English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఆస్తుల కోసం కొడుకుని లేపేయ్యాలని చూస్తున్న సవతి తల్లి!

Eto Vellipoyindhi Manasu : ఆస్తుల కోసం కొడుకుని లేపేయ్యాలని చూస్తున్న సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -284 లో... శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వచ్చి మీరు నిజంగానే మారిపోయారా అని అడుగుతుంది. రామలక్ష్మి అడిగిన వాటిల్లో సందీప్ ఇష్టమని శ్రీలత చెప్పగానే.. అంటే మీకు సీతా సర్ కన్నా సందీప్ ఇష్టం అన్నమాట అని రామలక్ష్మి అనగానే.. సీతా ఇష్టమే కానీ సందీప్ ని నవమాసాలు మోసి కన్నాను కదా అని శ్రీలత కవర్ చేస్తుంది. మీరు మారిపోతే మంచిదే కానీ మారకుండా సీతా సర్ నీ ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం మళ్ళీ నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి.

అఖిల్ కామెంట్స్ కి నిఖిల్ కౌంటర్...ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు

అఖిల్ కామెంట్స్ కి నిఖిల్ కౌంటర్...ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు

పొలిటికల్ కామెంట్స్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చేసే కామెంట్స్ బయట వాళ్ళ ఫాన్స్ కానీ ఇతరత్రా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే కామెంట్స్ కూడా  బాగా డిబేటబుల్ అవుతాయి.. అలాగే కాంట్రవర్సి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ 8 కి సంబంధించి గత బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్  చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. "గౌతమ్ రియల్ విన్నర్ కానీ గౌతమ్ ని బిగ్ బాస్ విన్నర్ ని చేయాలనుకోవడం లేదు..నిఖిల్ ని విన్నర్ ని చేయాలనుకుంటోంది..ఏదో జరుగుతోంది" అంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

విజయ సేతుపతి సలహా : బేబక్క తినడమే కాదు.. మంచిగా వర్కౌట్ చేయండి 

విజయ సేతుపతి సలహా : బేబక్క తినడమే కాదు.. మంచిగా వర్కౌట్ చేయండి 

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యుట్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె వాడే పడికట్టు పదాలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. "బై పెండ్స్...గట్టిగా పాపాలు చేసేయండి. నాలుగు కాలాలు పాటు హాయిగా  ఉంటారు" లాంటి రీల్స్ తో ఆమె బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి వచ్చింది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనౌన్స్ చేసే రోజున విజయ్ సేతుపతిని తెలుగు బిగ్ బాస్ కి తీసుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అలాగే ఎలిమినేట్ ఐన, ఎక్స్ - కంటెస్టెంట్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు. అందులో ముందుగా ముక్కు అవినాష్ చెయ్యెత్తి టాప్ 5 కంటెస్టెంట్ ని సర్ అని విజయ్ సేతుపతికి చెప్పాడు.

బిగ్ బాస్ 8 గేమ్ చెంజర్ ...నీ పొట్టెక్కడ భయ్యా 

బిగ్ బాస్ 8 గేమ్ చెంజర్ ...నీ పొట్టెక్కడ భయ్యా 

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ దాదాపు జబర్దస్త్ లో పదేళ్లుగా కామెడీ స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని నవ్విస్తూ వస్తున్నాడు. అలాంటి అవినాష్ కమెడియన్ గా మాత్రమే కాదు అటు బిగ్ బాస్ కి వెళ్లి కూడా ఎంటర్టైన్ కూడా చేసాడు. బుల్లితెర మీద అవినాష్ హోస్ట్ శ్రీముఖి ఇద్దరూ జిగిరీ దోస్తులు. ఐతే అవినాష్ ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పార్టిసిపేట్ చేసి త‌న‌దైన రీతిలో న‌వ్వించి ఆక‌ట్టుకున్నాడు. ఇక హౌస్ నుంచి వచ్చాక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఇతరత్రా షోస్ లో కనిపిస్తూ వస్తున్నాడు. అలాగే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా వీడియోస్ చేస్తున్నాడు. అలాంటి అవినాష్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 లోకి అవకాశం వచ్చింది. దాంతో తన సత్తా నిరూపించుకోవడానికి వెళ్ళాడు. గేమ్ కూడా బాగా ఆడాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రానంత గుర్తింపు ఈ సీజన్ లో వచ్చింది. టాప్ 5 లో నిలబడ్డాడు.

రైతు బిడ్డ కాదు..మోడరన్ రాయల్ బిడ్డ

రైతు బిడ్డ కాదు..మోడరన్ రాయల్ బిడ్డ

​బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటిగరీలో వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటాడు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ తో వైరల్ అవుతూ ఉంటాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ కి వచ్చి వేషాలేస్తున్నాడని కొందరు, రైతు పని చేసినంత మాత్రాన స్టైల్ గా ఉండకూడదా అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ ని తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక అతను కూడా తగ్గేదేలే అన్నట్టు అల్లు అర్జున్ డైలాగ్ ని రెట్టించి చెప్తూ ఉంటాడు. " మల్లొచ్చినా" అంటే అంటూనే ఉంటాడు. ఐతే బిగ్ బాస్ టైటిల్‌ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానని బిగ్ బాస్ స్టేజి మీద ప్రకటించాడు కూడా.

Brahmamudi : భార్య చేతులు పట్టుకున్న భర్త.. ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందా!

Brahmamudi : భార్య చేతులు పట్టుకున్న భర్త.. ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -597 లో..... దుగ్గిరాల ఇంటికి బ్యాంకు ఆఫీసర్స్ వచ్చినట్లు ఆస్తులు జాప్తు చేస్తామనగానే ధాన్యలక్ష్మి, రుద్రాణి లు కేసు వేస్తామని అనడంతో ఇందిరాదేవి కిందపడిపోయినట్లు రాజ్ కల కంటాడు. దాంతో ఒక్కసారిగా నిద్ర లేచి అలా జరగకూడదు లోన్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలని రాజ్ తనకి తెలిసిన బ్యాంక్ ఎంప్లాయికి ఫోన్ చెయ్యగా.. ఇస్తాం, కానీ ఆస్తులు ఎవరి పేరున ఉన్నాయో వాళ్ళని తీసుకొని రండీ అనగానే రాజ్ సరే అంటాడు. ఇప్పుడు కావ్యని బ్రతిమిలాడాలని రాజ్ అనుకుంటాడు.

Brahmamudi : కోడలికి భాద్యతలు చెప్పిన అత్త.. ఆయనెందుకు టెన్షన్ లో ఉన్నాడు!

Brahmamudi : కోడలికి భాద్యతలు చెప్పిన అత్త.. ఆయనెందుకు టెన్షన్ లో ఉన్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -596 లో.... అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది.  ఈ బాధ్యతలు నాకు వద్దని అంటుంది. అది బరువు అనుకోకు బాధ్యతలా ఫీల్ అవ్వు.. ఎవరు అడిగిన వాళ్ళ అవసరం అడుగు.. అవసరం అయితేనే ఇవ్వు.. అప్పుడే నీ నైపుణ్యం తెలుస్తుందని కావ్యకి అపర్ణ చెప్తుంది. మీరు అందుకే ఈ బాధ్యతలు అప్పజెప్పారా అని కావ్య అనగానే.. నీకు అలవాటు అవుతుందని ఇచ్చానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఎవరు వచ్చి డబ్బులు అడిగినా ఇస్తారన్నమాట అయితే నేను కూడా డబ్బులు సంపాదించాలని రాహుల్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి సీతారామయ్య గారు నాకు డబ్బులు ఇస్తా అన్నారని అడుగమని రాహుల్ మాట్లాడుతుంటే.. అప్పుడే స్వప్న వచ్చి రాహుల్ నీ తిడుతుంది. రుద్రాణికి కూడా రాహుల్ భాగోతం చెప్పగానే.. తను కూడ స్వప్న వెళ్ళిపోయాక చివాట్లు పెడుతుంది.

Karthika Deepam2 : ఇది ఆరంభం మాత్రమే.. కార్తీక్ శపథం అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'.(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -231 లో...కార్తీక్, దీప కలిసి ఇంటికి వస్తారు. అనసూయ క్యారేజ్ చూసేసరికి అది బరువుగా ఉంటుంది. దాంతో వీళ్ళు భోజనం చెయ్యాలేదు.. ఏం జరిగిందని అనసూయ, కాంచన ఇద్దరు దీపని అడుగుతారు. నన్నేం అడగకండి అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ ని కంపెనీ నుండి తీసేయ్యడమేంటని దశరత్ తో మాట్లాడుతుంది సుమిత్ర. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. వాడు పోతే నష్టమేంటి అన్నట్లు మాట్లాడుతాడు. అప్పుడే జ్యోత్స్న కూడా వస్తుంది. బావ వెళ్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావని జ్యోత్స్నతో సుమిత్ర అనగా.. వాడు తగ్గాలా నేను తగ్గాలా అని శివన్నారాయణ‌ అంటాడు. వాడు పోతే ఇంకా దొరకరా ఏంటని పారిజాతం అనగానే.. దొరకరు పిన్ని వాడు చాలా టాలెంటెడ్.. వాడు సీఈఓ అయినప్పటి నుండి మరిన్ని లాభాలు వచ్చాయని దశరథ్ అంటాడు. ఇంకా వాడి గురించి ఆపు.. మనమందరం ఉన్నాం.. వాడేం చేసిన శివన్నారాయణని మాత్రం ఢీ కొట్టలేడని శివన్నారాయణ అంటాడు.