అమెరికా ఆర్మీడేకి చీఫ్ గెస్ట్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

Publish Date:Jun 13, 2025

Advertisement

భార‌త్ కి దౌత్య‌ప‌ర‌మైన దెబ్బ‌.. కాంగ్రెస్ ఆందోళన 

పాక్ అమెరికా లు  సంప్ర‌దాయ మిత్ర దేశాలు. అయితే  911 దాడుల త‌ర్వాత  పాక్ కి దూరం జ‌రుగుతూ వ‌చ్చింది అమెరికా.  అప్ప‌ట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడ‌దే సీన్ రిపీట్ అవుతూ వ‌స్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్.  ట్రంప్ పిల్ల‌ల‌కు చెందిన వ‌ర‌ల్డ్ లిబ‌ర్టీ ఫైనాన్షియ‌ల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఒప్పంద ప‌త్రాల మీద సంత‌కాలు చేసింది. ఈ సంస్థ పాక్ భూభాగం కేంద్రంగా బిజినెస్ చేస్తోంది. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరిందో తెలిస్తే ఎవరైనా సరే షాక్ కాక తప్పదు. ఒక ప‌క్క పాక్,  భార‌త్ మధ్య  భీక‌ర‌మైన యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డి ఉన్న స‌మ‌యంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ మాట‌కొస్తే ప‌హెల్గాం దాడుల‌కూ మునీర్ వ్యాఖ్య‌ల‌కు సంబంధ‌ముంద‌ని అంటారు కాంగ్రెస్ క‌మ్యూనికేష‌న‌ల్ హెడ్ అయిన జైరామ్ ర‌మేష్. మునీర్ రెచ్చ‌గొట్టిన త‌ర్వాతే ఉగ్ర‌వాదులు కాశ్మీర్ లో రెచ్చిపోయి 26 మందిని హ‌తం చేశారు. 

ఇప్పుడు కాశ్మీర్ ప‌ర్యాట‌కం లేక విల‌విల‌లాడుతోంది.  దానికి తోడు ఆ స‌మ‌యంలో అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ సైతం భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.  వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఈ దాడిలో ఇన్ డైరెక్టుగా అమెరికా  పాత్ర ఉన్న‌ట్టు కూడా అనుమానించాలి.  మొన్న ఇదే మునీర్ ఏదో సాధించేసిన‌ట్టు.. అత‌డికి ఫీల్డ్ మార్ష‌ల్ ప‌ద‌వినిచ్చి స‌త్క‌రించింది పాకిస్తాన్. ఇప్పుడు చూస్తే అమెరికా ఆర్మీ పెరెడ్ కి మునీర్ కు అనూహ్య ఆహ్వానం. దీనంత‌టి వెన‌క అస‌లేం న‌డుస్తోందన్నది స‌స్పెన్స్ గా మారింది. ఈ ఆర్మీడే ఆహ్వానానికి ముందు యూఎస్ జ‌న‌ర‌ల్ ఒక‌రు పాకిస్తాన్ ను  ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌లో అత్యుత్త‌మ భాగ‌స్వామిగా అభివ‌ర్ణించ‌డం కొస‌మెరుపు. అంతే కాదు రెండేళ్ల‌లో ఈ ఇద్ద‌రు.. అంటే    అమెరికా, పాక్ జ‌న‌ర‌ల్స్ మూడు సార్లు క‌లిసిన‌ట్టు రిపోర్టులున్నాయి.  హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్ వంటి వ‌ర‌ల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ట్రెర్ర‌రిస్టుల‌కు ర‌క్ష‌ణ, శిక్ష‌ణ‌తో పాటు వారి కోసం నిధుల సేక‌ర‌ణ కూడా చేసే పాక్ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌లో భాగ‌స్వామి ఎలాగ‌య్యిందో అమెరికాకు తప్ప ఇంకెవ‌రికీ అర్ధం కాదు.

గ‌తంలో ఇదే పాక్ ర‌క్ష‌ణ మంత్రి తాము గ‌తంలో యూఎస్ కోసం ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఎన్నో చెత్త ప‌నులు చేసిన మాట వాస్త‌వం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ ఏ కొత్త చెత్త ప‌నులు యూఎస్ కోసం పాక్ చేస్తుందో అర్ధంకాని అగ‌మ్యగోచ‌రం.  ఇక్క‌డ పాకిస్థాన్ ఉచ్చులో అమెరికా చిక్కిందా.. లేక అమెరికా ఉచ్చులో పాక్ చిక్కిందా? అన్న‌దొక స‌స్పెన్స్. గ‌ త కొంత కాలం నుంచి పాకిస్థాన్ కి ఏకైక ఆర్ధిక ఆద‌రవు చైనా. చైనా పాక్ భూభాగాన్ని ఆశించి.. చైనా పాక్ కారిడార్ పేరిట ఒక ప్ర‌పంచ ర‌హ‌దారి నిర్మాణం చేయ‌డ‌మే కాదు.. హైబ్రిడ్ రోడ్లు, సీపోర్టులు, ఎయిర్ పోర్టులు నిర్మిస్తోంది. 

