English | Telugu

Illu illalu pillalu : తండ్రి దగ్గర డబ్బు దొంగిలించిన కొడుకు.. అర్థరాత్రి రోడ్డుపై ఆమె!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -253 లో.....ఆనందరావు ఇంటికి రాగానే ఇప్పుడు ఎందుకు వచ్చావ్ నాన్న అని శ్రీవల్లి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తిరుపతి చెయ్ కలశం లో నుండి బయటకు వస్తే అవి గిల్టీ నగలు అని మన బండారం బయటపడుతుంది కదా అందుకే ఒక ప్లాన్ ఆలోచించాను. ఈ ఒక్క రోజుకి నేను ఇక్కడే ఉండేలా చూడమని ఆనందరావు అంటాడు. అతను బయటకి వచ్చి ఇక నేను వెళ్తాను బావగారు అని రామరాజుతో అంటాడు. ఇప్పుడు ఎలా వెళ్తావ్.. నాన్న చీకటి అయింది వద్దని శ్రీవల్లి అంటుంది దాంతో ఆగిపోతాడు.

అగ్నిపరీక్షలో ఒపీనియన్ ట్యాగ్ ఎవరికొచ్చిందంటే!

బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడానికి జియో హాట్ స్టార్ లో అగ్నిపరీక్ష ద్వారా ఎపిసోడ్ లని రిలీజ్ చేస్తున్నారు బిబి టీమ్. ఇక ఈ అగ్నిపరీక్ష ముగియడానికి మూడు ఎపిసోడ్ లే మిగిలి ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో పదిహేను మందిలో ఎవరికి ఏ ఒపీనియన్ ఉందో ట్యాగ్ ఇవ్వాలని టాస్క్ అందరు ఒకొక్క ఒపీనియన్ తమకి నచ్చని వారికి ఇస్తూ వచ్చారు.  నాగ, హరీష్ కి ప్రసన్న కుమార్ ట్యాగ్ ఇచ్చాడు కానీ వాళ్ళు మేమ్ అది కాదు అని వాదించారు. దాంతో ప్రసన్న కుమార్ సైలెంట్ అయిపోయాడు. ఇక శ్రీముఖి అతని దగ్గరికి వచ్చి ఇలా ఉండకూడదు.. ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావని అతడిని అడుగుతుంది.

తోలుబొమ్మలాట.. శ్రీముఖి ఫైర్.. ఎల్లో కార్డ్స్ ఇచ్చిన నవదీప్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దాంతో టాస్కులన్నీ కూడా ఫుల్ టఫ్ గా ప్లాన్ చేస్తోంది టీమ్. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ఇక ఇందులో రెండు ఇంటర్ కనెక్షన్ టాస్కులు ఇచ్చారు. ముందుగా టాగ్స్ ఇమ్మని  చెప్పి ఎవరు ఎవరికీ టాగ్స్ ఇచ్చారో ఆ ఇద్దరినీ ఒక జోడీగా చేసి బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ ఆడించారు. అంటే తోలు బొమ్మలాటను ఆడించారు. ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టించేసింది. టేబుల్ మీద కొన్ని గిన్నెలు, ఒక ప్లేట్ లో స్వీట్స్ పెట్టింది. వాళ్ళను ఆడించేవాళ్లను వెనక నిలబెట్టింది శ్రీముఖి. తర్వాత ఒక కార్డు చూపించి ఆ కార్డులో ఉన్న స్వీట్ ని ఆ కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తితో సరిగా గుర్తించేలా చేసి ఆ స్వీట్ ని గిన్నెలో వేయించి వెంటనే వచ్చి గంట గొట్టాలి.

శ్రీనివాస్ తో గొంతు కలిపిన కార్తీక్...డాక్టర్స్ కి చూపిస్తాం అంటూ ప్రామిస్ చేసిన థమన్

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ వచ్చి జడ్జెస్ ని ఇంప్రెస్స్ చేసేలా పడుతూ వెళ్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో వైజాగ్ నుంచి వచ్చిన 26 ఏళ్ళ శ్రీనివాస్ సాంగ్ కి ఫిదా ఇపోయారు జడ్జెస్ ముగ్గురు. శ్రీనివాస్ పుట్టిన దగ్గర నుంచే తనకు కళ్ళు కనిపించవు అని చెప్పాడు. ఇక థమన్ "ఏ సాంగ్ పాడుతున్నావ్" అని అడిగేసరికి..."ఒక మారు" అనే సాంగ్ పడుతున్నా అని చెప్పాడు. "ఓహ్ అది కార్తీక్ సాంగ్ కదా కార్తీక్ అంటే ఇష్టమా" అని అడిగాడు. "అవును అలాగే మీరు నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్" అని చెప్పాడు. "ఏ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇష్టం" అని కార్తీక్ అడిగాడు. "వయోలిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇష్టం భాగమతి మూవీ కూడా ఇంకా ఇష్టం, నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అని చెప్పాడు. "వీళ్లందరినీ మీరు ఎలా ఊహించుకుంటారు " అని గీత మాధురి అడిగింది. డైలాగ్స్ వింటూ యాక్షన్ లో ఊహించుకుంటాను అని చెప్పాడు.

ఢీ డాన్సర్స్ అన్షు - రాజు...హగ్గులు,రోజాలు

ఇంతకుముందు వరకు జబర్దస్త్ లోనే ట్రెండింగ్ కపుల్స్ కనిపించేవాళ్ళు...వాళ్లనే నెటిజన్స్ కూడా ఆరాధిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఢీ షోలో కూడా ఆ ట్రెండ్ కనిపిస్తోంది. కొంతమంది కపుల్ కంటెస్టెంట్స్ మాత్రం ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నారు. వాళ్ళే అన్షు - రాజు, ఆనాల సుస్మిత - పండు, విజయ బిన్నీ మాష్టర్ - రెజీనా అలాగే భూమిక - అభి మాస్టర్ ఇలా. నెక్స్ట్ వీక్ ఢీ షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందన్న విషయం ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇందులో కాండిల్ లైట్ కపుల్స్ గా వీళ్ళు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక అన్షు - రాజు ఐతే నిజంగానే ప్రేమలో ఉన్నట్టు ఈ షో ద్వారా లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. "నీ కోసం రెక్కల గుర్రాన్ని తేలేకపోవచ్చు కానీ రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని ఒక రాణిలా చూసుకుంటాను" అంటూ అన్షుకి ప్రామిస్ చేసాడు రాజు.