English | Telugu

పఠాన్ కు జేజేలు పలుకుతున్న ప్రేక్షకులు!

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కు సరైన సక్సెస్ పడి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. కరోనా మొదలు అయినప్పటినుండి బాలీవుడ్ సినిమాలు అంటే స్వయంగా ఉత్తరాదిన చిన్నచూపు మొదలయింది. క‌రోనా భ‌యం వ‌ల్ల ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదా? అంటే అది నిజం కాదు. ఎందుకంటే వారు సౌత్ సినిమాలకు థియేటర్‌లో పెద్ద క్యూ కడుతున్నారు. కానీ హిందీ సినిమాలను మాత్రం పట్టించుకోవడం లేదు. చాలా కాలం తర్వాత హిందీ సినిమా కోసం ఆడియ‌న్స్ క్యూ  కడుతున్నారు. అదే బాలీవుడ్ బాద్షా షారుక్ నటించిన పఠాన్ చిత్రం కోసం. దీనికి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌. ఇలా జనాలను క్యూలో నిలబెట్టిన ఘనత షారుఖ్ కంటే సిద్ధార్థ్‌ ఆనంద్ కే  ఎక్కువగా దక్కుతుంది. ఇది విశ్లేషకుల అభిప్రాయం.