వైసీపీ శ్రేణుల ఆరాధ్యుడు జగనన్న ఇప్పుడు జగన్ మావయ్యా అయ్యారు. ‘ఏప్రిల్ ఫూల్స్’ రోజున మావిగన్ అని కొత్త క్యాపిటెల్ ప్రపోజ్ చేసిన మాజీ సీఎం నెటిజన్లకు అడ్డంగా బుక్ అయ్యారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా, యూట్యూబ్ ఒకటేంటి .. మొత్తం సోషల్ మీడియా వేదికల్లో జగన్ ట్రోలింగ్ పీస్ అయిపోయారు. మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో మావిగన్ కు కౌంటర్గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్ని ఒక రేంజ్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
‘ఇంకా నయం.. జమ్మలమడుగులో జ, గుంటూరులో గన్ కలిపి గుంటూరు కేంద్రంగా జగన్ పేరుతో రాజధాని పెట్టమన్లేదు ఒకరు సెటైర్ వేశారు. జగయ్యపేట నుంచి గుంటూరు వరకు హైవే ఉందిగా, ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి జగన్ అని పేరు పెట్టాలని మరొకరు సూచించారు. ఇకపై మా మచిలీపట్నం,విజయవాడ, గుంటూరు ఫ్రెండ్స్ను మావిగన్స్ అని పిలవొచ్చా? అని జగన్ పర్మిషన్ అడిగేస్తున్నారు. జెన్-జీ బ్యాచ్ పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు గూగుల్లో వెతుకుతున్నారు. వారు జగన్ను సంప్రదిస్తే చాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నారు.
ఆ క్రమంలో మావయ్యా ఎలా వస్తాయ్ మీకే ఇలాంటి ఐడియాలు.. మరి మన మూడు రాజధానుల సంగతేం చేద్దాం అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎవరో రాసిచ్చారు సరే, చదివే ముందైనా స్క్రిప్ట్ చూసుకోవాలని కదా?.. ఈ వారం వచ్చిన కొత్త ఐడియా ఇదా? దీని కోసం బెంగళూరు నుంచి రావాలా? .. మరిన్ని ప్రెస్మీట్లు పెట్టి ప్లాన్ -సి టూ ప్లాన్-జడ్ వరకు చెప్పండంటూ చరుకలు అంటిస్తున్నారు. ‘మేమేం పాపం చేశాం? మా జిల్లా, మా ఊరి పేరు కూడా కలిసేలా రాజధాని నామకరణం చేయండి అని పంచ్లు విసురుతున్నారు. రాష్ట్రానికి రాజధాని అనే పదం రాజ్యాంగలో లేదన్నప్పుడు మావిగన్ ఎక్కడ పెట్టుకోవాలి మాయ్యా అని తెగ్ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట నామకరణాల మావయ్య అలా బుక్ అయ్యారిప్పుడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizwns-troll-jagan-on-mavigun-36-216637.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.