LATEST NEWS
  వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడడమే కాక ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగింది. దీనితో దాల్ మిల్ సూరి పై కలెక్టర్  ఉత్తర్వులు మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసామని జిల్లా  ఎస్పీ తెలియజేసారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ విజయ కుమార్ తో కలిసి ఈ కేసు వివరాలను ఎస్పీ విలేకర్ల సమావేశంలో తెలియజేసారు.  కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు తెలిపారు. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు.
  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు  భారత్‌ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు. అయితే, ఈ సంక్షోభానికి శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. వివాద పరిష్కారానికి హింస మార్గం కాదని భారత్ మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఈ ఏడాది చివర్లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రావాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కోరారు. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు.  ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా చెప్పారు. కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆ‌ర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని అని విమర్శించారు. బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్‌ అన్నారు. చిల్లర, బజారు మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతో వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు నాటకాలకు తెరదీశారని మండిపడ్డారు.  ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు.నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడం విచారకరమని అన్నారు.  హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. 
  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామన్నారు. దీంతో రాంచందర్రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.  మరోవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కమలం గూటికి చేరనున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కేసులు, సిట్‌లు, కమిషన్లు, విచారణలు, దర్యాప్తులు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికితోడు బీజేపీ కూడా అటు బీఆర్ఎస్‌పై.. ఇటు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపైనా రాంచందర్ రావు స్పందించారు. ఈ కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటికి వస్తుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతోనే..రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదని టీ బీజేపీ చీఫ్ ఆరోపించారు.  
  బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.  శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమీషన్లలో వాటా ఇవ్వలేదని జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏడ్చారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై  జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభాకర్ రెడ్డి.. నీవ్వుంతా నీ బతుకెంతా?, వ్యక్తిత్వంలో నాతో సరిపోడు. నీ మాదిరిగా నేను ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదు. బీఆర్ఎస్ 40 దొంగల్లో ప్రభాకర్ కూడా ఓ దొంగ'. అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు. పంచే గుణం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు.  నేను ఎలాంటి వాడినో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు. నేమైనా ప్యాకేజీల లీడర్‌ నా అంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ALSO ON TELUGUONE N E W S
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. రాజా సాబ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.    ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఫౌజి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. పెద్దగా హడావుడి లేకుండా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ప్రభాస్ మరో 30 రోజులు కేటాయిస్తే.. ఆయన పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణకు మరో 20 రోజులు పట్టే అవకాశముంది అంటున్నారు.    ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్లు ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం అరుదైపోయింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఓ వైపు 'రాజా సాబ్' చేస్తూ.. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ ఇంత పూర్తి చేయడం మామూలు విషయం కాదు. 'ఫౌజి' చిత్రాన్ని 2026, ఏప్రిల్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  
  ఇండియన్ సినిమాలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటి 'వార్-2'. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ.. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. (War 2)   'వార్-2'ను తెలుగునాట సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం సితార సంస్థ రూ.80 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర'ను కూడా తెలుగునాట సితారే విడుదల చేసి, మంచి లాభాలను పొందింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు 'వార్-2'ని కూడా భారీస్థాయిలో విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్లాన్ చేస్తున్నారట. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం.   'వార్-2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం(ఆగస్టు 10) హైదరాబాద్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, హృతిక్ హాజరు కానున్నారు. బుకింగ్స్ కూడా ఆదివారం నాడే ఓపెన్ కానున్నాయి.   
Telugu Film Chamber have announced their firm decision to not enter into discussions or any sort of negotiations with Film Workers and employees Federation. They are hurt by the federation's decision to unilaterally announce strike. Seems like producers are firm on their decision to not yield to workers' demands.  In the official press release, they wrote, "All members of the Telugu Film Chamber of Commerce are hereby advised not to engage in any discussions or negotiations with any individual Unions of the Telugu Film Industry Employees Federation that have called for a unilateral strike, until further notice. Studios, Outdoor Units, and Infrastructure Unit members are strictly instructed not to provide any services without prior intimation and explicit approval from the Telugu Film Chamber of Commerce. Producers and Studio Sector members are requested to treat this matter with utmost seriousness and strict compliance." This seems like a huge move against Federation and unions with Chamber looking to strictly impose their decision. Let's see how things will be resolved in coming days as many medium budget films will be largely effected by these moves.   
  సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి అంత మొత్తంలో వేతనాలు పెంచడానికి నిర్మాతలు సుముఖంగా లేరు. మరోవైపు ఫెడరేషన్ ఏక పక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంపై ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ మరో సంచలన ప్రకటన చేసింది. ఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు యూనియన్లతో నిర్మాతలు సంప్రదింపులు జరపవద్దని ఆదేశించింది. స్టూడియోలు సైతం ఎలాంటి సేవలూ అందించకూడదని స్పష్టం చేసింది.   "తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌ ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా.. యూనియన్లతో చర్చలు లేదా సంప్రదింపులు జరపకుండా ఉండాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు సూచిస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ నుండి అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదని.. స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లకు కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. నిర్మాతలు మరియు స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పాటించాలి." అంటూ ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది.   
  తారాగణం: ప్రవీణ్, హర్ష చెముడు, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్, షైనింగ్ ఫణి తదితరులు సంగీతం: వికాస్ బాడిస డీఓపీ: బాల సరస్వతి ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ రచన, దర్శకత్వం: ఎస్.జె. శివ నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్ధన ఆచారి బ్యానర్: ఎస్.జె. మూవీస్  విడుదల తేదీ: ఆగస్టు 8, 2025   కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. హర్ష చెముడు, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం టైటిల్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Bakasura Restaurant Review)   కథ: పరమేష్(ప్రవీణ్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెస్టారెంట్ పెట్టాలనేది అతని కోరిక. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టంలేకపోయినా.. జాబ్ చేస్తుంటాడు. నలుగురు స్నేహితులతో కలిసి రూమ్ లో రెంట్ కి ఉంటాడు. వీరంతా కలిసి డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ హంటింగ్ వీడియోలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఒక వీడియో కోసం ఓ బంగ్లాకు వెళ్ళగా.. అక్కడ తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంలో రాసి ఉన్నట్టుగా పూజలు చేయగా.. ఎప్పుడో 200 ఏళ్ళ క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసుర (హర్ష చెముడు) ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ పరమేష్ రూమ్ కి వచ్చిన అంజి(షైనింగ్ ఫణి) శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు ఆ బకాసుర ఎవరు? అతని కథ ఏంటి? బకాసుర ఆత్మ అంజి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పరమేష్, అతని స్నేహితులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? రెస్టారెంట్ పెట్టాలనే పరమేష్ కోరిక నెరవేరిందా లేదా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: తెలుగులో హారర్ కామెడీ జానర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు దాదాపు ఒకే టెంప్లేట్ లో సాగుతుంటాయి. ఒక ఆత్మ ఎవరైనా శరీరంలోకి ప్రవేశించడం, దాని ద్వారా కలిగే భయం నుంచి కామెడీని పుట్టించడం, ఆ ఆత్మకు ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉండటం, ఆత్మ పగను తన పగలా భావించి మెయిన్ లీడ్ పోరాడటం.. దాదాపు హారర్ కామెడీ సినిమాలన్నీ ఇదే ఫార్ములాలో ఉంటాయి. 'బకాసుర రెస్టారెంట్' కూడా ఇదే టెంప్లేట్ లో నడుస్తుంది. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం ప్రత్యేకంగా నిలిచింది.  