మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. పది రోజుల్లో మూడో సారి

Publish Date:May 22, 2026

Advertisement

దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై చమురు సంస్థలు ఇంధన ధరల భారం మోపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటంతో..  దేశీయ చమురు సంస్థలు శనివారం ( మే 23) మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.   గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.  మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు,  ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

 ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్మూజ్ జలసంధి లో రవాణాకు ఎదురౌతున్న ఆటంకాలు.. ధరల పెరుగుదలకు కారణం. ఇండియా తన మొత్తం ముడి చమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అలాగే సగానికి పైగా సహజ వాయువు అవసరాలకు కూడా విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం. ఈ సరఫరా ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాల నుంచే జరుగుతుంది.  

తాజా పెంపు ప్రకారం   దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు పెరిగి రూ.98.64 నుంచి రూ.99.51 కి చేరుకుంది. అలాగే ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 91 పైసలు పెరిగి రూ.91.58 నుంచి రూ.92.49 కి ఎగబాకింది. కోల్‌కతా లో పెట్రోల్ ధరపై 94 పైసలు పెరగడంతో, అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.109.7 నుంచి రూ.110.6 కి చేరింది. అక్కడ డీజిల్ ధర కూడా 95 పైసలు పెరిగి రూ.97 కి చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 90 పైసలు పెరిగి రూ.108.4 కి చేరగా, డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.95 గా నమోదైంది.  చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ.105.3 కి చేరగా, డీజిల్ ధర లీటరుకు 87 పైసలు పెరిగి రూ.96.9 కి పెరిగింది. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సీఎన్‌జీ (సీఎన్జీ) ధరలను కూడా కిలోకు రూ.1 చొప్పున పెంచడంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.81.09 కి చేరింది.

ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి  మే 15 న,  ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు  5 రూపాయల మేర పెరిగాయి.  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించిన గణాంకాల ప్రకారం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రేట్లను నియంత్రించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇందులో కేవలం ఉత్పత్తి వ్యయానికి, విక్రయ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసం వల్లే  లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. లక్ష కోటి వరకు నష్టం వాటిల్లింది. మే 11 న కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలకు ఎలాంటి తక్షణ బెయిలౌట్ ప్యాకేజీని ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో, కంపెనీలు తమ నష్టాల నుంచి బయటపడటానికి ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో దేశీయంగా ఇంధన ధరలు లీటరుకు మరో రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు
చంద్ర‌బాబును చేర‌దీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌దా? అలాంటి చంద్ర‌బాబు రాజారెడ్డిని హ‌త్య చేయించి ఉంటారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.