అప్పుడే ఏడాది.. తమిళనాడుకు తీరని లోటు..

Publish Date:Dec 5, 2017

Advertisement

 

డిసెంబర్ 5 ఈరోజు ఏంటో తెలియకపోవచ్చు కానీ.. కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు మాత్రం అర్దమవుతుంది. ఈరోజే... తమిళనాడు రాజకీయాల్లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని.. తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని నిరూపించిన.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. తమిళుల ఆరాధ్య దైవం జయలలిత మరణించిన రోజు. గత ఏడాది ఈరోజు.. తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది. తమిళ ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించిన రోజు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన రోజు. సంవత్సరం గడుస్తున్నా రాష్ట్రంలో ‘అమ్మ’ లేని లోటు అలాగే ఉంది. ఆమె మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి చోటుచేసుకుంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

 

అమ్మ మరణానంతరం శశికళ తనలోని మరో రూపాన్ని చూపించింది. జయ ఉన్నంత కాలం సైలెంట్ గా ఉన్న ఆమె.. పదవి చేపట్టాలని బాగానే ప్రయత్నించారు. పార్టీపై పట్టు బిగించేందుకు ప్రయత్నించారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇక సీఎం పగ్గాలు కూడా చేపడదామనుకున్న ఆమెకు..జయలలిత నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వం అడ్డుతగిలాడు. ఇక అప్పటినుండి.. అన్నాడీఎంకేలో అధికార పోరు జరుగుతూనే ఉంది. ముందు పన్నీర్ సెల్వం వర్గం... శశికళ వర్గం ఉండేది. ఆ తరువాత.. శశికళ సీఎంగా నియమించిన పళనిస్వామి కూడా ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ జైలుకు వెళ్లిందో.. తనకు వ్యతిరేకంగా మారాడు. ఇక దాని తరువాత పన్నీర్ సెల్వం.. పళనివర్గాలు కలిసిపోయాయి. ఇక జైల్లో ఉండే... తన మేనల్లుడు దినకరన్ తో చక్రం తిప్పుదామని చూసింది. అది కూడా బిస్కట్ అయింది. పార్టీ గుర్తు వార్ లో దినకరన్ లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఆ తరువాత ఆమెకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు ఇదే అదనుగా చూస్తున్న బీజేపీ, డీఎంకేలు తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు  పావులు కదుపుతున్నాయి.

 

ఇంకా ఎన్నో మార్పులు వచ్చాయి జయ మరణానంతరం... జయ సీఎంగా ఉన్నన్నాళ్లూ ఉన్నామా, లేమా అన్నట్టుగా ఉన్న ఐటీ శాఖ ఒక్కసారిగా జూలు విదిల్చింది. వీఐపీలు సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంలోనే సోదాలు చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ సచివాలయంలో దాడులు నిర్వహించడం అదే తొలిసారి. అంతేనా.. జయలలిత బతికి ఉండగా తాము జయలలిత వారసులమని ఒక్కరు కూడా బయటకు రాని వారు ఆమె మరణంతో కలుగులోని ఎలుకల్లా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆమెకు అసలైన వారసులం తామేనని ప్రకటించి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల తాను జయ కుమార్తెనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం సూచన మేరకు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

 

ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నది మాత్ర నిజం. తాను చనిపోయిన ఏడాది గడుస్తున్న తమిళనాడు రాజకీయాల్లో ఇంకా స్తబ్దత.. అయోమయం ఉన్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆ స్థాయి నేత కరువయ్యారు. ఇప్పుడు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పినా.. ఆమెలాగా చెరగని ముద్ర వేయడం చాలా కష్టం. తమిళనాడు ఆమె ఒక తీరని లోటు..

By
en-us Political News

  
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.