దర్శకుడు ఎంచుకున్న కథ, దాని కోసం చేసిన రీసెర్చ్ బాగున్నాయి. కానీ, ఆ కథను ఆసక్తికరంగా తెరమీదకు తీసుకురావడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. హీరో పాత్ర పరిచయం, యూట్యూబ్ వీడియోలు వంటి సీన్స్ తో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగానే నవ్వించాయి. పరమేష్ రూమ్ కి అంజి రావడం, అతని శరీరంలోకి బకాసుర ఆత్మ ప్రవేశించడంతో కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. నిజానికి సెకండ్ హాఫ్ లో కామెడీ పరంగా, ఎమోషన్ పరంగా మంచి స్కోప్ ఉంది. కానీ, రైటింగ్ లో ఆ మ్యాజిక్ కనిపించలేదు. కొన్ని చోట్ల బాగానే నవ్వులు పంచినప్పటికీ, కొన్ని సీన్స్ మాత్రం రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని, పతాక సన్నివేశాలను మరింత ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: కథానాయకుడిగా సినిమాని తన భుజాలపై మోసే బాధ్యతను ప్రవీణ్ తీసుకున్నాడు. పరమేష్ పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు. వైవా హర్ష కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ.. తన మార్క్ చూపించాడు. అంజి పాత్రకు షైనింగ్ ఫణి పూర్తి న్యాయం చేశాడు. చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన కృష్ణ భగవాన్.. తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.  సాంకేతిక విభాగాల పనితీరు బాగానే ఉంది. బాల సరస్వతి కెమెరా వర్క్ మెప్పించింది. పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వికాస్ బాడి.. నేపథ్య సంగీతంతో ప్రభావం చూపించాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి.    ఫైనల్ గా... కథాకథనాల్లో పెద్దగా మెరుపులు లేనప్పటికీ.. అక్కడక్కడా బాగానే నవ్వించింది. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా నచ్చే అవకాశముంది.   రేటింగ్: 2.5/5   
గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్  తమ ప్రొడక్షన్ నెం.1గా  "పెళ్లిలో పెళ్లి"(Pellilo Pelli)చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణుప్రియ, ఉమామహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు. గణేష్ కోలి(Ganesh KOli)నిర్మాత కాగా 'శ్రీకాంత్ సంబరం'(Srikanth Sambaram)దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా తనికెళ్ల భరణి(Tanikella bharani) మాట్లాడుతు 'పెళ్లిలో పెళ్లి"లో సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త..అంటే సుఖాన్ని అందించేవాడు అని అర్థం. దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. షోలాపూర్ లో సినిమా చేస్తున్నామని చెప్పాడు. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉంటారు. నన్ను ఈ టీమ్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. పెద్దలను గౌరవించడం అనే గొప్ప గుణం వీళ్లందరిలో కనిపించింది. గణేష్ కోలి లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ వస్తే మరిన్ని మంచి చిత్రాలు యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారు. ఆయన "పెళ్లిలో పెళ్లి" సినిమాతో హిట్ అందుకుని బాలీవుడ్ లో సినిమాలు చేసేంతగా ఎదగాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం ప్రతిభావంతుడు. హైదరాబాద్ లో సినిమా చేయడం సులువే కానీ షోలాపూర్ కు 24 క్రాఫ్టుల వాళ్లను తీసుకెళ్లి చాలా స్పీడ్ గా సినిమా రూపొందించాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా అని మాట్లాడారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ మూవీకి   మంచి కథ కథనాలతో పాటు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరాయి. ఇంత మంచి సినిమాకి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి థ్యాంక్స్. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తనికెళ్ల భరణి గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. నెక్ట్స్ రాబోయే ఈవెంట్స్ లో ఈ చిత్రం గురించి మరింతగా మాట్లాడుతా అన్నారు. హీరోయిన్ సంస్కృతి గోరే మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" సినిమా మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా పట్ల మేమంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మీ అందరినీ ఆకట్టుకునేలా "పెళ్లిలో పెళ్లి"  ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా.ను అని మాట్లాడింది.  