తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్, జీహెచ్ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు, మోటార్ వైహిల్ ట్యాక్సేషన్ చట్టాల సవరణలను సంబంధించి 5 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండా శాసన సభలో ఈ బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఇందులో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన 3 కీలక బిల్లులున్నాయి. సీఎం, ట్రాన్స్ఫోర్టు మినిస్టర్ల తరపున ఈ బిల్లులను సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు.
మూజువాణి ఓటుతో సభ వీటికి ఆమోదం తెలిపింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి గడ్డం ప్రసాద్ పక్షపాతి వైఖరికి నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల బహిష్కరించనున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం తమకు సభలో మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత కాలినడకన ఎదురుగా ఉన్న గన్పార్క్లోకి వెళ్లి స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-assembly-36-211892.html
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది.
రాష్ట్రపతి భవన్లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ రెండవ ప్రదర్శన జరగనుంది.
కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి?
కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా కీలక చర్యలు చేపట్టింది.
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.