మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

 ఏపీ మద్యం కుంభకోణం కేసులో  వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు  సుప్రీంకోర్టులో  చుక్కెదురైంది. మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు,   ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన    సీజేఐ  నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఈ కుంభకోణంలో 350 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందనడానికి   ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.   ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడంపై సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం   ఉందన్న సుప్రీం కోర్టు . అక్రమంగా చేతులు మారిన వేల కోట్ల రూపాయల వెనుక  అసలు సూత్రధారులు ఎవరు, ఆ డబ్బు ఎక్కడికి తరలించారనే నిజానిజాలు బయటకు రావాలంటే నిందితులను నేరుగా ప్రశ్నించడమే సరైన మార్గమని అభిప్రాయపడింది.

ఇందు కోసం కస్టోడియల్ విచారణ అవసరమనీ, ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక నేరాలలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించకుండా పూర్తి నిజాలు రాబట్టడం సాధ్యం కాదని  సుప్రీం ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. విచారణాధికారులకు సహకరించాల్సిన బాధ్యత నిందితులపై ఉందే తప్ప, విచారణ నుంచి తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బెయిలు  రక్షణ కవచంలా ఉపయోగపడకూడదని  స్పష్టం చేసింది. 350 కోట్ల రూపాయల మేర ప్రజాధనానికి గండి పడిందన్న ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో, నిందితుడికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు   దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటూ కారుమూరి నాగేశ్వరరావు యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఏపీ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు మార్గం సుగమమైనట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

AP liquor scam, Karumuri Nageswara Rao, Supreme Court verdict, anticipatory bail rejected

By
en-us Political News

  
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..!
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.