ధోని 50..ఇండియా 316 ఆలౌట్

Publish Date:Dec 6, 2012

Advertisement

 

 

ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో భారత్ 316 పరుగులకు ఆలౌటైంది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జహీర్ ఖాన్(6), ఇషాంత్ శర్మ(0)తో ఔటయ్యారు. ఒంటరి పోరాటం చేసిన ధోని 52 పరుగుల చేసి అవుటవ్వడంతో ఇండియా 316పరుగులు చేయగలిగింది.ఇంగ్లాండు బౌలర్లలో అండర్సన్ మూడు, పనేసర్ నాలుగు, స్వాన్ ఒక వికెట్ తీసుకున్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ఇండియా 47 పరుగుల వద్ద సెహ్వాగ్ 23 తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత పనేసర్ పుజారాను 16 పరుగుల వద్ద అవుట్ చేశాడు. గంభీర్ 60 అర్థ సెంచరీ చేసి పనేసర్ బౌలింగులో ట్రాట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమవుతూ వస్తున్నాడు. కేవలం ఆరు పరుగులు చేసి కోహ్లీ అండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు.



ఆ తర్వాత కాసేపటికి వచ్చిన యువరాజ్ సింగ్ నిలదొక్కుకున్నట్లుగానే కనిపించాడు. అయితే 32 వ్యక్తిగత పరుగుల వద్ద స్వాన్ బౌలింగులో కుక్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 215 పరుగుల వద్ద భారత్ 5 వికెట్ కోల్పోయింది. సచిన్ టెండూల్కర్ సెంచరీ దిశగా వెళ్తున్న సమయంలో అతను అండర్సన్ బౌలింగులో ప్రియర్‌కు దొరికిపోయాడు. సచిన్ రూపంలో ఆరో వికెట్ భారత్ కోల్పోయింది. సచిన్ 76 పరుగులు చేశాడు. భారత్ స్కోర్ 230 వద్ద ఉన్నప్పుడు ఔటయ్యాడు. ఇది టెండూల్కర్‌కు 66వ అర్థ సెంచరీ.

By
en-us Political News

  
ఉత్తమ పాలసీల రూపకల్పనతోనే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు.
పుష్ప సినిమాను తలపించేలా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సైబరాబాద్‌లో బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించింది.
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో ఎట్టకేలకు కీలక పురోగతి లభించింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులకు భారీ విజయం లభించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు
సంగారెడ్డి పట్టణంలో సోమవారం ఆనంద క్షణాలు కనిపించాయి.
మంగళవారం నుంచి ఈ నెల 22 వరకూ అంటే పది రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ నిప్పుల గుండంగా మారనుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ యవనికపై కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.