Read more!

English | Telugu

70 మిలియన్ల ఫాలోయర్స్ వచ్చారోచ్ అంటున్న మల్లీశ్వరి!

బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ ఇప్పుడు క్లౌడ్ నైన్ లో తేలుతున్నారు. ఆమె ఇన్‌స్టా 70 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆనందంగా పంచుకున్నారు మన మల్లీశ్వరి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు కత్రినా కైఫ్. సోమవారం ఆమె ఇన్‌స్టా ఫాలోయ‌ర్ల సంఖ్య 70 మిలియన్లకు చేరుకుంది. నిద్ర లేవగానే అద్భుతమైన విషయం తెలిసిందంటూ నవ్వుతూ ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు కత్రినా కైఫ్. ఆమె ఆనందానికి ఫ్యాన్స్ శుభాకాంక్షలు యాడ్ అవుతున్నాయి. కంగ్రాజులేషన్స్ మేడం, కంగ్రాట్యులేషన్స్ క్యాట్ అంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. 

జోయా అక్తర్ లాంటివాళ్ళు ఇది నీకు సులభ సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ ని దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, ఆలియా భట్ లాంటి వాళ్లు ఫాలో అవుతున్నారు. ``మీ జీవితంలో ప్రతి సక్సెస్ మీకే సొంతం... కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి ఇక్క‌డిదాకా వచ్చారు. 70 మిలియన్లు మీ ఆస్తి. మేమందరం మీ కుటుంబ సభ్యులం`` అంటూ ఓ ఫ్యాన్ రాసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంత యంగ్ గా ఎలా ఉన్నారు అంటూ మరో ఫ్యాన్ చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. ఇంకా ఎక్కువ పిక్స్ ని పోస్ట్ చేయండి... మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అంటూ మరో ఫ్యాన్ ఇన్‌స్టాలో పోస్ట్  చేశారు.

 లవ్ యు ఫర్ ఎవర్ క్వీన్... గాడ్ బ్లెస్స్ యు.. కీప్ గ్రోయింగ్... ఆల్వేస్ స్టే హ్యాపీ అంటూ పలువురు కత్రినాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్ పెళ్లయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రెగ్నెంట్ అనే రూమర్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటిదాకా ఈ విషయం గురించి కత్రినా కైఫ్ గాని, ఆమె భర్త విక్కీ కౌశల్ గాని... ఎక్కడ చెప్పలేదు. ఇటీవల వారిద్దరూ సిద్ధి వినాయక టెంపుల్ ని సందర్శించారు. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రూమర్స్ గట్టిగా వైరల్ అయ్యాయి. న్యూ ఇయర్ వెకేషన్ ని ఈ కపుల్ రాజస్థాన్లో సెలబ్రేట్ చేసుకున్నారు. కత్రినా త్వరలోనే  టైగర్ త్రీ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. అలాగే దక్షిణాది నటుడు విజయ్ సేతుపతి తో కలిసి మెర్రి క్రిస్మస్ సినిమాలో నటించారు.