English | Telugu

llu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ట్రాప్ చేసాడంట!

llu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ట్రాప్ చేసాడంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో... ధీరజ్ మళ్ళీ ఎందుకు వచ్చాడంటూ రామరాజు గొడవ పెడుతుంటే.. వద్దని వేదవతి ఆపుతుంది. వాడు తప్పు చేసాడని వద్దని అంటున్నారు. మరి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు రానిచ్చారని వేదవతి అడుగుతుంది. రామరాజు ఆలోచలలో పడి.. సరే ఇక ముందు వాడు ఏదైనా తప్పు చేస్తే నీ సంగతి చెప్తానని రామరాజు అంటాడు. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య నేనే హెల్ప్ చేస్తే చివరికి నన్నే వెళ్ళమంటారా అని నర్మద అంటుంది. దాంతో నీకు నాకు మాటలు లేవు అంటూ వెళ్ళిపోతుంది వేదవతి.

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం హైపర్ ఆది ?

జబర్దస్త్ షోకి యాంకర్ గా అనసూయ వెళ్లిపోయాకా చాలా మంది మారారు కానీ అప్పటికి ఇప్పటికీ ఒకే ఒక్క యాంకర్ రష్మీ మాత్రమే అలాగే ఆ షోస్ ని ఏలుతోంది. ఐతే ఈ గ్యాప్ లో సౌమ్య రావు కూడా జబర్దస్త్ యాంకర్ గా కన్నడ నుంచి వచ్చింది. కానీ చాలా కొద్దీ టైంలోనే వెళ్ళిపోయింది. ఐతే ఆమె షో నుంచి వెళ్లిపోవడానికి కారణం హైపర్ ఆది అనే టాక్ బాగా వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు హైపర్ ఆది గురించి సౌమ్య తన మాటల్లో చెప్పుకొచ్చింది. "జబర్దస్త్ కి హోస్ట్ గా వచ్చినప్పుడు నాకు అసలు ఆ షో అంటే ఏంటో కూడా తెలీదు. హోస్ట్ అనసూయ అంటే కూడా ఎవరో తెలీదు. తర్వాత వాళ్ల వీడియోస్, షోస్ చూసి తెలుసుకున్నా. సుధీర్, రష్మీ జోడి నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళ గురించి నాకేం తెలీదు. ఆఫ్ స్క్రీన్ లో సుధీర్ ఎం మాట్లాడరు.. వచ్చినప్పుడు హాయ్ అని వెళ్ళేటప్పుడు బై అని చెప్పి వెళ్ళిపోతారు అంతే.