నటి దివిజ మాట్లాడుతు "పెళ్లిలో పెళ్లి" సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారు లేకుంటే ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యేది కాదు. ఈ టీమ్ తో కలిసి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. త్వరలోనే మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం అన్నారు. హీరో శివ సాయిరిషి మాట్లాడుతు 'మా మూవీ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. భరణి గారికి, ఆకాష్ జగన్నాథ్ అన్నకు థ్యాంక్స్. నన్ను ఈ వేదిక మీద చూసి మా అమ్మ సంతోషిస్తోంది. నేను ఈ సినిమా చేసేందుకు మా ప్రొడ్యూసర్ గణేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో సపోర్ట్ చేశారు. షోలాపూర్ నాకు మరో ఇల్లులా మారింది. ఈ టీమ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ఎంఎల్ రాజా గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. మా మూవీ గురించి నెక్ట్స్ ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతా, త్వరలోనే రిలీజ్ కు వస్తున్న మా "పెళ్లిలో పెళ్లి" సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతు'మేము మహారాష్ట్రలో ఉంటాం. కానీ తెలుగు సినిమాలు చూస్తుంటాం. తెలుగు భాషను అభిమానిస్తాం. తెలుగులో తెరకెక్కే కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టపడతాం. సినిమా మేకింగ్ మీద అభిరుచితో "పెళ్లిలో పెళ్లి" చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నాను. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతు మా ఈవెంట్ కి  పిలవగానే వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్స్. ఆయనను ఇన్వైట్ చేసేప్పుడు నేను దేవుడిలా భావించే పూరి జగన్నాథ్ గారిని కలిశాను. షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది. మాలాంటి కొత్త వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది మీరే. అన్నారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతు 'ఇది పోస్టర్ లాంఛ్ లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమా టీమ్ చూస్తుంటే అంతా యంగ్ స్టర్స్ ఉన్నారు. ఇలాంటి యంగ్ టీమ్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి నా అభినందనలు. ఈ సినిమాలో కీ రోల్ చేసి ఈ టీమ్ కు సపోర్ట్ గా ఉన్న భరణి గారికి కూడా థ్యాంక్స్. "పెళ్లిలో పెళ్లి" సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ పుల్ గా ఇంప్రెస్ చేస్తోంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.  శివ సాయి,సంస్కృతి గోర్, దివిజ, తనికెళ్ల భరణి లతో పాటు విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: వేణుగోపాల్ ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్ : కె.దత్తాత్రేయ, డీవోపీ : శుభం గుండ్ల, పీఆర్ఓ - సతీష్. కె, డిజిటల్: నరేష్, ఉదిత్ సాయి, శివ, కో ప్రొడ్యూసర్: రూపాలీ కొల్లి.    
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Upendra, Shruti Haasan, Satyaraj and Aamir Khan has set box office on huge fire in Kerala. The movie ticket sales have been opened in several single screens in Kerala. Audiences have rushed to ticket counters for their share of tickets.  The maddening rush has struck Internet like a huge storm. Scenes from the theatres, booking counters and the online advances have been a brilliant example for the craze of Superstar and Coolie. Looking at the rush, box office experts are in shock. While many thought there is sky-high hype for the film, this is beyond imagination. Within hours of opening the bookings, the sales have crossed over Rs.2 crores and it is trending with 6.5K tickets sold per hour on BMS app. That too just from Kerala. Soon, Hindi and Telugu markets could open while Tamil theatres are announcing that from next week, they will open bookings.  Well, even though none of the cast members are young and happening, also, each one of them have been facing disasters but this kind of rush to see them all together cements the saying, "Legends are beyond recent box office results".  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
'రిషబ్ శెట్టి'(Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార'(Kantara)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంతార' కి ఫ్రీక్వెల్ గా  'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)ముస్తాబవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని రిషబ్ శెట్టి అత్యంత భారీ వ్యయంతో,ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి 'కాంతార' కి సంబంధం ఉన్న నటీనటులు వరుసగా మరణిస్తు వస్తున్నారు. ఆ కోవలోనే రీసెంట్ గా 'కాంతార'లో మహాదేవ క్యారక్టర్ లో కనిపించిన 'టి ప్రభాకర్ కళ్యాణి'(T. Prabhakar Kalyani)గుండెపోటుతో తన నివాసంలో  మృతి చెందాడు. తొలుత నాటక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాకర్, ఆ తర్వాత, సినిమాల్లోకి ప్రవేశించి అనేక చిత్రాల్లో నటించాడు. ఆయనకి  భార్య, కుమారుడు ఉండగా, కొన్ని రోజుల క్రితం ప్రభాకర్ కి హార్ట్ ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది.కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడికా 'ప్రభాకర్' స్వస్థలం. కాంతార చాప్టర్ 1 కి సంబంధించి మే నెలలో ముప్పై నాలుగు సంవత్సరాల 'రాకేష్ పూజారి'(Rakesh Poojary)గుండెపోటుతోనే మరణించాడు. ఇదే నెలలో పాతికేళ్ళు కూడా లేని జూనియర్ ఆర్టిస్ట్, కాంతారా షూటింగ్ ని ముగించుకొని ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న ఒక నదిలో ఈతకి దిగి చనిపోయాడు. జూన్ లో 'కళాభవన్ నిజూ'(Kalabhavan Niju)అనే మరో ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు.ఈ విధంగా  కాంతార సిరీస్ లో నటించిన వాళ్ళందరు వరుసగా చనిపోతుండటం వైరల్ గా మారింది.        
Cast: Praveen, Harsha Chemudu, Garuda Ram, Krishna Bhagawan, Shining Phani Crew:  Music Director: Vikas Badisa Cinematographer: Bala Saraswathi Editor:  Marthand K. Venkatesh Director: SJ Shiva Producers: Lakshmaiah Achari, Janardhan Achari   Comedian Praveen turned into leading man with Bakasura Restaurant movie. Harsha Chemudu, Krishna Bhagwan and several others have been cast in this comedy. As many comedians have been turning into leading men, the movie turns out to be another big jump for yet another popular actor. The movie released today and let's discuss about the movie in detail. Plot:  Paramesh (Praveen) dreams about opening his own restaurant. He is a software employee and starts small term savings to fulfil his dream. His friends also decide to join him but their attempts fail at regular intervals. To make quick money, they think ghost hunting videos and vlogs on YouTube would yield thier neccessity. During one video, they find a Tantra Sastra book and use it for money. But they awaken a spirit and hence, their lives turn into chaos. Watch the movie to know more.  Analysis:  Praveen is good in few scenes. In dialogue based comic scenes, he performed at his best. But these sparks are limited. He couldn't really elevate all the scenes but as an actor, he tried his best. Harsha Chemudu did get few laughs but his scenes did not really bring the house down as makers anticipated. Many scenes seem good on paper but some failed in execution.  Few scenes have worked out better but many scenes lost their charm in the second hour. Each scene seem to have been dragged out to bits and it feels like we are watching a short film stretched out to the maximum. Also, the movie starts to feel repetitive in the second hour. The emotional scenes in the second hour feel forced. The plotline reminds us an in-form SV Krishna Reddy from early 90's and it needed similar flair in writing to sustain. Slight misses harm the flow.  Drag in second hour and repetitiveness of few punch lines work against the start. Realistically, the movie could have been worked out better with innovative writing and execution, in the second hour. Technically, movie suffered at few places but largely, the team worked their best to give a novel experience. As the idea had a lot of potential, the ending and second hour could have been planned even better. We can appreciate the makers for their attempt even with flaws. Bottomline:  Potential storyline could have been executed much better. Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.
కింగ్ 'నాగార్జున'(King Nagarjuna)ఈ నెల 14 న 'రజనీకాంత్'(Rajinikanth)తో కలిసి 'కూలీ'(Coolie)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పైగా తన కెరీర్ లో ఫస్ట్ టైం 'కూలీ'లో  విలన్ గా చేస్తుండటంతో నాగ్ రోల్ పై అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. స్వయంగా ఇటీవల నాగ్ రోల్ ని ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతు 'కూలీ సబ్జెట్ విన్నప్పుడు విలన్ క్యారక్టర్ లో నేనే  చేద్దామని అనుకున్నాను. అంత పవర్ ఫుల్ గా నాగ్ పోషించిన సైమన్ క్యారక్టర్  ఉంటుందని చెప్పాడు. దీన్ని బట్టి నాగ్ క్యారక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇక కూలీ తర్వాత నాగ్ కొత్తగా ఒప్పుకున్న అప్ కమింగ్ సినిమాల గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ బుల్లితెర రియాలిటీ షో  'బిగ్ బాస్ సీజన్ 9(Big Boss season 9)ద్వారా మరోసారి అలరించనున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి నాగ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమిళ, కన్నడ, మలయాళ బిగ్ బాస్ హోస్ట్ లు తీసుకునే రెమ్యునరేషన్  కంటే నాగార్జునే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. బిగ్ బాస్ కోసం నాగార్జున  సుమారు మూడు నెలల సమయాన్ని కేటాయియిస్తాడనే విషయం తెలిసిందే. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు దిగ్విజయంగా తొమ్మిదవ సీజన్ లోకి అడుగుపెడుతున్నాడు. నాగార్జున యొక్క  అద్భుతమైన యాంకరింగ్ వలన బిగ్ బాస్ విశేష ప్రేక్షాదరణ తో దూసుకుపోతుంది. టిఆర్పి రేట్ ల పరంగా కూడా బిగ్ బాస్ అనేక రికార్డులని నెలకొల్పుతుంది. ఈ సారి ఎవరి ఊహలకి అందని కంటెస్ట్ లు సీజన్ 9 కి రాబోతున్నారు.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
చేనేత చాలా గొప్ప కళ.. ఒక దారం కలుస్తుంది, ఆకారం తీసుకుంటుంది, మలుపులు తిరుగుతుంది, కొన్నిసార్లు విప్పుతుంది, విరిగిపోతుంది,  తరువాత మళ్ళీ కలుస్తుంది.  అంతా అయ్యాక ఒక అద్బుతం ఆవిష్కారం అవుతుంది.  అదే చేనేత అందం. జాతీయ చేనేత దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా కనిపించే విభిన్న స్వదేశీ వస్త్రాల గురించి,  చేనేత నైుణ్యం గురించి, భారతదేశానికి చేనేత తెచ్చిపెట్టిన ప్రత్యేక గుర్తింపు గురించి తెలుసుకుంటే.. పెళ్లి, పండుగ, శుభకార్యం.. ప్రత్యేక సందర్భం ఏదైనా పట్టు వస్త్రాలు కట్టుకోవాలి అనుకుంటారు. అయితే మిషన్ వస్త్ర పనితనానికంటే.. చేత పనితనం చాలా అద్బుతాలను ఆవిష్కరిస్తుంది.  ఇది వ్యక్తిలో సృజనాత్మకతను, కళను, పనితనాన్ని వెలికితీస్తుంది. నిజానికి చేనేత అనేది ఒక అద్బుతమైన కళ. కేవలం దారాలతో వస్త్రాలు నేయడం కాదు.. రంగులు,  డిజైన్లు ఇందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  చేనేత అనేది దేశం యావత్తు ఆవరించి ఉంది. పశ్చిమ భారతదేశంలో  గుజరాత్‌లోని దంగాసియా,  భార్వాడ్ కమ్యూనిటీలు తంగాలియా నేతను ఆచరిస్తారు. ఇది వార్ప్ దారాల చుట్టూ చుట్టబడిన అదనపు దారాలను ఉపయోగించి సృష్టించబడిన చుక్కల నమూనాలకు ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలో విదర్భ..  