ఇరాన్ సేఫ్ కాదు.. ప్రవాసాంధ్రులూ వెనక్కు వచ్చేయండి!

Publish Date:Feb 23, 2026

Advertisement

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ లో ఉండటం క్షేమం కాదని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇరాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న ఆయన అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెంటనే వెనక్కు తిరిగి రావాలి పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.  ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇండియన్ సిటిజన్స్ కు అక్కడి భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది.  ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కోరారు.  అక్కడ జరుగుతున్న నిరసనలకు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా   తిరిగి రావాలని కోరారు.  సహాయం అవసరమైన సందర్భంలో , ఏపీఎన్‌ఆర్టీ ఏర్పాటు చేసిన 24/7 హెల్ప్‌లైన్‌ నంబరు  91 8500027678 ను సంప్రదించాలని పేర్కొన్నారు. 

By
en-us Political News

  
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇక్కడ నుంచి రిలీవ్ అయి బీహార్ కువెళ్లారు. ఆయనను ఇప్పుడు బీహార్ లో అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరుతూ బీహార్ కోర్టును ఆశ్రయించారు. అయితే సునీల్ నాయక్ కు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు బీహార్ కోర్టు నిరాకరించింది.
క్షతగాత్రుల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు.
రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఇకపై ఉద్యోగుల పనితీరును శాస్త్రీయంగా విశ్లేషించి వారికి వెయిటేజ్ ఇస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిచే అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నుంచి అధికారికంగా అభినందన లేఖలు అందజేస్తారు. ఇది ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని సీఎం ఆకాంక్షించారు.
తనను రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను చిత్రహింసలకు గురిచేసి గాయపరిచినట్లు తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు భోలా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కల్తీ పాల కారణంగా రాజమహేంద్రవరం చౌడేశ్వరనగర్, స్వరూప్ నగర్ లకు చెందిన నలుగురు వ్యక్తులు ఇప్పటికే మృతి చెందారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.
ఒకప్పుడు ఎల్ మోంచో కూడా పోలీసే. 1980ల్లో అందరు మెక్సికన్ యువకుల్లాగానే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి.. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కొన్నాళ్ల పాటు అమెరికన్ జైళ్లలో జైలు శిక్ష అనుభవించిన ఇతడ్ని ఆ తర్వాతి కాలంలో మెక్సికోకి అప్పగించింది. స్వదేశానికి వచ్చిన కొత్తల్లో మోంచో మంచి బాలుడిలా పోలీసు జాబులో చేరాడు. ఆ తర్వాత డ్రగ్ మాఫియాతో చేతులు కలిపాడు.
ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. తండ్రి తనను నీట్ పరీక్షకు సిద్ధం కావాలికి పదేపదే చెబుతుండటాన్ని ఆ కొడుకు సహించలేకపోయాడు. తుపాకితో తండ్రిని కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసి ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు.
దాదాపు రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.