English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమని తెలుసుకున్న కొడుకు.. భార్యతో ప్రేమగా ఉంటున్న సీతాకాంత్!

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమని తెలుసుకున్న కొడుకు.. భార్యతో ప్రేమగా ఉంటున్న సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -312 లో.....రామలక్ష్మి తెలివిగా భద్రాన్ని పట్టుకొని పోలీసుల ముందుకు తీసుకొని వస్తాడు. దాంతో శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. నా పేరుని నమ్మి వెంచర్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరికి డబ్బు మీరే ఇవ్వండి అని సీతాకాంత్ పోలీసులకి చెప్తాడు. దాంతో పాటు ఈ ఫ్రాడ్ భద్రం గాడిని కూడా అప్పగిస్తున్నాను.. మీ వాళ్లే మీకు ఎందుకు ఇలా చేశారని మీడియా వాళ్ళు సీతాకాంత్ ని అడుగుతారు. దానికి సమాధానం రామలక్ష్మి చెప్తుంది. వాళ్లే ఇలా చేశారు. ఇంకా ఆవిడ అయితే తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చిందంటూ శ్రీలత గురించి చెప్పబోతుంటే.. 'రామలక్ష్మి' అని పిలిచి సీతాకాంత్ ఆపుతాడు.

Illu illalu pillalu: కత్తిపట్టుకోవాల్సింది చేతులు కలుపుతున్నావంటే తేడా కొడుతుందిరా!

Illu illalu pillalu: కత్తిపట్టుకోవాల్సింది చేతులు కలుపుతున్నావంటే తేడా కొడుతుందిరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-66 లో.. ధీరజ్, సాగర్ ఇద్దరు ప్రేమ, నర్మదలను వీపుపై ఎక్కించుకుని పందెంలో పోటీ పడతారు. అయితే ప్రేమను మోస్తూనే.. ఇంత పరువు ఉన్నావే ఏంటే రాక్షసి అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ.. నీ మీద ఎక్కినందుకు నాకు ఒళ్లు కంపరంగా ఉందిరా అని గిల్లి గిచ్చేస్తుంటుంది. చివరికి పోటీలో కూడా ధీరజ్, ప్రేమలే గెలుస్తారు. సాగర్, నర్మదలు రెండో స్థానంలో నిలుస్తారు. మా ఇద్దరు కోడళ్లు మా కుటుంబాన్నిగెలిపించారని తెగ సంబరపడిపోతుంది వేదవతి. అయితే తనని గిచ్చినందుకు ప్రేమను గట్టిగా గిచ్చుతాడు ధీరజ్. దానికి ఆమె పెద్దగా అరుస్తుంది. సరిగ్గా అప్పుడే భద్రవతి చూస్తుంది. ఆ రామరాజుగాడి కుటుంబంతో కలిసి పోవడం నేను భరించలేకపోతున్నాను. నువ్వు మమ్మల్ని చేసిన మోసాన్ని సహించలేకపోతున్నానని భద్రవతి రగిలిపోతుంది. ఇక ఆ తర్వాత తాడు లాగే కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Brahmamudi : అనామిక ప్లాన్ కనిపెట్టేసిన ప్రియుడు.. కోర్టు నోటీసులు పంపించిన ధాన్యలక్ష్మి!

Brahmamudi : అనామిక ప్లాన్ కనిపెట్టేసిన ప్రియుడు.. కోర్టు నోటీసులు పంపించిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -629 లో.. అనామిక సామంత్ లు చెస్ ఆడతారు. ఆ నందు గాడిని లేకుండా చేసి రాజ్ కావ్యలని మరింత ప్రాబ్లమ్ లోకి నెట్టేసాం.. వాళ్ళ కుటుంబం మొత్తం కుళ్ళి కుళ్ళి ఏడవాలని అనామిక అంటుంది. ఆ తర్వాత ఆ ఆఫీస్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనామిక అంటుంది. అప్పుడు నీదే స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ అవుతుందని అనామిక అంటుంటే సామంత్ మురిసిపోతాడు. ఈ అనామికని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరంటూ తన గురించి తనే గొప్పగా చెప్తుంది.

