పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి … బలవంతపు గర్భస్రావ యత్నం

Publish Date:Feb 12, 2026

Advertisement

 

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట జీవితంలో కల్లోలం నెలకొంది. నాలుగు నెలల గర్భిణీ అయిన యువతిపై బలవంతంగా గర్భస్రావం చేయించే ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహేష్ , భాగ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.. దీంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

జనవరి 30న యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. అప్పటికే భాగ్య నాలుగు నెలల గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.వివాహం అనంతరం భాగ్యను ఆమె తండ్రి, బావ కలిసి ఒత్తిడి చేసి కల్వకుర్తి సమీపంలోని ఓ ఆసుపత్రిలో గర్భ స్రావం చేయించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు మహేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ పరిణామాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్య ఆత్మహత్యకు ప్రయత్నించింది.ఈ ఘట నపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ప్రియుడు... మహిళ సమ్మతి లేకుండా గర్భస్రావం చేయించడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొంటూ, తన భార్యకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని పరిశీలించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటన పై వెంటనే స్పందించింది. 

మహిళ స్వేచ్ఛ, శారీరక స్వాతంత్ర్యంపై దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. మహిళ సమ్మతి లేకుండా గర్భస్రావం చేయించడం భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. కల్వకుర్తి సీఐ, వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ వోలను ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే ఈ కేసును నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విచారణ జరపాలని సూచించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై ఫిబ్రవరి 26 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బాధిత యువతికి రక్షణ కల్పించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించింది.
 

By
en-us Political News

  
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ విడుదల చేసిన జాబితాలో డెల్‌తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌కు గూఢచారి సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది.
స్టెల్త్ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులతో సహా ముప్పులను గుర్తించి, పసిగట్టి, నిర్వీర్యం చేయగల ఒక శక్తివంతమైన రక్షణ గొడుగును సృష్టిస్తాయి. ఈ సమీకృత వ్యవస్థ, ఆధునిక వైమానిక యుద్ధ సవాళ్లకు ప్రతిస్పందించే భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
మావోయిస్టు కీలక నేత, కొంత కాలం కిందట ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గతంలో పీఎల్ జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వైపు వెళ్లిన తరువాత దళాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్‌గా బడ్సే దేవాను నియమించగా, డిప్యూటీ కమాండర్ బాధ్యత లను సోది కేశాలకు అప్పగిం చారు.
మల్లె, కనకాంబరం, రోజా, చామంతి వంటి సుగంధ పుష్పాలతో పాటు తులసి వంటి పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్ప నీరాజనం సమర్పించారు. గంటల తరబడి సాగిన ఈ పుష్పాభిషేకం చూసి భక్తులు పులకించిపోయారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్‌లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం వెళ్లారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు.
మంగళవారం ) పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.