యుద్ధంలో అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ గట్టి దెబ్బకొట్టిందా? అమెరికా అహందెబ్బతిందా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. , ఇరాన్ సరిహద్దుల్లోకి చొరబడిన అమెరికా నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేసాయి.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.
గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. అణు ఒప్పందాల విషయంలోనూ, ఆర్థిక ఆంక్షల విషయంలోనూ ఇరు దేశాల మధ్య తీవ్ర వైరం నెలకొంది. ఈ క్రమంలో అమెరికా తన అత్యాధునిక నిఘా విమానాలను ఇరాన్ సరిహద్దుల్లో మోహరించడం, ఇరాన్ వాటిని కూల్చివేయడం అనేది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక పెద్ద యుద్ధానికి సంకేతంగా మారుతోంది. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనకాడబోమని ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.
ఇరాన్ విడుదల చేసిన దృశ్యాల్లో అమెరికా విమానం శకలాలు ఎడారి ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. ఆ విమానంలోని కీలక పరికరాలు, డాక్యుమెంట్లు మరియు ఇతర సాంకేతిక సామాగ్రిని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. తాము శాంతిని కోరుకుంటున్నామని, కానీ తమ భూభాగంలోకి ఎవరైనా అక్రమంగా వస్తే సహించేది లేదని ఇరాన్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వీడియో సాక్ష్యాలు ఇప్పుడు అమెరికాకు మింగుడుపడని అంశంగా మారాయి.
ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ ప్రజలు ఈ చర్యను తమ దేశానికి గర్వకారణంగా అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో పెంటగాన్ వర్గాలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానాన్ని కావాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా దీనికి ప్రతికారంగా తీవ్ర స్థాయిలో ఇరాన్ పై దాడులకు తెగబడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రక్షణ సంబధ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మరో 24 గంటలు అంటూ ఇరాన్ కు స్పష్టమైన హెచ్చరిక చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/setback-for-the-us-36-216852.html
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ల దౌత్యం ఉంది. ఇరాన్కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.