క్లిష్టమైన కార్వతి కినార్ నేత  చాలా ప్రత్యేక కలిగి ఉంది. నేత కళాకారిణి శ్రుతి సాంచెటికి ఈ కళను కాపాడుకుంటూ వస్తోంది. తాను ఈ చేనేత పనిని సంరక్షించడం తన బాధ్యత అనుకుంటోంది. "ఈ కళారూపం నాకు చాలా విలువైనది" అని ఆమె చెబుతుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ నుండి వచ్చిన ఇకత్-రంగు వేసిన, నూనెతో  చేయబడిన టెలియా రుమల్ ఫాబ్రిక్ ఎరుపు, నలుపు,  తెలుపు రేఖాగణిత,  పూల నమూనాలను కలిగి ఉంటుంది. ఇక ధర్మవరం పట్టు,  బనారస్,  కంచి,  ఉప్పాడ వంటివి వస్త్రాలలో చీరల స్థానాన్ని ఎప్పుడూ ఒక మెట్టు కాదు.. వంద మెట్లు పైన ఉంచుతున్నాయి. నిజానికి చీర అనే వస్త్రం కూడా తరతరాలుగా ఇట్లా నిలబడటానికి కారణం పట్టు వస్త్రాలు.. అందులోనూ సాంప్రదాయత, భారతీయతనం ఈ చీరలలో ఉట్టిపడటమే.. ఈ కారణంగానే ఎన్ని రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినా  చీరకు ఒక స్పెషల్ స్టేటస్ ఉండనే ఉంది. కేవలం చీరలు అనే కాదు.. పురుషుల వస్త్రాలు,  పిల్లల వస్త్రాలను సాంప్రదాయంగా ఉంచడంలో చేనేత వస్త్రాలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే చేనేతలను ఎప్పుడూ గౌరవించాలి. ఆదరించాలి, ప్రోత్సహించాలి.                                            *రూపశ్రీ.
  టాయిలెట్ సీట్.. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చాక ఇంట్లో అందరూ ఒకే సీటు మీద కూర్చుని టాయిలెట్ వెళ్లడం తప్పనిసరి. అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత శుభ్రం చేస్తున్నా టాయిలెట్ సీట్ తొందరగా మురికిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా టాయిలెట్ శుభ్రంగా లేకపోతే వచ్చినవారు చాలా అసహ్యించుకుంటారు. అయితే టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను కేవలం 10 రూపాయల విలువ చేసే పానీయంతో సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా కూల్ డ్రింక్ అంటే షాకయ్యేవారు ఎక్కువ. కానీ దీని వెనుక నిజాలు తెలుకుంటే.. కూల్ డ్రింక్.. వేసవి కాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేస్తాయి అనే విషయం పక్కన పెడితే.. టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను మాత్రం అద్భుతంగా క్లీన్ చేస్తాయి. నిజానికి కూల్ డ్రింక్స్ లో  కార్బోనిక్ ఆమ్లం,  ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటాయి. ఈ ఆమ్లాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవి టాయిలెట్ సీటుపై ఉన్న మొండి మరకలు,  ధూళిని సులువుగా కరిగిస్తాయి . దీని కారణంగా మురికిగా ఉన్న టాయిలెట్‌ను శుభ్రం చేయడం సులభం. దీన్ని ఉపయోగించడం వల్ల శుభ్రపరిచేటప్పుడు  ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. ఎలా క్లీన్ చేయాలి.. కూల్ డ్రింక్స్ ను ఉపయోగించి టాయిలెట్ ను క్లీన్ చేయడానికి కూడా పెద్ద యుద్దం చేయాల్సిన పని లేదు.  టాయిలెట్ సీట్ పైన ఎక్కడెక్కడ మురికి ఎక్కువ కనిపిస్తోందో.. అక్కడ కూల్ డ్రింక్ ను కాస్త ఎక్కువ పోయాలి. మిగిలిన ప్రాంతంలో సాధారణంగా వేస్తే సరిపోతుంది.  ఇలా పోసిన తరువాత దాన్ని ఒక 15 లేదా 20 నిమిషాలు అలాగే వదిలేయాలి.  కూల్ డ్రింక్ లో ఉండే ఆమ్లం చర్య జరిపి మురికి, మరకలు మొదలైనవాటిని కరిగిస్తుంది.  15 నిమిషాల తరువాత టాయిలెట్ బ్రష్ తీసుకుని స్ర్కబ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేశాక నీళ్ళు పోసి కడిగితే సరిపోతుంది.  ఇలా చేస్తే టాయిలెట్ కొత్త దానిలా మెరిసిపోతుంది కూడా.  అయితే కూల్ డ్రింక్ లోని తీపి బాగా పోయేలా కాస్త నీరు ఎక్కువ వినియోగిస్తే సరిపోతుంది.  టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా  ఉండటానికి, నిమ్మ తొక్క, ఉప్పు,  నీటిని కలిపిన ద్రావణాన్ని టాయిలెట్‌లో పోయాలి. ఓడోనిల్ వంటి ఉత్పత్తులకు బదులుగా, మీరు నిమిషాల్లో దుర్వాసనను తొలగించడానికి  డిఫ్యూజర్‌ను ఉపయోగించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. టాయిలెట్ లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, టాయిలెట్ లో వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువులు ఉంచడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా ఉంటుంది.                                   *రూపశ్రీ.  
