Publish Date:Oct 21, 2022
ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తం చేయడం కూడా ఇటీవలి కాలంలో అర్ధరహితంగా, చాలా దారుణంగా మారిం దనడానికి ఉదాహరణే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టడం. అయితే ఈ చర్య వెనుక రాజకీయ కారణాల కంటే ఆ ప్రాంతం లో ఫ్లోరోసిస్ బాధితులు తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, బీజేపీ హామీని నిలబెట్టుకోలేదన్న ఆక్రోశమే ఆక్రోశమే ప్రధాన కారణమై ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారు జాతీయ రహదారి పక్కన ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి కేటాయించిన స్థలంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫ్లోరైడ్ పరిశో ధనా కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్కు తరలించడానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానా లు న్నాయి. ఫ్లోరైడ్ కేంద్రానికి కేటాయించిన స్థలానికి వెళ్లే దారిలో మట్టితో సమాధి కట్టారు. దానిపై జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టారు. అక్కడే ‘రీజినల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం సమాధిని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీ సులు అక్కడికి చేరుకొని సమాధిని తొలగించారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా , రాష్ట్రంలోని 1,041 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కేంద్రం 2017లో రూ.700కోట్లు, అంతకుముందు ఏడా ది నీతి ఆయోగ్ ద్వారా రూ.95కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఒక సీఎం ఒక గ్రామానికి ఎన్నికల ఇన్చార్జ్గా ఉండటం ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్ప డుతున్నారని, తెలంగాణను కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా మారుస్తున్నారని ఆయన మండి పడ్డారు.
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా 2016 ఫిబ్రవరి 9న మర్రిగూడ మండలంలో పర్యటించారు. పరిశోధన కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతుం డటంపై ఫ్లోరోసిస్ బాధితులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అయితే, పరిశోధన కేంద్రం పనులు ప్రారంభం కాక పోగా దానిని పశ్చిమ బెంగాల్కు తరలిస్తూ అప్పటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. దీనిని నిరసిస్తూ బాధితులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. అప్పటి నుంచి ఈ భూమి నేష నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పేరుతో నిరుపయోగంగా ఉంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికతో పరిశోధన కేంద్రం మళ్లీ తెరపైకి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/naddas-tombflorosys-victims-work-25-145821.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.