English | Telugu
మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఆగడు". శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తమన్నా చేయట్లేదని తెలిసింది.
నారా రోహిత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి "రౌడీ ఫెల్లో" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం ద్వారా పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జెండాపై కపిరాజు". సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా అమలపాల్ నటిస్తుంది. కె.ఎస్.శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ యంగ్ బాలకృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఆకాష్ షూటింగ్ లో పాల్గొననున్నాడని దర్శకుడు తెలిపారు.
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "టాప్ ర్యాంకర్స్". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. జి.నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పసుపులేటి బ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జయసూర్య సంగీతాన్ని సమకూర్చారు.
పూనమ్ పాండే. ఈ పేరు తెలియని వారుండరు. IPL టైం లో ఇండియా గెలిస్తే బట్టలు విప్పేసి గ్రౌండ్ లో డాన్స్ చేస్తానని కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు హోలీ కి తన అందాలను రంగులలో తడిపిన ఫొటోస్ నెట్ లో పెట్టేసి కుర్రాళ్ళను తన వైపుకు తిప్పేసుకుంది.
"ఎప్పుడోచ్చాం అని కాదన్నయ్య.. బుల్లెట్టు దిగిందా లేదా" ఇది పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్. ఇదే డైలాగ్ ను తన స్టైల్ లో చెప్తుంది హాట్ బ్యూటీ సన్నీ లియోన్.
సూపర్స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఆ అవకాశం అందరికి రాదు. అయితే రజినీతో సినిమా చేసే ఛాన్స్ రావడమే చాలా గొప్ప విషయం. అలాంటి అవకాశాన్ని వదులుకొని ఇపుడు చాలా బాధపడుతుంది అందాల అనుష్క.
తన అనుమతి లేకుండా తన నడుము చూపించేసరని గోల గోల చేసిన నజ్రియా నజిమ్ ఇపుడు అందరికి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం "వాయ్ మూడి పెసువోయ్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మమ్ముట్టీ తనయుడు దుల్హర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మున్నార్ లో జరుగుతుంది.
నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....
"కితకితలు" చిత్రంలో అల్లరి నరేష్ కు బండ భార్య గా, తన నటనతో మనల్ని కడుపుబ్బ నవ్వించిన నటి గీతాసింగ్ హీరోయిన్ గా మారింది. జి.మధుబాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క, ఆర్య జంటగా నటించిన తాజా చిత్రం "వర్ణ". సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుండి U సర్టిఫికేట్ ను దక్కించుకుంది.
మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి "పాండవులు పాండవులు తుమ్మెదా" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
సాయిధరంతేజ హీరోగా అప్పట్లో 2010లో ప్రారంభమైన "రేయ్" సినిమా ఎట్టకేలకు 2014 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వై.వి.యస్. చౌదరి దర్శకత్వంలో మూడు సంవత్సరాల పాటు కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం సాయిధరంతేజకు మొదటి సినిమా అవుతుందో లేక రెండో సినిమా అవుతుందో చూడాలి.
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్ర ఆడియోను ఈనెల 13న విడుదల చేయనున్నారు. సుధా సినిమాస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా