TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. జలమయం.!

భారతదేశ రాజధాని ఢిల్లీలో సామాజిక మౌలిక సదుపాయాల లోపం మరోసారి ప్రస్ఫుటంగా బయటపడింది. ఢిల్లీలోని గాలి నాణ్యత సూచిక, ట్రాఫిక్ పరిస్థితి అత్యంత దారుణం అన్న సంగతి తెలిసింది. తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమై విమర్శలకుగురైంది. శుక్రవారం హస్తినలో కురిసిన భారీ వర్షానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. ముఖ్యంగా టెర్మినల్ 2, 3 అప్రోచ్ రోడ్లు, ఫోర్‌కోర్ట్‌లలో భారీగా నీరు నిలిచింది. సాధారణంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉత్తమ నాణ్యతతో ఉంటాయని అంతా భావిస్తారు.. కానీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నాణ్యత విషయంలో అద్వానంగా ఉందని తాజా ఘటన చాటింది. విమానాశ్రయం జలమయమవ్వడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శని, ఆదివారాలలో కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. [Delhi Airport Water logged, , Indira Gandhi International Airport, Delhi rains, airport waterlogging, Delhi news, Telugu One]

Published on: Sat Sep 5, 2026 11:08AM

political-news-img

లోన్ రికవరీ పేరిట దారుణం.. మహిళ కిడ్నాప్, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్.!

లోన్ రికవరీ పేరిట ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన ముఠా ఉదంతమిది. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. అప్పుల వసూళ్ల కోసంఈ ముఠా అరాచకానికి పాల్పడింది. రుణం చెల్లించలేదన్న కారణంతో ఓ ముప్పై ఏళ్ల మహిళను అపహరించి, రెండు రోజుల పాటు రహస్య ప్రాంతంలో బంధించి, హింసించడమే కాకుండా, ఆమెను వివస్త్రను చేసి వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు చంద్రాలయా అవుట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలు గతంలో కొందరి వద్ద వడ్డీకి అప్పులు తీసుకుంది. అయితే అనుకున్న సమయానికి అసలు, వడ్డీ చెల్లించలేకపోవడంతో వారు దారుణానికి పాల్పడ్డారు. నిందితులు ఆమెను, ఆమె మైనర్ కుమారుడిని కిడ్నాప్ చేసి.. కుంబల్‌గోడు ప్రాంతంలో ఒక నివాసంలో నిర్బంధించి హింసించారు. ఆమెను వివస్త్రను చేసి.. వీడియో తీసి.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. అనంతరం ఖాళీ పత్రాలు, డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. లక్షన్నర రూపాయల అప్పు తీసుకున్న ఆమెను 11 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. కాగా బాధితురాలి కిడ్నాప్ పై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుల ఆచూకీ గుర్తించి మహిళను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఈ దారుణానికి పాల్పడిన నిందితులు రేష్మా బాను, సుహైల్, నజ్రత్ సహా మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. [Bengaluru loan recovery case, woman kidnapped, loan shark harassment, Chandra Layout police station, illegal loan recovery gang arrested]

Published on: Sat Sep 5, 2026 10:10AM

political-news-img

శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..!

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో విమానం పార్కింగ్ బేలోకి వెళ్తుండగా అక్కడ ఏర్పాటు చేసిన విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) పోల్‌ను ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం సుమారు 9.02 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండిగోకు చెందిన 6E 225 విమానం (VT-NOG)ను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులోని బే నంబర్‌ 6లో పార్కింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం పోల్‌ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గుర య్యారు. అయితే అదృష్ట వశాత్తూ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. ఘటన అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని విమానం నుంచి సురక్షితంగా దించేశారు. ఇందుకోసం మాన్యువల్ మెట్లను వినియోగించారు. ప్రమాదంలో విమానానికి నష్టం జరిగినట్లు నివేది కలు పేర్కొన్నప్పటికీ, ఘట నకు గల ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. పార్కింగ్ సమయంలో విమానం VDGS పోల్‌ను ఎలా ఢీకొట్టిందన్న అంశంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనకు గల కారణంపై ఎలాంటి నిర్ధారణకు రాలేమని అధికా రులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. (Srinagar Airport, IndiGo flight Accident, Airplane VDGS Poll, Aircraft accident, VDGS pole collision, Flight 6E 225, Mumbai to Srinagar flight Telugu News, Telugu One)

Published on: Fri Sep 4, 2026 2:25PM

political-news-img

టీమ్ కేజ్రీవాల్ ఏంటి?.. బొద్దింకల పార్టీలో చీలిక.!

నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా శక్తిమంతమైన ఉద్యమాన్ని నడిపి, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన బొద్దింకల పార్టీ కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక సంభవించింది. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆ పార్టీ కీలక నేత మనీష్ బ్రహ్మభట్ కాక్‌రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డి) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆయన ప్రస్తుత సీజేపీ నాయకత్వం, ముఖ్యంగా అభిజీత్ దిప్కే బృందం ప్రజా ఉద్యమాన్ని రాజకీయమయం చేసిందని దుయ్యబట్టారు. అభిజీత్ దిప్కే వర్గం సీజేపీని టీమ్ కేజ్రీవాల్'గా మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం (సెప్టెంబర్ 3) తన కొత్త పార్టీ సీజేపీ-డిని అధికారికంగా ప్రకటించిన మనీష్ బ్రహ్మభట్ మీడిమాతొ మాట్లాడుతూ.. దేశంలోని సాధారణ ప్రజల చెమట, రక్తంతో సాధించిన నీట్ విజయాన్ని, ఉద్యమాన్ని అభిజీత్ దిప్కే వర్గం తమ స్వార్థం కోసం అమ్మేశారని విమర్శించారు. కేవలం 12 మంది ఒక ఇంట్లో కూర్చుని రహస్యంగా జాతీయ స్థాయి జట్టును ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు ఆ సంస్థ పూర్తిగా టీమ్ కేజ్రీవాల్ గా మారిపోయిందన్నారు. గతంలో అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలోనూ అరవింద్ కేజ్రీవాల్ సరిగ్గా ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడు సీజేపీ నాయకత్వం ఏర్పాటు వెనుక కూడా కేజ్రీవాల్ హస్తం ఉందనీ బ్రహ్మభట్ ఆరోపించారు. అభిజీత్ దిప్కే గతంలో ఆప్ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన నేపథ్యం ఉండటం.. జంతర్ మంతర్ వద్ద బొద్దింకల ఉద్యమానికి కేజ్రీవాల్ మద్దతు తెలపడం. నేపథ్యంలో.. ఇప్పుడు మనీష్ బ్రహ్మభట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాయి. తాము తాజాగా ఏర్పాటు చేసిన సీజేపీ-డిలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తామన్న మని మనీష్ బ్రహ్మభట్.. సాధారణ వాలంటీర్లకు కూడా ఓటు హక్కు కల్పించి, అందరి భాగస్వామ్యంతో పార్టీని ముందుకు నడిపిస్తామన్నారు. [Split in Cockroach Janata Party, CJP split, Manish Brahmbhatt, Abhijeet Dipke, CJP Democratic, Team Kejriwal, Telugu One]

Published on: Fri Sep 4, 2026 11:42AM

political-news-img

ఈ ఏడాది చివరిలో భారత్ గగన్ యాన్ ప్రయోగం.. ఇస్రో చైర్మన్ వెల్లడి.!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్'ప్రయోగానికి సంబంధించిన కీలక వివరాలను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి మానవ రహిత యాత్రను ఈ ఏడాది చివరి నాటికి నిర్వహించేందుకు సమాయత్తమౌతున్నట్లు చెప్పారు. అంతరిక్ష రంగంలో ఇండియా సత్తా ప్రపంచానికి చాటిచెప్పే దిశగా ఇస్రో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారన్న ఆయన, గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ప్రణాళికాబద్ధంగా తొలి దశ మానవ రహిత ప్రయోగాన్ని ఈ ఏడాది చివరి నాటికి చేపట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి వ్యోమమిత్ర అనే హాఫ్ హ్యూమనాయిడ్ రోబోను పంపనున్నట్లు వివరించారు. వ్యోమగాములు ప్రయాణించే సమయంలో క్యాబిన్ లోపలి వాతావరణ పరిస్థితులు, వారి శరీర కదలికలకు తగినట్లుగా వ్యవస్థలు ఎలా స్పందిస్తాయనే విషయాలను ఈ రోబో పరిశీలించి నియంత్రణ కేంద్రానికి సమాచారాన్ని అందిస్తుంది. మానవులను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపే ముందు ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు, ఇస్రో భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మానవ సహిత యాత్రకు ముందే మొత్తం మూడు మానవ రహిత ప్రయోగాలను నిర్వహించనుంది. లాంచ్ వెహికల్ హ్యూమన్ రేటింగ్ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. అలాగే వ్యోమగాముల భద్రతను రక్షించే క్రూ ఎస్కేప్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ రూపకల్పన కూడా పూర్తయ్యింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు వివిధ రకాలుగా దాదాపు 8 వేల పరీక్షలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు ఇస్రో చైర్మన్ వివరించారు. క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ అసెంబ్లీ మరియు వాటి సమగ్ర పరీక్షలు తుది దశకు చేరుకున్నాయన్నారు. భూమికి నాలుగువందల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ముగ్గురు భారత వ్యోమగాములను పంపి, అక్కడ మూడు రోజుల పాటు వారిని సురక్షితంగా ఉంచి, ఆ తర్వాత తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావడమే గగన్‌యాన్ టాస్క్. ఈ మిషన్ కోసం ఎంపిక చేసిన వ్యోమగాములకు ఇప్పటికే రష్యాలో జనరల్ శిక్షణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణను పొందుతున్నారు. [Gaganyaan mission by Year End, ISRO Chairman, Vyommitra robot, Indian space flight, human spaceflight program, Telugu One]

