్టు చెబుతారు. ఇక ప్ర‌కాష్ రాజ్ కూడా ఒక దశ‌లో బీఆర్ఎస్ లో చేరుతార‌నే ప్రచారం కూడా జరిగింది.  ఇక కేసీఆర్ ప్ర‌భుత్వ చివ‌రి  రోజులలో క‌రోనా రావ‌డం. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా.. శ్రీనివాస యాద‌వ్ హ‌డావిడీ.. దాస‌రి త‌ర్వాత అంత‌టి సినీ ప‌ర్స‌నాల్టీ చిరంజీవి అన్న గౌర‌వ మ‌ర్యాద‌లు.. అంతా బాగుండేది.  కానీ సినిమా అవార్డులు మాత్రం ఇచ్చేవారు కాదు.  బీఆర్ఎస్ హ‌యాంలోనే తెలంగాణ యాస‌లో ఫిదా, బ‌ల‌గం వంటి సినిమాలు రావ‌డం.. ఆపై విజ‌య్ దేవ‌ర‌కొండ‌లాంటి అచ్చ తెలంగాణ‌కు చెందిన ఒక కుర్రాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ బేధాల‌కు అతీతంగా హీరోగా ఎద‌గ‌డం. చాంబ‌ర్లు కూడా వేరు కావ‌డం.. తెలంగాణ ద‌ర్శ‌కులు బాగా పెర‌గ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు సందీప్ రెడ్డి వంగ‌, నాగ అశ్విన్.. ఇలా ర‌క‌ర‌కాలుగా తెలంగాణా సినీ అభివృద్ధి పరిఢవిల్లిందనే చెప్పాలి.   తెలంగాణ సినిమాకు కావ‌ల్సింది అవార్డులు కావు.. వాటికంటూ ఒక పాల‌సీ అంటారు ఇంకొంద‌రు. గ‌తంలో ప్ర‌భుత్వ ప‌రంగా ఏదైనా స‌హాయ స‌హ‌కారాలు వెళ్తే అదంతా ఆంధ్రుల‌కే వెళ్లింద‌న్న అప‌వాదు ఉండేది.  అంతెందుకు ఇదే ఉద్య‌మ కాలంలో కొంద‌రు రాఘ‌వేంద్ర‌రావు వంటి వారు స్టూడియోల‌కు స్థ‌ల‌మిస్తే క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు క‌ట్టార‌న్న గొడ‌వ జ‌రిగింది. అలాగ‌ని కేవ‌లం స్టూడియో మాత్ర‌మే క‌డితే.. అది మ‌రో రామానాయుడు స్టూడియోలా త‌యార‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. ఈ స్డూడియో స‌రిగా న‌డ‌వ‌క‌.. క‌రెంటు చార్జీలు క‌ట్ట‌డానికి కూడా ఇబ్బంది క‌రంగా మారింది. ఇపుడీ స్టూడియోను ఉంచకోలేక‌, తీయ‌లేక సురేష్ అవ‌స్త‌లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి గొడ‌వ‌లు చాలానే.   అయితే బీఆర్ఎస్ పాల‌న‌లో ఎన్ శంక‌ర్ వంటి వారికి స్టూడియో నిర్మాణాల‌కు 5 ఎక‌రాల‌ స్థ‌లం ఇచ్చారు. త‌ర్వాత ఎవ‌రికీ పెద్ద‌గా ఈ దిశ‌గా ఎంక‌రేజ్ మెంట్ జ‌ర‌గ‌లేదు. కేసీఆర్ స్వ‌యానా ర‌చ‌యిత‌. తెలుగు సాహితీ  పిపాసి కూడా.  జైబోలో తెలంగాణ వంటి  సినిమాల ద్వారా కూడా ఆయ‌న త‌న ఉద్య‌మాన్ని న‌డిపించారు. అందులో ఒక పాట కూడా రాశారు. అయినా కూడా ఆయ‌నెందుకో తెలుగు సినిమా అవార్డుల‌ని ఇంత పెద్ద ఎత్తున ఇవ్వ‌లేదు. అస్స‌లు ప‌ట్టించుకోలేదు.  