English | Telugu

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్-9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ వీళ్ళే!

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్-9 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరు.. కామనర్స్ ఎవరు.. సెలెబ్రిటీస్ ఎవరు.. అసలు టాస్క్ లు ఏంటి.. ఇలా ఎన్నో ప్రశ్నలతో బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్-9 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కోసం అగ్నిపరీక్ష మొదలెట్టగా వారిలో నుండి కొంతమందిని ఫిల్టర్ చేశారు బిబి టీమ్. మరి కామనర్స్ తో పాటు హౌస్ లోకి వెళ్ళేదెవరో ఓ సారి చూసేద్దాం.. ఇమ్మాన్యుయల్, సింగర్ శ్రీతేజ, సంజనా గల్రాని, రీతు చౌదరి, భరణి, సుమన్ శెట్టి, తనూజ, దెబ్జానీ, ఆశా షైనీ, స్రష్టి వర్మ, రాము రాథోడ్ కన్ఫమ్ కంటెస్టెంట్స్ అని తెలుస్తోంది. ఇక కామనర్స్ నుండి ఎవరు వస్తారోనని క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేయబోతున్నాడు. ఇక హౌస్ లోకి ఎంతమంది కంటెస్టెంట్స్ వెళ్తారు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయా.. ఓల్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా హౌస్ లోకి వెళ్తారా లేదా అసలు ఈ సీజన్-9 లో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు వాటన్నింటికి జవాబులు కావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.