అయితే బ‌లూచిస్తాన్ స్వేచ్చా పోరాటం చేయ‌డంతో పాటు త‌మది స్వతంత్ర దేశమని  ప్ర‌క‌టించుకుంది. ఆ దేశం గానీ రేప‌టి  రోజున అధికారికంగా పాక్ నుంచి డిటాచ్ అయితే చైనాతో పాక్ సంబంధాలు పూర్తిగా  చెడిపోయే ప‌రిస్థితి. ఇప్ప‌టికే బ‌లూచీలు త‌మ భూభాగంలోని చైనీయుల‌ను త‌రిమి త‌రిమి కొడుతున్నారు. ఈ  సిట్యువేష‌న్లో చైనా కూడా ఆలోచ‌న‌లో ప‌డింది. దానికి తోడు సింధ్ లో నీటి క‌ట‌క‌ట  కార‌ణంగా  ఏకంగా హోం మంత్రి ఇంటికే నిప్పు పెట్టిన ప‌రిస్థితి.

ప‌రిస్థితులు ఎంత మాత్రం స‌జావుగా లేక పోవ‌డంతో.. మునీర్ నాయ‌క‌త్వంలో అమెరికాకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా ప‌థ‌క  ర‌చ‌న చేసింది పాక్. అంతే కాదు అమెరికాకు కూడా పాక్ సాయం అవ‌స‌రం.  కార‌ణ‌మేంటంటే చైనాతో యూఎస్ విప‌రీతమైన వాణిజ్య యుద్ధం చేస్తోంది. అందులో భాగంగా  చైనా ఇటీవ‌ల అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు స‌ర‌ఫ‌రా చేయ‌డాన్ని ఆపేసింది. దీంతో అమెరికా చైనాను క‌ట్ట‌డి చేయ‌డానికంటూ పాక్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటోందని తెలుస్తోంది.

అందుకే వ‌ద్ద‌న్నా ఐఎంఎఫ్ లోన్లు, వ‌ర‌ల్డ్ బ్యాంకు అప్పులు పాక్ కి ఇప్పిస్తోంది అమెరికా. దానికి తోడు మునీర్ కి కూడా ఏదో ఒక  అగ్ర‌దేశం అండ కావాలి. వారి ద్వారా దేశాన్ని ముందుకు న‌డ‌పాల్సిన  ప‌రిస్థితి  ఉంది. భార‌త్  ఇటు బలూచీల‌ను రెచ్చ‌గొడుతూ.. అటు   ఆఫ్ట‌న్ల‌తో చెలిమి చేస్తోంది.  దీంతో అన్ని  ర‌కాలుగా తిరిగి అమెరికాకు ద‌గ్గ‌ర‌వ్వ‌డ‌మే ల‌క్ష్యంగా పాక్ పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మునీర్ కు అమెరికా ఆర్మీడేకు ఆహ్వానం అన్నది దౌత్య ప‌రంగా  భార‌త్ కి భారీ ఎదురుదెబ్బ‌ అంటోంది కాంగ్రెస్. 

ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే పాక్ డ‌యాస్పోరా సైతం ఈ ఆహ్వానానికి వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే పాక్ మాజీ  ప్ర‌ధాని ఇమ్రాన్ పార్టీ అమెరికాలోని పాక్ ఏంబ‌సీ ముందు నిర‌స‌న  కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. అమెరికాతో ఏ ఒప్పంద‌మైనా స‌రే పాక్ కి న‌ష్ట‌మేనంటోంది ఇమ్రాన్ పార్టీ. ఇన్నేసి  దుశ్శ‌కునాల  మ‌ధ్య అసీం  మునీర్ ఏం సాధిస్తాడో తెలియాల్సి ఉంది.

ఇక్క‌డో మ‌రో గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే..  అమెరికా  జూన్ 14న త‌న 250వ ఆర్మీడే జరుపుకుంటోంది.. సరిగ్గా అదే రోజు ట్రంప్ 79వ బ‌ర్త్ డే కూడా. దానికీ మునీర్ హాజ‌ర‌వుతున్నాడు. స‌రే.. మ‌రి  అమెరిక‌న్ సోల్జ‌ర్స్ ని ఉద్దేశించి ఆయ‌నెలా వారికి ప్రేర‌ణ‌గా  నిలుస్తాడ‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ. కార‌ణ‌మేంటంటే ప్లాన్స్ లేవు- ప్రేయ‌ర్స్ త‌ప్ప అంటూ ఆప‌రేష‌న్ సిందూర్ లో చేతులెత్తేసిన మునీర్ వీరికెలా ఇన్ స్పిరేష‌న్ అవుతాడో అర్దం కాక బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు ఒక్కొక్క‌రూ.

By
en-us Political News

  
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో విడదల రజినితో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడు పిల్లి కోటి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వివాదానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే న్యాయస్థానం విడదల రజినిని పాస్ పోర్టు సరెండర్ చేయాల్సిందిగా ఆదేశించింది.
నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం మాత్రమే కాకుండా ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వేదికపైకి వెళ్లి కొత్త ముఖ్యమంత్రిని అభినందించడం ప్రస్తుత కాలంలో అత్యంత అరుదనే చెప్పాలి. ఆ ఆరుదైన సంఘటన కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం జరిగింది.
విద్యాసంవత్సరం ఆరంభాన్ని ఓ భారీ విద్యాపండుగగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఆ రోజు అంటే రానున్న విద్యాసంవత్సరం మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఏకకాలంలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అవేంటంటే అదే రోజున తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలో జమచేయనుంది. అలాగే అదే రోజు అంటే పాఠశాలలె తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించనుంది. అలాగే అదే రోజు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నూ నిర్వహించనుంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు.
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.