ఇండియాపై మళ్లీ విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి.!

Publish Date:Jul 29, 2026

Advertisement

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ నిప్పుల గుండంగా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై పీవోకే ప్రజలు ఒక రకంగా తిరుగుబాటు ప్రకటింారు.    ప్రాథమిక హక్కుల కోసం,  రాజకీయ ప్రాతినిధ్యం కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఒక రకంగా పీవోకేలో పరిస్థితి సివిల్ వార్ ను తలపిస్తోంది.  ఇటువంటి పరిస్థితుల్లో    పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన పాక్ పాలకులు.. పీవోకేను శత్రుదేశంగా అభివర్ణిస్తూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు.  ముఖ్యంగా పాకిస్థాన్ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పీవోకే నిరసనకారులను ఇండియా లాగే వాళ్లు కూడా పాకిస్థాన్ కు శత్రువులు అంటూ ప్రేలాపనలు చేస్తున్నారు. పీవోకే నిరసనకారులను భారత్ లాగే శత్రువులు అంటూ పాక్ రక్షణ మంత్రి  ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను  పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.  ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను పీవోకే   ప్రధాని ఫైసల్ ముంతాజ్ రాథోడ్   ఖండించారు.  కాశ్మీరీలకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన  ఖవాజా ఆసిఫ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే.. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇండియా కూడా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన సొంత వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని  భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్   ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ చేస్తోన్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ,  అణచివేత కారణంగానే  పీఓకే ప్రజల ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

Khawaja Asif POK remarks, POK protests 2026, Pakistan Defence Minister controversy, JAAC Rawalakot march, India slams Pakistan POK, Pakistan occupied Kashmir human rights

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..!
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.