  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.
  కళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన,  సున్నితమైన భాగం. ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి,  అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి కళ్లే ఆధారం. అయితే నేటి కాలంలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి, వీటిలో కంటి చూపు మందగించడం, కంటి ఒత్తిడి, చికాకు, ఎరుపు వంటివి ఉన్నాయి. స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. పెద్దల  నుండి పిల్లల  వరకు ప్రతిదానికీ డిజిటల్ పరికరాలు చాలా అవసరం అయ్యాయి. గంటల తరబడి వాటి ముందు గడపడం వల్ల కళ్ళపై చాలా ఒత్తిడి వస్తుంది,  కళ్ళు అలసిపోతాయి. వీటి వల్ల కంటి ఒత్తిడి, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.  దీని నుండి ఉపశమనం కలగడానికి, కంటి చూపు మెరుగవ్వడానికి 20-20-20 టెక్నిక్ భలే సహాయపడుతుంది.  దీని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. 20-20-20 టెక్నిక్.. స్క్రీన్ చూస్తున్నప్పుడు కంటి ఒత్తిడిని నివారించడానికి 20-20-20 నియమం ఒక గొప్ప మార్గం . ఈ నియమంలో   స్క్రీన్ నుండి 20 సెకన్ల విరామం తీసుకుంటారు.  ఇది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడాలి. ఇది ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్‌లను చూడటం వల్ల కలిగే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయోజనాలు.. ప్రతిరోజూ 20-20-20 నియమాన్ని పాటించడం ద్వారా, కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు లేదా నిరోధించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు అనేక అధ్యయనాలలో కూడా కనుగొనబడ్డాయి. 20-20-20 నియమం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ను నివారించడానికి,  దీర్ఘకాలిక కంప్యూటర్ లేదా డిజిటల్ పరికర వినియోగం వల్ల కలిగే డిజిటల్ కంటి ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే సరళమైన,  ప్రభావవంతమైన టెక్నిక్. స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కంటి దృష్టి కేంద్రీకరించే కండరాలు సడలించబడతాయి. ఇది కంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర మార్గాలు.. కంటి ఒత్తిడిని కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా తగ్గించవచ్చు.  స్క్రీన్ చూస్తున్నప్పుడు లైటింగ్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి.  టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం చాలా మసక వెలుతురు లేదా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు   కంటి ఒత్తిడిని పెంచుతుంది.  కంప్యూటర్‌ను ఉపయోగించడం లేదా చదవడానికి వైద్యులు సూచించిన  అద్దాలు ధరించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గుతుంది. పెద్దలు స్క్రీన్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయవచ్చు. తాము ఆచరిస్తూ పిల్లలకు చెప్పడం మంచిది.   ఎక్కువసేపు స్క్రీన్ వాడటం వల్ల కంటి ఒత్తిడి,  నొప్పి వస్తుంది. దీన్ని పై చిట్కా తో అధిగమించవచ్చు. కంటి సమస్యలు ఉన్నవారు  క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.  ఇది కంటి ఒత్తిడిని తగ్గించగలదు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...