English | Telugu

Illu illalu pillalu : నగలు తీసేసుకున్న శ్రీవల్లి.. తిరుపతి హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -254 లో.. ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చెయ్యగానే తన సంగతి చెప్తానంటూ కళ్యాణ్ చెప్పిన అడ్రెస్ కి వెళ్తుంది కానీ ఎంత వెతికినా కళ్యాణ్ కనిపించడు. కళ్యణ్ ప్రేమకి ఫోన్ చేసి ఇంత టెన్షన్ పడుతూ కూడా ఎంత బాగున్నావ్ బేబీ అని తనని చాటు నుండి చూస్తూ ఫోన్ మాట్లాడతాడు. ఎక్కడున్నావ్ రా అని ప్రేమ కోపంగా మాట్లాడుతుంది. కళ్యాణ్ గురించి ప్రేమ వీధి వీధి వెతుక్కుంటూ అర్థరాత్రి రోడ్డుపై తిరుగుతు ధీరజ్ కి ఎదరుపడుతుంది. ఇంత అర్థరాత్రి ఏం చేస్తున్నావ్ ఏదో పెద్ద ప్రాబ్లమ్ నిన్ను భయపెడుతుంది.. ఏంటది అని ధీరజ్ అడుగగా ప్రేమ సైలెంట్ గా ఉంటుంది.

bigg boss agnipareeksha : అందరితో కన్నీళ్లు పెట్టించిన ప్రసన్న ఎలిమినేషన్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష డోర్స్ క్లోజ్ కావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని నవదీప్ చెప్తూ వస్తున్నాడు. ఇక ఈ రోజు ఇద్దరినీ ఏలిమినేట్ చేశారు. అందులో ఒకరు ప్రసన్న కుమార్. ఆయనకు నవదీప్ రెడ్ కార్డు ఇచ్చేసరికి అక్కడున్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా అతనితో జోడిగా ఉన్న విజయవాడ అడ్వకేట్ నాగా కూడా తట్టుకోలేకపోయాడు. 12 వ  ఎపిసోడ్ లో జరిగిన మినీ టాస్క్ లో నాగా డంబ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ఐతే తర్వాత ప్రసన్న నాగా విషయంలో కరెక్ట్ పాయింట్స్ కూడా రైజ్ చేయలేదు. ఇక 13 వ ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్కుల్లో కూడా ప్రసన్న సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం అలాగే నాగా కూడా టాస్క్ గెలవడానికి చాల ఎఫోర్ట్స్ పెట్టిన గెలవలేకపోయాడు. ఐతే ప్రసన్నకు ఆల్రెడీ ఎల్లో కార్డు ఉండడం కూడా మైనస్ అయ్యింది. దాంతో నవదీప్ రెడ్ కార్డు ఇచ్చి ఇక షో నుంచి ఏలిమినేట్ అయ్యారంటూ చెప్పాడు. ఇది నువ్వు ఉండాల్సిన షో కాదు. బయట ఉన్నది నీ ప్రపంచం. నీ కథ ఈ ప్రపంచానికి తెలిసింది. అలాగే నీ జర్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఉంది. ఇంత వరకు వచ్చావంటే గ్రేట్ అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అమ్మ బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళళపోయాను..ఏలిమినేట్ ఐన శ్వేత  

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇక 13 వ ఎపిసోడ్ లో శ్వేతా, ప్రసన్న కుమార్ ఏలిమినేట్ ఇపోయారు. అంటే 15 మందిలో ఇప్పుడు కేవలం 13 మంది మాత్రమే మిగిలారు. మూటలను హోల్స్ లో వేసే టాస్క్ లో హరీష్, శ్వేతా జోడి ఆడారు. కానీ ఆ టీమ్ ఓడిపోయింది. దాంతో బిందు రెడ్ కార్డు ఇచ్చింది. ఆల్రెడీ శ్వేతా దగ్గర ఒక ఎల్లో కార్డు ఉంది. ఇప్పుడు ఓడిపోవడంతో ఇక ఏలిమినేట్ చేసేసారు. "బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తోంది అంటే నేను అన్నిటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాను. కానీ నేను చాలా ట్రై చేశాను. నేను బిగ్ బాస్ హౌస్ లోకి మా అమ్మను తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ కుదర్లేదు" అని చెప్పింది శ్వేతా.