Published on: Fri Sep 4, 2026 10:17AM

political-news-img

బీఎస్పీలో సంచలనం..మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు మాయావతి బిగ్ షాక్..!

రాజకీయ పరిణతి లేదంటూ ఆనంద్‌పై బీఎస్పీ అధినేత్రి ఫైర్..! ఉత్తరప్రదేశ్ రాజకీయాలోనే కాకుండా దేశ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. పార్టీలో సొంత మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ఒకానొక సమయంలో తన రాజకీయ వారసుడిగా ప్రచారం చేస్తూ, కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి.. ఇప్పుడు ఉన్నపళంగా ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు వేశారు. ఢిల్లీలో తాజాగా జరిగిన బీఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాయావతి మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆకాష్ ఆనంద్‌కు పార్టీలో అతి ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించేంత రాజకీయ పరిణతి, అనుభవం ఇంకా రాలేదని ఆమె బహిరంగంగా స్పష్టం చేశారు. బాధ్యతలు నిర్వహించాలంటే కేవలం బంధుత్వం ఉంటే సరిపోదని, ప్రజాక్షేత్రంలో మరింత అనుభవం గడించి పరిణతి సాధించాల్సిన అవసరం ఉందోనని ఆమె తేల్చిచెప్పారు. గతంలో ఆకాష్ ఆనంద్‌కు పార్టీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చి, దేశవ్యాప్తంగా బీఎస్పీ పునర్నిర్మాణ బాధ్యతలను ఆమె అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే కీలకమైన ఎన్నికల సమయానికి ముందు ఆయనను ఆ పదవి నుండి పక్కన పెట్టడం వెనుక అనేక రాజకీయ సమీకరణాలు ఉన్నాయని తెలుస్తోంది. మాయావతి ప్రకటన ప్రకారం, ఆకాష్ ఆనంద్ ఇంకా మరింత పరిణతి సాధించడమే కాకుండా, కార్యకర్తలు నాయకుల నుండి పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందాల్సి ఉంది. అంతవరకు ఆయనకు పార్టీ పరంగా ప్రధాన లేదా కీలక బాధ్యతలు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే పార్టీ కోసం ఒక సాధారణ నాయకుడిగా, కార్యకర్తగా స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాయావతి వెల్లడించారు. ఇదే సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపైనా మాయావతి స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఏ ఇతర పార్టీతోనూ, కూటమితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఏకపక్షంగా, ఒంటరిగానే మొత్తం అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతామని ప్రకటించారు. ఇదివరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ బీఎస్పీ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతుందని చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. బహుజనులు, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలన్నదే తమ పార్టీ ఏకైక లక్ష్యమని, దీనికోసం క్షేత్రస్థాయిలో ఒంటరి పోరాటమే శ్రేయస్కరమని మాయావతి భావిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుడైనప్పటికీ పార్టీ ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మాయావతి నిరూపించారని ఆమె మద్దతుదారులు అంటుంటే, ఈ నిర్ణయంతో బీఎస్పీలో తదుపరి నాయకత్వం ఎవరనే ప్రశ్న మళ్లీ మొదలైంది. కుటుంబ పరిపాలన అనే విమర్శలను తిప్పికొట్టేందుకే మాయావతి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారా లేక ఆకాష్ ఆనంద్ శైలి పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారా అనే చర్చ తీవ్రమవుతోంది. ఏది ఏమైనా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ మాయావతి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం బీఎస్పీ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. (Mayawati, Akash Anand, BSP news, Mayawati nephew Akash Anand, UP Assembly Elections, BSP politics, SP Party, CM Yogi, Telugu One, Telugu News)

Published on: Thu Sep 3, 2026 5:46PM

political-news-img

దేశంలోని డాలర్ల ప్రవాహం.. సూపర్ సక్సెస్ అయిన ఆర్బీఐ పథకం.!

