బుర్ఖా తీసి చెక్ చేసే హక్కు ఉంది: మాధవిలత

పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు. తాను చాలా వినమ్రతగా 'అమ్మా, మీ ఫేస్... ఫొటో ఐడీని చెక్ చేసుకోండి' అని వారిని రిక్వెస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫేస్‌ను, ఫొటో ఐడీని చూశానన్నారు. రెండు బూత్‌లలో ఈవీఎంలను మార్చేశారని ఆరోపించారు. పోటీ చేసే అభ్యర్థిగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను తీసుకెళ్లి చూపించడానికి తనకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రెండు బూత్‌లలో మోసం చేస్తున్నారని.. దీనిపై ఎవరు మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

విచ్చలవిడిగా రెచ్చిపోయిన జోగి రమేష్

పోలింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నాయకత్వంలో  బీభత్సం సృష్టించారు. పెనమలూరు మండలం నిడమానూరు హైస్కూలు దగ్గర పోలింగ్ కేంద్రం దగ్గరకి తన అనుచరులతో వచ్చిన జోగి రమేష్ అక్కడ వున్న తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ల మీద దాడిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయకుల ఇళ్ళ ముందుకు వెళ్ళి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు జోగి రమేష్ తన అనుచరులను పంపించి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నాలు చేశారు. జోగి రమేష్ ప్రయత్నాలను తెలుగుదేశం వర్గాలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి.   

వైసీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి  యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి  ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది.  ఏపీలో ఓటర్లు చైతన్యవంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఒటర్ మూడ్ ఎప్పుడో అర్ధమైన వైసీపీ పోలింగ్ ప్రక్రియకు అవరోధాలు, అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా హింసాకాండకు తెగబడింది.  ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు పల్నాడులో వైసీపీ దౌర్జన్య కాండకు దిగింది. అయితే వైసీపీ దౌర్జన్యాలను జనం కూడా అదే స్థాయిలో ప్రతిఘటించి, తమ ఓటు హక్కు వినియోగించుకుని తీరుతామన్న పట్టుదల కనబరిచారు. ఈ క్రమంలో   తెనాలి శివకుమార్ దాష్టీకంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనను వెంటనే అదుపులోనికి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనను పోలింగ్ పూర్తయ్యే వరకూ నిర్బంధంలో ఉంచాలని హుకుం జారీ చేసింది.  అలాగే   నరసరావుపేట వైసీపీ  అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలింగ్ పూర్తయ్యేవరకు శ్రీనివాస్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచాలని ఆదేశించింది. ముందుగా అన్నాబత్తుని శివకుమార్ విషయానికి వస్తే తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆయనను క్యూలైన్ లో నిలబడాల్సిందిగా ఓ ఒటరు సూచించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన  శివకుమార్ సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఓటర్ పై చేయి చేసుకున్నారు. అయితే ఆ ఓటరు ప్రతిఘటించి తిరిగి ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో శివకుమార్‌ అనుచరులు ఓటరుపై దాడి  చేసి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించి అన్నాబత్తుని శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అంతే కాకుండా ఆయనపై   ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై శివకుమార్ స్పందించారు. తాను  తెనాలి ఐతాన‌గ‌ర్‌లో తన భార్య‌తో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లిన సందర్భంలో గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించాడనీ  దీంతో తాను ఆగ్రహావేశాలకు లోనయ్యాననీ పేర్కొన్నారు. అదీ కాక ఉదయం నుంచీ కూడా సుధాకర్ అక్కడి పోలింగ్ బూత్ వద్ద హల్ చల్ చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.   అదే విధంగా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలకు అధికార వైసీపీ మూకలు తెగబడిన నేపథ్యంలో  సీరియస్ గా స్పందించిన ఎన్నికల సంఘం మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు  పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను హౌస్ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు పోలీసులు వారిరువురినీ గృహ నిర్బంధంలో ఉంచారు. 

హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్ శాతం

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.తెలంగాణలో ఇవాళ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే… హైదరాబాదీలు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. అసలు ఓటు వేయడానికి నగరవాసులు కలవడం లేదు. ఇప్పటికే చాలాసార్లు హైదరాబాదీలు పోలింగ్ విషయంలో ప్రత్యేకంగా వార్తాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు ముందుకు రావడం లేదని.. సీటీ ప్రజలకు ఎందుకింత బద్ధకం అని.. ఎన్నికలు జరగినప్పుడల్లా మీడియా అనేక రకాల కథనాలు కూడా ఇస్తుంది. అటు ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకుల, సెలబ్రిటీలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. అందరు కదిలి ఓటు వేయాలని.. మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక ఎన్నికల అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు కూడా ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా హైదరాబాదీల తీరు మాత్రం మారడం లేదు. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇదే తంతు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌లోనే తక్కువగా పోలింగ్ శాతం నమోదు అవుతుంది. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా… ఇప్పటివరకు పోలీంగ్ శాతం తక్కువగా  నమోదు అవ్వడంపై… ఎన్నికల అధికారులు సైతం షాక్ అవుతున్నారు. అయితే హైదరాబాద్‌లో చాలామంది ఏపీ ప్రజలు ఉంటారు. చాలామందికి ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉంది. దీంతో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. చాలామంది ఓటు కోసం ఏపీకి క్యూ కట్టారు. అలా కొందరు వెళ్లినా కూడా… కనీస పోలింగ్ అయినా నమోదు కావాలి. కానీ.. అలా జరగలేదు. సిటీ జనం ఇంటి గడప దాటడానికి ఇష్టపడటం లేదు. దీంతో హైదరాబాద్‌లో పోలింగ్ మందకొడిగా సాగింది. జంట నగరాల్లో మూడు పార్లమెంట్ స్థానల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయ్యింది.

కుప్పంలో తెలుగుదేశం ఏజెంట్లకు వైసీపీ అభ్యర్థి బెదరింపులు

కుప్పం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిని బద్దలు కొడతామంటూ ఇంత కాలం వైసీపీ ప్రగల్భాలు పలికింది. వైనాట్ కుప్పం అంటూ జగన్  విర్రవీగి మాట్లాడారు.   ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. అయితే ఆయన కుప్పం నుంచి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు కదా అన్న కుప్పం ప్రజల విశ్వాసాన్ని ఇసుమంతైనా దెబ్బతీయలేకపోయారు. దీంతో ఇక పోలింగ్ రోజున బెదరింపుల పర్వానికి దిగారు.    కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ స్వయంగా తెలుగుదేశం ఎజెంట్లను బదిరించారు.  రామకుప్పంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లి మరీ  భరత్  తెలుగుదేశం ఏజెంట్లను బెదిరించారు.  ఒక్క రామకుప్పంలోనే కాకుండా నియోజకవర్గంలోని పలు బూత్ లలోకి వెళ్లిన వైసీపీ అభ్యర్థి తెలుగుదఏశం ఏజెంట్లను బెదిరించారు. తన మాట వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.   సింగ సముద్రంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లిన భరత్ తలుపులు మూసేసి పోలింగ్ నిలిపివేయడానికి తెగించారు. అయితే ఆ బూత్ లో ఉన్న తెలుగుదేశం ఏజెంట్లు గట్టిగా ప్రతిఘటించి తలుపులు తెరిచారు.  తెగించి దాడులకు, బెదరింపులకు పాల్పడుతున్న భరత్ వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ ఫిర్యాదులు అందాయి.  భరత్ ఫ్రస్ట్రేషన్ తో పోలింగ్ బూతులన్నీ కలియదిరుగుతూ తెలుగుదేశం ఏజెంట్లపై బెదరింపులకు పాల్పడటం కుప్పంలో వైసీపీకి ఎదురుగాలి ఎంత తీవ్రంగా వీస్తోందో తెలియజేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రోజా పోలింగ్ కొనసాగుతుండగానే.. ఓటమి ఒప్పేసుకున్నారు!

వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా.. నగరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ సోమవారం పోలింగ్ ప్రారంభం కాగానే ఆమె కాడె వదిలేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి నేరుగా కాకపోయినా ఆమె తన ఓటమిని మీడియా ముందు అంగీకరించేశారు. నగరిలో వైసీపీ నాయకులే తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం పని చేశారని ఆమె మీడియా ముఖంగా చెప్పారు. అసలు తొలి నుంచీ నగరి నియోజకవర్గాన్ని రాయలసీమలో కుప్పం తరువాత తెలుగుదేశం గ్యారంటీగా గెలిచే సీట్లలో ఒకటిగా ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు ముందు వెలువడిన ప్రతి సర్వే కూడా నగరిలో తెలుగుదేశం విజయం నల్లేరు మీద బండినడకేనని తేల్చేశాయి. అయితే రోజా మాత్రం నగరిలో హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి భాను ప్రకాశ్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.   పోలింగ్ ప్రారంభమయ్యే వరకూ విజయంపై ధీమాగా ఉన్న రోజా.. ఆ తరువాత మాత్రం చేతెలెత్తేశారు. ఓటమిని అంగీకరించేసినట్లుగానే మీడియా ఎదుట మాట్లాడారు. కనీసం పోలింగ్ పూర్తయ్యే వరకూ కూడా ఆమె ఆగలేకపోయారు.   సొంత పార్టీ నేతలే తెలుగుదేశం పార్టీ కోసం పని చేశారని చెప్పడం ద్వారా  పరోక్షంగా తన ఓటమి ఖాయమని స్వయంగా ఆమె చెప్పేశారు. ఇంతకీ ఆమె మీడియాతో ఏం మాట్లాడారంటే. నగరిలో స్థానిక తెలుగుదేశం కేడర్, నాయకులతో తనకు వచ్చిన సమస్యేమీ లేదన్నారు. సమస్యల్లా కొందరు వైసీపీ నేతలతోనేనని కుండబద్దలు కొట్టేశారు. వారు తన ఓటమే లక్ష్యంగా నగరిలో పని చేశారని ఆరోపించారు. వారు హాయిగా జగన్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నగరికి వచ్చి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తారని రోజా విమర్శించారు.  

తెలంగాణలో 3 గంటల వరకూ 52. 32శాతం పోలింగ్

తెలంగాణలో పోలింగ్ ఈ సారి  పుంజుకుందనే చెప్పాలి. సార్వ్రతిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ   52.32 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మధిరలో మధ్యాహ్నం 3 గంటలకు 63.67శాతం పోలింగ్ నమోదైంది.  కరీంనగర్ లో 3 గంటల వరకు 58.24 శాతం  వరంగల్ లో  61.4 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మహబూబాబాద్‌ ఎంపీ స్థానంలో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండ లో 59.91 శాతం పోలింగ్‌  నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌  62.44 శాతం, మెదక్‌ 60.94 శాతం, నాగర్‌కర్నూల్‌ లో 57.17 శాతం, మహబూబ్‌నగర్‌ ఎంపీ నియోజకవర్గంలో 58.92 శాతం పోలింగ్ నమోదైంది. అయితే హైదరాబాద్, సికిందరాబాద్ లలో మాత్రం పోలింగ్ యధాప్రకారం స్వల్పంగానే ఉంది.

