Publish Date:Dec 26, 2020
ఏపీలోని జగన్ సర్కార్ రోజుకో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాలకు బ్యాంకులు నిధులు మంజూరు చేయడంలేదని పేర్కొంటూ.. బ్యాంకుల ముందు చెత్త పోయడాన్ని బ్యాంకర్లు సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో వచ్చే సోమవారం నాడు ఏదో ఒక రూపంలో తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరుల్లోని బ్యాంకుల గుమ్మం ముందు చెత్తను గుమ్మరించిన ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై ఆమె ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మాట్లాడినట్లుగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్యాంకు గుమ్మాల ముందు చెత్తపోసిన ఫొటోలను కూడా ఆమె తన పోస్ట్ కు జత చేశారు. దీంతో ఈ విషయం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో "ఏపీలో ఇలా జరుగుతోందా" అంటూ బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోతున్నా జగన్ సర్కారు మాత్రం దీనిని తేలిగ్గానే తీసుకుంటోంది. అంతేకాకుండా రుణాలు అందని పథకాల లబ్ధిదారులే ఇలా నిరసన వ్యక్తం చేశారని ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులలో ఒకేరోజు వివిధ బ్యాంకు శాఖల ముందు చెత్తపోయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని... "ఉన్నతస్థాయి" నుండి వచ్చిన ఆదేశాలను పాటించి మునిసిపాలిటీ పారిశుధ్య సిబ్బంది ఈ పని చేశారని బ్యాంకర్లు భావిస్తున్నారు.
అంతేకాకుండా ఉయ్యూరులో ఏకంగా "నగరపంచాయతీ కమిషనర్" పేరిట బ్యానర్లు ఉంచడమే దీనికి నిదర్శనమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, సీఎం స్వానిధి తదితర పథకాల విధివిధానాల్లో స్పష్టత లేకపోవడంతోపాటు, సిబ్బంది కొరత కారణంగానే రుణాలివ్వడంలో జాప్యం జరుగుతోందే తప్ప ఇందులో ఉద్దేశపూర్వక అలసత్వం ఏమాత్రం లేదని వివిధ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నప్పటికీ ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటాన్ని బ్యాంకర్లు ఖండిస్తున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. క్రిస్మస్ సెలవుల తర్వాత ఏదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేయాలని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఆలోచిస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nirmala-sitharaman-responded-on-vuyyuru-bank-garbage-issue-39-108135.html
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?
మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్ హై స్కూల్ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.
డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు.
మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది.
ఎట్టకేలకు భారత్ యువసేన ఇంగ్లండ్ గడ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగురవేయగలిగింది. కారణం.. ఒకటి శుభ్ మన్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్.
మస్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒకరు అధ్యక్షులు కావాలంటే.. అందుకు ఫస్ట్ వారు జన్మతహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల పైబడి వయసుగల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మస్క్ కి లేవు. ఆయన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్ల వరకూ సాగింది.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి.