English | Telugu

Illu illalu pillalu : అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చూసేసిన ధీరజ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో.... శ్రీవల్లి ఆటకి చెక్ పెట్టాలని నర్మద, ప్రేమ అనుకుంటారు. ఇంట్లో స్వీట్ చేసి అందరిని పిలిచి స్వీట్ ఇస్తారు. ఏంటి స్పెషల్ అని వేదవతి వాళ్ళ అడుగుతారు. ఈ రోజు వల్లి అక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా అని ప్రేమ అంటుంది. అదంతా విన్న శ్రీవల్లి బయపడుతుంది. ఎలా తప్పించుకోవాలో అలోచించి కిచెన్ లోకి వెళ్లి రెండు ఉల్లిపాయలు తీసుకొని వచ్చి చంకలో పెట్టుకొని జ్వరం వచ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది.

శ్రీవల్లి దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. వాళ్లు వచ్చే సరికి జ్వరంతో వణుకుతుంది శ్రీవల్లి. జ్వరం వచ్చింది చెల్లి అని శ్రీవల్లి అనగానే అయ్యో అవునా అని చెయ్యి పట్టుకొని చూస్తారు. దాంతో ఉల్లిపాయ కిందపడుతుంది. అది చూసి నీ జ్వరం ఎలా తగ్గించాలో మాకు తెలుసని ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు భాగ్యం, ఆనందరావులకి అప్పు ఇచ్చిన వాళ్ళు కొట్టడానికి వస్తారు. వాళ్ళ నుండి తప్పించుకొని శ్రీవల్లికి ఫోన్ చేస్తే నేనున్న సిచువేషన్ బాలేదని వాళ్లపై కోప్పడి ఫోన్ కట్ చేస్తుంది.

శ్రీవల్లి అక్కకి జ్వరం వచ్చింది. అందుకే డాక్టర్ ని పిలిపిస్తున్నామని ప్రేమ, నర్మద ఇంట్లో వాళ్ళతో చెప్తారు. అప్పుడే డాక్టర్ వస్తాడు. శ్రీవల్లికి ఇంజక్షన్ చేపించాలని అనుకుంటారు. డాక్టర్ పశువులకి వేసే పెద్ద ఇంజక్షన్ తియ్యగా.. అది చూసి శ్రీవల్లి భయపడి నాకు జ్వరం తగ్గిపోయిందని డాన్స్ చేస్తుంది. నాకు తెలుసు అక్కా.. అతను డాక్టర్ కాదు నీ యాక్టింగ్ బయటపెట్టాలని రప్పించామని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. తరువాయి భాగం లో అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం ధీరజ్ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.