English | Telugu

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్...జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్...జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా

 బుల్లితెర మీద రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఆమెకు శునకాలంటే పిచ్చి ప్రేమ. ఏ మూగజీవానికి హాని జరిగినా ఊరుకోదు. అలాంటి రష్మీ దగ్గర ఒకప్పుడు చుట్కి అనే పెట్ డాగ్ ఉండేది. దాంతో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా రష్మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసేది. ఐతే అది కొంతకాలం క్రితం చనిపోయింది. ఇక రష్మీ తన పెట్ డాగ్ అస్థికలను గోదావరి నదిలో కలిపేసింది. ఆ వీడియోని అలాగే తన చుట్కితో గడిపిన క్షణాల వీడియోస్ ని కూడా పోస్ట్ చేసింది. "ఒక జీవిత కాలం పాటు నీ ప్రేమను నేను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది ఉంటే గనక ఎలాంటి బాధా లేకుండా పుట్టాలని కోరుకుంటున్నాను.

Eto Vellipoyindhi Manasu : రామ్ పుట్టినరోజుకి రామలక్ష్మి వస్తుందా.. షాక్ లో సీతాకాంత్!

Eto Vellipoyindhi Manasu : రామ్ పుట్టినరోజుకి రామలక్ష్మి వస్తుందా.. షాక్ లో సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో.....రామలక్ష్మి రామ్ కి టీసీ ఇస్తానని చెప్పడంతో.. నేను భోజనం చెయ్యనంటు రామ్ మారం చేస్తుంటాడు. నాకు ఆ మిస్ కావాలి. నాతో సరదాగా ఆడుకుంటుందని రామ్ ఏడుస్తుంటే.. నువ్వు ఆ స్కూల్ లోనే ఉంటావ్. నేను మేడమ్ తో మాట్లాడతానని రామ్ ని సీతాకాంత్ బ్రతిమాలతాడు. రామలక్ష్మి తన క్యాబిన్ లోకి వచ్చి తనకి సంబంధించిన వస్తువులు తీసుకుంటుంది. అప్పుడే ఇద్దరు టీచర్స్ వస్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ రామ్ కి ఇవ్వండి అని చెప్పి బయలుదేర్తుంది.

Illu illalu pillalu : డబ్బున్నోళ్ళలాగా నటిస్తున్న భాగ్యం.. రామరాజు కుటుంబం పసిగట్టగలరా!

Illu illalu pillalu : డబ్బున్నోళ్ళలాగా నటిస్తున్న భాగ్యం.. రామరాజు కుటుంబం పసిగట్టగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో....రామరాజు వాళ్ళు ఇంటికి వస్తాను అనడంతో భాగ్యం టెన్షన్ పడుతుంది. మనం బాగా డబ్బున్నోళ్ళమని బిల్డప్ ఇచ్చినాం.. ఇప్పుడు వాళ్ళు ఈ కొంపని చుస్తే ఇంకేమైనా ఉందా నేను చదవిందే ఆరో తరగతి.. బిటెక్ అని చెప్పావని శ్రీవల్లి అంటుంది. ఇవన్నీ సమస్య కంటే ఇంకొక పెద్ద సమస్య ఉంది. రేపు ఇంటికి వస్తే మనం ఉండే ఈ అద్దె కొంపని చూస్తారని భాగ్యం చిన్న కూతురు అంటుంది. అలా జరగకూడదు. ఇలాంటి బకరా సంబంధం మళ్ళీ దొరకదని భాగ్యం అంటుంది.

Karthika Deepam2 : సెంట్ నచ్చలేదని భార్యకి విడాకులిస్తానన్న భర్త!

Karthika Deepam2 : సెంట్ నచ్చలేదని భార్యకి విడాకులిస్తానన్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -299 లో.... శ్రీధర్, కావేరి ఇద్దరు కార్తీక్ రెస్టారెంట్ కి వస్తారు. శ్రీధర్, కావేరి తిన్న తర్వాత బిల్ కట్టడానికి డబ్బులు మర్చిపోయి వస్తారు. దీపని తిట్టాడని కోపంతో కావేరి కూడ ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్తుంది. పర్లేదు అని దీప అంటుంటే.. ఎందుకలా అంటావ్ ఇలాగేనా బిజినెస్ చేసేది ఇలా అంటూ ఉంటే మనం అప్పు ఎలా కడతామని కార్తీక్ అంటాడు. నేను అన్న మాటలు నాకే అప్పజెప్పుతున్నావా అని శ్రీధర్ అంటాడు. అన్న మాటలు అప్పుతో సమానమని కార్తీక్ అంటాడు.

Brahmamudi : కావ్యకి ప్రపోజ్ చేసిన రాజ్.. హానిమూన్ కి ప్లాన్!

Brahmamudi : కావ్యకి ప్రపోజ్ చేసిన రాజ్.. హానిమూన్ కి ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -663 లో.....ఇంట్లో అందరు కలిసి రాజ్ రాగానే చుట్టుముడతారు. నువ్వు ఎప్పుడు ఆఫీస్ అంటావ్.. నీకు కావలసిన హెల్ప్ కావ్య దగ్గర నుండి తీసుకుంటావ్ కానీ తన గురించి ఎప్పడైనా ఆలోచించావా.. అందుకే మీరు కొన్ని రోజులు హనీమూన్ కి వెళ్ళండి అని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. ఇంత సడెన్ గా అంటే కష్టమని రాజ్ అనగానే.. అన్ని ఏర్పాట్లు చేసానని సుభాష్ అంటాడు. ఇదిగో ఫ్లైట్ టికెట్స్ అని ప్రకాష్ ఇస్తాడు. లగేజ్ అంటూ స్వప్న ఇస్తుంది. అందరు ప్లాన్ డ్ గా ఉన్నారు కదా.. ఇదంతా కావ్య ట్రైనింగా అని రాజ్ అనగానే.. నాకు తెలుసు మీరు నన్నే అంటారని అంటూ అలిగి కావ్య పైకి వెళ్తుంది.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి రామలక్ష్మి వార్నింగ్.. తను ఊటీ బ్రాంచ్ కి వెళ్ళిపోతుందట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో.... సీఐ సీతాకాంత్ ఇంటికి వస్తాడు. తనని చూసి రామలక్ష్మి మైథిలి వేరు వేరు అని చెప్తాడో.. ఒకవేళ మైథిలి రామలక్ష్మిలు ఒకరే అని చెప్తాడో అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. సీఐ తో రామలక్ష్మి రావడం చూసి ఇంకా టెన్షన్ పడతారు. తను ఎందుకు వస్తుంది. నేనే రామలక్ష్మిని.. వాళ్ళు నన్ను చంపాలని చూసారని చెప్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి కోపంగా లోపలికి వస్తుంది. రామ్ ఎదరుపడి మేమే వస్తుంటే మీరే వచ్చారని అంటాడు. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని రామ్ ని పంపిస్తుంది.