Read more!

English | Telugu

'బడే మియా చోటేమియా' షూటింగ్ మొదలైంది!


బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, బాలీవుడ్ యంగ్‌స్టార్‌ టైగర్ ష్రాఫ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా 'బ‌డేమియా చోటేమియా'. ఇద్ద‌రు హీరోలు కలిసి ఫైనల్ గా తమ అప్‌క‌మింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బడే మియా చోటే మియా'ను ప్రారంభించారు. పూజ ఎంటర్టైన్మెంట్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళ యంగ్ హీరో, మ‌ల్టీటాలెంటెడ్ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. వషు భగ్నాని, జాకీ భగ్నానీ నిర్మిస్తున్న సినిమా ఇది. 

ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ "చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా 'బడే మియా చోటే మియా'. చోటే టైగర్ ష్రాఫ్.. నువ్వు పుట్టిన సంవత్సరమే నా కెరీర్ ని మొదలు పెట్టానని గుర్తుపెట్టుకో" అంటూ సరదాగా స్పందించారు. దీనికి టైగర్ ష్రాఫ్‌ స్పందిస్తూ "నేను పుట్టిన సంవత్సరమే మీరు కెరీర్ మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ నాకన్నా బలంగా కిక్ చేయగలరు.  ఎత్తుల నుంచి నాక‌న్నా సునాయాసంగా దూకగలరు" అని అన్నారు.  

పాతికేళ్ల తర్వాత 'బడే మియా చొటేమియా' ఫ్రాంచైజీలో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందని వషు భ‌గ్నాని అన్నారు. తన కెరీర్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా 'బడే మియా చోటేమియా'ను గుర్తు చేసుకున్నారు. అక్షయ్ కుమార్,  టైగర్ ష్రాఫ్‌ లాంటి ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రియల్ స్టార్ పృథ్వి ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తారని చెప్పారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం చేస్తున్న కృషిని గుర్తు చేసుకున్నారు జాకీ భగ్నాని. 

ఒరిజినల్ 'బడే మియా చోటే మియా' సినిమాలో అమితాబచ్చన్, గోవిందా కలిసి నటించారు. 1998లో ఈ సినిమా విడుదలైంది. కామెడీ డ్రామా కోవ‌కు చెందుతుంది ఈ సినిమా. ఈ ఏడాది క్రిస్మస్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.