English | Telugu

నా జీవితంలో కలర్ ఫుల్ డేస్ అంటే అవే..

నా జీవితంలో కలర్ ఫుల్ డేస్ అంటే అవే..

చలాకి చంటి అంటే చాలు ఒకప్పటి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. అప్పటిలో ధన్ రాజ్, చంటి, వేణు వండర్స్ వీళ్లంతా టీమ్ గా ఉండేవాళ్లు. ఇక ఇప్పుడు చంటి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఐతే రీసెంట్ గా నూకరాజు చంటితో చిన్న చిట్ చాట్ చేసాడు. ఆ విషయాలు చూద్దాం.  "నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్  యాక్షన్  షాట్ జల్లు అనే మూవీ. నేను, ధన్ రాజ్, చిత్రం శీను, గ్రేట్ కమెడియన్ ఎంఎస్ నారాయణ గారితో కలిసి చేశా. నాకు డైలాగ్ చెప్పాలంటే ఫస్ట్ టైం కదా భయంగా ఉంది. అప్పుడు నారాయణ గారు పక్కకు తీసుకెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అందులోనూ క్లోజ్ షాట్ దొరకడం చాల అదృష్టం. సినిమా ఆడినా ఆడకపోయినా ఒక్కసారి ఎవరైనా చూసినా కూడా నువ్వు ఎప్పటికీ ఈ ప్రపంచానికి గుర్తుండిపోతావ్ అన్నారు.

Karthika Deepam2 : ఆపరేషన్ చేస్తే గానీ శౌర్య బ్రతకదు.. తల్లిపై పడి ఏడ్చేసిన కార్తీక్ బాబు!

Karthika Deepam2 : ఆపరేషన్ చేస్తే గానీ శౌర్య బ్రతకదు.. తల్లిపై పడి ఏడ్చేసిన కార్తీక్ బాబు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -263 లో...శౌర్య దగ్గరికి వెళదామన్న దీపని ఏదో ఒకటి చెప్పి కార్తీక్ ఆపుతాడు. ఈ టైమ్ కి శౌర్య తిని పడుకుంటుంది. మనం భోజనం చేద్దామని దీపతో కార్తీక్ అంటాడు. మరుసటిరోజు కార్తీక్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. ఫిఫ్టీ పెర్సెంట్ అమౌంట్ ఈ రోజే పే చేయాలని చెప్తారు. సరే కట్టేస్తామని కార్తీక్ అంటుంటే.. అపుడే దీప వచ్చి ఎవరికి డబ్బు కట్టాలని అడుగుతుంది. అదేం లేదు ఇప్పుడు నన్నేం అడగొద్దని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసిన అనసూయ కార్తీక్ దగ్గరికి వెళ్లి.. శౌర్య ఎలా ఉందని అడుగుతుంది. మీరు ఏదో దాస్తున్నారని అనసూయ అనగానే శౌర్య బాగుంది ఇలా అడగకండి దీప వింటుందని కార్తీక్ అంటాడు.

Karthika Deepam2 : తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన జ్యోత్స్న.. శౌర్య కోసం ఎమోషనల్ అయిన దీప!

Karthika Deepam2 : తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన జ్యోత్స్న.. శౌర్య కోసం ఎమోషనల్ అయిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -262 లో.....పోలీసుల ఎంక్వయిరీ లో నేనే దాస్ ని కొట్టానని తెలుస్తుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. దాంతో జ్యోత్స్న టెన్షన్ మరింత పెరుగుతుంది. దాస్ గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అవును వాడు నా కొడుకు అని పారిజాతం అంటుంది. తనకి అయిన దెబ్బలు చూస్తుంటే అవి ఆక్సిడెంట్ అయిన దెబ్బలు లాగా లేవు.. ఎవరో బలవంతం గా కొట్టినట్లు ఉందని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే చివరగా ఇక్కడ చూపించింది. తర్వాత సిగ్నల్ చూపించలేదని ఇన్‌స్పెక్టర్ అంటాడు.

Brahmamudi : భార్యని అర్థం చేసుకున్న భర్త.. ఇదే కదా సరికొత్త బ్రహ్మముడి!

Brahmamudi : భార్యని అర్థం చేసుకున్న భర్త.. ఇదే కదా సరికొత్త బ్రహ్మముడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -626 లో.... రుద్రాణి ధాన్యలక్ష్మి లు గెస్ట్ హౌస్ తాకట్టు గురించి అడుగగా.. వచ్చాక చెప్తామని వాళ్ళతో రాజ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఇక రాజ్ , కావ్య నందగోపాల్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడున్న రౌడీలని కావ్య తన ఎమోషనల్ మాటలతో గొడవ చేయకుండా ఆపుతుంది. వాళ్లు ఆగితే ఏంటి నేనున్నాను కదా అంటూ నందగోపాల్ రాజ్ ని కొట్టబోతాడు. దాంతో రాజ్ వాడిని కొడతాడు బయటకు పరిగెడుతుంటే చుట్టూ పోలీసులు వచ్చి చేరుతారు. నంద గోపాల్ కి తప్పించుకునే ఛాన్స్ ఉండదు.

Eto Vellipoyindhi Manasu : మూడు రోజుల టైమ్ ఇచ్చిన పోలీసులు.. మోసం చేయలేదని సీతాకాంత్ నిరూపిస్తాడా!

Eto Vellipoyindhi Manasu : మూడు రోజుల టైమ్ ఇచ్చిన పోలీసులు.. మోసం చేయలేదని సీతాకాంత్ నిరూపిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో...... మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గర అందరు గొడవ చేస్తున్నారని చెప్పడం తో రామలక్ష్మి, మాణిక్యం సీతాకాంత్ లు ఆఫీస్ కి బయల్దేర్తారు. అప్పుడే రామలక్ష్మి కి శ్రీలత ఫోన్ చేస్తుంది. జరుగుతున్న దానికి తనకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది లిఫ్ట్ చేసి మాట్లాడమని మాణిక్యం అంటాడు. దాంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇదంతా కావాలని మీరే చేయించారా అని రామలక్ష్మి అడుగగా.. మరి లేనిది ఉన్నట్టు ఎలా అవుతుంది. అంతా నేనే చేశానని శ్రీలత అంటుంది.

Illu illalu pillalu : రామరాజుకి ఎదురుతిరిగిన కొడుకు.. వాడిని చంపడానికి విశ్వ స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -61 లో..... నీ ముద్దుల కొడుకు వల్ల నలుగురిలో పరువు పోయిందని రామరాజు అంటుంటే ధీరజ్ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దాంతో మాట్లాడకని రామరాజు అనగానే.. నేను మాట్లాడతాను నాన్న.. నలుగురు ఏం అనుకుంటారో అంటున్నారు. ఎవరు ఆ నలుగురు ఇరవై అయిదు సంవత్సరాల క్రితం మీరు అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నలుగురు మీకు సాయంగా ఉండి.. ఒక పూట భోజనం పెట్టారా.. ఎందుకు నలుగురి గురించి అలోచించడం అని ధీరజ్ అంటుంటే.. రామరాజుకి ఇంకా కోపం వస్తుంది.