English | Telugu

మధు అర్జెంటుగా మీ ఆవిడని కట్ చెయ్.. అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సూపర్ స్టార్స్ రి-యూనియన్ నిర్వహించారు. ఈ షోకి అలనాటి సీనియర్ సీరియల్ యాక్టర్స్ వచ్చారు. రాజ్ కుమార్, సునయన, సీనియర్ ఆర్టిస్ట్ మధుసూదన రావు-రుతురాగాలు శృతి, కౌశిక్, ఇంద్రనీల్ - మేఘన, సీనియర్ నటుడు ప్రదీప్, ప్రీతి నిగమ్ వంటి వాళ్లంతా వచ్చారు. శ్రీముఖి వీళ్లందరితో మంచి ఫన్ చేసింది. అలనాటి తారలతో అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం అంటూ చెప్పింది శ్రీముఖి. "ప్రదీప్ గారు ఇక్కడ ఉన్న లేడీస్ లో ఫేవరేట్ ఒక్కరినే మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు" అని అడిగాడు. "శ్రీముఖినే" అని చెప్పాడు ప్రదీప్. ఇక శృతి వాళ్ళాయన మధుసూదన్ రావును పట్టుకుని "మధు ఈవిడ నీకు బాగా లైన్ వేస్తోంది..నాకు నచ్చట్లేదు. ఈవిడను ట్రాక్ లోంచి కట్ చెయ్ " అంటూ మధు వాళ్ళావిడ శృతిని చూపిస్తూ అడిగింది. "దా దా" అంటూ మధు శ్రీముఖి చేతిని పట్టుకుని వెళ్ళబోయాడు. దానికి శ్రీముఖి ఆ అని నోరెళ్లబెట్టింది.

వెంటనే సునయన వచ్చి శృతిని పట్టుకుని "ఇదేదో అపశ్రుతిలా ఉంది" అంటూ చెప్పేసరికి శృతి అవాక్కయ్యింది. ఇక రాజ్ కుమార్ ని చూసి "మిమ్మల్ని చూసిన ప్రతీ సారి ముద్దుగా ఒక్కటే పిలవాలనుకుంటున్నాను. రాజా" అని పిలిచేసరికి రాజ్ కుమార్ కూడా సిగ్గుపడిపోయాడు. "రాజా రాజాధిరాజా" అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక సునయనని పిలిచి "అబ్బాయిల్లో ఒక్కళ్లను సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు" అని అడిగింది శ్రీముఖి. "కౌశిక్ నా ఫస్ట్ హీరో కాబట్టి..అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్" అని కౌంటర్ వేసేసరికి కౌశిక్ షాకైపోయాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..