Publish Date:Oct 21, 2022
రాజసూయం అంటే ప్రాచీన భారతదేశపు రాజులు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి చేసే ఒక వైదిక క్రతువు. రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో ఈ యాగాన్ని నిర్వహిస్తారు. మహాభారతంలో ధర్మ రాజు రాజసూయ యాగం చేసినట్లు ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది. ఈ యాగం చివరలో ధర్మ రాజు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వబోగా అందరూ అంగీకరించినా శిశుపాలుడు అంగీకరించక, కృష్ణుణ్ణి తులనాడతాడు. శ్రీకృష్ణుడు అతని నూరు తప్పులు క్షమించి తర్వాత తన సుదర్శన చక్రంతో సంహరి స్తాడు.
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ రాజసూయ యాగం చేస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ ప్రకటించారు. తమ పార్టీ ముఖ్యులతో కలిసి కేంద్రం పథకాలు, అభివృద్ధిని.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో చేరి కలు వెల్లు వలా ఉంటాయని చెప్పారు. తెలంగాణలో సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రదాత ఎవరో త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా తెలంగాణాలో కేసీఆర్ను శిశుపాలునిగా భావించి వారి పాలన లోపాలను ఫుల్ సౌండ్లో మైకుల్లో మళ్లీ మరో మరోసారి ప్రజల చెవులు చిల్లులు పడేలా వినిపించి టీఆర్ ఎస్ను గద్దె దించేయ మని యుద్ధానికి ఓటర్లను సమాయత్తం చేస్తుందిట. మును గోడు భారీ మెజారిటీతో గెలిచి ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజయాన్ని కానుకగా ఇవ్వడానికి బీజేపీ శ్రేణులు ఇలా సిద్ధమవుతున్నారనే అనుకోవాలేమో!
ముందుముఖ్యంగా, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య లేదంటున్న మంత్రి హరీశ్, అక్కడ ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని బూర డిమాండ్ చేశారు. బీజేపీలో చేరాక గురువారం తొలిసారిగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బూర.. మీడియాతో మాట్లా డారు. ఉద్యమ వ్యతిరేకులు, పక్క రాష్ట్రం నాయకులకు టీఆర్ఎస్ అడ్డాగా మారిందని విమర్శించారు. ప్రగతి భవన్లోకి వెళ్లాలంటే ప్రజలకు వీసా దొరకట్లేదని అన్నారు. ఉమ్మడి ఏపీలో కంటే కఠినమైన నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
సినిమాల్లో ఒకప్పుడు సిల్క్ స్మిత పాపులర్. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిని చూస్తే అదే అభిపాయ్రం కలుగుతోంది. లింగభేదం ఒక్కటే తేడా అని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పై 2014 ఎన్నికల ముందు కేసీఆర్ చూపించిన సినిమా దృశ్యాలను మరిచిపోలేకపోతున్నానని నర్సయ్య తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-its-bjps-rajasuyam-25-145816.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.