కుప్పం వైకాపా అభ్యర్థి భరత్‌ అనవసరపు ఆత్రం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో విజయం వన్‌సైడ్ అని అందరికీ తెలిసిన విషయమే. కుప్పం ప్రజలు ఎప్పుడూ చంద్రబాబు వైపే వుంటారు. అయితే ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ అనవసరపు ఆత్రం ప్రదర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని పలు కేంద్రాల్లో వైకాపా గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి భరత్ స్వయంగా రంగంలోకి దిగి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. భరత్ సింగసముద్రంలోని పోలింగ్ బూత్‌కు వెళ్లి తలుపులు మూసేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటించడంతో భరత్ తలుపులు తెరిచారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న కెఎ పాల్ 

 ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఓటు వేశానని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ లకు రావాలని అన్నారు. యువత, చదువుకున్న వాళ్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారని... ఇది శుభ పరిణామని చెప్పారు.  మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రావాలని కేఏ పాల్ అన్నారు. మళ్లీ వాళ్లే గెలుస్తారులే అంటూ చాలా మంది విద్యావంతులు ఓటు వేసేందుకు ఇష్టపడరని... అది సరి కాదని చెప్పారు. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి... క్రిమినల్స్ కు ఓటు వేయకండి అని సూచించారు. ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. మీరు ఓటు వేయడమే కాకుండా... మీకు తెలిసిన వారందరి చేత ఓటు వేయించాలని అన్నారు. విశాఖ నుంచి కేఏ పాల్ ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే . 

తెలంగాణ సంపద, వనరుల రక్షణకు ఓటెత్తండి.. మల్లు పిలుపు

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంపద, వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటునే ఆయుధంగా వాడుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. లేకుంటే ప్రజాస్వామ్య పునాదులు, లౌకిక వాదం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సజావుగా సాగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. నగర ఓటర్లు ఓటు హక్కు వినియోగంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. మరో వైపు షేక్ పేటలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యంగా షేక్ పేట్ డివిజన్ లో దాదాపు 3 వేల ఓట్లను గల్లంతయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారు. అప్పుడు ఉన్న ఓటు ఇప్పుడు తొలగించడమేమిటని షేక్ పేట్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  బీజేపీకి వ్యతిరే కంగా అధికారులు ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే తొలగించారని ఆరోపి స్తున్నారు. వారం కిందట ఓటరు స్లిప్పులను పంచి ఇప్పుడు జాబితాలో పేరు లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షేక్ పేట్ కు వచ్చారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘాని కి కూడా ఫిర్యాదు చేయనున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.  

తెలంగాణ ఓటర్ల మూడ్ క్లియర్..! ఎవరికి కలిసి వ‌స్తుంది?

తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. బీజీపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఈ ఎన్నిక‌ల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ సరళిని గమనిస్తున్న ఈ మూడు పార్టీలు తమ విజయావకాశాల పైన అంచనాలు వేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు పోలింగ్ సరళి పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందనే అంశం పైన ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు 17 నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా పని చేయాలని పార్టీ కేడర్ కు సూచిస్తున్నాయి. చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ త‌క్కువ‌గా న‌మోదు అవుతుండ‌టంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థులు ఆందోళ‌న‌ప‌డ‌టం క‌నిపించింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్, ఫిలం నగర్ పరిసరాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే తమ ఓటు వేసారు. ముఖ్యమంత్రి రేవంత్ సతీ సమేతంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వికాస్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొన సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.  ఈ ఎన్నికలు కాంగ్రెస్ వందరోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకు మించి ఓట్లు వస్తాయని చెప్పారు.  బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది. 17 సెప్టెంబర్ 2025తో మోదీకి 75ఏళ్లు నిండుతాయి. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని రేవంత్ అన్నారు.  బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. 400 సీట్లు ఎట్లా సాధ్యం అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.  13ఏళ్లు సీఎంగా, 10ఏళ్లు పీఎంగా పనిచేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.  దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారని రేవంత్ విమర్శించారు.  ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతుంటే.. మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్.. దీన్ని బట్టి తెలుస్తోంది. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజలకోసం పనిచేస్తున్నారో చర్చకు సిద్ధం. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది. మానసిక ఒత్తిడిలో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

అంబటి అల్లుడి హల్ చల్.. దేశం శ్రేణులు తిరగబడడంతో పరార్!

ఎక్కడ చూసినా వైసీపీ మూకలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. గెలుపు ఆశలు వదిలేసుకున్న వైసీపీ హింసాకాండతో పోలింగ్ సజావుగా సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బరి తెగించేస్తోంది. అయితే వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు బెదరకుండా ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద ఎక్కడకక్కడ తిరగబడుతున్నారు. దాడులకు భయపడం ఓటేసి తీరుతాం అంటూ ప్రతిన చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అల్లడు ఉపేష్ చౌదరి హల్ చల్ చేశారు. ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అనుచిత భాషతో దూషిస్తూ విరుచుకుపడ్డారు. అక్కడ ఉన్న పోలీసులను పిలిచి తెలుగుదేశం నా కొడుకులందర్నీ అక్కడ నుంచి తరిమేయాలంటూ యాజ్ ఇఫ్ ఆయనే పోలీస్ బాస్ లా హుకుం జారీ చేశారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డారు. మీ పెత్తనం ఏమిటి? నీ దౌర్జన్యం ఏమిటంటూ తిరగబడ్డారు. ఉమేష్ చౌదరి అనుచరులు కారులోంచి కర్రలు, రాడ్లు తీసుకువచ్చి దాడికి యత్నించగా తెలుగేశం కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతీ అంబటి అల్లుడు ఉపేష్ చౌదరి తన అనుచరులతో అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు.    

తెనాలి శివకుమార్‌ని అరెస్టు చేయండి: ఈసీ

తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ మీద ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యూలో రమ్మన్నందుకు ఓటర్ని కొట్టడం మాత్రమే కాకుండా, తన అనుచరుల చేత కూడా దాడి చేయించడం పట్ల ఎన్నికల సంఘం సీరియస్ అయింది. శివకుమార్‌ని వెంటనే అరెస్టు చేయాలని, పోలింగ్ ముగిసేవరకు ఆయన్ని గృహ నిర్బంధంలో వుంచాలని ఆదేశించింది.  తెనాలిలో ఓటు వేయడానికి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలో నిల్చోకుండా డైరెక్ట్.గా వెళ్ళిపోతున్నారు. అది చూసిన గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు మీరు కూడా క్యూలో రావాలని రిక్వెస్ట్ చేశారు. అంతే శివకుమార్‌కి ఎక్కడ లేని కోపం ముంచుకుని వచ్చేసింది. ఒక్కసారిగా సుధాకర్ మీదకి దాడి చేసి ఆయన చెంపమీద కొట్టారు. దాంతో రియాక్ట్ అయిన సుధాకర్ కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప ఛెళ్ళుమనిపించారు. అది చూసిన వైసీపీ ఎమ్మెల్యే పక్కనే వున్న గూండాలు సుధాకర్ మీద దాడి చేసి దారుణంగా కొట్టారు. 

దర్శిలో వైసీపీ గూండాయిజం.. గొట్టిపాటి లక్ష్మిపై కత్తులతో దాడికి యత్నం

వైసీపీ మూకలు దర్శిలో రెచ్చిపోయాయి. మండల పరిధిలోనే బొట్ల పాలెం గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థిపై వైసీపీ గూండాలు కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. రెండు రోజుల కిందట తెలుగుదేశం కార్యకర్తపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.   దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఓటమి భయంతోనే ఇలా దాడులకు తెగబడుతోందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.  ఎన్నికల రోజు బొట్లపాలెంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ మూకలు జరిపిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కత్తులతో  దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారు. దీనిపై గొట్టిపాటి లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఓటమి భయంతో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ ఈ గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ దగ్గరకు వచ్చి దౌర్జన్యాలకు తెగబడుతున్నారని విమర్శించారు.  శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాతనే టీడీపీ, జనసేన కార్యకర్తలపై  వైసీపీ మూకలు దాడులకు దిగినట్లు తెలిపారు. ఒక మహిళా డాక్టర్‌ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ తనపై కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.   టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఓటేయాలని, తాను అండగా ఉంటానని గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు.