English | Telugu

Jayam serial : వినాయకుడి విగ్రహం మాయం.. వీరూనే చేసి ఉంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -46 లో.....సూపర్ మార్కెట్ ని బంద్ చేసి రుద్రని డెవలప్ కాకుండా చెయ్యాలని వీరు ప్లాన్ చేస్తాడు. కానీ రుద్ర ముందే సమస్యని పసిగట్టి పరిష్కరిస్తాడు. ఇక వినాయకుడి విగ్రహలు రావడం లేట్ అయ్యేలా వీరు చేస్తాడు. కానీ గంగ మట్టితో విగ్రహాలని రెడీ చేస్తుంది.

గంగ వంక రుద్ర అలానే చూస్తుంటాడు. రుద్ర గాడిని దెబ్బ కొట్టాలంటే అన్నీ అడ్డంకులే ఈ గంగ వల్ల మొత్తం చెడిపోయింది.. రుద్రకి గంగ తోడైతే ఏం చెయ్యలేమని వీరు అనుకుంటాడు. అప్పుడే వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. అనుకున్నది ఏం జరగడం లేదని ఇషికతో వీరు అంటాడు. ఆ గంగకి ఆ దేవుడి సపోర్ట్ ఉందేమో... అందుకే ఏం చెయ్యలేకపోతున్నామని ఇషిక అంటుంది.

ఆ తర్వాత ఆ దేవుడినే మాయం చేస్తే అని వీరు అనగానే ఏం అంటున్నావ్ బ్రో అని ఇషిక షాక్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం ఇందుమతి హాల్లోకి వస్తుంది. వినాయకుడి విగ్రహం అక్కడ ఉండదు.. దాంతో తను షాక్ అయి అందరిని పిలుస్తుంది. ఆ విషయం ఇందుమతి చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. వినయకుడి విగ్రహం కన్పించకపోవడం ఏంటని ఇంట్లో అందరు అనుకుంటారు. అప్పుడే గంగ వస్తుంది. విషయం తెలిసి షాక్ అవుతుంది. అసలు వినాయకుడి విగ్రహం ఎవరు తీశారు.. వీరూనే తీసి ఉంటాడా.. తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.