రెండాకుల పార్టీని… పువ్వు పార్టీ… హైజాక్ చేసేసిందా?

Publish Date:Apr 18, 2017

Advertisement

ఒకప్పుడు ఛాయ్ అమ్ముకున్నాడని చెప్పే పన్నీర్ సెల్వం… మరో వైపు దేశాన్నే ముందుకు దూకిస్తున్న అసలు సిసలు ఛాయ్ వాలా మోదీ… ఆయన అభిప్రాయాలకు, అంచనాలకు అనుగుణంగా నడుచుకునే అపర చాణక్యుడు, పక్కా గుజరాతీ పొలిటికల్ కిల్లర్ అమిత్ షా! వీళ్లు చాలరన్నట్టు ఇప్పుడు స్వంత వర్గంగా వుంటూ వచ్చిన పళనిస్వామి కూడా రివర్స్ అయిపోయాడు శశికళ అండ్ దినకరణ్ లకు! రాజకీయంలో, రౌడీయిజంలొ తమకు ఎదురులేదనుకున్న మన్నార్ గుడి మాఫియా ఇప్పుడు విలవిలలాడిపోతోంది! రెండాకుల పార్టీని తమ గుత్త సొత్తని భావించిన శశి వర్గం ఇప్పుడు మోదీ నుంచీ పన్నీర్ దాకా అందరూ ఏకమై పావులు కదిపే సరికి… వారంతా తమ కంటే రెండాకులు ఎక్కువే చదివారని అర్థం చేసుకుంటోంది!

 

జయ బతికి వున్నప్పుడు అమ్మ చాటు బిడ్డల్లా బతికిన శశికళ, ఆమె కుటుంబం ఇప్పుడు నిజమైన కరుడుగట్టిన పాలిటిక్స్ వేడిని అనుభవిస్తున్నారు. అతి తెలివికిపోయి జైలుకి వెళ్లేలోగానే సీఎం అవ్వాలని కలలుగన్న చిన్నమ్మ ఇప్పుడు జైల్లో సామాన్య ఖైదీగా వుంది. మరో వైపు ఆమె నియమించిన ఆమె ఉప ప్రధాన కార్యదర్శి దినకరణ్ ఈసీకే లంచం ఇవ్వజూపిన కేసులో ఇరుక్కున్నాడు. ఇక అరెస్ట్ ఒక్కటే మిగిలి వుంది. అన్నిటికంటే ఆందోళనకరంగా, శశికళ నమ్మి ముఖ్యమంత్రిని చేసిన ఈ. పళనిస్వామి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపాడని టాక్! శశికళ, దినకరణ్ జైళ్లలో వుండగానే అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమై మళ్లీ ఒకే పార్టీగా అవతరించాలనుకుంటున్నాయట! అదే జరిగితే పళని స్వామీ ఆకు ఒకటి, పన్నీర్ సెల్వం ఆకు ఒకటి కలిసి… రెండాకుల ఏఐఏడీఎంకే ప్రతిష్ఠాత్మక ఎన్నికల గుర్తు గొడవ తీరిపోయినట్టే!

 

రెండాకుల గుర్తు తాను ఉప ప్రధాన కార్యదర్శిగా వున్న అన్నా డీఎంకే వర్గానికి చెందేలా దినకరణ్ పావులు కదిపాడు. అందుకోసం, అరవై కోట్లు లంచం ఇవ్వటానికి కూడా సై అన్నాడు. ఇదంతా ఎందుకూ అంటే.. ఆ రెండాకుల గుర్తు వుంటేనే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓట్లు పడతాయి. దినకరణ్ గెలుస్తాడు! కాని, కేంద్రంలో వున్న మోదీ సర్కార్ తమకంటే రెండాకులు ఎక్కువే రాజకీయం చదివిందని దినకరణ్ గ్రహించలేకపోయాడు. మొదట్నుంచీ శశికళ బ్యాచ్ వారి రౌడీ రాజకీయాలకి వ్యతిరేకంగా వుంటూ వస్తోన్న ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీగా లంచం కేసులో ఇరికించేసింది దినకరణ్ ని! ఇక ఇప్పుడు ఆయన ఎంతో ఎక్కువ సేపు జైలు బయట వుండే పరిస్థితులు లేవు. మరి ఆయన కూడా శశికళ బాటలోనే జైలుకి వెళితే పరిస్థితి ఏంటి?

 

ప్రస్తుతం రెండు వర్గాలుగా వున్న ఈపీఎస్, ఓపీఎస్ పార్టీలు శశికళ , దినకరణ్ ల బెదిరింపులు లేకపోతే తక్షణం ఏకమైపోతాయి. ఇది పెద్దగా ఆశ్చర్యకరం కాదు. అసలు కథంతా ఆ తరువాతే వుండనుంది. ఇప్పుడు తెర వెనుక నుంచి డ్రామా నడిపిస్తోన్న బీజేపి పెద్దలు ముందు ముందు నేరుగానే ఎంట్రీ ఇవ్వొచ్చు. జయలలిత లాంటి కరుడుగట్టిన నేత లేకుండా స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేను ఎదుర్కోవటం చాలా కష్టం. కాబట్టి పన్నీర్ సెల్వం, పళని స్వామి వచ్చే ఎన్నికల లోపు తమ ఎమ్మేల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరితో సహా కమల కండువాలు కప్పుకోవచ్చు! అన్నాడీఎంకే ఒక చరిత్రగా మిగిలిపోయి బీజేపి తమిళనాడులో ప్రధాన పక్షంగా ఎదగవచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక విలీనం జరగకున్నా… సగానికి సగం సీట్లు పంచుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపితో పొత్తు పెట్టుకోవటం మాత్రం అన్నాడీఎంకేకి తప్పనిసరి. కారణం కేంద్రంలోని సర్కార్ నుంచి నిధులు రాకుండా పన్నీర్ కాని, పళని కానీ ఏం చేయలేని పరిస్థితి వుంది. అలాగే, స్టాలిన్ రాజకీయాన్ని ఎదుర్కోవటం కూడా మోదీ, అమిత్ షా లాంటి వారి నాయకత్వంలో ముందుకు సాగితేనే వీలవుతుంది. ఈ కాలిక్యులేషన్స్ అన్నిట్నీ చూపిస్తూ కొందరు రాజకీయ పండితులు ముందు ముందు తమిళనాడు కాషాయమయం అవకాశాలు లేకపోలేదంటున్నారు!

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.