ఇక ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ల‌తో స‌మానంగా తెలుగు తెర‌ను ఏలిన కాంతారావు, కుటుంబం దీన ప‌రిస్థితుల్లో ఉంది. ఈ విష‌యంలో కూడా కేసీఆర్ గానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యులుగానీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. క‌రీంన‌గ‌ర్ కి చెందిన‌ పైడి జ‌య‌రాజ్ అనే ఒక న‌టుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు. ఆయ‌న కుటుంబాన్నీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గ‌తంలో విల‌న్ పాత్ర‌లు వేసిన ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఇక్క‌డి వారే. ఆయ‌న అయితే ఏకంగా చిత్ర‌పురి కాల‌నీ కోసం త‌న విలువైన స్థ‌లాన్ని కూడా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు.   టోట‌ల్ గా గ‌ద్ద‌ర్ అవార్డుల వ‌ల్ల మీకు హ్యాపీయేనా అని అడిగితే కొంద‌రు మాత్రం నాట్ హ్యాపీ అంటున్నారు.  ఎందుకంటే ఒక గ‌ద్ద‌ర్ అవార్డును స్మ‌గ్ల‌ర్ పాత్ర‌కు ఇవ్వ‌డం స‌రికాద‌ని చెబుతారు వీరు. అంతే కాదు ఒక రైట్ వింగ్ సినిమా ర‌జ‌కార్ కి లెఫ్ట్ వింగ్ ప్ర‌తీక అయిన గ‌ద్ద‌ర్ అవార్డు ఇవ్వ‌డ‌మేంటి? అస‌లు ఈ అవార్డుల‌న్నీ ఎవ‌రికి వెళ్లాయ్? ఈ అవార్డుల క‌మిటీలోని జ‌య‌సుధ‌, ముర‌ళీ మోహ‌న్ ఎవ‌రు?  వీరిలో ఎవరికీ కూడా అవార్డు సినిమా గుర్తింపే తెలీదు. వీరి ముందుకు స‌త్య‌జిత్ రే, శ్యాంబెన‌గ‌ల్ సినిమాల‌ను తీసుకొచ్చి పెట్టినా.. వాటిని తీసి ప‌క్క‌న పడేస్తారు. వీరు త‌మ‌కున్న సినిమా ప‌రిజ్ఞానంతో ఈ అవార్డులు ఇవ్వ‌లేదు. త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో ఇచ్చారు త‌ప్పించి ఇందులో మ‌రేదీ లేదు. కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి కావాల‌ని కొన్ని సినిమాల‌కు కొంద‌రు న‌టుల‌కు రాజ‌కీయ ఉద్దేశాల‌ను అనుస‌రించి అవార్డులిచ్చిన ప‌రిస్థితి కూడా ఉందంటూ.. కామెంట్ చేస్తున్నారు కొంద‌రు తెలంగాణ ద‌ర్శ‌కులు. అందుకే కేసీఆర్ ఈ అవార్డులు ఇవ్వ‌లేద‌ని అంటారు వీరు. ఈ కామెంట్ల‌ను బ‌ట్టి చూస్తే ఒక వేళ అవార్డులే ఇవ్వాల్సి వ‌స్తే అది ఆంధ్రోళ్ల‌కే ఎక్కువ అవార్డులు వెళ్తాయ‌న్న కోణంలో ఈ అవార్డుల‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌ని కంక్లూడ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కేవ‌లం ఆంధ్ర తెలంగాణ బేధాన్ని క‌ళ‌ల్లోనూ చూపించార‌న్న‌మాట‌. కాబ‌ట్టే ప‌దేళ్ల పాటు సినిమా అవార్డులివ్వ‌లేద‌న్న‌మాట‌. అమ్మ కేసీఆర్ అంటూ ఇప్పుడు నోళ్లు నొక్కుకుంటున్నారు కొంద‌రు.