దేవినేని నెహ్రూకి, దేవినేని ఉమకి ఎందుకు పడదు

Publish Date:Apr 17, 2017

Advertisement

తండ్రి కొడుకులయినా...అన్నాదమ్ములనైనా బద్ధ శత్రువులుగా చేసే శక్తి రాజకీయానికి ఉందంటారు..ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. ఆ కోవలోకే వస్తారు దేవినేని బ్రదర్స్. దేవినేని అనగానే గుర్తొచ్చే పేర్లు నెహ్రూ..ఉమా..ఇద్దరు అన్నదమ్ములే..కానీ ఒకరంటే ఒకరికి పడదు..ఎందుకు..? వీరి మధ్య ఇంతటి వైరానికి కారణం ఏంటి..? అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి.  కృష్ణాజిల్లా రాజకీయాల్లోనే కాదు..ఏపీ రాజకీయాల్లోనూ దేవినేని కుటుంబానిది కీలక పాత్ర..దశాబ్దాలుగా ఆ కుటుంబం ప్రజాసేవలోనే కొనసాగుతుంది. ముఖ్యంగా దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావ సభ్యుడు..ఆయన ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు ..ఎన్టీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెహ్రూ వెన్నంటే ఆయన బాబాయి కుమారులు దేవినేని వెంకట రమణ, దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశంలో కీలక నేతలుగా ఎదిగారు.

 

అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో మనస్పర్థలు రావడంతో నెహ్రూ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ తన సత్తా చాటిన నెహ్రూ అక్కడా కీలకనేతగా ఎదిగారు. అయితే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయన్నట్లు, ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్‌‌ నేతలకు రాజకీయ సమాధి కట్టింది. అలాంటి నేతల్లో నెహ్రూ కూడా ఒకరు. మరో పక్క నెహ్రూ సోదరుడు దేవినేని ఉమ టీడీపీలో చక్రం తిప్పుతూ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే పార్టీలు వేరైనా, ఎప్పుడూ అన్నదమ్ములిద్దరూ మాటా మాటా అనుకున్నది లేదు..కానీ పట్టిసీమ ప్రాజెక్ట్ వీరి మధ్య దూరాన్ని పెంచింది. తన ఇంటి పక్కన వెళుతున్న బుడమేరు కాలువలోకి భలేరావు చెరువులోని నీరు తీసుకువచ్చి అవి పట్టిసీమ నీరు అని ఉమా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ నెహ్రూ సెటైర్ వేశారు. పైగా తన ఇంటి పేరే ఉమకి ఉండటం తనకు అవమానంగా ఉందని ఘాటైన వ్యాఖ్య చేశారు.

 

ఈ వ్యాఖ్యలు ఉమకి ఆగ్రహం తెప్పించాయి. అన్న అని మర్యాద ఇస్తే ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా తాను కాకుండా తన అనుచరులతో మాటల తూటాలు పేల్చారు. అయితే ఎంతలా కృష్ణాజిల్లాను శాసిస్తున్నా..మంత్రిగా అధికారాన్ని గుప్పెట పెట్టుకున్నా..నెహ్రూకి జనంలో ఉన్న ఛరిష్మా ఉమకు లేదూ అంటుంటారు..ముఖ్యంగా దేవినేని అంటే ముందుగా గుర్తొచ్చేది నెహ్రూనే..చాలా సందర్భాల్లో అన్నయ్యకి ఎదురువస్తే ఉమ పక్కకు తప్పుకునేవాడు కానీ..కనీసం తలెత్తి మాట్లాడేందుకు కూడా భయపడేవాడని టీడీపీ వర్గాల్లో టాక్. అంతటి ఛరిష్మా ఉంది గనుకనే చంద్రబాబు సైతం పాత గొడవలు పక్కనబెట్టి నెహ్రూని టీడీపీలోకి ఆహ్వానించారు. అయితే నెహ్రూ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలోనూ ఆయన రాకను ఉమ అడ్డుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్నయ్య వస్తే కృష్ణాజిల్లాలో తన ప్రాధాన్యత తగ్గుతుందోనన్న భయం కావొచ్చు..మరేదైనా కానీ నెహ్రూని టీడీపీలోకి రానివ్వద్దంటూ అధినేతకు తేల్చి చెప్పాడని పసుపు కండువాలు గుసగుసలాడుకున్నాయి. అయినా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నెహ్రూని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు చంద్రబాబు.

 

ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. ఇద్దరూ మళ్లీ కలుసుకుంటారు అనుకున్న సమయంలో నెహ్రూ హఠాన్మరణం టీడీపీ కార్యకర్తలను కలచివేసింది. అటు ఉమా కూడా అన్నయ్య మరణవార్త వినగానే కుప్పకూలిపోయారు. నెహ్రూ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. 

By
en-us Political News

  
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది.
అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో గాంధీలు జైలుకు వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది.
జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు జగన్ ను కలవాటంటే ముందుగా ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు.
తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారి పోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది, ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది చేతులు కట్టేసింది. కాళ్ళకు సంకెళ్ళు, నోటికి తాళం వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది, గాంధీ భవన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు, సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌.
జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది.
  తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది.  మద్యానికి బానిసలైన  కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు .
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.
నందమూరి బాలకృష్ణ, నటసింహం. సినిమాలలో ఆయన అన్ స్టాపబుల్.. అలాగే రాజకీయాలలో అన్ స్టాపబుల్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని స్వయంగా చంద్రబాబే చెబితే.. ఔను తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారు.
భార‌త‌దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న వేళ‌ బీజేపీ అధినాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్టీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌న్న చర్చ బీజేపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో.. ఆయ‌న వార‌సుడిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ పెద్ద‌లు నిమ‌గ్న‌మ‌య్యారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు
కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.
పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.