Publish Date:Oct 21, 2022
లోకంలో స్నేహాలు చిత్రంగా ఉంటాయి. మనిషికి జంతువులకి, మనిషికి పక్షులకీనూ! వాటి విశ్వాసం, స్నేహం పోని తెంచలేని సంబంధాలు అర్ధంకావు. వాటి మనసులో మాట చెప్పలేవు..స్నేహం చేస్తున్న వారికే తెలియాలి. పక్షులు మాట్లాడతాయంటారు.. ఎలా? అన్నది ఆ స్నేహితులే చెప్పగల్గుతారు. రోజూ గింజలు తినడానికి వచ్చే పావురం ఒక్కరోజు రాకుంటే పెద్దాయన ఆలోచనలో పడతాడు, మంచినీళ్లు తాగడానికీ ఆలోచిస్తాడు..అరే ఇది ఇవాళింకా రాలేదే అనుకుంటాడు! అదీ అంతే కిటికీ ఊచలకు ఊగు తూ .. ఈ ముసలాయన ఇంకా కనపడలేదే అనీ అనుకుంటుంది..హాస్యం కాదు.. వారి స్నేహంలో అదో అందం.. చూసి తీరాలంతే!
తనకే దిక్కులేదు ఇదొకటి నా వెంటే పడుతోందనుకోలేదు చిన్న కుక్కపిల్లతో బిచ్చగాడు. కానీ మధ్యా న్నం అయ్యేసరికి కనీసం ఒక ముద్ద దానికీ పెట్టడంతో వదల్లేదు. ఆ బిచ్చగాడు చనిపోతే చొక్కాతో పట్టి లాగి కాస్తంత నీడగా ఉన్న బస్టాప్లో పడేసి వీడి సంగతి చూడమని రోడ్డునపోయేవారికి మొరిగి మొరిగి మరీ చెప్పింది. . అదీ విశ్వాసం. తర్వాత అదీ రెండేళ్లకి యాక్సిడెంట్లో చనిపోయింది, సరిగ్గా దానికి అన్నం పెట్టిన వాడు చనిపోయిన చోటే!
మనం తినేటపుడు రెండు గింజలు పడేస్తే పక్షులూ అదే సమయానికి పనిగట్టుకుని వస్తూంటాయి. అదేదో నగరంలో పక్షుల రాజా అనేవాడుండేవాడు. అతని పేరు ఎవ్వరికీ తెలీదు. పావురాలన్నీ మధ్యాన్నానికి అతని దగ్గరి వచ్చి చేరతాయి. తలమీద డాన్స్ చేస్తాయి. అతను గట్టిగా నవ్వుకుంటాడు. జేబులోంచి పది గింజలు విసిరితే అవి తినేసి వాటిపళాన అవి ఎగిరిపోతాయి.. అతను తృప్తిగా నవ్వుకుంటాడు. ఇది చిత్రంగా ఉండవచ్చు. కానీ అదో స్నేహబంధం..త్వరగా అందరికీ అర్ధం కాదు.
శ్రీలంక బట్టికలోవాలో ఒక వ్యక్తి ఒక కొండముచ్చుకి రోజూ కాస్తంత తిండి పెట్టేవాడు. వారి స్నేహం కుది రి దింది. రోజూ తిండి పెట్టేవాడు. అతను ఈమధ్యనే మరణించాడు. ఆ రోజు అతని బంధువులు, తెలిసిన వారూ ఎంతో బాధపడ్డారు, శవం ఇంటిముందు పెట్టారు. అంతలో ఒక్క ఉదుటున వచ్చింది అతని స్నేహితురాలు పెద్ద కొండముచ్చు. ఎంతో బాధపడుతూ చేత్తో గుండెల మీద కొడుతూ లేపడానికి ప్రయ త్నించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటివి అరుదే.. కానీ ఆ బంధం అంతటితో తెగిపోదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-friendship-is-endless-relation-25-145819.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.