విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుడి ఆదాయానికి గండి కొడుతున్న వీఐపీ, వీవీఐపీ దర్శనాలకూ ఇక నుంచి టికెట్ తప్పని సరి చేశారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి నిత్యం మూడు వందల మంది వరకూ వీఐపీలు, వీవీఐపీలు వస్తుండటం, వారందరికీ ఉచిత దర్శనాలతో దుర్గ గుడి ఆదాయానికి భారీగా గండిపడుతోందని భావించిన ఆలయ అధికారులు ఇక నుంచి ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
నిత్యం వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో 30 వేల మంది, వారాంతాల్లో 50 వేల వరకు దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వస్తారు. వీరిలో రోజుకు మూడు వందల మంది వరకూ వీఐపీ, వీవీఐపీలు ఉంటారు. వీరంతా ఉచితంగానే ఎటువంటి టికెట్ తీసుకోకుండా దుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. ఈ విషయంపై ఆలయ ఈవో స్పందించారు. ఇకపై ఈ పద్ధతికి అడ్డుకట్ట వేయాలని భావించి, ఆ మేరకు ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు చేయాలని నిర్ణయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/durga-gudi-committee-key-decession-36-211907.html
హిడ్మా ఎన్కౌంటర్ వెనుక టీపీసీసీ నేత పాత్ర ఉందని మావోయిస్టులు లేఖ సంచలనం విడుదల చేశారు
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులు ఆమోదం తెలిపింది
ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది.