Publish Date:Mar 10, 2026
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలతో పలువురు భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయి అల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దుబాయ్లో చిక్కుకొన్న వారికి సహాయం చేసేందుకు భారత సంతతి వ్యాపారవేత్త యోగేశ్ దోషి ముందుకువచ్చారు. 64 నివాసాలు ఉన్న తన అపార్ట్మెంట్లో వసతి కల్పిస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఘర్షణల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో యూఏఈ నుంచి స్వదేశానికి రావాల్సిన పలువురు భారతీయులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తనవంతు సహాయం చేయాలని అల్ మిజన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్ దోషి భావించారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ, దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన అపార్ట్మెంట్లో తాత్కాలిక షెల్టర్ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 125 మందికి ఉచితంగా వసతి కల్పించారు. వారికి ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. తాము ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లలో ఉండేందుకు గడువు ముగిసిందని, పొడిగింపు వీలు కాని క్లిష్ట సమయంలో తమకు ఈ సహాయం అందిందని పలువురు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.
యోగేశ్తో పాటు ఆ దేశంలో స్థిరపడిన పలువురు భారత సంతతి వ్యక్తులు ఈ ఉద్రిక్త సమయంలో తమ స్నేహహస్తం అందిస్తున్నారు. దుబాయ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మన్లో వ్యాపారవేత్త ధీరజ్జైన్ ఇలాంటి వసతులే ఏర్పాటుచేశారు. వెంటనే స్వదేశానికి వెళ్లలేనివారి కోసం తన ఫామ్హౌస్లో తాత్కాలిక వసతి కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా ఈ సౌకర్యం అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ షెల్టర్ వద్దకు తీసుకురావడానికి రోల్స్ రాయిస్ సహా 11 కార్లను నడుపుతుండటం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/humanity-of-indian-businessmen-in-dubai-36-215293.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.