English | Telugu

Brahmamudi : అప్పుని తిట్టిన కావ్య.. ఇదంతా రాజ్ వల్లేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -844 లో......కావ్య దగ్గరకి అప్పు వచ్చి విడాకులు తీసుకుంటానని ఎందుకు అంటున్నావని అడుగుతుంది. అప్పుకి నేను ఆడుతుంది నాటకం అని తెలిస్తే అందరికి తెలిసే ప్రమాదం ఉందని అప్పుకి చెప్పదు. ఏ తల్లి అయిన బిడ్డకి జన్మనివ్వాలనుకుంటుంది. ప్రాణం తియ్యాలనుకోదు.. అలాంటిది మీ బావ నన్ను అబార్షన్ చేసుకోవాలంటున్నాడని కావ్య అంటుంది.

అదంతా రుద్రాణి వింటుంది. అప్పు తన రూమ్ లో ఆలోచిస్తుంటే ధాన్యలక్ష్మి వచ్చి భోజనానికి పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని అప్పు చెప్తుంది. తర్వాత తింటానని అప్పు అనగానే ధాన్యలక్ష్మి వెళ్లి భోజనం చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. అప్పు ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. తర్వాత తింటానని చెప్పిందని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుని వాళ్ళ అక్క ఇష్టం వచ్చినట్లు తిట్టింది.. అందుకే భోజనానికి రాలేదని రుద్రాణి అనగానే చెల్లిని అక్క ఎందుకు తిడుతుందని ఇందిరాదేవి అడుగుతుంది.

మీ గొడవల్లోకి నా కోడలిని లాగకండి అని కావ్యపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఆ తర్వాత అప్పుకి భోజనం తీసుకొని వెళ్తాడు‌ కళ్యాణ్. తనకి నచ్చజెప్పి భోజనం తినేలా చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య బయట పడుకోమని పంపిస్తుంది. మరొకవైపు సుభాష్, ప్రకాష్ లు కూడా బయట హాల్లో పడుకోవడానికి వస్తారు. నీ వల్లేరా ఇదంతా అని రాజ్ తో సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.