English | Telugu

పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు

జబర్దస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ గా శ్రీదేవి విజయ్ కుమార్, కృష్ణ భగవాన్ వచ్చారు. ఇక నూకరాజు, కొమరక్కా ఇద్దరూ కలిసి ఒక స్కిట్ వేశారు. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు. "మిడిల్ క్లాస్ అంటే ఏమిటి" అని కొమరక్కా అడిగేసరికి " పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు" అంటూ నూకరాజు చెప్పారు. "పైసలు తక్కువున్నప్పుడు పిల్లలెందుకు ఎక్కువ" అని అడిగింది. "రిచ్ పర్సన్..పని తప్ప వేరే కోరిక ఉండదు. మిడిల్ క్లాస్. కోరికలు తప్ప పనులే ఉండవు" అని చెప్పాడు. ఇక రాంప్రసాద్, సున్ని కలిసి వేసిన స్కిట్ లో బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాడు. "మన బెస్ట్ ఫ్రెండ్ ఏరా మనం నాశనమైపోవాలని కోరుకుంటాడు ఫస్ట్" అన్నాడు రాంప్రసాద్. "అదేంట్రా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వేగా" అన్నాడు సున్ని. "నీకు మందు అలవాటు చేసింది. నీ కెరీర్ డల్ కావడానికి కారణం ఎవరు" అనేసరికి "నువ్వు" అన్నాడు సన్నీ. "ఇప్పుడు నేనేమవుతాను" అన్నాడు రాంప్రసాద్.

శ్రీముఖి అసలైన రాధికా...డిజె టిల్లు కౌంటర్

జీ కుటుంబం 2025 అవార్డ్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ ప్రోమోలో "తెలుసు కదా" మూవీ టీమ్ నుంచి సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా వచ్చారు. అలాగే సీరియల్స్ నుంచి కొంతమంది లేడీ యాక్టర్స్ కూడా వచ్చారు. డిజె టిల్లు మూవీలో రాధికా రోల్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఈ అవార్డ్స్ ఈవెంట్ కూడా రాధికా రోల్ మీదనే నడిచింది. ఈ షోకి హోస్ట్స్ గా ప్రదీప్, శ్రీముఖి ఉన్నారు.  "మా ప్రతీ సీరియల్ లోనూ ఒక రాధికా ఉంటుంది" అని ప్రదీప్ అనేసరికి. "రాధికా లైఫ్ లోనే ఉంటుంది సర్" అన్నాడు సిద్దు. "నాకు లైఫ్ అప్పుడప్పుడు రాధికలా ఉంటుంది" అన్నాడు ప్రదీప్. "ఇప్పుడు మీ ముందుకు కొంతమందిని ప్రెజెంట్ చేస్తాను. వాళ్లలో రాధికా ఎవరో చెప్పాలి" అన్నాడు ప్రదీప్. "మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డ్రెస్సింగ్ ని బట్టి రాధికా తెలిసిపోతుంది" అంటూ శ్రీముఖి చెప్పింది. "నీ గోల ఏంటి మధ్యలో.." అంటూ శ్రీముఖి మీద సిద్దు సెటైర్స్ వేసాడు.

సింగపూర్ లో  కీర్తి సురేష్ క్రైమ్ స్టోరీ...

జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి మోడరన్ మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక జగపతి బాబు మీదనే కీర్తి ఫుల్ సెటైర్స్ వేసింది. "నువ్వు మహానటివి అని తెలుసు...బయట పెద్ద మహానటివి" అనేసరికి "మీకు మహానాటీ" అంటూ కన్ను కొట్టి సరదాగా మాట్లాడింది కీర్తి సురేష్. "స్కూల్ లో ఎలా ఉండేదానివి" అనేసరికి "ఉందా మీ దగ్గర ఫోటో" అని అడిగింది. "అదిగో" అంటూ కీర్తి స్కూల్ ఫోటో చూపించారు. "పాకెట్ మనీ నీకు ఇచ్చేవాళ్ళా నువ్వు జేబులోంచి కొట్టేసేదానివా" అని అడిగారు. "జేబులోంచి తియ్యడం..ఆ సంతోషమే వేరు" అని చెప్పేసరికి జగపతి బాబు పగలబడి నవ్వారు.

Illu illalu pillalu : చందు నిజం చెప్పేస్తాడేమోనని హార్ట్ ఎటాక్ డ్రామా ఆడిన భాగ్యం దంపతులు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -282 లో.... శ్రీవల్లిని ప్రేమ ఒక ఆట అడేసుకుంటుంది. గాజు పెంకులపై డ్యాన్స్ చేయిస్తుంది. దాంతో ప్రేమ అంటే శ్రీవల్లికి భయం వేస్తుంది. మరుసటి రోజు శ్రీవల్లి కాలికి గాజు పెంకులు గుజ్జుకున్నాయని ఏడుస్తుంటే నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఆ తర్వాత ప్రేమ నిద్ర లేచి.. రాత్రి జరిగింది గుర్తుచేసుకుంటుంది. ధీరజ్ వచ్చి నా డ్రెస్ ఎక్కడ అని అడుగుతాడు. నాకేం తెలుసు.. మీ ఐశ్వర్యకి తెలుసని వెటకారంగా మాట్లాడుతుంది.