English | Telugu
అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ సినిమా మొదలైంది
Updated : Jan 16, 2023
అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్. వీరిద్దరికీ కామన్గా చాలా విషయాలుంటాయి. ఇద్దరూ ఫిట్నెస్ ఫ్రీక్స్. ఎక్కడా తగ్గరు. వరుసగా సినిమాలు సైన్ చేసుకుంటూ వెళ్తుంటారు. అవతలి వాళ్లు ఎవరైనా సరే, వాళ్లతో కలిసి యాక్ట్ చేయడానికి ముందుకొచ్చేస్తుంటారు. సినిమా మాత్రమే ప్యాషన్ అని ఓపెన్గా చెబుతుంటారు. ఇలాంటి కామన్ పాయింట్స్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి ఇప్పుడు ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా బడేమియా చోటేమియా. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశారు అలీ అబ్బాస్ జాఫర్. ఇద్దరు యాక్షన్ హీరోలతో ఎప్పుడెప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడదామా అని ఆత్రుతగా వెయిట్ చేశారట అలీ అబ్బాస్ జాఫర్.
సోమవారం మధ్యాహ్నం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు అలీ అబ్బాస్ జాఫర్. క్లాప్ బోర్డ్ ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో 786 అనే సంఖ్య అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అలీ అబ్బాస్ పోస్టు చూడగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మా ఖిలాడీ ఇంతకు ముందు ఎప్పుడూ చేయని యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నారు అని ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యారు. మరో నెజిటన్ ఒరిజినల్ యాక్షన్ జోడీ బాక్సాఫీస్ రికార్డులను బ్యాంగ్ బ్యాంగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అని అన్నారు.
ఇద్దరు హీరోల వ్యక్తిత్వం గురించి, అలవాట్ల గురించి కూడా నెట్టింట్లో గట్టిగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం ఆల్రెడీ ముంబైలో భారీ సెట్లు వేశారు. అక్కడ పూర్తవగానే ఫారిన్ లొకేషన్లలో తెరకెక్కిస్తారు. ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని, ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతాయని హింట్ ఇస్తున్నారు చిత్ర యూనిట్ మెంబర్స్.