నా జీవితంలో కలర్ ఫుల్ డేస్ అంటే అవే..

నా జీవితంలో కలర్ ఫుల్ డేస్ అంటే అవే..

చలాకి చంటి అంటే చాలు ఒకప్పటి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. అప్పటిలో ధన్ రాజ్, చంటి, వేణు వండర్స్ వీళ్లంతా టీమ్ గా ఉండేవాళ్లు. ఇక ఇప్పుడు చంటి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఐతే రీసెంట్ గా నూకరాజు చంటితో చిన్న చిట్ చాట్ చేసాడు. ఆ విషయాలు చూద్దాం.  "నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్  యాక్షన్  షాట్ జల్లు అనే మూవీ. నేను, ధన్ రాజ్, చిత్రం శీను, గ్రేట్ కమెడియన్ ఎంఎస్ నారాయణ గారితో కలిసి చేశా. నాకు డైలాగ్ చెప్పాలంటే ఫస్ట్ టైం కదా భయంగా ఉంది. అప్పుడు నారాయణ గారు పక్కకు తీసుకెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అందులోనూ క్లోజ్ షాట్ దొరకడం చాల అదృష్టం. సినిమా ఆడినా ఆడకపోయినా ఒక్కసారి ఎవరైనా చూసినా కూడా నువ్వు ఎప్పటికీ ఈ ప్రపంచానికి గుర్తుండిపోతావ్ అన్నారు.

Karthika Deepam2 : ఆపరేషన్ చేస్తే గానీ శౌర్య బ్రతకదు.. తల్లిపై పడి ఏడ్చేసిన కార్తీక్ బాబు!

Karthika Deepam2 : ఆపరేషన్ చేస్తే గానీ శౌర్య బ్రతకదు.. తల్లిపై పడి ఏడ్చేసిన కార్తీక్ బాబు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -263 లో...శౌర్య దగ్గరికి వెళదామన్న దీపని ఏదో ఒకటి చెప్పి కార్తీక్ ఆపుతాడు. ఈ టైమ్ కి శౌర్య తిని పడుకుంటుంది. మనం భోజనం చేద్దామని దీపతో కార్తీక్ అంటాడు. మరుసటిరోజు కార్తీక్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. ఫిఫ్టీ పెర్సెంట్ అమౌంట్ ఈ రోజే పే చేయాలని చెప్తారు. సరే కట్టేస్తామని కార్తీక్ అంటుంటే.. అపుడే దీప వచ్చి ఎవరికి డబ్బు కట్టాలని అడుగుతుంది. అదేం లేదు ఇప్పుడు నన్నేం అడగొద్దని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసిన అనసూయ కార్తీక్ దగ్గరికి వెళ్లి.. శౌర్య ఎలా ఉందని అడుగుతుంది. మీరు ఏదో దాస్తున్నారని అనసూయ అనగానే శౌర్య బాగుంది ఇలా అడగకండి దీప వింటుందని కార్తీక్ అంటాడు.

Karthika Deepam2 : తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన జ్యోత్స్న.. శౌర్య కోసం ఎమోషనల్ అయిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -262 లో.....పోలీసుల ఎంక్వయిరీ లో నేనే దాస్ ని కొట్టానని తెలుస్తుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. దాంతో జ్యోత్స్న టెన్షన్ మరింత పెరుగుతుంది. దాస్ గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అవును వాడు నా కొడుకు అని పారిజాతం అంటుంది. తనకి అయిన దెబ్బలు చూస్తుంటే అవి ఆక్సిడెంట్ అయిన దెబ్బలు లాగా లేవు.. ఎవరో బలవంతం గా కొట్టినట్లు ఉందని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే చివరగా ఇక్కడ చూపించింది. తర్వాత సిగ్నల్ చూపించలేదని ఇన్‌స్పెక్టర్ అంటాడు.