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభఉత్వం, ఆర్బీఐ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐ వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టిన యూఎస్ డాలర్, రూపాయి స్వాప్ పథకానికి ఎన్నారైల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రాథమిక గణాంకాల ప్రకారం ఆగస్టు 31 నాటికి దేశంలోకి ఏకంగా 136 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.30 లక్షల కోట్ల రూపాయలు వెల్లువలా వచ్చి పడ్డాయి. డాలర్ల సమీకరణ ప్రయత్నాల్లో ఈ డాలర్, రూపీ స్వాప్ పథకం కొత్త చరిత్ర సృష్టించింది. ప్రవాస భారతీయులను భారతీయ కంపెనీలను మరింతగా ప్రోత్సహించి, దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పథకాన్ని జూన్ 8న ఆర్బీఐ ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రధానంగా మూడు విభిన్న మార్గాల ద్వారా ఈ నిధులను సమీకరించింది. ఒకటి ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు, రెండు భారతీయ కంపెనీలు విదేశాల నుంచి సేకరించిన రుణాలు, ఇక మూడోది.. ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ మార్గాలు. ఈ మూడు మార్గాలలో కలిపి సమీకరించిన మొత్తం 136 బిలియన్ డాలర్లలో సింహభాగం, అంటే దాదాపు 93 శాతం ఎన్నారైల డిపాజిట్ల రూపంలోనే రావడం విశేషం. మిగిలిన విదేశీ నిధులలో విదేశీ రుణాల ద్వారా 5 బిలియన్ డాలర్లు, ఈసీబీల ద్వారా మరో 3.8 బిలియన్ డాలర్లు సమకూరాయి. ఈ పథకం ముగింపు దశకు వచ్చేసరికి స్పందన అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు 21 నాటికి 73 బిలియన్ డాలర్లుగా ఉన్న నిధుల ప్రవాహం, కేవలం చివరి 10 రోజుల్లోనే మరో 63 బిలియన్ డాలర్లు అదనంగా వచ్చి చేరింది. ఈ స్పందన కారణంగా లక్ష్యం నిర్దేశిత గడువు కంటే ముందే సంపూర్ణంగా నెరవేరడంతో ఆర్బీఐ ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 30 గడువుకు బదులుగా, ఎఫ్‌సీఎన్ఆర్(బి) డిపాజిట్ల విండోను ముందస్తుగానే అంటే గత నెల 31కే ముగించింది. అయితే, మిగిలిన రెండు రుణ సమీకరణ మార్గాలు మాత్రం డిసెంబర్ 31 వరకు యథావిధిగా అందుబాటులో ఉండనున్నాయి. 2013లో ఆర్బీఐ ఇలాంటిదే ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పుడు కేవలం 26 బిలియన్ డాలర్లు మాత్రమే రాగా.. దానితో పోలిస్తే తాజా స్కీమ్ ఏకంగా ఐదు రెట్లకు పైగా నిధులను ఆకర్షించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ విదేశీ నిధుల రాకతో దేశ విదేశీ మారక నిల్వలు మరింత పటిష్టమై, అంతర్జాతీయంగా తలెత్తే చమురు ధరల పెరుగుదల, ఇతర ఆర్థిక ఒడిదొడుకుల నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థకు భద్రత లభిస్తుందని చెప్పవచ్చు. [RBI scheme, NRI dollars, foreign currency inflows, RBI swap facility, FCNR deposits, Indian forex reserves]

Published on: Thu Sep 3, 2026 11:21AM

political-news-img

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.!

ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్ లో రాహుల్ పౌరసత్వానికి సంబంధించి అంశం సుదీర్ఘ కాలంగా చర్చలో ఉన్నసంగతి విదితమే. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి అంశంపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ముగిసింది. రాహుల్ గాంధీ ఇండియన్ కాదనీ, సంతతికి చెందిన వ్యక్తంటూ కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు పిటిషనర్లు తమ వాదనలను నిరూపించడానికి ఎలాంటి బలమైన లేదా సరైన పత్రాలను సమర్పించలేదని పేర్కొంటూ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలు రావడానికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. గతంలో 2015 నుంచి వివిధ రాజకీయ వేదికలపై, అలాగే కొన్ని పిటిషన్లలో ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. యూకేలోని ఒక కంపెనీ రికార్డులను ప్రస్తావిస్తూ ఆయన పౌరసత్వంపై అనుమానాలు వ్యక్తంచేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపధ్యంలోనే 2019లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ విషయమై వివరణ కోరినప్పటికీ, ఆరోపణలను రుజువు చేసేలా ఎలాంటి ఆధారాలు వెలుగులోకి రాలేదు. ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్న సమయంలో ఆయనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునేందుకే ఇలాంటి వివాదాలను మళ్లీ మళ్లీ తెరపైకి తెస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి నిరాధార ఆరోపణలతో ఆయనపై బురద జల్లి వ్యక్తత్వ హననానికి పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా విరుచుకుపడుతున్నారు. న్యాయస్థానంలో సరైన ఆధారాలు సమర్పించలేకపోవడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి కేసులు బనాయించడం వల్ల సమయం వృథా కావడంతో పాటు వ్యవస్థలపై అవాస్తవ ప్రచారాలు పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు. రాహుల్ గాంధీపై గతంలో వచ్చిన అనేక ఆరోపణల మాదిరిగానే ఈ పౌరసత్వ వివాదం కూడా నిరాధారమైనదిగా తేలిపోవడం పట్ల కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. [Rahul Gandhi citizenship, Allahabad High Court verdict, British citizen allegations, Rahul Gandhi news, Indian politics]

Published on: Thu Sep 3, 2026 10:57AM

political-news-img

నేపాల్ కు భారత్ అందిస్తున్న సాయంపై సోనూసూద్ ఏమన్నారంటే?

జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్ లో బాధితులను నేరుగా పరామర్శించి, సహాయం అందించేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఆ దేశంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా అక్కడి వాస్తవ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన జల ప్రళయంలో తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్' ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. నీట మునిగిన గ్రామాలు, కొట్టుకుపోయిన ఇళ్లు, సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో పొరుగు దేశానికి ధైర్యం చెప్తూనే, ప్రధాని మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ప్రశంసించారు. నేపాల్‌లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందనడానికి అక్కడి దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయన్న సోనూ సూద్.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే గుండె తరుక్కుపో తోందన్నారు. అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి చాలా సమయం పడుతుందనీ, ఇది కొద్ది వారాల్లోనో నెలల్లోనో తీరే సమస్య కాదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌కు అందిస్తున్న తక్షణ సాయం అభినందనీయమన్న సోనూసూద్.. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ మానవీయ సహాయం సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు. [Sonu Sood Visit Nepal Flood Effected Areas, Nepal Floods, PM Modi Aid to Nepal, Trishuli Bazaar Nepal, Nepal Rescue Operations, Sonu Sood Praises Modi]

Published on: Wed Sep 2, 2026 2:25PM

political-news-img

బంగారం కొనకండి.. దేశ ప్రజలకు మోడీ మళ్లీ పిలుపు.!

ఇండియా ప్రగతి రథం పరుగులు పెట్టాలంటే.. దేశం అభివృద్ధుతున్న స్థితినుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రజా సహకారం అత్యవసరమని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఇందు కోసం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. అనవసరపు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. అలాగే బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని పదే పదే చేస్తున్న ఈ విజ్ణప్తులు, సూచనలు హాట్ టాపిక్ గా మారాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు, దేశ ప్రగతి, పురోగతికి ప్రధాని ప్రకటనపై ఓ వైపు హర్షం వ్యక్తం అవుతున్నా.. విమర్శలు కూడా వినవస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఇండియా జిడిపి సూచీలో ఏకంగా 7.8 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. దేశం సాధిస్తున్న ఈ అభివృద్ధి అసాధారణమైనదని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోవడానికి పౌరులంతా మేడ్ ఇన్ ఇండియా మంత్రాన్ని జీవితంలో భాగం చేసుకోవాలన్న ప్రధాని అనవసరపు విదేశీ యాత్రలు, అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి విలాసాలకు స్వస్థి చెప్పాలన్నారు. అత్యవసరమైతే తప్ప బంగారాన్ని కొనుగోలు చేయవద్దని దేశ పౌరులకు సూచించారు. తన విజ్ణప్తిని మన్నించాలని పేర్కొన్న మోడీ, అలా చేస్తే.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి దేశాన్ని వికసిత భారత్‌గా మార్చగలమని పేర్కొన్నారు. గతంలో కూడా ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా' ప్రాముఖ్యతను వివరించినప్పుడు విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని స్పష్టం చేశారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెరిగితేనే స్థానిక పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారాలు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. [Dont Buy Gold PM Narendra Modi Calls Again, Gold Purchase Warning, Made in India Campaign, Indian Economy GDP Growth,Telugu One]

Published on: Wed Sep 2, 2026 10:39AM