తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ భారీ వరాలు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం దినోత్సవం వేడుకల్లో మహిళలకు విజయ్ హామీల వర్షం కురిపించారు. టీవీకే అధికారంలో వస్తే నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, యువతులకు పెళ్లి కోసం 8 గ్రాముల గోల్డ్, పట్టుచీర, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు.
ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ తెలిపారు. అన్నపూరణి సూపర్ సిక్స్ పథకం కింద ప్రతి ఏడాది ఆరు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా మహిళలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
కామరాజర్ కల్వి ఉరుతి తిట్టం పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలపై జరిగే నేరాలను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రజా రవాణా వాహనాల్లో ‘స్మార్ట్ పానిక్ బటన్’లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీసు వ్యవస్థలో “రాణి వేలు నచియార్” ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే నవజాత శిశువులకు బంగారు ఉంగరం, బేబీ కిట్ అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. మామల్లపురంలో టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ డే దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఈ హామీలను ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamil-nadu-elections-36-215187.html
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ల దౌత్యం ఉంది. ఇరాన్కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.